ముద్రగడకు మద్దతుగా నిరసనలు
కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన అమాయకులను విడుదల చేయాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆమరణ నిరాహారా దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్య, కోడలి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు నిరసన ప్రదర్శనలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నిరనస ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో సెక్ష్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా గరిటెలతో కంచాలను మోగిస్తూ రహదారిపై ఆందోళనలకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ దామోదర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.