కరోనా కేసుల విషయం లో కేసీఆర్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి
posted on Jun 11, 2020 @ 6:40PM
దేశంలో కరోనా కేసులు బయట పడుతున్న తొలి రోజుల్లో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం తీవ్రంగా శ్రమించిన కేసీఆర్ సర్కార్ కాలం గడుస్తున్న కొద్ది పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తాజాగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఒక పక్క ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ను పట్టించుకోకుండా టెస్టులను తగ్గిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం నుండి వచ్చిన కేంద్ర బృందం రాష్ట్రం లో పెరుగుతున్న కేసుల విషయం లో ఆందోళన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ పై దాడి తీవ్రమైంది. కరోనా కేసుల విషయం పై ఇటు హైకోర్టు అటు కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం తో ముంచెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు గాంధీ ఆపత్రి కి చెందిన జూడాలు ఆందోళన ఇబ్బందికరంగా తయారైంది. దీనికి తోడుగా అనేక మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతుండటం తో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.