బాలయ్య మాస్టారు మాంచి లెక్చర్ ఇచ్చారు!

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాస్టారుగా మారి మాంచి లెక్చర్ ఇచ్చారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య గురువారం లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొట్నూరు ఉన్నత పాఠశాలఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసంస్థలకు ఎల్ఈడీ టీవీలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్టారు బాలకృష్ణ విద్యార్థులకు మాంచి లెక్చర్ ఇచ్చారు.సామాజిక మాధ్యమంలో ఎక్కువ సేపు కాలం వృధా చేయొద్దన్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టండి, ఫేస్బుక్ చూస్తూ కాలం వృధా చేయవద్దంటూ హితవు చెప్పారు. అంతకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో హిందూపురంలో వైసీపీ ఎంపీ మాధవ్ జెండా ఆవిష్కరణ  చేయడాన్ని తప్పుపట్టారు. అశ్లీల వీడియోలో అడ్డంగా దొరికి పోయిన మాధవ్ కు జాతీయ జెండా ఆవిష్కరించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.తెలుగుదేశం కార్యకర్తలు ఆయనని అడ్డుకుంటే పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు.  ఇలాంటి అరెస్టులకు తెలుగుదేశం కార్యకర్తలు భయపడదన్నారు.  వైసీపీ .సంక్షేమం ప్రచారం లో మాత్రమే ఉందని అమలులో లేదని  అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయం లో గుణపాఠం చెబుతారని బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం  పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ఆయన  బుధవారం ప్రారంభించారు.  

సుప్రీం ఉత్త‌ర్వుల బేఖాత‌రు ప్ర‌మాద‌క‌రం..ఏపీ హైకోర్టు

ఒక కేసులో పోలీసు స్టేష‌న్‌కి, కోర్టుకీ వెళ్లిన వ్య‌క్తి త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని తెలిసి ఎంపీని క‌లిసి కేసు లే కుండా చేసుకుంటాడు. ఎంపీగారు  ఒక్క ఫోన్ కాల్‌తో అంత పెద్ద కేసూ  అమాంతం నీరుగారిపోతుంది. జైలుకి వెళ్ల‌వల‌సిన‌వారు  బ‌య‌ట తిరిగేస్తుంటారు. ఇది సినిమా సీన్‌!  పోతే, ఇటీవ‌లి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలే న్యాయ‌స్థానం ప‌నులు చేసేస్తూ కేసులు మాఫీ చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. త‌మ వారిని కాపాడుకునే ల‌క్ష్యంతో ప్రభుత్వాలు జీవో జారీచేయ‌డం ప‌ట్ల హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  అస‌లు సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌రు చేస్తూ జీవోల‌ను ఇస్తే ప్ర‌భుత్వానికే ప్ర‌మాద‌మ‌ని కోర్టు వ్యాఖ్యా నించింది. ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకో రాద‌ని సుప్రీం కోర్టు 2020 సెప్టెంబరు 16న తేల్చిచెప్పిందని గుర్తు చేసింది. ఉప‌సంహ‌రించు కోవ‌డానికి ముందుగా హైకో ర్టు అనుమ‌తించిన త‌ర్వాత‌నే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.   హోంశాఖ జారీ చేసిన జీవోలను తాము కొట్టేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే ఓ పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని సూచించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీ ఎస్ ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం  ఆదేశాలిచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంపీ లు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించి సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వా లని బీజే పీ నాయ కుడు అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యా న్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి లేకుండా ప్రస్తుత, మాజీ ఎంపీ లు, ఎమ్మె ల్యేలపై కేసులు ఉపసంహరించడానికి వీల్లేదంటూ 2020 సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది.  పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు సిఫార సు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అందులో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మె ల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ  వ్యా జ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి. చెవుల కృష్ణాంజనేయులు తరఫున న్యాయ వాది వెంకటేష్‌ వాద నలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఉదయభానుపై ఉన్న తీవ్రమైన కేసులు ఉపసంహరించేందుకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. కేసులు ఉపసంహ రించేందుకు సంబంధిత పీపీలు చర్యలు తీసుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వమే కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చిందని తెలిపారు.  హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హోంశాఖ తరఫున ప్రభు త్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చి నా, ప్రక్రియ తుది దశకు చేరలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తరు వాతే కేసులు ఉపసంహరిస్తామని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశించినా.. హైకోర్టు అనుమతి పొందకుండా  నేరుగా కేసుల ఉపసంహరణకు జీవోలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పరిష్కార మార్గంతో కోర్టు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

కమల దళంలోకి పొంగులేటి?

తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి  హాజరు అవుతున్నారు. అమిత్ షా కి ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు సర్వం సన్నద్ధంగా ఉన్నారు.   హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారని ఇప్పటికే ప్రకటించారు. అలాగే టి.ఆర్.ఎస్   నుండి కమలం కండువా కప్పుకునే నేతలలో  ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీలో పొంగులేటి చేరిక ఖాయమైందని మునుగోడు సభలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. బుధవారం (ఆగస్టు 17) జరిగిన తన కుమార్తె  నిశ్చితార్థం రిసెప్షన్తో  దీనిపై మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె  నిశ్చితార్థ  వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఐతే ఇంత ఘనంగా నిర్వహించిన వేడుకలో అధికార టీఆర్ఎస్  నేతలెవరూ కనిపించలేదు.  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి  షర్మిల సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.  ఈ వేడుకలో ఈటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సొంత పార్టీ నేతలెవరూ హాజరకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పొంగులేటి బీజేపీలోకి వెళ్లనున్నారని అందువల్ల గులాబీ నేతలు హాజరు కాలేదని తెలుస్తోంది. పొంగులేటి తన బలం చుపించుకోవడానికే లక్షలాది మందిని ఆహ్వానించారని తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా అమిత్ షా సమక్షంలో కమలదళంలో చేరే అవకాశముందని సమాచారం.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.  

అమరావతి రాజధాని కోసం ఎందాకైనా..!

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి విదితమే. జగన్   నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా.. నిబంధనలు, నిర్బంధాలు పెట్టినా మొక్కవోని దీక్షతో రాజధాని ప్రాంత రైతులు తొలి మహా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. తొలిదశలో చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. అదే స్ఫూర్తితో.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఇప్పుడు రైతులు మళ్లీ మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. అమరావతి పరిధి వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాద్రయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడంతో మలి దశ మహా పాదయాత్రను ముగిస్తారు. రెండు నెలలు కొనసాగే ఈ మహా పాదయాత్ర సందర్భంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అనేక గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఉద్యమిస్తున్న రైతు సంఘాల జేఏసీ సిద్ధం చేసింది.  తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో భేటీ అయిన రైతు సంఘాల జేఏసీ మలి దశ పాదయాత్ర ప్రారంభించే సెప్టెంబర్ 12కు ముందు రోజున దీక్షా శిబిరంలో హోమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతినే నిర్ణీత కాలంలోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పినా ముడు ముక్కలాటకు వైసీపీ సర్కార్ తెర దించకుండా కొత్త జిత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నది. కోర్టు తీర్పుతోనైనా జగన్ సర్కార్ కు జ్ఞానోదయం కలుగుతుందని ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఆశించారు. అయినా.. ప్రభుత్వం పాత పాటే పాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఏపీ సర్కార్ బేషరతుగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని పోరాట కమిటీ తెగేసి చెప్పింది. ఈ క్రమలోనే రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొనే మరో మహా పాదయాత్రకు రైతు సంఘాల జేఏసీ  సిద్ధం అవుతోంది. ఈ మహా పాద యాత్రలో అమరావతి రైతులకు తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు. కాగా.. మహా పాదయాత్రకు అందరూ సహకరించాలని, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రాష్ట్రంలోని రైతులు ముందుకు రావాలని అమరావతి రైతుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐక్య కార్యాచరణ సమితి, దళిత ఐక్య కార్యాచరణ నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలతో దిగిరాని వైసీపీ సర్కార్ కు తాజాగా తలపెట్టిన మరో మహా పాదయాత్రతోనైనా జ్ఞానోదయం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటికై జగన్  తన మొండి పంతాన్ని వీడి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు.

