బ్లాక్ ఫంగస్‌తో కళ్ళు పోతాయా ?

కోవిడ్ నుండి  కోలుకున్న దాదాపు 12 మంది రోగులకు బ్లాక్ ఫంగస్ సోకు తోందని కోవిడ్19 పై పోరాడు తున్న వారికి బ్లాక్ ఫంగస్ పెద్ద సవాలుగా మారింది. బ్లాక్ ఫంగస్ సమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని చాలా మంది అపోలోలో చేరారని కొందరు సి హెచ్ ఎల్ లో చేరగా ఇంకొందరు చోఇతా రాం ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇండోర్ జిల్లాలో మ్యుకోర్ మైకోసిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దీనినే బ్లాక్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీని ప్రభావం,ముక్కు, చెవి, మెడకు చేరి నాశనం చేస్తుందని. గత నెలలో అంటే ఏప్రిల్ లో 15 రోజుల క్రితం అంటే సెకండ్ వేవ్ కోరోనా ఇది కనిపించినట్లు నిపుణులు వివరించారు. ఈ అంశం పై ఎం జి ఎం ఆసుపత్రికి చెందినహెచ్ ఓ డి  ఊపిరి తిత్తుల వ్యాధుల నిపుణుడు డాక్టర్ సలీల్ మాట్లాడుతూ కోవిడ్ 19 కోలుకున్న వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రజలలో పెరుగుతోందని డయాబెటిస్ తో పాటు స్టేరాయిడ్ తీసుకున్న వారిలో ముఖ్యంగా ఐ సి యు లో దీర్ఘ కలం పాటు చికిత్స తీసుకున్న వారిలో ఆక్సిజన్ తెరఫీ తీసుకున్న వారిలో ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపారు. దీనికి కారణం ప్రజలలో వ్యాధి నిరోధాక శక్తి తగ్గడమే అని కోవిడ్19 సమయంలో ఇష్టం వచ్చి నట్లు విచ్చల విడిగా స్తేరాయిడ్స్ తో చికిత్చ చేయడం వల్లే అని బార్ఘవ అభిప్రాయ పడ్డారు. ఇదేసమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని. తమకు దగ్గరలో ఉన్న అపోలో, సి హెచ్ .ఎల్  ఆసుపత్రి లో చేరారని వివరించారు. ముంబై అసుపత్రికి చెందిన డాక్టర్ అనిల్ తపారియా న్యురాలజిస్ట్ మాట్లాడుతూ ప్యండమిక్ కు ముందు 4 గురు లేదా 5గురు రోగులకు బ్లాక్ ఫంగస్ చూసామని. దీనికి కారణం ఇమ్యునిటీ లోపమే అని వీరిలో చాలా మంది కిడ్నీ లేదా క్యాన్సర్, డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్న వారేఅని గత నెల పదిహేను రోజులుగా ముంబాయి ఆసుపత్రిలో 3౦ మంది రోగులకు చికిత్స చేసామని. డాక్టర్  తపారియా తెలిపారు. కాగా బ్లాక్ ఫంగస్ ముక్కునుంచి ప్రారంభ మై చెవిలో చేరి, మెడకు సోకుతుందని దీనిని సకాలంలో గుర్తించక పోతే కన్నుపోయే ప్రమాదం ఉందని తపాడియ వివరించారు. కొన్ని సందర్భాలాలో తీవ్రతను బట్టి కన్ను తొలగించాల్సి వస్తుందని తపాడి యా.విశ్లేషించారు. దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే దీనికి చికిత్చ అత్యంత సులభమని ఫంగస్ రోగుల మెదడులో చేరితే రక్షించడం అసాధ్యమని తేల్చారు. అపోలో ఆసుపత్రి కి చెందిన డాక్టర్ అరవింద్ కింగర్ మాట్లాడుతూ దీనివల్ల దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా 3౦% నుంచి 8౦% ఉంటుందని తెలిపారు. కోవిడ్19 రోగులను  రక్షించేందుకు స్టెరాయిడ్ ను విచ్చల విడిగా వాడడం వల్లే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని అది నెలల నుంచే సంవత్సరం నుంచి డాక్టర్ ