పరమాన్నం పెట్టి 1.33 కోట్లు టోకరా.. బురిడి బాబా అరెస్ట్..
posted on Jun 17, 2016 @ 10:10AM
'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డిని బురిడి కొట్టించి శివానంద అనే దొంగ బాబా కోటి 30 లక్షల రూపాయలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజహాన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఇప్పుడు శివానందని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ ను ట్రేస్ చేసి.. ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై దృష్టి సారించి.. వారిని విచారించడంవల్ల ఆయన ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం వుందో తెలుసుకున్నామని... వారు చెప్పినట్టే అతనిని బెంగళూరు శివారుల్లో పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం అతను హైదరాబాదు నుంచి డబ్బులు తీసుకుని బెంగళూరు వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. అతని నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.