ప‌ది మందిని కంటే రూ.13 ల‌క్ష‌లు... అమ్మ‌ల‌కు పుతిన్ ఆఫ‌ర్‌!

పూర్వం అంత‌టా సంతాన‌ల‌క్ష్ములే ఉండేవారు. దాదాపు ప్ర‌తీ ఇల్లూ పిల్ల‌ల‌తో సంద‌డిగా ఉండేది. కాల క్ర‌మంలో సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింది. ఇపుడిక ఆధునిక పోక‌డ‌ల‌వ‌ల్ల‌, సామాజిక ప‌రిస్థితుల వ‌ల్లా ఒక్క‌రి ద్ద‌రితో స‌రిపెట్టుకుంటున్నారు.  ర‌ష్యాలో అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం మ‌ళ్లీ పిల్ల‌ల సంద‌డి అవ‌స‌ర‌మ‌ని భావించారు. అంటే జ‌నాభా పెరుగుద‌ల‌ను ఆశిస్తున్నారు. కార‌ణం కోవిడ్‌-19 కావ‌చ్చు. కోవిడ్ వ‌ల్ల  అనేక దేశాల్లో జ‌నాభా త‌గ్గిపోయింది. ర‌ష్యా కూడా దాని ప్ర‌భావానికి గురైంది.           కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్  ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు.  జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్  అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద ప‌దిమంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయి తే ప‌ది మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి.  పదో బిడ్డకు మొదటి పుట్టినరోజు నాటికి ఒక మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు.  ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50వేల‌కు చేరుతుండ టం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.  పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని రష్యన్ రాజకీ య, భద్రత రంగాల నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్యను పరిష్క రిం చేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కు వ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు. జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్‌పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం ప‌ది మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు. 

రజినీకాంత్ కు బీజేపీ గవర్నర్ తాయిలం?

రాజకీయంగా ఎత్తులు వేయడంలో బీజేపీ అందెవేసిన చెయ్యి అనడంలో సందేహం లేదు. అందులోనూ మోడీ- షా ద్వయం ఇలాంటి విషయాల్లో ప్రదర్శించే చాణక్య నీతి గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా కాలు మోపేందుకు వీలు లేక బీజేపీ నేతలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూనే ఉన్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో బలపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కు బీజేపీ డబుల్ ఇంజిన్ గాలం వేసింది. రజినీకాంత్ కు గవర్నర్ పదవి ఇచ్చి, తమిళనాడులో పాగా వేయాలనే వ్యూహానికి పదును పెట్టిందని సమాచారం. అందుకోసం రజినీకాంత్ కూడా సరే అన్నట్లు తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి తమిళనాడులో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రజినీకాంత్ వస్తారనే ప్రచారం చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే రజినీకాంత్ తన అభిమానులు, అభిమాన సంఘాలతో పలుమార్లు భేటీలు నిర్వహించారు. ఆ తర్వాత ‘మక్కల్ సేవాయ్ కచ్చి’ పేరుతో రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. దానికి ఎన్నికల సంఘం ‘ఆటో రిక్షా’ గుర్తును కూడా కేటాయించింది. అయితే.. ఆ తర్వాత అది రాజకీయ పార్టీ కాదని, కేవలం తన అభిమాన సంఘాల సమాఖ్య మాత్రమే అని రజినీకాంత్ ప్రకటించారు. అనంతరం దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు రజినీ కాంత్ తెలిపారు. రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఉండడానికి ఆరోగ్యం సహకరించకపోవడం, ఇతర సమస్యలే కారణం అంటారు. అయితే.. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను రజినీ అంగీకరించడానికి కారణం లేకపోలేదంటున్నారు. గవర్నర్ పదవి అయితే.. ఏ పార్టీలోనూ చేరే పని ఉండదనే ఉద్దేశంతోనే రజినీకాంత్ బీజేపీ ఆఫర్ కు సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు రజినీకాంత్ ఇటీవల వేస్తున్న అడుగులు కూడా  బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న రజినీకాంత్.. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవడం రజినీకాంత్ కు గవర్నర్ పదవి అన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఆ తర్వాతి రోజున తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితో కూడా రజినీకాంత్ భేటీ అయ్యారు. ఇలాంటి పరిణామాలన్నీ రజినీకాంత్ కు గవర్నర్ పదవి ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవడానికి కారణమయ్యాయి. వాస్తవానికి ప్రధాని మోడీ- రజినీకాంత్ మధ్య మంచి స్నేహ బంధమే ఉంది. అందుకే ఇటీవల ప్రధాని మోడీ చెన్నై వెళ్లినప్పుడు రజినీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.  రజినీకాంత్ కు తమిళనాడులో లక్షలాది మంది అభిమానులున్నారు. వందలాది అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఒక్క పిలుపు ఇస్తే.. మారు మాటేదీ మాట్లాడకుండా రజినీకాంత్ ను అనుసరించే అభిమాన జనం తమిళనాడు వ్యాప్తంగా ఉన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ-షా ద్వయం సరిగ్గా ఇదే పాయింట్ ను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు వ్యూహం పన్నిందని, రజినీకాంత్ కు గవర్నర్ పదవి కట్టబెట్టి.. తమిళ ఓట్లను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టాలని, తద్వారా ఆ రాష్ట్రంలో కూడా అధికార పగ్గాలు చేపట్టాలని పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు స్థంభాలాట‌!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలో పోటీ పెరిగిపోతోంది. ఉపఎన్నిక ఇన్‌చార్జ్ అయితే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందనే ఆలోచనతో నేతలు కసరత్తులు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌చార్జ్ కోసం బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. మునుగోడు బీజేపీ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్ రేసులో నలు గురు నేత‌లు ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, మనోహర్ రెడ్డి ఇన్ చార్జ్ కోసం పోటీపడుతున్నారు.  మునుగోడు ఉప ఎన్నికల పర్వం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లతోపాటు సీపీఐ, బీఎస్పీ పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. బరిలో ఎందరు అభ్యర్థులు వున్నా మునుగోడులో చతుర్ముఖ పోటీ ఖాయమనిపిస్తోంది. అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఉప ఎన్నికకు ఇన్ చార్జ్ ఉంటే అమిత్ షా వద్ద పరపతి పెరు గుతుందని నేతల ఆలోచన. అమిత్ షా సభ తర్వాత నియోజక వర్గ ఇన్‌చార్జ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్ లను ఈటెల రాజేందర్ బీజేపీలోకి  తీసుకు వచ్చారు. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్‌లను ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకు వచ్చారు. దుబ్బాక, హుజురాబాద్ సెంటిమెంటుతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి పని చేయగా.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్ రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డిని ఉప ఎన్నిక ఇంచార్జ్‌గా పెడితే బాగుం టుందని కమలనాథులు అంటున్నారు. అటు రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా, అధిష్టా నానికి రాష్ట్ర నాయ కత్వానికి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

త‌గునా ఇది మీకు రోజ‌మ్మా!

తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి ఏడాది కాలం నుంచే ఎంతో సిద్ధ‌ప‌డి వెళుతూంటారు జ‌నం. తిరుమ‌ల ర‌ద్దీకి, కాలానికి సంబంధం లేదు. ఎప్పుడూ ర‌ద్దీగానే ఉంటుంది. గంట‌ల‌త‌ర‌బ‌డీ ద‌ర్శ‌నానికి భ‌క్త‌కోటి వేచి ఉం టారు. దేవుని దృష్టిలో అంద‌రూ స‌మానులే. కానీ అధికార పార్టీవారికి అలాంటివేమీ ప‌ట్టింపులేదు. ఏపీలో వైసీపీ మంత్రులు, ఎమెల్యేలు ప్రొటోకాల్ పాటించ‌డం స‌హ‌జం. కానీ ప‌ర్యాట‌కశాఖా మంత్రి ఆర్‌.కె. రోజా మాత్రం త‌న‌కు, త‌న అనుచరుల‌కీ పెద్ద‌గా ప్రోటోకాల్‌తో ప‌నిలేద‌నే భావించారు. అందుకే ఉల్లంఘించారు. భ‌క్త‌జ‌న కోటికి ఆగ్ర‌హ‌మూ తెప్పించారు. గంట‌ల‌త‌ర‌బ‌డి వేచి ఉన్న భ‌క్తుల‌ను కాకుండా త‌న‌కు, త‌నతో వ‌చ్చిన 30 మంది అనుచ‌రుల‌కు మంత్రి   ద‌ర్శ‌నం వెంట‌నే ఇప్పించాల‌ని భీష్మించారు. దీనికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున పాటించాల్సిన క‌నీస ప్రోటోకాల్  కూడా ఉల్లంఘించ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌టికే అధికారులు, అక్కడి  ఇత‌ర ప‌ని వారూ ఆమె రాక‌తో భ‌క్తుల ఇబ్బందుల గురించి వివ‌రించారు. కానీ తాను ప‌ర్యాట‌కశాఖ మంత్రిని క‌నుక త‌న‌కు నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామి ద‌ర్శ‌నం క‌ల్పించాల్సిన బాద్య‌త అక్క‌డున్న అధి కారులదే అన్నంత‌గా భీష్మించారు ఆర్‌.కె.రోజా. వాస్త‌వానికి ఆగ‌ష్టు 21 వ‌ర‌కూ టిటిడి బ్రేక్ ద‌ర్శ‌నాలు నిలిపి వేసింది.  కానీ అధికారంలో ఉన్న‌వారికి అందునా ప‌ర్యాట‌క‌శాఖ మంత్రికి టీటీడీ నియ‌మ‌నిబంధ‌న‌లు తెలియ‌క పోవు. అయినా రోజా త‌న అనుచ‌రుల‌తో బ్రేక్ ద‌ర్శ‌నం కోసం డిమాండ్ చేయ‌డం ఎంత‌ వ‌ర‌కూ  స‌మం జ‌సం అని భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు. వేలాది మంది భ‌క్తుల‌ను కాద‌ని త‌న 30మంది అనుచ‌రుల‌కు ద‌ర్శ నం క‌ల్పించ‌డానికి ప‌ట్టుబ‌ట్టడం ఆమె అధికార బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు నిద‌ర్శ‌న‌మే అవుతుంది. ఇది ఊహిం చ‌ని సంఘ‌ట‌నే. ఇలాంటివి ఇక ముందు జ‌ర‌గ‌కుండా ఉండాల‌నే అధికారులు ప్రార్ధ‌న‌లు చేయాలి. క‌నీసం ప్రోటోకాల్ లేకుండా మంత్రిగా త‌న స‌త్తాను అనుచ‌ర‌గ‌ణం ముందు ప్ర‌ద‌ర్శించ‌డంలో అర్ధం లేదు. అధికారుల ని వత్తిడి చేసి మ‌రో ప‌దిమందికి ప్రోటోకాల్ దర్శ‌నం  కల్పించారు. దర్శనాలు పూర్త య్యకనే బయటకి వచ్చారు. ఇందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. అంత సేపూ క్యూలైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఉండాల్సి వచ్చింది.

సీతా.. ఏమిటీ వైప‌రీత్యం?

తెలుగు తెర‌మీద ల‌వ‌కువ చిత్రం న‌డుస్తున్నంత కాలం అంజ‌లీదేవిని  తెలుగు ప్ర‌జ‌లంతా  సీత అవ‌తా రంగానే భావించి పూజ‌లు చేశారు. కొన్నాళ్ల త‌ర్వాత టీవీలో రామానంద్ సాగ‌ర్ రామాయ‌ణం రావ‌డం మొదలై సంవ‌త్స‌రాల త‌ర్వాత అయిపోయేనాటికి దీపికా చిక్లియా భార‌తీయుల సీత‌గా మారింది. ఆ సీరి య‌ల్ న‌డుస్తున్నంత కాలం బ‌య‌ట ఆమె మ‌రో డ్ర‌స్‌లో క‌నిపించినా స‌సెమిరా ఇష్ట‌ప‌డేవారు కాద‌ట‌. అంతగా ఆమెలో సీత‌ను చూసుకున్నారు. ఇది కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపించ‌వ‌చ్చుగాని, మ‌న దేశం లోనే ఇలాంటివాటికి ఆస్కారం ఎక్కువ‌. సీత రాముడితో క‌న‌ప‌డాలి, కృష్ణుడు రాధ‌తో క‌నిపించాలి, దేశ‌భ‌క్తులు జాతీయ‌జెండాతో క‌నిపించాలి. కానీ యావ‌త్ భార‌తావ‌నీ టీవీ సీత‌గా భావించిన దీపికా చిక్లియా మాత్రం పాకిస్తాన్ ప్ర‌ధాని కార్యాల‌యాన్ని ట్యాగ్ చేసింది. కానీ ప్ర‌జ‌లు అందునా నెటిజెన్‌ల‌కు ఇలాంటివే ఠ‌క్కున క‌న‌ప‌డ‌తాయి. ప్రజలు దానిని విస్మరిం చలేరు. ఆమె భారత పీఎంఓని ట్యాగ్ చేయాలనుకుంది, కానీ ఆమె తప్పు హ్యాండిల్‌ను ట్యాగ్ చేసింది. ఆమె ట్వీట్‌ను తొలగించినప్పటికీ, ట్విట్టర్‌లో జోకులు, మీమ్స్, ట్రోల్స్ వర్షం కురుస్తూనే ఉంది. ఫోటోలో, ఆమె చేతిలో జాతీయ జెండాను పట్టుకుని కనిపిస్తుంది. మనందరికీ @PakPMO 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేసింది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న స్క్రీన్‌ షాట్ ఇక్కడ ఉంది. నేను లేనప్పుడు, నా పని కేవలం రామాయణం మాత్రమే కాదు, అది చాలా ఎక్కువ ఉండాలి. నేను కన్నడలో లేదా బెంగాల్‌లో చేసిన సినిమాలు అన్నీ రికార్డులను బద్దలు కొట్టాయి. నాకు మంచి పని తనం ఉండాలి. రామాయణం కాకుండా హిందీ సినిమాల్లో.. రామాయణ వారసత్వాన్ని నేను జీవించి నందుకు నా  సంతృప్తి కోసం అలా చేయడం నాకు చాలా ముఖ్యమ‌ని ఆమె చెప్పింది. రామాయణంతో పాటు, ఘర్ కా చిరాగ్ , ఖుదాయి అనే రెండు చిత్రాలలో రాజేష్ ఖన్నా రొమాంటిక్ లీడ్‌గా దీపికా చిక్లియా నటించింది. ఆమె రూపే దస్ కరోడ్‌లో కూడా భాగమైంది.

జ‌మ్మూకాశ్మీర్ లో స్థానికేత‌రుల‌కూ ఓటుహ‌క్కు    

జమ్మూకశ్మీర్ చీఫ్ ఎల క్ట్రోరల్ ఆఫీ సర్ హిర్దేష్‌ కుమార్ స్థానికేతరులకు ఓటుహక్కుపై సంచ లన ప్రక టన  చేశారు. స్థానికేతరులు,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులక ఓటు హక్కు కల్పిస్తూ జమ్మూకశ్మీర్  ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి హిర్‌దేష్ కుమార్ నిర్ణయం తీసుకు న్నారు. జమ్మూ కాశ్మీరులో నివాసం ఉంటున్న వారు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జమ్మూకశ్మీరులోని ఆర్మీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సైని కులు కూడా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనుమతించారు.  స్థానికేతరులకు జమ్మూకశ్మీరులో ఓటు హక్కు కల్పించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా మార్చుకోవా లని భావిస్తుందని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. స్థానికేతరులను ఓటు వేయడాని కి అనుమతించడం ద్వారా బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలనుకుంటోందని మెహ బూబా ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానికులను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని మెహబూబా చెప్పారు. జమ్మూకశ్మీరులో బీజేపీ విజయం సాధించడానికి తాత్కాలిక ఓటర్లను దిగుమతి చేసుకుంటుందని మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీకి ఓటర్ల దిగుమతి ఎన్నికలలో సహాయపడవని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.  2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను నిర్వ హిస్తున్నందున కేంద్రపాలిత ప్రాంతంలో దాదాపు 25 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అవుతారని అంచనా వేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హిర్దేష్ కుమార్ బుధవారం తెలిపారు. నవంబర్ 25నాటికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను పూర్తి చేసేందుకు జరుగు తున్న కసరత్తును సవాలుతో కూడుకున్న పనిగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దేశంలోని ప్రతి పౌరుడు ఉద్యోగం, విద్య, వ్యాపార ప్రయోజనాల కోసం - సాధారణంగా జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, తదు పరి అసెం బ్లీ ఎన్ని కలలో ఓటు వేయవచ్చని జ‌మ్మూ కాశ్మీర్‌ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హిర్దేశ్ కుమార్ తెలిపారు. ఎర్రర్-ఫ్రీ తుది జాబితాను అందించడానికి అక్టోబర్ 1, 2022 లేదా అంతకుముందు 18 సంవత్సరాలు నిండిన వారితో సహా అర్హులైన ఓటర్లందరూ నమోదు చేసుకున్నారని నిర్ధారించడానికి ప్రక్రియను సకా లంలో పూర్తి చేయడానికి భారీ కసరత్తు జరుగుతోందని కుమార్ అన్నారు. ఓటరు ఐడీ  ఆధార్‌తో  అను సంధానం చేస్తారు, అనేక భద్రతా లక్షణాలతో కొత్త కార్డ్‌లు జారీ చేయబడతాయి, అయితే  ఆధార్ నంబ ర్‌ను అందించడం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. కార్యక్రమ లక్ష్యం ఓటర్ల గుర్తింపును ఏర్పాటు చేయడం, ఎలక్టోరల్ రోల్‌లోని ఎంట్రీల ప్రామాణీకరణ అని సిఈఓ నిర్వహించారు. జ‌మ్మూకాశ్మీర్‌ లో ఉంటున్న దేశంలోని ప్రతి పౌరుడు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కును కలిగి ఉండ వచ్చని జ‌మ్మూకాశ్మీర్‌ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకటనపై స్పందిస్తూ, జ‌మ్మూకాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ సజాద్ గని లోన్ ఈరోజు అటువంటి చర్య 1987కి రీప్లే అవుతుందని అన్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్, ఇది ప్రమాదకరమని సజాద్ అన్నారు. వారు ఏమి సాధించాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఇది అపచారం కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా కాశ్మీర్ సందర్భంలో ప్రజాస్వామ్యం ఒక అవశేషం. దయచేసి 1987ని గుర్తుంచుకోండి. మేము ఇంకా దాని నుండి బయటపడలేదు. 1987ని రీప్లే చేయవద్దు. ఇది వినాశకరమైనది. ఈ ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. స్థానికేతర ఓటర్లను తీసుకురావడం ద్వారా J&K లోకి బ్యాక్‌డోర్ ప్రవేశం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఒమర్ ఆరోపించారు. జ‌మ్మూకాశ్మీర్  నిజమైన ఓటర్ల నుండి మద్దతు గురించి బిజెపికి అంత అభద్రతాభావం ఉందా, సీట్లు గెలవడానికి తాత్కాలిక ఓటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవ సరం ఉందా? జ‌మ్మూకాశ్మీర్ ప్రజలు తమ ఫ్రాంచైజీని వినియోగించుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఈ విషయాలు ఏవీ బీజేపీకి సహాయపడవని ఒమర్ ట్విట్టర్‌లో రాశారు. మెహబూబా ముఫ్తీ ఇలా రాశారు.

సర్వోన్నత న్యాయస్థానమే సంక్షిష్టం అన్న సమస్య

అసలు ఉచితం అంటే,సంక్షేమం అంటే  కనీసం అవి తీసుకుంటున్న ప్రజలకి తెలుసా?రాజకీయ పార్టీ లు తాము అధికారం లోకి రావడం కోసం ప్రజలని పథకాల పేరు తో ఉచితాలకి అలవాటు చేసారు. ఏది ఉచితమో.. ఏది సంక్షేమమో నిర్ణయించడం కష్ట సాధ్యమని సీజేఐ  జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందంటేనే అర్ధం అవుతోంది రాజకీయ పార్టీ లు ఉచితాల ను ఎంతగా సంక్షిష్టం చేశాయో.   అశ్వనీకుమార్ ఉపాధ్యాయ అనే  న్యాయవాది దాఖలు చేసిన ” ఉచితాల రద్దు ” పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేస్తున్నవి ఉచితాలు కాదని,సంక్షేమ పథకాలని వాదించాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు హామీలు ఇవ్వకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. అలాగే ఏది ఉచితమో ఏది సంక్షేమమో నిర్దుష్టంగా నిర్వచించలే మనీ పేర్కొంది. నిజానికి ఇలాంటి సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపిస్తుందేమో అనుకున్నారు. ప్రజల దగ్గర పన్నుల రూపం లో వసూలు చేసిన డబ్బును మళ్లీ వాళ్ళకే పథకాల రూపంలో ఇవ్వడం ప్రజలని సోమరిపోతుల్ని చేయడమే అని, ఉచితల వల్ల రాజకీయ పార్టీ లు అధికారం పొందుతాయోమో గాని దేశం లో అభివృద్ధి కుంటుబడుతుందని ప్రదాని మోడీ ఇటీవలే ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే రాజకీయ పార్టీలు ఆ డబ్బులకు వివిధ పేర్లు పెట్టి ఆ వర్గాలు బాగుపడకూడదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఎవరూ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. తమ అధికారం కోసం ప్రజల జీవితాల్ని అంధకారం చేసి తాము వేల కోట్లు కూడబెట్టుకుంటే వచ్చే ప్రయోజనమేంటో ఆలోచించాలి. ఈ విషయాన్నీ ప్రజలు కుడా ఆలోచించాలి. ఇచ్చే ఉచితపదకాలు తమ తర్వాతి తరాలు భవిష్యత్తు ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి.సుప్రీమ్ కోర్ట్ కూడా ఈ విషయం మీద తీర్పు చెప్పడానికి ఆలోచించింది అంటే ఉచితం అనే పదం ఎంత ప్రభావితం చేస్తోందో,రాజకీయ నాయకులూ దేశ అత్తున్నత న్యాయ స్థానాన్ని ఎంతప్రభావితం చేస్త్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  దీన్ని  అంతం చేయాలంటే  పాలకులు రాజకీయ నేతల్లోనే మార్పు రావాలి అనుకుంటే కాదు.  ఉచిత పథకాల లబ్ధిదారుల్లోనూ మార్పు రావాలి.  ఉచితాల వల్ల నాశనం అయిన దేశాలని మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు,ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకుని జరగబోయే నష్టాన్ని ఆపాలి.దీనికి ఏ న్యాయ స్థానం అవసరం లేదు.ప్రజలలో మార్పు రావాలి.

కోర్టులో త‌ప్పు అంగీకరించాడు... బ‌య‌ట‌కి వ‌చ్చి త‌ల న‌రికేడు!

క‌ర్ణాట‌క‌, హ‌స‌న్ జిల్లా.  చిత్ర అనే ఆమె వాష్‌రూమ్‌కి వెళుతోంది. వెన‌గ్గా భ‌ర్త వ‌చ్చి కొడ‌వ‌లితో మెడ న‌రికి చంపేశాడు. ఇదేదో క్రైం సినిమాలో సీన్ కాదు. నూటికి నూరుపాళ్లూ వాస్త‌వం. అప్ప‌టిదాకా అక్క‌డివారు వాళ్ల‌ను గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, కొత్త జీవితాన్ని గ‌డిపేవారిగానే భావించారు. హ‌మ్మ‌య్యా వారిద్ద‌రూ క‌లి సేరు అనుకున్నారు రెండు కుటుంబాల‌వారూ, చిత్ర బంధువులు, కోర్టులో కోర్టు సీన్ చూసిన‌వారు. కానీ ఆ ఆనందం ఆమెకు తాత్కాలిక‌మైంది. ఆ క్ష‌ణం ఆమెకు ఆఖ‌రిక్ష‌ణంగా మారు తుంద‌ని ఊహించ‌లేదు. అప్పుడు కాస్తంత న‌వ్వి, త‌న త‌ప్పు తెలుసు కున్నాన‌న్న భ‌ర్త న‌టిస్తున్నాడ‌ని ఆమె అస్స‌లు గ్ర‌హించ లేదు. కానీ శివ‌కుమార్  మొగుడు, దుర్మా ర్గుడు.. వాష్‌రూమ్ వ‌ర‌కూ వెంట వెళుతున్నాడ‌నే అనుకున్నారంతా.. అంత‌లోనే అంతా అయి పోయింది.  గొడవలు, మనస్పర్థలు భార్యాభర్తల మధ్య సహజం. ఒక్కోసారి ఇవి గోరంత నుంచి కొండంతకు వెళ్లి దారు ణాలకు దారి తీస్తుంటాయి. పోలీసులు, కోర్టుల జోక్యంతో భార్యాభర్తల మధ్య ఉండే విబేధాలు కొంతవరకు తగ్గొచ్చు. ఫ్యామిలీ కోర్టుకి చేరుకున్న కేసును సాధ్య‌మైంత‌వ‌ర‌కూ శిక్షవేయ‌కుండా వారిద్ద‌రినీ క‌ల‌ప‌డానికే చూస్తుంది కోర్టు. ఏదో కొన్ని సంద‌ర్భాల్లోనే త‌ప్ప‌నిస్థితిలో ఎవ‌రో ఒక‌రికి శిక్ష వేయ‌డం త‌ప్ప‌నిస‌రే అవుతోంది. ముందు అన్నింటికి అంగీక‌రించి ఆన‌క అత్తింటి ఆర‌ళ్లు కొన‌సాగ‌డం ఏ మ‌హిళ‌ క‌యినా దుర దృ ష్ట‌మే. నాలుగ్గోడ‌ల మ‌ధ్య జ‌రిగే హింస‌ను కోర్టుకు ఈడ్చింద‌న్న ఆగ్ర‌హం రెట్టించ‌డ‌మూ జ‌రుగుతోంది. ఇలా చాలామంది స‌మ‌స్య‌లు తీవ్ర‌త‌ర‌మై ఆత్మ‌హ‌త్య‌లూ చేసుకుం టున్నారు.  కానీ క‌ర్ణాట‌క హ‌స్స‌న్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు వ‌చ్చిన శివ‌కుమార్‌, చిత్ర కేసు ఊహించ‌నివిధంగా ఒక కొలిక్కి వ‌చ్చింది. ఏడేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. కొంత‌కాలం నుంచి వారి మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరు కుని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. విడిపోవాల‌నే నిర్ణ‌యించుకున్నారు. విడాకులే కావాల‌న్నారు. కానీ కోర్టువారు మాత్రం ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్పి ప్ర‌శాంతంగా కాపురం చేసుకోవాల‌ని సూచించారు. కోర్టు చెప్పిన మాట‌లు విన్నారు, త‌మ త‌ప్పు తెలుసుకున్న‌ట్టే క‌నిపించారు. ఇక నుంచీ క‌లిసే ఉంటా మ‌న్నారు. శివ కుమార్ త‌న త‌ప్పును తెలుసుకున్నాను, ఇక నుంచి చ‌క్క‌గా కాపురం చేసుకుం టాన‌నే అన్నాడు. అంత టితో కేసు ముగిసిపోయింది. ఇద్ద‌రూ కోర్టు హాలు నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. ఊహిం చ‌ని ట్విస్ట్ ఇక్క‌డ జ‌రిగింది.  చిత్ర వాష్ రూంకి వెళ్తుండగా ఆమె వెనకాలే వెళ్లి కొడవలితో ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు చిక్కాడు. రక్తపు మడుగులో ఉన్న చిత్ర ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై హస్సన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘‘కోర్టు పరిధిలోనే ఈ దారుణం జరిగింది. నిందితుడు మా కస్టడీలోనే ఉన్నాడు. దాడికి ఉపయోగించిన కొడవలిని సీజ్ చేశాం. ఈ కేసుపై తదుపరి విచారణ చేస్తున్నామ‌ని తెలి పారు.

తెలుగుదేశంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ తరహా ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం అందుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీని అధికారంలోనికి చంద్రబాబు ఓ నిర్దుష్టమైన విధానాన్ని అవలంబించనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడులకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు వీటిని కొనసాగిస్తూనే..  తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అధికార వైసీపీతో అంటకాగుతోన్న కలుపు మొక్కలను ఏరిపారేయాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి నేతలను బుజ్జగించి వారి మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఓ వేళ వారు  మారకుంటే   శాశ్వతంగా వదిలించుకోనే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముందు పార్టీలోని అసమ్మతి సెగపై నీళ్లు చల్లి.. ఆ తర్వాత  జగన్ పార్టీపై దృష్టి సారించాలన్నదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. అలాగే పార్టీలో ప్రస్తుతం సైలంట్ గా ఉన్న  వారి  కలిసి.. వారితో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారట. రానున్న ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఆ క్రమంలో గతంలో పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే.. వారిని దూరం చేసుకోవాలంటే చంద్రబాబు ఒకటికి రెండు సార్లు ఆలోచించి... ఆ తర్వాత చూద్దాంలే అంటూ ఓ విధమైన  సాగతీత ధోరణితో ఉండేవారని.. కానీ అధికారం అందుకోవాలంటే.. ఆ మోహమాటాలు..  చూసి చూడనట్లు పోవడాలు... వగైరా వగైరా వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని... ఇలాంటి ధోరణి వల్ల పార్టీనే కాదు.. లీడర్ నుంచి కేడర్ వరకు అందరు   దెబ్బతింటారని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కఠిన వైఖరిని అవలంబించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి బలం ఉన్నా.. పార్టీలోని నేతల వెన్నుపోటుతో ఎంత నష్టం జరగాలో అంతా కళ్ల ముందే జరిగిపోయింది. దీనిని గుణపాఠంగా తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే సైకిల్ పార్టీ గుర్తించి.. పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే.    అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించి.. ప్రస్తుతం  సైలెంట్‌గా మిగిలిపోయిన నేతల వైఖరిలో స్పష్టమైన మార్పు తీసుకు వచ్చేందుకు చంద్రబాబు  నడుంబిగించారని చెబుతున్నారు  మరికొద్ది రోజుల్లో.. జిల్లాలోని పార్టీ అసమ్మతి నేతలతో వరుస భేటీలు జరిపేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిందరిని ఒకే తాటిపైకి తీసుకు వస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని ఎదుర్కొవడం ఏమంత కష్టం కాదని చంద్రబాబు భావిస్తున్నారంటున్నారు. అలాగే ఎవరి వల్లనైనా తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతోందంటే.. వారిని సైతం చంద్రబాబు వెన్ను తట్టి మరీ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.   ఆ క్రమంలో ఇప్పటికే కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులతో పాటు పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు ఇలా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ   స్పష్టమైన సంకేతాలు వెళ్తాయని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లందరు.. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు బాసటగా నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ర‌జ‌నీకి గవర్నర్ గిరీ ఎర.. దక్షిణాదిలో పాగాకు బీజేపీ ఎత్తుగడ!

వల‌వేసిన‌వాడు చిన్న‌చేప కోస‌మే రోజంతా వేచి ఉండ‌డు. వల వేసిన ప్రతి సారీ ఏదో ఒక పెద్ద చేప‌ను ప‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే ఉంటాడు. కచ్చితంగా పెద్ద చేప చిక్కుతుంద‌న్న‌ది అత‌ని న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కంతోనే ఎంత‌టి ప‌నైనా సాధించ‌వ‌చ్చ‌న్న‌ది బీజేపీ వ్యూహ‌కారులు ఇటీవ‌లి కాలంలో స్ప‌ష్టం చేసింది.  దేశంలో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికి విప‌క్షాల‌ను దెబ్బ‌తీయ‌డంలో అనేక వ్యూహ‌ వ‌ల‌ల‌ను కమలం పార్టీ వేసింది. ఒక్క‌టి రెండు త‌ప్ప అన్నీ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చాయి. ఇపుడు ద‌క్షిణాదినా వారి అజ‌మాయిషీ సాధిం చుకోవ‌డానికి త‌మిళ‌నాట తాజాగా వ‌ల విసిరేరు.  ఆ వలకు రజనీకాంత్ అనే పెద్ద చేప చిక్కింది. ఒక్క డైలాగ్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను వెర్రెక్కించి త‌న వీరాభిమానుల‌ను చేసుకోగ‌ల స‌త్తా ఉన్న న‌టుడు ర‌జ నీ. త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌,  శివాజీగ‌ణేష‌న్‌, క‌మ‌ల్ త‌ర్వాత అంత‌టి  స్థానాన్ని సంపాదించిన న‌టుడు ర‌జ‌నీకాంత్. ర‌జ‌నీ సినిమాలంటే ప‌డి చ‌చ్చే జ‌నం ఆయ‌న రాజ‌కీయాల్లోకీ వ‌చ్చి రాజ‌కీయ రంగాన్ని ప్ర‌క్షా ళ‌న చేయాల‌ని వీరాభిమానులు   ఆశించారు. ఓకే మీ మాటే నా మాట అని పార్టీని ప్ర‌క‌టించారు ర‌జ‌నీ. కానీ ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌క‌పోవ‌డంతో రేపు, ఎల్లుండీ అంటూ క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా కాళ్లూ చేతులూ పెట్ట‌డానికి ముందు వెనుకలాడారు. చివరికి అనారోగ్యం అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే రాజకీయ సన్యాసం ప్రకటించేవారు.  క్ర‌మేపీ సామా జిక ప‌రంగా ఎంతో సేవచేయాల్సి ఉంద‌ని అభిమానుల‌కు ర‌జ‌నీ త‌న మాట‌గా ప్ర‌క‌టించి రాజ‌కీయాల సంగ‌తి ఆలోచించ‌కుండా చేయ‌గ‌లిగారు. అయితే తాను వాస్త‌వానికి క‌ర్ణాట‌క నుంచి మ‌ద్రాసు వ‌చ్చి సినీ న‌టునిగా స్థిర‌ప‌డి త‌మిళుల హృద‌యాల్లో తిష్ట వేసిన మ‌హా న‌టుడు రజనీకాంత్.  ఇప్పటికీ త‌మిళుల భావ‌న అదే. అయితే కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల రంగు కూడా పుల‌మ‌డంతో ఆయ‌న మ‌న‌వాడు కాదు గ‌నుక ఆయ‌న్ను దూరంగా పెట్టాల‌న్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.  దీంతో ప‌రిస్థితులు  ర‌జ నీకి ప్రతికూలంగా మారాయి. ర‌జ‌నీ త‌న స్థాయిని, జ‌నాల్లో ప‌ట్టును, ప్ర‌తిష్ట‌ను కాపాడుకోవ‌డానికి బీజేపీ వారి స‌హాయ స‌హ కారాల‌ను కోరారు. ఇలా చాలా కాలం నుంచే ర‌జ‌నీ బీజేపీతో  స‌ఖ్య‌ంగా ఉంటూ వచ్చారు. ఇక తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల దృష్ట్యా ఇది బీజేపీ   ఆస‌రాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. త‌మిళ‌నాట  ర‌జ‌నీ ఇంటి దేవ‌త‌తో స‌మానం. ఇలాంటి అత్యంత పాప్యుల‌ర్ న‌టుడిని, వ్య‌క్తిని త‌మ‌కు గొప్ప అస్త్రంగా దొర‌క‌డం, దాన్ని మ‌రింత ప‌దునుపెట్టి ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ద‌క్షిణాదిన త‌మ రాజ‌కీయ ఎత్తు గ‌డ‌లు విజ‌య‌వంతంగా వేయ‌వ‌చ్చ‌ని, ముందుకు దూసుకుపోవ‌చ్చ‌న్న ఆలోచ‌న చేసింది టీమ్ మోదీ! ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాట ఉన్న అపార అభిమాన జ‌నం బీజేపీ కీ కూడా ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌లోనే ఆయ‌న్ను వ‌ల‌వేసి ప‌ట్టింద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయ‌న‌కు గ‌న‌క గవర్నర్ ప‌ద‌వి ఇస్తే, రాష్ట్రంలో తిరుగులేకుండా పోతుంద‌న్నది బీజేపీ వ‌ర్గాల న‌మ్మ‌కం కూడా. అస‌లే ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న ఈ త‌రుణంలో ర‌జ‌నీని ద‌గ్గ‌ర‌వానిగా మ‌రింత ఆత్మీయునిగా చేసుకుని ఉన్న‌త ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌గిలిగితే త‌మిళ‌నాడు, ద‌క్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేసే ఆలోచ‌న‌లు మ‌రింత ప‌దునుగా అమ‌లు చేయ‌డానికి ఎంతో ఆస్కారం ఉంద‌న్న‌ది బీజేపీ మేథోవ‌ర్గానికి అనిపించి ఉండ‌వ‌చ్చు. మ‌రో విధంగా, ర‌జ‌నీ కూడా ఇటీవ‌ల సినిమాల‌కు కాస్తంత విశ్రాంతి ఇచ్చి రాజ‌కీయ‌ప‌రంగా త‌న స్నేహితుల‌ను ద‌రిచేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని త‌ప్ప‌కుండా స్వీక‌రించితే త‌న స్థాయిని పెంచుకోవ‌డంతో పాటు, త‌న‌కు త‌మిళ‌నాట  పెరుగుతోన్న రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌కు అడ్డుక‌ట్ట వేయ‌చ్చ‌న్న ఆలోచ‌నా చేసి ఉండ‌వ‌చ్చు. క‌నుక త‌మిళ నాట ర‌జ‌నీ ఫాన్స్‌కి ఇదో శుభ‌వార్తే అవుతుంది. ర‌జ‌నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అరుణాచ‌లం, భాషా, బాబా,ముత్తు వంటి సినిమాలు ర‌జ‌నీని ఆధ్యాత్మిక గురువుగానూ మ‌రో కోణంలో అభిమానులు ద‌ర్శించారు.  ఇదిలాఉండ‌గా, గతంలో ఆధ్యాత్మిక చింత‌న భారంతోనే ర‌జ‌నీ అనేక రాజ‌కీయ అంశాల‌మీద ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమర్శ‌లూ చేయ‌లేదు. అయితే రాజ‌కీయ‌విశ్లేష‌కులు మాత్రం అదంతా న‌ట‌నే, బీజేపీ, కేంద్ర నాయ‌క‌త్వాన్ని ఆక‌ట్టుకోవ‌డంలో ర‌జ‌నీ వేసిన ఎత్తుగ‌డే త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ముఖ్యంగా జ‌మ్ము కాశ్మీర్ అంశంలో ర‌జ‌నీ ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలో బీజేపీ నాయ‌క‌త్వాన్ని సీనియ‌ర్ నాయ‌కుల‌ను భ‌జ‌న చేయ‌డం కూడా జ‌రిగింది. చాలా కాలం క్రిత‌మే అమిత్‌షాను పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తారు ర‌జ‌నీ. మీరు పార్ల‌మెంటులో చేసిన భాష‌ణ మ‌హాద్భుతం.. ఎవ‌రివ‌ల్లా కాదు మిత్ర‌మా అంటూ పొగిడేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా ల జంట మ‌హాభార‌తంలో  కృష్ణార్జునుల వంటిదని ర‌జ‌నీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వీరిద్ద‌రి వ‌ల్లే దేశం ఊహించ‌ని  అభివృద్ధి దిశ‌లో వెళుతోంద‌ని దేశ‌మంతా వినిపించేలా ప్ర‌శంసించారు.  2018లో తూత్తుకుడిలో యాంటీ స్టిరెటైట్ ప్రొటెస్టుల సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌లు, అల్ల‌ర్ల‌ను ర‌జ‌నీ వ్య‌తిరేకించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన పోలీసు కాల్పుల్లో ఏకంగా 13మంది చ‌నిపోయారు. జూలైలో నెటిజెన్లు శాంతాకుళం లో ఇద్ద‌రు వ్యాపారుల మ‌ర‌ణం గురించి నెటిజ‌న్లు హోరెత్తితే ఇక త‌ప్ప‌ని స్థితిలో ర‌జ‌నీ కామెంట్ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిందే గాని, కేంద్రం ఏమ‌నుకుంటుందోన‌న్న భీతి ఆయ‌న‌లో లేక‌పోలేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల మీద సామాన్య‌జ‌నులూ విరుచుకుప‌డుతున్న త‌రుణంలో, విప‌క్షాలు మండిప‌డుతున్న స‌మ యంలోనూ ర‌జ‌నీ అంత‌గా స్పందించ‌లేదు. ఆయ‌న ఆధ్యాత్మిక చింత‌న సారాంశం కేవ‌లం కేంద్రం లోని బీజేపీవారిని ఆక‌ట్టుకోవ‌డానికే అన్న విమ‌ర్శ‌లూ ర‌జ‌నీ ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది. ఏతావాతా తేలిందేమంటే, ర‌జ‌నీకాంత్ కేవ‌లం భారీ డైలాగ్‌ల‌తో పెద్ద ఎత్తున జ‌నాక‌ర్ష‌క నాయ‌కునిగా ఆరాధ్య‌దైవంగా నిల‌బ‌డ‌ట‌మే కాకుండా త‌న‌లోప‌లి క‌మ‌ల‌నాథుడిని కూడా కాపాడుకోవ‌డానికి స్వీయ ఎత్తుగ‌డ‌లు క‌నిపించి క‌నిపించ‌కుండా చేప‌ట్టి ఢిల్లీ ప్రయాణాలు, ఆహ్వానాల‌కు మోదీ, షాల‌తో  ములా ఖ‌త్‌ల‌కు ట్విస్ట్ .. తన‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ అంటగ‌ట్టే అనుకూల‌త సాధించ‌డ‌మేన‌ని విశ్లేష‌కుల మాట‌.

ప‌రాగ్‌, రాపిడో డ్రైవ‌ర్ కాదు.. షార్ట్‌ఫిల్మ్ డైరెక్ట‌ర్‌!

అత‌ను రాపిడో రైడ‌ర్‌.  పేరు ప‌రాగ్‌.  ఎప్పుడూ బిజీగా ఉండే బెంగ‌ళూరు అత‌ని నివాసం. కావ‌డాన‌కి అత ను బైక్ టాక్సీ డ్రైవ‌ర్ గా అన్ని ప్రాంతాల‌కు అటు నుంచి ఇటు జ‌నాన్ని చేర‌వేయ‌డం ఉద్యోగంలానే చేస్తున్నాడు. కానీ అత‌నిలో క‌ళాకారుడు.. డైరెక్ట‌ర్ బ‌య‌టికి వ‌చ్చేడు. వాస్త‌వానికి అత‌నో వీడియోగ్రాఫ‌ర్ కూడాను. అందువ‌ల్ల  ఎంతో ఆస‌క్తితో జ‌నాన్ని ఆక‌ట్టుకునే చిత్రాలు తీయాల‌న్న త‌ప‌న స‌హ‌జంగానే అత‌నికి ఉంది.  ప‌రాగ్‌,  రాపిడో రైడ‌ర్‌గా ప‌నిచేస్తునే ఒక చైనా కంపెనీకి వీడియో సిరీస్‌లో ప‌నిచేస్తుండేవాడు. కానీ  చైనా యాప్స్ నిషేధంచ‌డంతో అత‌ను ఆ కంపెనీవారి నుంచి బ‌య‌ట‌ప‌డి స్వంత‌గా ఏద‌న్నా చేయాల‌న్న ఆలో చ‌న‌లో ప‌డ్డాడు. కోవిడ్‌-19 భ‌యాందోళ‌న‌లో బెంగ‌ళూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లంతా బికు బికు మంటూంటే ఇత‌ను మా త్రం ధైర్యం చేసి కెమెరా ప‌ట్టుకుని సిటీ అంతా తిరుగుతూండేవాడు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్‌లు తీస్తుండేవాడు. అత‌నికి అలా చాలామంది ఆ ఫీల్డ్ కి సంబంధించిన సంబంధాలు ఏర్ప‌డ్డాయి. చేతిలో కెమెరా కూడా ఉండ‌డంతో ఫిల్మ్ తీయ‌డం మ‌రింత సులువు కావ‌డంతో త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా మంచి థీమ్‌తో చ‌క్క‌ని షార్ట్ ఫిల్మ్‌లు తీసి తెలిసిన‌వారికి, ఆ ఆసక్తి ఉన్న పెద్ద‌వారికి చూపిం చేవాడు. ఈ ప్ర‌యాణంలోనే అత‌నికి ఒక పెద్ద కంపెనీని సంప్ర‌దించాడు. పెద్ద సిరీస్‌కి ప్లాన్ చేశాడు. అది విజ‌య‌వం త‌మైంది. అంతేకాదు, ఏకంగా 15 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకున్నాడు.  క్ర‌మేపీ రాపిడో రైడ‌ర్ ప‌ని నుంచి బ‌య‌ట‌ప‌డి పూర్తిస్థాయి షార్ట్‌పిల్మ్ డైరెక్ట‌ర్ గా అంద‌రి దృష్టినీ ఆక‌ట్టు కున్నాడు. ఇపుడు ప‌రాగ్ బెంగ‌ళూరులో చెప్పుకోద‌గ్గ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌. 

రేవంత్ టార్గెట్ గా మర్రి వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి బావిలో కప్పలా తయారైంది. బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారీ.. ఓ రెండడుగులు వెనక్కులాగేలా అసమ్మతుల గళం వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మార్పు కలకలం సద్దుమణుగుతోందని అనుకునేలోగా మర్రి శశిథర్ రెడ్డి టీపీసీసీ తీరుపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపాయి. సీనియర్లు అందరూ పథకం ప్రకారం రేవంత్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా అనంతరం.. కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. మండలాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించుకుని ఉపఎన్నిక కదన రంగంలోనికి పకడ్బందీగా దూకేందుకు సమాయత్తమౌతోంది. ఇందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక నుంచి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకటరెడ్డిని పూర్తిగా దూరం చేశారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ పై విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు పార్టీ హై కమాండ్ స్పష్టమైన సందేశం పంపించింది. ఇప్పుడు తాజాగా మర్రి శశిథర్ రెడ్డి టీపీసీసీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. సీనియర్ నేతలంతా ఒకరి తరువాత ఒకరుగా రేవంత్ ను పార్టీలో బలహీనపరచడానికి పకడ్బందీ వ్యూహంతో అడుగులు కదుపుతున్నారా అనిపంచక మానదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగి, పార్టీ పరంగా పదవులు, హోదా అనుభవించి పార్టీ అధికారంలో లేనప్పుడు సోదిలోకి కూడా కనిపించకుండా మాయమైన నేతలు ఒక్కొక్కరుగా తెలంగాణలో రేవంత్ లక్ష్యంగా గొంతు సవరించుకుంటున్నారా అని పించేలా వారి తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ పై చేసిన విమర్శలన్నీ ఒకెత్తు, తాజాగా మర్రి శశిథర్ రెడ్డి చేసిన విమర్శలు ఒకెత్తు అన్నట్లుగా ఉన్నాయి. ఆయన రేవంత్ నే కాకుండా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బయటకు వచ్చే పరిస్థితిలో లేరనీ, తన లాంటి వారెవరికీ కనీసం ఆయన అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వరనీ అన్నారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన టీపీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారనీ, రేవంత్ కు ఏజెంట్ గా పని చేస్తున్నారనీ దుమ్మెత్తి పోశారు. అయితే మర్రి శశిథర్ రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఇంత కాలం నోరు కట్టేసుకున్న నేతలు .. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఒకింత పుంజుకోగానే.. గొంతు సవరించుకుని పార్టీని మళ్లీ ఇక్కట్లలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం మౌనంగా ఉన్న వీరు అదే మౌనాన్ని కంటిన్యూ చేస్తే పార్టీకి మేలు చేసిన వారౌతారని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కనీసం ఊహలో కూడా ఎవరూ తలిచే పరిస్థితి లేదు. అటువంటిది రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా బీజేపీని కాదు, కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అటు బీజేపీ కూడా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరపతి రోజురోజుకూ తగ్గుతుంటే..ప తెలంగాణలో మాత్రం రోజు రోజుకూ బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోందని భావిస్తోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ లక్ష్యంగానే వలసలకు తెరతీసింది. రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించడం, కొండా విశ్వేశ్వరరెడ్డ కమలం గూటికి చేరడం ఇందులో భాగమునని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద మర్రి వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఏదో ఒక మేరకు కాంగ్రెస్ జోరుకు, రేవంత్ దూకుడుకు కళ్లెం వేయాలన్న లక్ష్యంతో చేసినవేనని విశ్లేషిస్తున్నారు. 

పోటీప‌డిన త‌ల్లీ కొడుకు, పోటీప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌య్యారు

పిల్ల‌ల‌కి స్కూలు బ్యాగ్‌, టిఫిన్ బాక్సులు స‌ర్ద‌డంతో, హోంవ‌ర్క్ చేయించ‌డంతోనే త‌ల్ల‌లు చాలామంది స‌గం రోజు గ‌డిపేస్తుంటారు. పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతూ తాము చ‌దువుకున్న రోజుల్ని గుర్తుచేసుకునే వారూ ఉన్నారు. కానీ కొడుకుతో పాటు ప‌బ్లిక్ స‌ర్వీస్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డ‌టం మాత్రం బిందు చేయ‌గ‌లి గింది.  కేర‌ళ మ‌ల్ల‌పురానికి చెందిన బిందు త‌న కొడుకు వివేక్ కేర‌ళ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డ‌టం అత‌నికి స‌హాయం చేయ‌డంతో పాటు ఆమె కూడా ఒక ప్ర‌య‌త్నం చేసింది. అందుకు ఆమె భ‌ర్త కూడా అంగీక‌రించి త‌గిన మ‌ద్ద‌తునిస్తూ అన్ని ఏర్ప‌ట్లూ చేశాడు. అంతే ఇద్ద‌రు త‌ల్లి కొడుకులా కాకుండా పోటీ ప‌రీక్ష‌కు పోటీప‌డుతున్న విద్యార్ధుల్లా చ‌దివారు.  42 ఏళ్ల బిందు ఎల్ డీసి ప‌రీక్ష‌ల్లో 38వ ర్యాంక్ సాధించ‌గా ఆమె కొడుకు 24 ఏళ్ల వివేక్  92వ ర్యాంక్ సాధిం చాడు. చిత్ర‌మేమంటే ఇద్ద‌రూ క‌లిసే చ‌దువుకున్నారు, ఇద్ద‌రూ ఒకేచోట ట్యూషన్‌కీ వెళ్లారు. కానీ ఆమెకు చ‌దువు ప‌ట్ల శ్ర‌ద్ధ‌, ఉద్యోగం ఎలాగైనా సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ముందు త‌న కొడుకు శ్ర‌మ గొప్ప విజ‌యా నికి సాధించ‌లేక‌పోయింది. కానీ త‌ల్లి త‌ల్లే.. త‌న కొడుకు నుంచే స్పూర్తి పొందాన‌ని, అత‌ను శ్ర‌ద్ధ‌గా చ‌దువు తుండ‌డంతో త‌న‌కూ ఆస‌క్తి రెండింత‌లు పెరిగింద‌ని బిందు అన‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఈ ప‌రీక్ష‌లు రాయ‌డానికి 40 ఏళ్లు ప‌రిమితి. కానీ మింట్ ఉద్యోగానికి ఈ అర్హ‌తను మూడేళ్లు పెంచారు. ఈ కార‌ణంగా బిందు లాంటి ఆస‌క్తిగ‌ల‌వారికి ఇది మంచి అవ‌కాశంగా మారింది.  త‌ల్లీ కొడుకూ ఇద్ద‌రూ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష ఉత్తీర్ణుల‌య్యారు. ఇక ఉద్యోగాల గురించి వేచి ఉన్నారు. ఇద్ద రికీ ఒకే చోట‌.. ఒకే ప‌ట్ట‌ణంలో వేస్తారా.. వేరే వేరే ప్రాంతాల్లో వేస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉండ గా, ఇలా త‌ల్లీ కొడుకుల జోడి ప‌రీక్ష‌లు రాయ‌డం, ఉత్తీర్ణులు కావ‌డం క‌ర్ణాట‌క‌లో చాలా రోజుల త‌ర్వాత గ‌మ నిస్తున్నామ‌ని ట్విట‌ర్ల‌లో జ‌నాలు త‌మ అభిమానాన్ని తెలియ‌జేస్తున్నారు. ఇప్పుడు ఇద్ద‌రికి అభిమానుల తాకిడి ఎక్క‌వే అయింది. గుడ్ ల‌క్ బిందూ గారూ.. అంటూ పెద్ద పెద్ద అధికారులు కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఆహార భద్రత కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి

ఆహార భద్రత లబ్ధి దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త అందించింది. ఈ కార్డ దారులకు ఆరోగ్య శ్రీ సేవలను అందుబాబులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే అన్ని ఉచిత వైద్య సేవలకు, చికిత్సలకు ఆహార భద్రత కార్డు హోల్డర్ ను అర్హులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్‌ కు మాత్రమే పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్‌ భారత్‌లో చికిత్సలు పొందాలంటే.. సంబంధిత కార్డులైనా ఉండాలి. లేదా తెల్ల రేషన్‌ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి.దీంతో ఆహార భద్రత కార్డు దారుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత   10 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను అందజేసింది.   ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా దృక్పథంతో స్పందించి, ఆహార భద్రత కార్డు దారులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ఆదేశించారని హరీష్ రావు తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఇకపై ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతిస్తాయని  మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ - ఆరోగ్యశ్రీ పథకాలకు   ఆహార భద్రత కార్డులను కూడా అర్హతగా పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కూడా ప్రకటించింది.   ఈ మేరకు అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సమాచారం అందించిందని పేర్కొంది. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ పథకాలను కలిపి ఒకే రూఫ్ కిందకు తీసుకువచ్చిన సంగతి  సంగతి తెలిసిందే. ఆ ఆహార భద్రత కార్డు లేనివారు... రేషన్‌ కార్డుతోపాటు ఆధార్‌ కార్డును కూడా చూపించి ప్రయోజనం పొందవచ్చు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బుధవారం ఓ ప్రకటన జారీచేసింది.

ఆసియా లీడర్స్ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం

కేటీఆర్ సీఎం కారు.. అయినా ఆయనకు తెలంగాణలో అంతకు మించి గుర్తింపు ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా కేటీఆర్ తనదైన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ గుర్తింపుతోనే చాలా మంది  సీఎంలకు కూడా దక్కని ఒక అవకాశం ఆయన తలుపు తట్టింది. బెస్ట్ సీఎంలుగా వివిధ సర్వేలతో ఊదరగొట్టించుకున్న ముఖ్యమంత్రులకూ రాని  గుర్తింపు, అవకాశం కేటీఆర్ తలుపు తట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు ఆర్థిక సదస్సులకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కేటీఆర్ కు ఇప్పుడు మరో ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్ ల్యాండ్ లో జరిగే ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆసియా లీడర్స్ సీరిస్ ఫోరం కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితుల కారణంగా   ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై పడుతున్న ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమావేశానికి తనకు ప్రత్యేకంగా ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.  వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు దొరికిన అవకాశంగా ఆయన ఈ ఆహ్వానాన్ని అభివర్ణించారు. ఇలాంటి సమావేశాలకు హాజరవడం వల్ల తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికపై ప్రజెంట్ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు.