జామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు...

ఇది మామూలుగా మనం ఏ పుస్థకంలో దో కాదు ఇది ఓ డాక్టర్ గారి స్వీయ  అనుభవాన్ని మీముందుకు తీసుకు వస్తున్నాం.యదార్ధ సంఘటన.    ఇది ఇరవై ఐదు సంవత్సరాల నాటి మాట  ఈ విషయయం  ప్రముఖ ఆస్ట్రేలియన్ హెర్బల్ వైద్యనిపుణుడు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు తెలుగు వన్ తో పంచుకున్నారు. ఈ మ్నేపద్యంలో తాను తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నానని. చెప్పారు  ఆస్ట్రేలియాలో ఉన్న చాలా మంది ఆలోపతి వైద్యులను సంప్రదించా నని చెప్పారు. చాలా మంది పిడియో డొంట్రిక్స్ సర్జన్స్ ఆ జ్ఞాన ద్సంతాన్ని తీయాల్సిదేఅని అన్నారు. అప్పటికే నా దవడ వాచింది తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.అన్నారు లక్ష్మణ్ రావు ఇక పంటిని పీకడం తప్ప మరోమార్గం లేదని వైద్యులు హెచ్చరించారు.ఇక చేసేది లేక  సరే అన్నాను అలా ఒక సారి బయటికి వచ్చి ఒక సారి ఎవరో చెప్పినట్టుగా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు ఆకు రసం చేయగలదా అనే జిజ్ఞాస కలిగించింది.ఆధునుక వైద్యం కూడా నయం చేసుకోగలిగాను. ఆ అను భవం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆధునిక వైద్యం కూడా నయం చేయలేని చిగుళ్ళ వ్యాధిని ఒక సాధారణ చెట్టు ఆకు అతి త్వరగా అతి త్వరగా తేలికగా పూర్తిగా నయం చేయగలిగింది. అలా నా సమస్యకు పరిష్కారం నన్ను హెర్బల్ మూలికా వైద్యం పైన పరిశోదన చేయడానికి దారి తీసింది అంటున్నారు ఆ స్ట్రేలియా  హెర్బల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు . హెర్బల్ మెడిసిన్ పై విదేశాలలో  40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు ఆయన తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు.కేవలం వృక్ష సంబంద తో నయం చేసే ఔషదాలను తాయారు చేస్తూ  సహజంగా హెర్బల్ మెడిసిన్ లో ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని దీర్ఘ కాలిక వ్యాధులను ఖచ్చితంగా నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు.

2030 నాటికి ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం ఎలా ఉంటుంది?

2030 నాటికి అసలు ప్రపంచం లోని ప్రజల జీవన పరిస్థితులు  ఎలా ఉంటాయి అన్నదే ప్రశ్న? ఇప్పుడు చీనా లోని ఊహాన్ ల్యాబ్ లో పుట్టిన  వైరస్ అతలా కుతలం చేస్తోంది. ఇక చీనా వరాలజీ ల్యాబ్ లో  ఉన్న వైరస్ లు  మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రజల అనారోగ్యం తో పోరాడుతూ ఉండాల్సిందేనా? మనల్ని వెంటాడే వైరస్ నుండి కాపాడు కోవాలంటే ఏమి చెయ్యాలి? అప్పటికి అంటే 2030 నాటికి మన ప్రపంచ దేశాలలో జీవిస్తున్న సగటు మనిషి కి  ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాయా ? అదే నేడు ప్రపంచం ముందు ఉనాసవాల్.  సంవచ్చరం గడిచి పోయింది మరెన్నో ప్రశ్నలు, సందేహాలు, 2030 నాటికైనా ఆరోగ్యరంగంలో భారాత్ అభివృద్ధి చెందుతుందా? వైద్య రంగంలో అభివృద్ధి చెందిండా అన్నదే ప్రశ్న? ఒక వేళ అభివృద్ధి చెందితే మొదటి వేవ్  ప్రభావంతో అసలు మనము ఏమి నేర్చుకున్నాము? అసలు రెండవ వేవ్ వస్తోంది దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక లేదు? వైరస్ ను ఎదుర్కొడానికి   వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచం చెపుతోంది. అయినా ఇప్పటికే వ్యాక్సిన్ ను  పంపిణీ చేసే ప్రణాళిక లేకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒకడోస్ అందిన వారికి రెండవ డోస్ ఇంకా ఇవ్వలేదు. వ్యాక్సిన్ నిల్వలు లేవని. అందుకే రెండవడోస్ ఆలస్యం అవుతోంది. మొదటి వేవ్ లో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం సన్నద్దమ్ కాలేదు. ఇక ముంచుకొస్తున్న మూడో వేవ్ లో ఎలా సన్నద్ధమౌతుంది అన్నది తేలాలి. రెండవ వేవ్ లో వచ్చిన పరిణామాల  దృస్ట్యా కనీసం ఏం చేయాలని అనుకున్నారు? అసలు ఆరోగ్య వ్యవస్థ పై నియంత్రణ ఉందా? ప్రణాళిక ఉందా ? ఆరోగ్య రంగం అంటే సేవా రంగం వినియోగ దారుడి కి సేవలు అందించడం ముఖ్యం దీనికి సంబందించిన కీలక ప్రశ్నలకు 2030 నాటికి జవాబుల భిస్తుందా ? దీని ధరలు మూడింతలు పెరుగు తయా? ఈ వైద్య విధానాన్ని భరించే శక్తి సామాన్యుడికి సాధ్యమేనా? అన్నది ప్రశ్న? ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయాలని చెప్పడలిచిందా ? చాలా రకాల సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంది.సృజనాత్మకత జోడించింది. వాటిని మానిటైజ్ చేసింది. కొంత మంది ఈ రంగానికి చెందిన వాళ్ళే కాదు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం భవనం, సమీకరించడం. సృజనను జోడించారు. ఈవిధంగా ఆరోగ్య రంగం పై  పెత్తనం చేయడానికి సిద్ధమౌతారు.ఇక వైద్య రంగం లో ప్రభుత్వం లో పెట్టుబడుల అంశం గురించి ఆలోచిస్తే కేంద్రం ప్రభుత్వ పెట్టుబడులు  ఉపసంహరించుకోడం జరుగుతుంది ఇక వైద్య సేవరంగానికి సంబందించి ప్రభుత్వ పెట్టుబడులు పెడుతుందని విశ్వసించలేము. ఇప్పటికే వైద్య రంగాన్ని పూర్తిగా చేసిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఆలవాట్లలో చేతిని శుభ్రం చేసుకోవడం పరిశుభ్రంగా ఉండడం సామాజిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కోరోనా వల్ల హెపటైటిస్ బి లేదా అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి థైరాయిడ్, డిసెంట్రీ, షింగ్రియా, ఇన్ఫెక్షన్, ప్రాణాలు హరిస్తున్న, టి.బి, మనం ట్రెస్, ట్రీట్, పేషెంట్ ఇండెక్స్, కాంటాక్ట్స్, వల్ల వ్యాధి విస్తరణ, జరగ కుండా ప్యాండమిక్, ను నిరోధించాలీ, కొన్ని దశాబ్దాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆరోగ్యం పై నిబద్దత కట్టుబడి ఉందా ? లేదా? అన్నది ముఖ్యం? ఇందుకు భిన్నంగా ఇంటి ఆరోగ్య సంరక్షణ, అత్యవసరం, ఎప్పుడు ఆసుపత్రి అవసరం చికిత్స, చికిత్స పద్దతులు ఇంట్లోనే ఉంటూ అలవాటు చేసుకోడం అవసరం. ఇంటి ఆరోగ్య సంరక్షణ పద్దతులు తెలిమేడికిన్, హోం ల్యాబ్, హోం ఫార్మా,హోంవ్యాక్సినేషన్, హోం హెల్త్, హెల్త్ మనీట్రింగ్, అన్నీ వేళలా ఎక్కువే, హోం హెల్త్ సోల్యూషన్ కొనుగోలు దారులు ఉంటారా. అను నిత్యం జీవితంలో భాగమై ఉండవచ్చు. ఇందుకోసం డాటా అవసరం.  ఆరోగ్య విధానం నూతన పద్దతి... ఈ మధ్య కాలంలో ఛైనా లో ఉన్న వైరస్ కన్నా ఇతర వైరస్ ల ప్రభావం గనక ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రకృతి  పరంగా వచ్చే రోగాలు  మున్ముందు మరింత ఇబ్బంది పెడతాయి. సాంకేతిక జ్ఞానం మరింత ఇబ్బంది కి గురికాక తప్పదు వాస్తవానికి  చాలా రకాల రోగాల పై పోరాడాల్సి ఉంది .ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగం లోని వైద్యం ద్వారా సంరక్షించ బడాలి. దీనికోసం సుదీర్ఘ సమయంలో పరిశీలించడం, వృద్ధి సాధించడం అవసరం.డిజిటల్, తెలిహేయల్త్, ట్రేస్, అండ్ ట్రీట్ పడ్డాతిలో క్లోస్ కాంటాక్ట్ ల ద్వారా వ్యాప్తి చెందకుండా ప్యాండమిక్ సమయంలో జాగ్రత్త పడ్డారు.సాంప్రదాయ వైద్యాన్ని సాధన చేయడం ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సాధన చేస్తూ నాణ్యమైన సురక్షిత మైన ఆరోగ్యం అవసరం. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ వైద్య రంగంలో సమగ్రమార్పులు చేపట్టడం దీనిని ఒక అవకాశంగా స్వీకరించి 2030 నాటికి సమగ్ర ఆరోగ్య విధానం తో అందరికీ  ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదే.

