యామినీ శర్మ.. పాపం బీజేపీకి ఏంటమ్మా ఈ కర్మ!!
రాజకీయ నాయకులకు పదవి అంటే పిచ్చి ప్రేమ. వారి స్థాయిని బట్టి నామినేటెడ్ పదవులో, మంత్రి పదవులో లేదా మరింకేదైనా పదవో కావాలని ఆశపడుతుంటారు. కొందరైతే మరి అత్యుత్సాహానికి పోతుంటారు. అసలు పదవి వస్తుందో రాదో, ఒకవేళ వస్తే ఎప్పుడొస్తుందో తెలియని పదవికి ముందే ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ పరిస్థితి అలాగే ఉంది.
కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా సాధినేని యామినీ శర్మను నియమిస్తూ వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ విశాల్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అబ్బో! యామినీ శర్మకి చాలా పెద్ద బాధ్యతలే అప్పగించారుగా. అంతేనా, ఎటువంటి పారితోషికం ఆశించకుండా, ఆలయం తరపున ఎటువంటి విరాళాలు స్వీకరించకుండా.. స్వచ్ఛందంగా కాశీ విశ్వనాథ దేవాలయం చేస్తున్న కార్యక్రమాలను, అందిస్తున్న సేవలను.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలోని భక్తులకు ప్రచారం చేయాల్సిందిగా యామినీ శర్మను ఆలయ సీఈఓ కోరారు. ఈ విషయాన్ని స్వయంగా యామినీ శర్మనే చెప్పారు. "కాశీ విశ్వనాథుని దేవాలయ ధార్మిక ప్రచారాన్ని దక్షిణాది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు నాకు అప్పగించినందుకు ఆలయ సీఈవోకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి క్షేత్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు యథాశక్తితో ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు" అంటూ యామినీ శర్మ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఏపీ మహిళ యామినీ శర్మ కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా నియమితులవ్వడం గర్వకారణమని మనస్సులోనే ప్రశంసిస్తునారా?.. ఆగండి.. ఆగండి.. వచ్చే నెలలో వర్షం కురుస్తుంది అంటే కంగారుపడిపోయి ఇప్పుడే గొడుగు పట్టకండి. అసలు మేటర్ వేరే ఉంది.
అసలు ఇదంతా ఫేక్ అంట. కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా సాధినేని యామినీ శర్మను నిజంగానే నియమించారా అని ఆరా తీయగా అదంతా అబద్దమని తెలిసింది. సీఈఓ పేరుతో ఉన్న లెటర్ హెడ్ ఫేక్, సీఈఓ సంతకం ఫోర్జరీ అంట. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత అయ్యుండి, ఇలా తప్పుడు ప్రచారం చేసుకోవడం ఏంటి? ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కాశీ విశ్వనాథ ట్రస్ట్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఊరు పేరు తెలియని నాయకులు ఎందరో తమకి ఆ పదవి ఉంది, ఈ పదవి ఉంది అంటూ.. ఐడీ కార్డులు వేసుకొని హడావుడి చేసేవారు. యామినీ శర్మ పుణ్యమా అని ఇప్పుడా సంప్రదాయం బీజేపీలో కూడా మొదలైంది. సోషల్ మీడియాలో నాలుగు మాటలు, నలభై ట్రోల్ల్స్ తప్ప వేరే ఏ క్వాలిఫికేషన్ లేని యామినీ శర్మ అదృష్టం కొద్దీ అప్పట్లో టీడీపీ అధికార ప్రతినిధి అయ్యారు. ఆమె వల్ల పార్టీకి రూపాయి ఉపయోగం లేకపోగా, వందరూపాయల నష్టం జరిగింది. మైక్ ముందు నోటికొచ్చింది వాగి, ఆమె ట్రోల్ అయింది, పార్టీ పరువు తీసింది. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక.. తనని అధికార ప్రతినిధిని చేసి నెత్తిన పెట్టుకున్న టీడీపీని నోటికొచ్చిన మాటలు అని బీజేపీలో చేరింది. కొన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న యామినీ శర్మ.. ఇప్పుడు బీజేపీలో ఆమె మార్క్ నష్టం చేయడం మొదలుపెట్టారు.
బీజేపీ రాజకీయాలు కాస్త పద్దతిగా ఉంటాయి. నాయకులు ఎవరికివారు ఒంటెద్దు పోకడలకు పోరు. పార్టీ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటారు. అలాంటి బీజేపీలో యామినీ శర్మ తింగరి పనులు చేస్తున్నారు. ఓ వైపు కాశీ విశ్వనాథ ట్రస్ట్ వాళ్ళు ఆ యామినీ శర్మ ఎవరో మాకు తెలీదు, ఆమెకి మేం ఏ బాధ్యతలు అప్పగించలేదని నెత్తినోరు కొట్టుకుంటుంటే.. యామినీ శర్మ ఏమో నాకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు, నా పనితనం ఏంటో చూపిస్తా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పాపం ఈ ఫేక్ ప్రచారంతో బీజేపీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అందుకే అంటారు.. ఎక్కడ ఉంచేవాళ్ళని అక్కడ ఉంచాలని. సోషల్ మీడియాలో నాలుగు అందమైన ఫోటోలు పెట్టి, నలభై డైలాగులు కొట్టినంత మాత్రాన నాయకులు అయిపోరు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి, దాన్ని ఆచరణలో చూపించాలి. అలాంటోళ్లని పార్టీలో చేర్చుకోవాలి, అంతేకాని ఇలా కాంట్రవర్సీలతో పేరు తెచుకునేవాళ్ళని కాదు. ఇప్పటికే ఆమెని నెత్తిన పెట్టుకొని ఓ పార్టీ పప్పులో కాలేసింది. ఇప్పుడు ఆమెకి బీజేపీ లేనిపోని ఫ్రీడమ్, పెత్తనం ఇచ్చి.. పార్టీకి నష్టం కలిగించొద్దు అంటూ.. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు, కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ ఇప్పటికే యామినీ శర్మపై ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదన్నమాట మేటర్. వారణాసి క్షేత్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు యథాశక్తితో ప్రయత్నిస్తాను అని చెప్పిన యామినీ శర్మ.. అసలు ఆమే తనకేదో పదవి వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆమెని ఆ దేవుడు కాపాడుతాడో లేడో. యామినీ శర్మ.. ఎందుకమ్మా లేనిపోని పిచ్చి ప్రచారాలు చేసుకొని నీకు ఈ కర్మ.