Boost your Immunity

Immunity holds lots of importance in preventing some serious contagious diseases. To keep the diseases at bay it is important to strengthen our body’s capability to resist harmful microbes from entering our bodies. It is our fortune that, there are some foods that can build up a protective-shield against the microbial diseases. Here are some immunity building foods: Yogurt is a great source of probiotics or most commonly known as ‘Good Bacteria’ which keep away diseases of gut and intestines. A 7-ounce intake of yogurt daily is as good as a popping in pills. A strain of Lactobacillus stimulate white blood cells and boost up our immunity Two cloves of Garlic a day fights off infectious bacteria and you are less likely to catch cold. Its intake is vital in lowering the risks of colorectal and stomach cancers besides building up our immunity Savoring Chicken Soup to tussle infections is an age old remedy, which was adopted by our forefathers too. It blocks the migration of inflammatory cells; the broth keeps minimal mucus just as the cough medicines do! Tea is yet another food that keeps policemen of our body all time vigilant. People who sip in tea are 10 times more capable of fighting off viruses owing to the increased virus-fighting policemen. For centuries together, people have looked upon to mushroom for healthy immune system. Recent researchers have proven that mushrooms are efficient in raising the production and activity of the white blood cells to fight off the diseases! Having good resistance to microbes is indeed a Boon! Because Prevention is always better than Cure! Stay Healthy!! Stay Forever!!

The Scary Nosebleed!!

The nosebleed or also known as epistaxis is the bleeding from the nose, and in severe case it may present as bleeding from the eyes or even mouth. The nosebleeds are rarely life-threatening, they are spontaneous and self-limiting, and however recurrent ones can be a reason for concern. Epistaxis can be divided into 2 categories, based on the site of bleeding as, anterior bleeds and posterior bleeds.  Most of the nosebleeds are anterior epistaxis, which occurs from the Little’s area, wherein the External and internal carotid arteries anastomose, thus the bleeds are constant ooze rather than pulsatile bleed. Posterior bleed arise further back in the nasal cavity, are usually more profuse, and are often of arterial origin, and are even more dangerous than the anterior nosebleeds. The most probable cause of nosebleed is the mucosa is eroded by cold and dry climate, exposing and subsequently rupturing the blood vessels. Local trauma is the most common cause, followed by facial trauma, foreign bodies, nasal or sinus infections, and prolonged inhalation of dry air. Children usually present with epistaxis due to local irritation or recent upper respiratory infection. While, the systemic causes include; blood dyscrasias, arteriosclerosis, hereditary hemorrhagic telangiectasia, drug abuse and idiopathic causes. The peak incidence is seen among the children of 2-10 years mostly due to self-inflicted local trauma, and also in elderly 50-80 years due to systemic and cancerous growths.  The management includes, first calm down the patient, then apply direct pressure over the soft and fleshy part of the nose hold it from about 5minutes and up to 20minutes, never hold your head back instead tilt it forward which helps decreasing the chances of nausea and airway obstruction. The nosebleed that do not subside within 20minutes require medical attention, this involves local application of vasoconstrictor or the use of silver nitrate to cauterize bleeding blood vessels. Rarely might require surgical ligation of the blood vessels. -Koya Satyasri  

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని  నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే అనార్ధాల పై అవగాహన కల్పించే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ప్రపంచం పొగాకు రహిత సమాజంగా రూపొందించాలన్న లక్ష్యంగా డబ్ల్యూ హెచ్ ఓ ప్రయత్నం చేస్తోంది. ప్రతి యేటా పొగాకు వాడకం వల్ల 6 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 20 30 నాటికి ఈ సంఖ్య 8 మిలియన్లు చేరే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే  వైరస్ తో పోరాడు తున్న ప్రపంచ ప్రజలు అనారోగ్యం తో సత మత మౌతూ మరణిస్తున్న వేళ పొగాకు  వాడకం వల్ల వచ్చే సమస్యలు తోడైతే ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  ప్రజలు తమ ఆరోగ్యం కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని తమ ఆదాయాన్ని  పూర్తిగా ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్తితి ఉందని అన్నారు.సగటున సంవత్సరానికి సగటున 4 ,0 0 0 సిగరెట్లు వాడతారని పేర్కొంది. ఇంత డబ్బును సిగరెట్ల కోసం ఖర్చు చేసే బదులు  ఇతర ఆహార విహారాలకు వెచ్చించ వచ్చని సూచించింది.ప్రపంచం పొగాకు రహిత సమాజంగా తీర్చి దిద్దాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది. ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం చరిత్ర ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 19 8 7 లో నే ప్రారంభించారు. పొగాకు వల్ల వచ్చే సమస్యలు తలెత్త డంతో మరణాలు అధికం కావడంతో 19 8 7 లో ప్రపంచ ఆరోగ్య సభ ఒక తీర్మానం చేసింది. పొగాకు వాడకం వల్ల ఊపిరి తిత్తులకు సంబందించిన సమస్యలు నిమోనియా, టి బి , వంటి సమస్యలు ఇతర సమస్యలు దారి తీయవచ్చు. నని 20 0 8 లో గుర్తించారు.పొగాకు వాడకం వల్ల ప్రకటనల రద్దు చేసింది. 20 14 నాటికి ప్రపంచం లో సిగరెట్ల ఉత్పత్తి రంగం లో అగ్రగామి చైనా కావడం మరో విశేషం. ప్రపంచంలో 30 % సిగరెట్ల ఉత్పత్తిలో వినియోగంలో ను చైనా ముందు వరుసలో ఉంటుంది. 20 వ శతాబ్దంలో 10 0 మిలియన్ల ప్రజలు  పొగాకు తాగడం వల్లే చని పోయినట్లు అంచనా. యూఎస్ లో 16 మిలియన్ల ప్రజలు ముఖ్యంగా అడల్ట్స్ పొగతాగడం వల్ల అనారోగ్యం  పాలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మరణాలు 15 % కేవలం పొగ తాగడం వల్లే నని పేర్కొంది. 70 సంవత్సరాల వయస్సు పై బడిన వారు  సగానికి సగం మరణాలు పొగాకు తాగడం వల్లే అని తేల్చింది. ప్రతి 5 గురిలో ఒక్కరు  పొగాకు తాగడం అలవాటు.7 మిలియన్ల ప్రజల మరణాలలో 1.3 మండి పొగాకు వాడిన  వారే ఉన్నారని తేల్చారు. 1.2 మిలియన్లలో 1.3 బిలియన్ల ప్రజలు పొగ తాగే వారిపక్క న కూర్చోడం వల్లే చని పోయారు.  పొగాకు అనర్ధాలకు 5 కారణాలు 1) పొగాకులో హానికరక రసయానాలు ఉంటాయి. 2) కొన్ని రసయానాలు క్యాన్సర్ కు కారకాలుఉన్నట్లు గుర్తించారు. 3) పొగాకు నియంత్రణకు సంబంచిన చట్టాల అమలు ప్రచారం చేయాలి. 4) రానున్న ముందు తరాల పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున పొగాకు వ్యతిరేకంగా  ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలి. 5) పొగ తాగడం వల్లే మీలోని సృజనాత్మక తను చంపేస్తుంది.  పొగాకు ఉత్పత్తులు, వాటివల్ల వచ్చే అనార్ధాలను నిరోధించడానికి పార్లమెంట్ లో చేసిన చట్టాలు  ఖటినంగా  అమలు చేయాలని డబ్ల్యూ హెచ్ ఓ స్పస్టం చేసింది.  

సంప్రదాయ వైద్యంతోనే ఆరోగ్యం

ఆయుర్వేదం అత్యంత శాస్త్ర్హీయ వైద్య శాస్త్రం. మన శరీర ఆరోగ్యాన్ని  కాపాడుకునే చికిత్స ఆయుర్వేద వైద్య విధానం ద్వారా చేసే చికిత్స  అద్భుత వైద్యంగా  వందల సంవత్సరాల క్రితం నిరూపిత మైంది.ఈ వైద్యంలో అనుసరిస్తున్న చికిత్స పద్దతులు మన పూ ర్వీకులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతావనిలో నే అనుసరించారని చరిత్ర చెపుతోంది.ఆయుర్వేద సంస్కృత పదం దీనిని ఇతర సాహిత్యం లోకి అనువదించి నప్పుడు.  సుదీర్గ కాలం పాటు జీవించేందుకు కావల్సిన జ్ఞానం. ఆయుర్వేద నిర్వచనం ప్రచారం ఆయుర్వేదం అంటే ఆయుష్టు ను పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. రోగాన్ని మూలాల నుండి నిరోదిస్తుంది.  హోలిస్టిక్ సైన్స్ గా పేర్కొన్నారు.ఆరోగ్య సంరక్షణ చేయడం తో పాటు .వ్యక్తిని  ఆరోగ్యం గా ఉంచే శక్తి ఆయుర్వేదనికి ఉంది.వ్యాధి స్వరూప స్వభావాన్ని బట్టి సమస్యను గుర్తించేందుకు వాత, పిత్త, కఫం అనే విధానాన్ని అనుసరించి చికిత్స చేస్తారు.శరీరం లో వచ్చే వివిద రకాల శబ్దాలు. శరీరం లో అవయవాలు , మనస్సు.సంస్కృతంలో శరీర మనసు ఆత్మ ఇదే జీతానికి మూడు ఆధారాలు.మూడు భాగాలు సమానంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.మన పూర్వీకులు, తప్పస్సు చేసిన ఋషులు, మనకు ఆయుర్వేదం మూల సిద్దాంతలను., విధానాలను  తెలిపారు ఫిజియోలజీ,మైండ్ ,బోడి, మెడిసిన్, ఆయుర్వేదానికి సంబందించి  విధి విధానాలను పురాతన ఆయుర్వేద శాస్త్రం ఋగ్వేదం లో కను గొన్నారు. వైద్య శాస్త్రాని కి సంబందించి తాళ పాత్ర గ్రంధాలలో చరక సంహిత , శుస్రూతుడు, వాగ్బట వంటి వారు తమ గ్రంధాలను భారతీయులకు అందించారు. ఇంకొంత మంది సిద్ధులు రక రకాల విభాగాలు, సాధారణ వైద్యం, పీడియాట్రిక్స్, శాస్త్ర చికిత్స, టోక్షికొలోజీ , ఫెర్టిలిటీ, వంటి అంశాలని పద్దతులను సాధన  ఎప్పుడైనా చేయ వచ్చని పేర్కొన్నారు. మన  చుట్టూ ఉన్న ప్రపంచలో చాలా ఆరోగ్య పద్దతులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా అదీ సూర్య రశ్మి వల్ల మరెన్నో ఆరోగ్య లా భ్హాలు ఉన్నాయని చెపుతున్నాయి ఆయుర్వేద శాస్త్రాలు. ఆయుర్వేదం లోని ప్రధాన సూత్రాలలో ఒకటి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని సమతౌల్యంగా ఉంచాలి  అవ్దే శరీరం, మనస్సు, ఆత్మ   , ఇందులో ఏ ఒక్కటి లోపం  ఉన్నా   శరీరానికి అనారోగ్యం వస్తుంది. ప్రపంచం మొత్తం లో ఆయుర్వేద శాస్త్రంలో ని ప్రధాన సూత్రాలు వాత, పిత్త, కఫం.ఆధారంగానే  రోగి తత్వాన్ని గుర్తిస్తారు.  ప్రపంచం పంచ బూతాలతో నిండి ఉంది అందులో గాలి, నీరు, అగ్ని,భూమి,ఆకాసం, ఈ పంచ భూతాలలో మనుషులలో మూడు దోషాలు శక్తులు అవే వాత, పిత్త,కఫ అని నిర్ధారించారు. శరీరంలో వచ్చే సమస్యను ఎదుర్కొడానికి, వీటి మధ్య సమతౌల్యాన్ని సాధించాలి.సమస్యను తొలగించాలి. మూడిటి లో సమ తౌల్యం లోపించకుండా మూల కారణాన్ని కనుగొని నివారణ సమతౌల్యాన్ని  సాధించ వచ్చు. ముఖ్యంగా ఎప్పుడు జట రాజ్ఞి, పోష్టీక ఆహారం తీసుకుని పనికి రాని చెడును  మొత్తంగా తీసివేస్తుంది. ఇది చాలా సులభం. ఇందులో ఏ దోషమైనా శరీరంలో ఉన్నప్పుదు ఒక పరిమిత స్థాయిలోలేనప్పుడు శరీరం  గతి తప్పు తుంది.వారి వారి శరీరాలలో అన్నీ సమానంగానే ఉంటాయి. ఈ దోషాల నుండి  విముక్తి పొందాలంటే వారి జీవన శైలి,ఆహార విహారాలలో పౌష్టిక ఆహారంవిధానాలను సూచించారు దీనివల్ల శరీరంలో అదనంగా పేరుకు పోయిన దోషాలను తొలగిస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం గా ఉన్నాడు అనెందుకు శుశ్రుత సంహితలో ఎవరి దోషాలు అయితే సమానంగా  ఉంటాయో శరీర తత్వం, పొట్ట, కణాలు సహజంగా పనిచేస్తాయో. ఎవరి మనస్సు శరీరం ఆత్మ  ఆనందంగా ఉంటారో వారే ఆరోగ్య వంతుతులు. అంటారు అందుకే మన ఆరోగ్యం  మన చేతుల్లో ఉందని అంటున్నారు.సాంప్ర దాయ వైద్యం తోనే ఆరోగ్యం అన్న విషయం ఆర్ధ మౌతోంది.

ధూమపానం మరణంతో సమానం

ప్రతి సిగరట్ ప్యాకేట్ మీద ఎంతో చక్కగా రాస్తారు స్మోకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్ అని,కాని అది ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి మరీ సిగరెట్ తో పాటు రోగాలని కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ధూమపానం వల్ల ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఒక అంచనా. ఈ రోజు No smoking day. ఈ సందర్భంగా కొంతమంది అయినా ఈ అలవాటుకి దూరమయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు.   ఈ సిగరెట్ కాల్చేవాళ్ళకి ఎంత ముప్పు ఉందో అది కాల్చకపోయిన పక్కనే ఉండి పీల్చేవాళ్ళకి దానికి రెండింతలు ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. సిగరెట్ తయారుచేయటానికి వాడే పదార్థాలలో 4000 కెమికల్స్ కలిసి ఉంటాయట.  ఒకప్పుడు ఏదైనా బాధలోంచి బైటకి రాలేనివారు ఒక మత్తు పదార్ధంగా భావించి దీనికి అలవాటు పడేవారు. కాని ఈ రోజుల్లో పొగతాగటం ఒక ఫాషన్ గా మారిపోయి ప్రాణాలని తెలియకుండానే మింగేస్తోంది.     సిగరెట్ లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం వల్ల గుండె  కొట్టుకోవలసిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుని గుండె దడకి, గుండెపోటుకి దారితీస్తాయి. పొగతాగేవారిలో 90% మంది  లంగ్  కాన్సర్ బారిన పడుతున్నారట. 70% మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. సిగరెట్ లో కలిపే తారు, నెయిల్ పాలిష్ రిమూవర్, క్రిమిసంహారక మందు మొదలైనవాటివల్ల ఆరోగ్యం విపరీతంగా క్షీణించటమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. పొగపీల్చటంవల్ల గాలిపీల్చే గొట్టాలకి కెమికల్స్ అంటుకుపోయి ఆయాసం, ఉబ్బసానికి దారి తీస్తాయి.  రక్తప్రసరణకి ఆటంకం ఏర్పడటమే కాకుండా ప్రాణవాయువు సరిగా అందకుండా చేస్తుందిట ఈ సిగరెట్.   మన దేశంలో 60 లక్షల మంది శ్రామికులు ఈ పొగాకు ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. ఒకేసారి ఈ ఉత్పత్తుల మీద నిషేదాలు విధించకుండా, వాళ్లకి వేరే ఉపాధి అవకాశాలు చూపించి ఈ పొగాకు ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పొతే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారత్ లో సిగరెట్ రేటు 10% పెంచితే వాటి వాడకం నలుగు నుంచి ఐదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు.       ఈ ధూమపానం అలవాటుకి దూరమవ్వాలనుకునేవారు ఎప్పుడైనా పొగ తాగాలనిపిస్తే నీరు ఎక్కువగా తాగటం వల్ల ఆ కోరిక తగ్గుముఖం పడుతుందిట. అలాగే పొగ తాగాలనిపించిన వెంటనే ఆ మూడ్ లోంచి బయటకి రావటానికి వాకింగ్ కి వెళ్ళటమో లేదా చూయింగ్ గమ్ లాంటిది అలవాటు చేసుకోవటమో చెయ్యాలి. అంతేకాక మెడికల్ షాపుల్లో కూడా వీటికి తగ్గ మందులు దొరుకుతున్నాయి.   ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చెయ్యకూడదని ఎన్నో రకాల ఆంక్షలు విధించినా ప్రజలలో సరైన అవగాహన లోపించటంతో ఆ చట్టాలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రజలలో చైతన్యం వచ్చిన రోజు ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.  ..కళ్యాణి

సుఖం ఎక్కువైతే..దుఖమే

సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్‌కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని  తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి.   నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి.   ఒకప్పుడు యాంటీబయోటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.   ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం.    * తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు. *  నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది. * అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి * శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.

మహిళలకు హై బీపీ వస్తే...

మధ్య వయస్సు మహిళలకు హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవ? హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు  40 సంవత్సరాలమధ్య వయసు ఉన్న మహిళలు బీపీ హై బీపీ సమస్యలతో బాధపడు తున్నారని ఒక పరిశోదన వెల్లడించింది. మధ్య వయస్సు లో ఉన్న మహిళలో 40 - 5 0 సంవత్సరాల లో ఉన్న పురుషులకంటే స్త్రీలలోనే గుండె దమనులు నాశనం చేస్తున్నాయని లో బీపీ అత్యంత ప్రమాద కరమని  డాక్టర్ నిర్ధారించారు. హై బీపీ లో బీపీ వల్ల గుండె పోటు, శరీరానికి రక్త ప్రసారం, ఆక్సిజన్ అందడం లో సమస్యలు వచ్చి నట్లు గుర్తించారు. పాశ్చాత్య దేశాలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ వల్ల మరణాల రేటు పెరిగినట్లు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి యువతులలో ఈ సమస్య పెద్దగా లేదని నిపుణులు విశ్లేషించారు.కొన్ని దేశాలలో యువతులు మధ్య వయస్సులో ఉన్న మహిళలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ పెరుగు తున్నట్లు గుర్తించారు.ఒక పరిశోదనలో పురుషులకంటే స్త్రీలలోనే రక్త పోటు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు యువతులకు వస్తున్న ఆంశం పైన పూర్తిగా పరిశీలించాల్సిన  అవసరం ఉందని ఒక నూతన పరిశోదన ప్రకారం 40 సంవత్సరాలకు ముందే రక్త పోటు చాలా తక్కువగా ఉంటుందని దీనిని స్టేజ్ 1 గా  యు ఎస్ లో గుర్తించారు.

ఓట్స్ అంటే ఔషధమే!

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఓట్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఓట్స్‌ అంటే తెలియనివారు ఉండరు. నిజానికి ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. ఐరోపా, పశ్చిమాసియా దేశాలలో వేల సంవత్సరాలుగా దీనిని పండిస్తూ వచ్చారు. అయితే దీనిని ఎక్కువగా పశువుల దాణాగానే ఉపయోగించేవారు. గుర్రాలు వేగంగా పరుగులెత్తేందుకు కావల్సిన శక్తిని అందించే ఆహారంగా దీన్ని భావించేవారు. 19వ శతాబ్దం నాటికి నిదానంగా ఓట్స్‌ పోషక విలువలు అర్థం కాసాగాయి. ఓట్స్‌తో బ్రెడ్‌ల తయారీ మొదలైంది.   పోషకాలే పోషకాలు!:  ఓట్స్‌ ఏడాది పొడవునా పెరిగే పంట. ఎంతటి వర్షపాతాన్నయినా తట్టుకుని పండే సత్తా దీనికి ఉంది. ఇక ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. విటమిన్లు అందునా ‘బి’ విటమిన్లలో ఉండే అన్ని విభాగాలూ (B1, B2, B3, B5, B6, B9) ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, ఖనిజాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే హోమియోపతిలో సైతం దీనిని ‘అవీన సటీవా’ పేరుతో విస్తృతంగా వాడుతూ ఉంటారు. నిస్సత్తువ, నరాల బలహీనతా, గుండె జబ్బులు... వంటి అనేక సమస్యలలో అవీనా సటీవా అద్భుతంగా పనిచేస్తుంని హోమియోపతి వైద్యులు నమ్ముతారు.   కొవ్వుని కరిగిస్తుంది:  ఊబకాయం తగ్గాలంటే ఓట్స్‌ గొప్ప ఆహారం అని జనం భావించడం వెనుక శాస్త్రీయత లేకపోలేదు. చాలా తక్కువ పదార్థాలలో ఉండే beta-glucan అనే పీచు పదార్థం ఓట్స్‌లో కనిపిస్తుంది. ఈ beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది. పైగా ఆహారం శుభ్రంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఒక గుప్పెడు ఓట్స్‌ తీసుకున్నా కూడా అందులో ఉన్న beta-glucan అటు కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పైగా శరీరంలో క్రిముల వల్ల ఏర్పడే ఇన్షెక్షన్లను కూడా ఈ beta-glucan ఎదుర్కొంటుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.   రక్తపోటుని నియంత్రిస్తుంది:  ఒక 40 గ్రాముల ఓట్స్‌లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు! రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందన్నమాట.   ఇతర తృణధాన్యాలు తినలేనప్పుడు:  కొంతమందికి గోధుమలు, బార్లీ వంటి తృణధాన్యాలు సరిపడవు. ఇందులో ఉండే గ్లూటెన్ అనే మాంసకృత్తుల సముదాయం వల్ల వారిలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటం వల్ల, మనకి కావల్సిన పోషకాల నుంచి దూరమవుతాం కదా! చిత్రంగా ఓట్స్‌లో గ్లూటెన్ ఉన్నప్పటికీ, అది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని తేలింది.   ఇంతేకాదు... ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఓట్స్‌ ఎన్నోరకమైన అనారోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకూ, శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి స్వస్థత పొందేందుకూ ఒక ఔషధిలాగా పనిచేస్తుందని తరచూ ఏదో ఒక పరిశోధన రుజువు చేస్తోంది. మరెందుకాలస్యం. మన రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను కూడా చేర్చేసుకుంటే సరి!   - నిర్జర

వైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరమా?

ఒక పక్క కరోనా వైరస్, మొన్న బ్లాక్ ఫంగస్, ఇప్పుడు వైట్ ఫంగస్ ప్రజల ను మింగేయ్య డానికి వచ్చిపడింది. వైరస్ ను కట్టడి చేయచ్చు. కానీ శరీరం లోపల పేరుకు పోయిన బూజు అదే ఫంగస్ శరీరం లోని కణ జలాన్ని తినేస్తుంది.  ఒక్కో అవయవంలోకి చెరీ న ఫంగస్ లు రెండు రకాలని ఒకటి బ్లాక్ ఫంగస్,రెండవది వైట్  ఫంగస్ అని నిపుణులు తేల్చారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వైట్ ఫంగస్ రొగులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాద కరమని తేల్చారు. వైట్ ఫంగస్ ఊపిరి తిత్తులు,గోళ్ళు, చర్మం, పొట్ట, కిడ్నీ, మెదడు,నోరు , వంటి భాగాలను తీవ్ర ప్రభావం చూపుతుందనిఅంటున్నారు.  వైట్ ఫంగస్ లక్షణాలలో ఒకటి ఊపిరి తిత్తుల్లో నొప్పిగా ఉండడం లేదా పట్టినట్లు ఉండడం. ఊపిరి పీల్చు కోడం లో ఇబ్బంది పడడం. సహజంగా చాలా మందికి శరీరంలో ఇన్ఫెక్షన్ లు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు, ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్. డయాబెటిస్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, కలుషిత ఆహారం తీసుకుంటే పొట్టలో ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇలా ఒకటో ఏమిటి మనశరీరం అంతా ఇన్ఫెక్షన్ల పుట్ట. ఇక దీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్న వారికి సుదీర్ఘ కాలం పాటు అన్నీ బెడ్ మీదే సాగే రొగులు అలాగే మంచం పై ఉంటే బెడ్ సోర్స్ వల్ల శరీరం లో పుండు ఏర్పడి ఆ భాగమ్ ఇన్ఫెక్షన్ కు గురి అయి అది ఇతర అవయవాలను చెరీ తినివేయడంవల్ల ఇన్ఫెక్షన్ తొల గించడానికి తీవ్రంగా శ్రమించాలి అయినా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కిడ్నీలో చెరీ ఇబ్బంది పెడుతుంది అలాగే సకాలంలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి ట్రీట్మెంట్ లో సరైన యాంటీ బాయిటిక్స్ ఐ వి ఇంటర్ వైన్ ఇస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మనిషిని బతికించవచ్చు లేదా ఆ యిన్ఫెక్షన్ అన్నీ అవయవాలను తినేస్తే శరీరం చికిత్సకు స్పందించకుంటే చనిపోతారని వైద్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలం పాటు చికిత్సలౌన్న సర్జరీ చేసిన త్రువాత ఇన్ఫెక్షన్ లో చీము చెరీ చనిపోయిన వారిసంఖ్య చాలానే ఉంటుంది. వైట్ ఫంగస్ కన్నా ఇన్ఫెక్షన్ లే ప్రాణాలను తీసేస్తాయి. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షనా కాదా కేవలం బూజు మాత్రమేనా యాంటీ బాయిటిక్స్ కు లొంగు తుందా అన్న విషయాన్ని నిపుణులు పూర్తిగా దృవీకరించాల్సి ఉంది. ఏది ఏమైనా ఫంగస్ ప్రాణాంతకం అని చెపుతున్నారు డాక్టర్స్. సొ జరబధ్రం మరి.                       

మంచి ఆరోగ్యానికి పంచశీల సూత్రాలు

    ఆరోగ్యానికి తప్పని సరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు... 1) ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివి అని మనకి తెలుసు.  అయితే మందులు వేసుకున్న వెంటనే మాత్రం పండ్లరసాలు త్రాగకూడదు. అలా తాగితే  మందులు పూర్తిస్థాయి ఫలితాలని ఇవ్వవు అని చెబుతున్నారు వెస్ట్రన్ అంటారియో  విశ్వవిద్యాలయ పరిశోధకులు. 2) క్యారెట్‌లలో ఉండే ఫాల్ కారినల్ కాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాలలో తేలింది. కానీ వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు ఆ పరిశోధకులు. క్యారట్‌ని తరిగి, ఉడకబెట్టడం వలన వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయట. క్యారట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచిని ఇచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయి. కాబట్టి  ఆరోగ్యం కోసం క్యారట్ తినాలంటే అలాగే తరగకుండా ఉడికించి తినాలి, లేదా పచ్చిగా తినాలి.   3) ప్రతీరోజూ పెరుగు తింటే చిగుళ్ళ వ్యాధులు రావు. పెరుగులోని లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్ళపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. దానివల్ల చిగుళ్ళు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి .    4) రోజూ వీలైతే మధ్యాహ్నం భోజనం తరవాత ఒక 45 నిముషాలు చిన్న కునుకు తీయండి. ఆ కునుకు మీ గుండెను కాపాడుతుంది అని అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. రోజూ మధ్యాహ్నం 45 నిముషాలు పడుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వలన, రాత్రిపూట గాఢంగా నిద్రపోయే సమయం తగ్గడంతో రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు పెరిగిపోయాయని, ఆ ముప్పు నుండి తప్పించుకోవాలి అంటే, పగటినిద్ర అవసరం అని సూచిస్తున్నారు వీరు.         5) సన్నగా కనిపించాలి అన్న ఆరాటంతో గంటలకి గంటలు కఠిన వ్యాయామాలు చేయడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసేముందు ఎంతసమయం వ్యాయామం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వంటి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి అట. ఎందుకంటే అవగాహనా లేకుండా ఎక్కువ సమయం కఠిన వ్యాయామాలు చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదంఎక్కువంటున్నారు నిపుణులు -రమ

శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని కరోనా!

నోవాల్ కరోనా వైరస్ కేవలం ఊపిరి తిత్తు పైనే ఎందుకు దాడి చేస్తుంది. లేదా ఇతర  అవయవాల పై  ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతున్న కోరోనా ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని ప్రశ్నలు ఒక మిస్టరీ గా మారింది. చాప కింద నీరులా నెమ్మదిగా హై పోక్సియా గా మారడానికి కారణం ఏమిటి?శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు తగ్గి పోతాయి? ఆక్సిజన్ స్థాయి ఎందుకుతగ్గి పోతుంది ?వెంటనే శరీరం లోని అవయవాలు పాడై పోదనికి గల కారణం ఏమిటి ? ఏమి గుర్తించ కుండా దీర్ఘ కాలం పాటు అనారోగ్యం తో ఇబ్బంది పడ్డ రోగులని చూడచ్చు.నేడు సాంకేతికత శకం అద్భుతాలు సృస్టిస్తున్నారు.రోగుల సమాచారాన్ని  బద్రపరచడం కీలకంగా మారింది బోస్టన్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్ యూనివర్సిటీ వర్మోనెంట్ సమన్వయంతో నిర్వహించిన పరిశోదన అసలు కోరోనా కేవలం ఊపిరి తిత్తులపైనే ఎందుకు దాడి చేస్తుంది అన్న అంశంపైన కారణాలను శోధించింది. ఈ మధ్య ముఖ్యంగా కోరోనా మొదటి రెండవ వేవ్ లో కోరోనా వచ్చిన రోగులలో ఆక్సిజన్ శాతం తగ్గడం వంటి సమస్యను ఎదుర్కున్న ఘటనలు చూశాం అలాగే  సమాయానికి ఆక్సిజన్ అందక పోయిన ప్రాణాల గురించి విన్నాం. కొన్ని సందర్భాలలో ఊపిరి పీల్ల్చు కోవడం కష్టంగా మారింది. ఇలా ఇబ్బంది పడే సమస్యను వైద్య భాషలో హై ప్రోక్సియా అసలు హై ప్రోక్సియా బలం ఏమిటి? ఎందుకు ఊపిరి తిత్తులను ఎందుకు నాశనం చేస్తుంది.అంటే ఇన్ఫెక్షన్ వల్ల నసనమయ్యేది మొదట ఓపిరి తిత్తులే. అందుకే మనిషి ఊపిరి ఉన్నంత వరకే అయు ష్యూ. ఊపిరి ఆగిందా పరలోక ప్రాప్తి తధ్యం అని అంటున్నారంటే అసలు ఊపిరి ఊపిరి తిత్తులు మనల్ని బతికిస్తాయి ఊపిరి తిత్తుల్లో ఉండే టి ష్యూ లకు ఆక్సిజన్ అందక పోవడం వల్ల అవయవాలకు రక్త ప్రసారం అందడు.ఆక్సిజన్ చాలా నెమ్మదిగా చాపకింద నీరులా హై పోక్సియా కు తీసుకు పోతుంది. ఇంకా వీటీకి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.ఇప్పటికీ ఫిజియోలాజికల్ గా ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న? దీనిగురించి వచ్చిన దాతాలో కూడా లేదు.బి యు కాలేజ్  ఇంజనీరింగ్ ప్రొఫెసర్ బయో మెడికల్ ఇంజనీరింగ్  మెటీరీయల్ సన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లో పరిశోదన చేసిన రచయిత కోరోనా రోగుల అనుభవాలు నిపుణులు వర్ణించిన విధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మనిషికి సమానంగా ఉండాలి ఇది ఎపుడైతే బాలన్స్ తప్పుతుందో సమస్యలు వస్తున్నాయి. ఇది రోగిని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీని బారిన పడ్డ రోగులలో అబ్నార్మలటీస్ లక్షణాలు లేవని అందుకే లంగ్ స్కాన్ కు వెళుతున్నారని పరిశోదకులు బావించారు.  సైలెంట్ హై పో క్సియా... హైపోక్సియా కు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలి దశ నుంచి ఎలాంటి పరిణామాలు ఉన్నా యో. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద పెద్ద ఇంజనీర్లు సైతం పెద్ద పెద్ద కంప్యూ టర్లు సహకారం తో జరుగుతున్న ఘటనలను తెలుసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. ఆక్రమంలో రక్త ప్రసారనికి ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు. అన్న విషయం  తెలుసుకునే ప్రయత్నం చేషారు. పరిశోదనల అనంతరం నేచర్ కమ్యూనీకెషన్స్  ప్రచురణలో బయో లాజికల్ మెకానిజం గా పేర్కొన్నారు. బయోలాజికల్ గా వస్తున్న మార్పుల వల్ల కోవిడ్ 19 ఊపిరి తిత్తులలోకి చేరుతుంది.   బాయో మెడికల్ కు చెందిన ఇంజనీర్ జాకొబ్ హేమన్ ,సుర్కీస్ ల్యాబ్ లో అశోసి యెట్ సహజంగా ఊపిరి తిత్తులు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి ఆక్సిజన్ ను ప్రతి సెల్ కు అందిస్తుంది మనం ఊపిరి తీసుకునే నాన్ ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఊపిరి తీసుకున్న ప్రతిసారీ మన ఊపిరి తిత్తులకు రక్త ప్రసారం ఆక్సిజన్ ను 9 5 % నుండి 100 వరకు ఉంచుతుంది. 92 కు తగ్గినప్పుడు డాక్టర్ సహాయంతో కోరోనా సమయంలో ఆక్సిజన్ శూలిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స చేసే వైద్యులు ఆరోగ్య పరిస్తిని అంచన్న వేయడం లేదా సాంకేతిక శబ్దామ్ వచ్చినప్పుడు హెచ్చరించే వారు .సైలెంట్ హై ప్రోక్సియా ఆక్సీ మీతెర్స్ కొన్ని ఇంట్లో ఉంచుకోడం ఇప్పుడు అవసరంగా మారింది.కోరోనా వైరస్ ద్వారా ఇంట్లో ఎవరికైనా ఉందని గమనిస్తే త్వరగా కోలుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.కేవలం వారి వారి ఆక్సిజన్ బ్లడ్ లెవెల్స్ గమనించేందుకూ కొనుగోలు చేశారు. పరిశోదనలు కేవలం మొదట కోవిడ్ 19 ప్రభావం ఊపిరి తిత్తులపై ఎందుకు పడుతుంది ? సహజంగా రక్తం ఎక్కడికి వెళుతోంది ఎక్కడికి చేరుతోంది. ఇన్ఫెక్షన్ వల్ల పాడు కావడం వల్ల ఏ లంగ్ లో ఆక్సిజన్ అందం లేదు ఇక్కడ రక్త నాళాలు ఎలా పనిచేస్తున్నాయి? మన ఊపిరి తిత్తుల ద్వారా మాత్రమే లంగ్ లో ఉన్న ట్యూబ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ రక్తం శరీరానికి అందిస్తుంది.  పరిశోదకుడు హార్మన్ ప్రకారం ప్రాధమిక స్థాయిలో క్లినికల్ డాటా సూచనల మేరకు రోగులకు చెందిన  ఓపిరి తిత్తులు ఊపిరి తిత్తుల ద్వారా రక్త ప్రసారాన్ని నియంత్రించడం లో విఫలమై నందుకే టి ష్యూ లు పాడై పోయాయని వాటిని చూసినప్పుడు అవి గట్టి పడిపోయాయని , వాటిని సి టి స్కాన్ లో అంచనా వేశారు.ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమిటి అంటే సహజంగా ఉండే రక్త ప్రసారం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారా అన్న విషయాని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయ పడ్డారు. రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా రక్త ప్రసారం తగ్గిందా? అన్నకోణం లో పరిశీలించారు.రక్త ప్రవాహం లంగ్స్ లో ఉన్న ఇతర ప్రాంతాలలో రక్త ప్రసారం జరిగే ఇతర నాళాలో గోడలు కొంచం వాచీ ఉండడం గమనించామని అన్నారు. కోవిడ్ 1 9 ఇన్ఫెక్షన్ వల్ల స్కాన్ లో చిన్న చిన్న రక్త నాళాలు ఉన్నట్లు గమనించారు.ఆక్సిజన్ లెవెల్స్ తగ్గెందుకు ఇది ఒక కారణం అని చెప్పలేం. ఈ అంశం డాటా లో పేర్కొనలేదని తెలుస్తోంది.చివరగా ఒక వేళ సహజంగా గాలి ద్వారా రక్తం లోకి ప్రవేశిస్తే ఊపిరి తిత్తులు సహజంగా పని చేయాలి ఎక్కడ పొంతన లేని ఆంసలు ఒకదానికి ఒకటి సరిపోలని స్థితి ఓపిరి తిత్తుల్లో ఊచ్వాస్ నిశ్వాస లోనే ఏవో సమస్యలు ఉండవచ్చు . ఊపిరి తిత్తుల్లో ఇంజూరీ,గాయం లంగ్ అబ్నార్మల్ గా ఉందనేది అసంబద్దం అని తేల్చారు.పైన పేర్కొన్న ఆంశాలన్నీ క్రోడీకరించిన తరువాత కోవిడ్ రొగులు ఆక్సిజన్ శాతం తగ్గి పోదనికి కారణం చెప్పవచ్చు.ఇవేవీ గుర్తించ కుండ ఏవేవో ప్రక్రియలు చేసేస్తున్నారు.ఈ సమస్య నుండి బయట పడేందుకు చికిత్సలు ఎన్నో ఉన్నాయి.బోర్లా పడుకోడం వల్ల ఆక్సిజన్ పెరగడం వైరస్ ఒక్కొక్కరినీ ఒక్కోలా స్పందిస్తుంది.అవి ఆర్ధం చేసు కోడం అని డాక్టర్లు అంటారు రోగిలో రక్తం ఆక్సిజన్ శాతం తగ్గిందన్న విషయం  కారణం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనంతరం సరైన చికిత్స నిర్ధారించగలరు.వైద్యం చేయడం వల్ల రక్త నాళాల పని తీరును మెరుగు పరుస్తాయా లేదా ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసారం అన్నది అంతుచిక్కని మిస్టరీ  వ్యవహారం గా సుస్పెన్స్ గా మిగిలిపోయింది ఇంకా ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.  

కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు

ఊహాన్ లో పుట్టిన కోరోనా నేడు ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది.  అయిన వాళ్ళను దూరం చేసుకున్నా అభాగ్యులు, కోరోనా మూలంగా   తల్లి తండ్రుల ను కోల్పోయిన  పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లి తండ్రులు,  అందరినీ కోల్పోయి అనాధాలుగా మిగిలిన చిన్నారులు, ఇంటి ఇంటికి ఒక్కో కధ పుంఖాలు పుంఖాలుగా వస్తాయి. ఒక పక్క ఆసుపత్రి ఫీజులు మరోపక్క  అంబులెన్స్ ఫీజులు, స్కూల్ ఫీజులు, అంత్యక్రియలకు డబ్బుతో ముడి పడిన ఆంశాలే. చివరకరికి మనిషి చచ్చిన శవానికి శ్మశానంలో వేల కొద్ది ఫీజులు, ఇలా అటు మానవ సంబందాలు ఆర్ధిక సంబందాలుగా మారిన వేళ కాశీలాంటి పవిత్ర నదులలో అంత్యక్రియలు చేసే స్తోమత లేక నదిలో వదిలి పెడితే కనీసం పుణ్యలోకాలకు  పోతారనే విశ్వాసం తోనే అయిన వారిని అలా  విడిచి పెడుతున్నారని  తెలుస్తోంది. ఈ కుప్పల కొద్ది వస్తున్న శవాల దహానాలు ,మరో పక్క నదుల్లో విడిచి  పెట్టడం, అంటే ఆశవాలు దిబ్బలు కోరోనా శవాలు మాత్రమేనా అన్నది అనుమానం.? కొన్ని జిల్లాలలో శ్మశాన వాటికలో శవ దహనానికి వేలలో వస్శూలకు పాల్పడుతున్న గడ్డలు రాబందుల మధ్యలో ఉన్నామని సిగ్గు పడుతున్న. ఇక పవిత్ర గంగా నదిలో పడేసిన శవాల కు పోస్ట్ మార్టం చేసారా ? అన్నది ప్రశ్న? ఒకవేళ ఆశవాలకు కోరోనా ఉంటే ఆపవిత్ర జలాలుగా భావించి తాగినవారికి కోరోనా వస్తుందా? అన్నది పెడ్డసవాల్ గా మారింది. ఇంకో అపవిత్ర కార్యం ఏమిటి అని అంటే శ్మశానాలు ఖాళీ లేకపోవడంతో  శవాలన్నిటిని కుప్పలుగా పోసి సామూహిక దహానాలు జరిపిన ఘటనలు చూశాం.అయినప్పటికీ సామూహిక దహనాల వల్ల ఎవరి అస్థికలు ఎవరివి ఎవరిఆస్థికలు నిమర్జనం చేశారో కూడా తెలీదు. ఇలా అన్నీ సమస్యల లోకి సామాన్యుడి బతుకును బుగ్గు చేసింది కోరోనా. ఇక ఊహాన్ చైనా లోపుట్టిన కోరోనా ల్యాబ్ లోనుంచి మార్కెట్ లో విస్థ రించిందనేదే వాదన.  ఇది ఇలా ఉంటే ఇటీవల హ్య్ద్రబాద్ జూ పార్క్ లో 8 మండి సింహాలకి కోరోనా వచ్చిందని గుర్తించారు. వాటికి కోరోనా ఎలా వచ్చింది మనుషుల మృగాలా ? అన్నది ప్రశ్న వాటి సంరక్షణ కు ఏ చర్యలు తీసుకున్నారు . ఇక ఇతర జంతువుల పరిస్తితి ఏమిటి? ఇక నిత్యం పొద్దున్నే పవిత్రం గా భావించే ఆవులు గేదెల లో కోరోనా వస్తే? వాటికి చికిత్స ఎలా? ఇక నిత్యం మన వీధుల్లో  మనతో కలిసి జీవించే కుక్కలు, పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? ఇక ఆదివారం వచ్చింది అంటే నోన్ వెగ్ షాపుల్లో తీసుకుంటున్న మాంసం లో కోరోనా ఉందని అంటే  ఏమి చేస్తాము? ఒకప్పుడు గాలిలో కోరోనా ఉందని దీనివల్ల పక్షులు చనిపోతున్నాయని. వాటికి కోరోనా వచ్చి ఉండచ్చు అనుకున్న మనం మనచుట్టూ కరోనా వాహాకాల మధ్యలో జీవిస్తున్నా మనం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు అవుతాయి.  అయ్యా అధికారులు అసలు కారకాలు ఏవో తెలుసు కొండి కోరోనా కట్టడికి చర్యలు తీసుకోండి.  అలసత్వం పక్కన పెట్టి చర్యలు  చేపట్టండి లేదా పెనుముప్పు ఉందన్న విష యాని గమనించండి. ఒక చిన్న సందేహం మాత్రమే అధికారులను అప్రమత్తం చేయడం మాత్రమే.

కీరా దోసతో 8 లాభాలు

ఎండా కాలంలో మినహా ఎప్పుడూ తినని కీరా దోసలో ఎనిమిది రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు  నిపుణులు.ఎండా కాలంలో కాస్త చల్లగా ఉండడానికి తీసుకునే పచ్చికూర గయాలలో ఒకటి దోస,లేదా కీరా దోస.దీనిని తింటే 8౦ రకాల మంచి పోషక విలువలు ఉన్నాయని న్యూట్రీషియనిస్ట్లు  అంటున్నారు. సాధారణంగా సగటున పెద్దవాళ్ళు రెండు లీటర్ల నీరు తీసుకుంటారు.12 కప్పుల కీరా తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందినట్టే.ప్రతి రోజూ దోసకాయలో 95 % నీరు ఇందులో ఉంటుంది. మీ శరీరం సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి నీరు తప్పని సరి. నీరు లేకుంటే కళ్ళు తిరగడం అనారోగ్యంగా ఉండడం ఒక వేళ మీ కు అనారోగ్యం గా ఉంటె ఆసుపత్రిలో చికిత్చ తప్పదు. మీశారీర కొవ్వును కరిగిస్తుంది... మీరు ఊబ కాయం లేదా ట మ్మీటక్ వంటి సమస్య తో బాధ పడుతుంటే మీశారీరంలో ఉన్న సెల్ల్స్ ను  హైడ్రేట్ చెయ్యడానికి కీర దోసకాయ దోహదం చేస్తుంది. మీరు కోసి ఉంచిన ఒక కప్పు కీరా దోసకాయను  తీసుకుంటే 16 క్యాలరీల అంటే చాలా తక్కువ మోతాదులో తింటే మీ ఊబ కాయాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. పోషకాలు ఇచ్చే కీరా దోస... ఒక కప్పు కీరా దోస తీసుకుంటే 14 % - నుండి 19 % విటమిన్లు ఇస్తుంది. దీనిద్వారా విటమిన్ బి,సి లభిస్తుంది. కాపర్,ప్రోస్పరాస్, పొటాషియం,మెగ్నీషియం, వంటివి కీరా ద్వారా లభిస్తుంది. డయాబెటిస్ ను తగ్గించే కీరా... శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే శరీరంలో ని కణాలను అవయవాలను పాడు చేస్తుంది.ఆర్ ఒఎస్, ఆర్ ఓ సి వంటివి ఎలుకలలో ఉన్నాయా లేదా అని పరీక్షించి నప్పుడుకీరా తిన్న ఎలుకలలో  ఆర్ ఓసి ని తగ్గించి నట్లు గుర్తించారు.దీనిఫలితాలు మరిన్ని రావాల్సి ఉందని శాస్త్ర్హజ్ఞ్యులు  పేర్కొన్నారు యాంటీ ఆక్సిడెంట్ కీరా... కీరా దోసాలో అత్యంత విలువైన ఆ క్సిడెంట్స్  లభిస్తాయి.ప్లా వోనాయిడ్స్, లిగానాన్స్,ట్రైటర్పిన్స్, ఇవి సెల్స్ ను రక్షించడమే కాదు ఆర్థ రైటిస్, ద్వారా వచ్చే ఇన్ఫ్లా మేషన్, లేదా దీర్ఘ కాలీక పరిస్తి తు లకు కీరా సహక రిస్తుంది.దీని ద్వారా వచ్చే రసాయనాలు మీ శరీరంలో ని సెల్ల్స్ కు నష్టం కలగ కుండా ఫ్రీ రాడికల్స్ గా పనిచేస్తుంది. గుండెకు కీరా.... మీరు నిత్యం తీసుకునే ఆహారంలో కీరా తీసుకుంటే దీనిద్వారా వచ్చే యాంటీ ఆక్సిడెంట్ గుండె ద్వారా వచ్చే పలు సమస్యలకు సమతుల్యం చేస్తుంది. మీ శరీరంలో కీరా ద్వారా వచ్చే విత్తనాలు న్యూట్రియంట్లు - కొలస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల పై ప్రభావం చూపిస్తుంది.అందుకే కీరా దోస లేదా ఇతర ఏ దోసలోని విత్తనాలు తీసి తినాలని సూచించారు. ప్రతి రోజూ తినండి కీరా... మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతైనా ఆహారం తీసుకోండి.ఎక్కువ మోతాదులో ఉప్పు కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పుడు మీ జీర్ణ శక్తి  మంద గిస్తుంది.హై డ్రెషన్ కోసం కీరా తీసుకుంటే కాన్సి ఫేషన్ వంటి సమస్యకు కీరా చాలా మేలు చేస్తుంది.పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. దోస తో ఆవకాయ -లేదా పచ్చడి... దోస కాయ తో దోస ఆవకాయ చేసుకుంటే చాలా మంచిది.లేదా కొన్ని కీరాలను ఉప్పు నీటిలో ఉంచి  బ్యాక్టీరియా గా పనిచేస్తుంది.ఇది మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉన్న ఇతర క్రిములపై పోరాడుతుంది  న్యూట్రి యంట్స్ ఆహారం అరుదల కు సహక రిస్తాయి. యాంగ్జైటీ ని తగ్గించే శక్తి కీరకు ఉంది.ఒక  ముఖ్య విషయం మార్కెట్లో దొరికే దోసకాయ లను వెనిగర్ సోల్యూషన్ లో ఉంచి అమ్ముతారు అది ఇది ఒకటి కాదు అన్న విషాయం గమనించాలి.అయితే కీరా కొనేటప్పుడు చిన్న కీరా తీసుకోవాలి అని న్యూత్రీషియనిస్ట్ లు సూచిస్తున్నారు.  

కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమేనా...

నో మాస్క్ నో ఎంట్రీ అని మనము అంటే టేక్ వ్యాక్సిన్ రెమొవె యువర్ మాస్క్ అంటోంది అగ్ర రాజ్యం అమెరిక. తొలి దస కోరోనా ధాటికి అగ్ర రాజ్యం పని అయిపోయిందని ఇప్పట్లో కోలుకోడం ఆసాధ్యం అని అనుకున్న ప్రపంచానికి అమెరిక బ్యాక్ అన్నట్లుగా దెబ్బతిన్న పులి సవాళ్లు చేయలేదు ప్రచార ఆర్భాటం చేయలేదు సభలు పెట్ట లేదు అభినందనలు తీర్మానాలు చేయలేదు. సమస్య ఎక్కడుందో గుర్తించింది అందుకు అనుగుణంగా ప్రణాళిక  రూపొందించుకుంది తను చేయాలనుకున్న పనిని మూడో కంటికి తెలియ కుండా అనుకున్న సమయానికి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది 1 1 4 రోజుల్లో 25 ౦ మిలియన్ల అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం అమెరికా బై దెన్  చేయ సర్కార్  మాటల ప్రభుత్వం  కాదని చేతల ప్రభుత్వం అని నిరూపించింది. అంతే కాదు అన్నిటికీ గత ప్రభుత్వాల వైఫల్యమే దీనికికారణం అని దుమ్మెత్తి పోయలేదు దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న మన్న విమర్శలు చేయలేదు ఒక  ప్రణాళికా బద్ధమైన వ్యూహాన్ని రూపొందించింది దానికి తగ్గట్టుగా సి డి సి సమన్వయంతో అందరికీ వ్యాక్సిన్ అందించి ఇక మాస్క్ తీసివేయ వచ్చని అమెరికన్లలో ఆత్మస్ధైర్యాన్ని నింపింది బై డెన్ సర్కార్.  అమెరికన్ అధ్యక్షుడు జో బై డెన్ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్ వైట్ హౌస్ లిల్లి గార్డెన్ వేదికగా ముఖానికి మాస్కులు లేకుండా కనిపించారు. మనం కీలమైన మైలు రాయిగా బై డెన్  అన్నారు. మొదటగా వ్యాక్సిన్ ను అందరికీ విజయ వంతంగా పూర్తి చేసామని అమెరికన్లు సత్వరం మేల్కొని వ్యాక్సినేషన్ వేయించుకున్న వారిలో కోరోనా ప్రభావం తీవ్రత తక్కువగా ఉందని బై డెన్స్పష్టం చేసారు. ఇక మాస్క్ లేకుండా ఉండవచ్చని ఇది ప్రజల విజయంగా పేర్కొన్నారు.  సి డి సి రూపొందించిన మార్గదర్సకాల ప్రకారం వ్యాక్సిన్ఇవ్వగాలిగామని రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అయితే మొదటిడో స్ వేసుకున్నా రెండవ డోస్ అయ్యేంత వరకూ మాస్క్ తప్పనిసరి పేర్కొంది ఈసందర్భంగా మాట్లాడుతూ జో బై డెన్ మాట్లాడుతూఅ 114 రోజులలో    25౦ మిలియన్ల  వ్యాక్సిన్  దొసులు ఇచ్చామని దాని ఫలిఫలితం కనిపిస్తోందని దీనివల్ల 49 - 5౦ రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం గతసంవత్సరం మరణాల కన్నా ఇప్పుడు తగ్గిందని నలుగు నెలల మధ్య కాలంలో దాదాపు 5.5% అంటే 6౦ % పెద్దవాళ్ళు ఆర్ధికంగా స్తబ్దత ఉన్నప్పటికీ 4౦ సంవత్సరాల వృద్ధిని సాధించగలిగామని ఉద్యోగాలు కల్పించగలిగా మని   ఆయన వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు తమ కార్క్రమాలను మాస్ లేకుండా నిర్వహించుకోవచ్చని.సామాజిక దూరం  పాటించాలని వ్యాపార స్థలాలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసారు.స్థానిక రాష్ట్రాలు ,ఫెడరల్ స్థానిక లేదా సరహద్దు ప్రాంతాలలో  నియమ నిబందనలు పాటించాలని ఇకపై అందరికీ పరీక్షలు అవసరం లేదని లక్షణాలు ఉన్నవారు చికిత్స తీసుకోవాలని అదీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రభావం తక్కువే ఉంటుందని అత్యవసర పరిస్థితిలో ఫైజార్ ను ఇచ్చేందుకు ఎఫ్ ఏ డి అనుమంతించింది. జాన్సన్  జోన్సన్  ను డబ్ల్యు హెచ్ ఓ అనుమతించింది ప్రణాళికా బద్ధంగా అటు అధికారులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం సమాన్వయం తో పనిచేస్తే భినామైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురి చేయాకుండా పనిచేస్తే కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమే.                    

కళ్ళ జోడు లేకపోతే కోరోనానే..

కోరోనా మొదటి దశ రెండవ దశలో వైరస్ చాలా మార్పులు వస్తోంది.మొదటి రెండవ మధ్య చాలా తెడాలు ఉన్నాయని దీనిని వె రి యంట్ చాలా తీవ్రంగా  ప్రభావం చూపిస్తోంది అని వైద్యులు పేర్కొన్నారు. కంటి ద్వారా కోరోనా వస్తుందా ?  కంటి ద్వారా కరోనా వస్తుంది అన్నది  ఆపోహా కాదు నిజమని కంటి వైద్యులు నిర్ధారించారు.  అసలు కంటి ద్వారా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది ? దీనిని ఎలానిర్దారిస్తారు ? నోరు , ముక్కు ద్వారా కోరోనా వస్తుందని నిర్ధారించారు అయితే ముక్కు నోటి ద్వారా చేరి రక్త నాళాల లోకి చేఉతుంది అని అంటున్నారు. అది మ్యుకస్  మేమ్బ్రిన్ ద్వారా కంటి లోకి చేరుతుంది. అని వివరించారు.  మ్యుకస్ మేమ్రిన్ ద్వారా వస్తే కోరోనా వస్తుందా ? కంటి ద్వారా కోరోనా వస్తుంది అన్నది ఊహ కాదు అని పరిశోధనల అనంతరం  దీనిని నిర్ధారించారని అన్నారు. దీనికి ఉదాహరణ ఊహాన్ లో ఈవిషయం డాక్టర్లు  నిర్ధారించారని అన్నారు. కళ్ళ జోడు లేకుంటే కరోనా వస్తుందా ?  కోరోనా ప్యాన్దమిక్ సమయం లో కంటికి కళ్ళద్దాలు లేకుంటే కొరో నా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ కంటి వైద్యులు కాసు ప్రసాద రెడ్డి హెచ్చరించారు. కళ్ళ కు అద్దాలు లేకపోతే కళ్ళు అదే పనిగా నలుపుకున్తారని దాని వల్ల కోరోనా త్వరగా విస్తరిస్తుందని ఆయన హెచ్చరించారు. సెకండ్ వేవ్ ద్వారా వ్యాప్తి చెండుతుండా? అన్న ప్రశ్నకు సమాధాన మిస్తూ మొదటి దశలో వచ్చిన దానికన్నా దీని ప్రభావం తక్కువే అని వివరించారురెండవ దశలో మరణాలు జరగడం తీవ్రంగా భావిస్తున్నామని అది ఎవరికైనా దగ్గరి బందువుల మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ప్రసాద రెడ్డి అన్నారు.అయితే మనం భయ పడాల్సిన పని లేదని కుటుంబసభ్యులకు దూరంగా ఉండడం  అన్నా బాధాకరమని.అన్నారు. అసలు కంటికి కోరోనా వచ్చినప్పుడు లక్షణాలు ఎలాఉంటాయి ? ఎలా నిర్ధారిస్తారు?కంటికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అసలు కోరోనా  లక్ష నాలు తెలియవు.  కళ్ళు మంట, తల నొప్పి, జ్వరం ఒళ్ళు నొప్పులు సహజంగా ఉంటాయి డయేరియా వస్తుంది.దగ్గు, గొంతు నొప్పి     వంటివి ఉంటాయి. ఊపిరి ఆడక పోవడం. వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తే స్వాస సమస్యలు వాస్తాయి. ఈసమస్యకు  చాలా చికిత్చలు ఉన్నాయి. సదరణ మందులతో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి బ్లడ్ తిన్నర్స్ ఇస్తున్నారు.రక రకాల వాదనలు ఆశావహ దృక్పదం తో జీవితాన్ని సాగించాలి కీలక సమయాలలో డాక్టర్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. స్వాస  6౦  ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇస్తే తప్పని సరిగా ఇవ్వాలి బతికించాలి  అదే డాక్టర్ దర్మం అంటారు డాక్తర్ కేపీ. కంటి డాక్తర్ గా మీరు కంటిని దగ్గరగా చూడాలి మీకు కరోనా రాదా ? అసలు ఇక్కడ జరిగిన సంఘటనని చెప్పాలి.వైరస్ వల్ల రక్తం చిక్క బడింది. దేనిని ఇతలిలో నిర్ధారించారు.మార్చి 2౦ అప్పటికే కోరోనా వచ్చింది  12,౦ ౦ ౦ రోగులు, చూసాం.౩, ౦౦ ౦ సర్జరీలు చేసామని చెప్పారు. బై పోలార్ ఐ డిజార్దార్  టెక్నికల్ ద్వారా వైరస్ను నాశనం చేస్తుంది. బ్రీథ్ సేఫ్ - బ్రీథ్ సేవ్  అన్నదే మా నినాదం ఊపిరి పోయడం ఊపిరితోనే వారిని రక్షించడం మా చికిత్చ . కంటి జబ్బులతో పాటు ఇతర జబ్బులు  వచ్చిన వారు ముఖ్యంగా ఊబాకాయం చక్కర వ్యాధితో బాధ పడే వారితోనే మనకు రిస్క్.  చిన్న పిల్లలలో కంటిలో కరోనా వాచ్చే అవకాసం దాదాపు లేదని అంటున్న చంతిపాప మీకంటి పాప కి కోరోనా వచ్చినా ఇతర కంటి జబ్బు వచ్చిన వెంటనే  డాక్టర్స్ ను సత్వరం చూపించాలి.  

వ్యాక్సిన్ కు ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా?

కరోనా వ్యాక్సిన్ కు  ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా? అన్నది ఒక సందేహం శరీర తత్వాన్ని బట్టి అత్యవసరమైతే తప్ప పెయిన్ కిల్లర్స్ ను వాడకపోవడం ఉత్తమం అంటున్నారు  డాక్టర్లు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ పై ప్రభావం చూపుతాయని అంటున్నారు.  మనం తీసుకునే వ్యాక్సిన్ శరీరంలో బూస్టర్ ను పెంచేందుకు ప్రయత్నిస్తుంది. వైరస్ కు వ్యతిరేకంగా వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది . దీనివల్ల సహజంగా జ్వరం , తలనొప్పి, కండారాల నొప్పులు,  తాత్కాలికంగా వస్తాయని అన్నారు. ఈ లక్షణాలకు  ఆర్ధం ఏమిటి అంటే ? మీ ఇమ్యున్ సిస్టం రీవైవ్ అవుతున్నట్లే అని అంటే, వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లే అని అంటున్నారు వైద్యులు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్  కంట్రోల్ ప్రివెన్షన్  డైరెక్టర్  డాక్టర్ రోచ్ ఎల్లె వాటెన్ స్కై ఈ విషయాన్నీ మీడియాకు వివరించారు. పెయిన్ కిల్లర్స్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ ను తగ్గించేందుకే అని ఇందులో ఇబు ఫ్రోబిన్, ఎవిల్ , మార్టిన్ వంటి బ్రాండ్లు ఇమ్యునిటీని తగ్గిస్తాయని విశ్లేషించారు. ఇందులో భాగంగా ఎలుకలపై చేసిన పరిశో దనలో వెల్లడి అయ్యిందని రోచ్ వివరించారు. వైరాలజీ జనరల్ లో  ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల యాంటీ బాడీలు ఉత్పత్తి తగ్గుతుందని ఇంఫెక్టింగ్ సెల్ల్స్ వైరస్ ను అదుపు చేయడం కష్టమని పేర్కొన్నారు. డాక్టర్ ను  సంప్రదించిన తరువాతే పెయిన్ కిల్లర్స్ వాడాలని డాక్టర్  రోచ్ సూచించారు. అవసరమైతే acetamin ophen (tylenot) సురక్షితమని సూచించారు. ఈ మందు ఇమ్యూన్ సిస్టం ను నివారించదని అన్నారు. సిడిసి కొన్ని సూచనలను చేసింది. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ తడి గుడ్డను లేదా చల్లటి ఐస్ ముక్కను గుడ్డలో ఉంచి అక్కడ అప్లై చెయ్యాలని సూచించింది. మీరు వేసుకునే బట్టలు బిగుతుగా ఉండరాదని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చేయి ఎర్రగా మారినా చేయి వచ్చిన డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. 

అంతర్జాతీయ నర్సింగ్ డే

ప్రపంచం మొత్తం ఒక యుద్దాని ఎదుర్కుంటోంది. అదీ కనిపించని శత్రువుతో  ఈయుద్ధం లో హాహాకారాలు అడుకోమ్మంటూ రక్షించమంటూ  వేడుకోళ్ళు  మాప్రాణాన్ని ఎవరు కాపాడుతారు అని చీకట్లో సైనికుల ఎదురు చూపులు అప్పుడే సరిగ్గా  అప్పుడూ అదే పరిస్థితి క్రిమిజన యుద్ధభూమిలో గాయపడ్డ సనికులకి ఆమె అండగా నిలిచింది ప్రాణాలు పోసింది అప్పుడు వాళ్ళు శత్రు దేశమా వారిది ఏమతము అని చూడలేదు తనకు తెలిసిన అభిమతం  అల్ల ఓ క్కటే సైనికులకు శేవ చేయడం  రాక్తం ఆడుతున్న వాళ్లకి కట్టుకట్టి ఆనేప్పినుంది వచ్చే బాధనుండి ఉపసమనం కల్పించడం ఆమెచేసిన పని  అంగ వికలాంగులైన వారికి వారి సమస్యను అర్ధం చేసుకుని డాక్టర్ కన్నా ముందుగా స్పందించి గాయానికి మందులు ఇస్తూనే శారీరకంగా కోలుకునే విధంగా చికిత్చ చేస్తూనే   తిరిగి మనోధైర్యం ఆత్మస్ ధైర్యాన్ని నింపి తో జీవించ గల మన్న మనో ధైర్యాన్ని ఇచ్చిన నిజమైన  సంఘ సంస్కర్త ఆధునిక నర్సింగ్ విధానానికి  కొత్త భాష్యం చెప్పిన లేడీ విత్ ది ల్యాంప్ న్ఘ్తిట్ ఇన్ గైల్ జన్మ దినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మ పన్నెండున  అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా  ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తూ ప్రాణాలు తీసేస్తున్న మహమ్మారి వచ్చి సంవత్చారం  గడిచింది ఇప్పుడు మళ్ళీ కంటికి కనపడని శత్రువు  కోరోనాను జయించడానికి వ్యాధి  తీవ్రత ఎంత ఈక్షనంలో వారిది ఏమతం ఏమతం  గోప్పోళ్ళ లేనోళ్ళ నేను దగ్గరగా ఉన్నాను నాకు కోరోనా వాస్తే ఎం చేయాలి అని ఆలోచించలేదు నేను నుర్స్ను మస్త్రమే నాకు తెలిసింది అల్లా  ఒక్కటే వైద్యం చేయడం రోగి సతిని బట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ తన వాళ్ళ దగ్గరగా లేకపోయినా అన్ని త్హమే అయ్యి కోలుకునే వరకూ దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్న నర్సంమలకు ఆయాలకు, హెల్త్ వర్కర్స్ అందరికి శిరసు వంచి అభినందిస్తోంది తెలుగు వన్ హెల్త్ -- మీసేవకు కాత్తలేము వేల  మీకు మా అభినందనలు తప్ప కోరోనా యుద్ధభూమిలో  సేవలు అందిస్తూ అలుపెరుగని సేవలు చేస్తున్న మీ సేవానిరాతికి యావత్ భారతావని  సెల్యూట్ చేస్తుంది ముకుళిత హస్తాలతో మనస్పూర్తిగా నర్సింగ్ డే సందర్భంగా  నిరుపమాన మై న మీ సేవకు  నీరాజనం అందుకోమంతోంది . నుర్స్ అంటే ఒక హోదా కాదని ఒక కేసులో నర్సింగ్ ఎలా చేయాలన్నదే ముఖ్యమని నైట్ ఇన్ గైల్ గా ఆమె నిశ్చిత అభిప్రాయం. ఒకరి పట్ల మనకున్న మంచిగుణం ఉండాలనేదే నా భావన దానిని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటారు ఆమె.పది సార్లు మనం మరణించే దానికన్నా నూతన ప్రపంచం లోకి రావడానికి నేను ఒడ్డున నిలబడడానికి నేను ఇష్ట పడతాను అంటారు ఆమె. ఆసుపత్రిలో మొట్టమొదట కావాల్సింది రోగికి సేవచేయడం హాని చేయడం అంటారు. ఈమా టలనే అక్ష రాలా ఆచరించిన నిజమైన నిస్వార్ధ సంఘ సంస్కర్తగా నిలిచింది. ఒక ఇంచార్జ్ గా మీరు అంచనా వేయడం దానిని అందరూ ఆచరించడం ముఖ్యం అని అంటారు నమ్మిన విశ్వసనీయతను అంతకు మించి ఏమి ఆశించని మీ సేవతత్పరతకు జోహార్ జోహార్ అంటోంది తెలుగు వన్ హెల్త్. అందరు నన్ను నుర్స్ అని పిలవాలని అనిపించుకోడం ముఖ్యం కాదని ప్రతి సారీ మనం సరిగా పనిచేస్తున్నమా లేదా అన్నదే ముఖ్యమని ఒక డాక్టర్- నుర్స్  స్థానం చాలా మహోన్నత మైనదని ఒక పోలిస్ ఒక గుర్రంలా లంఘించ గలిగే లక్షణం అనుక్షణం రోగిని కంటికి రెప్పలా రోగిని సంరక్షించడం కీలకమని ఆమె అభిప్రయా పడ్డారు. అదే స్పూర్తితో నేడు మీరు చేస్తున్న కోరోనా తో పోరాడు తున్న వారిని కోలుకునే విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు హాట్స్ ఆఫ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ---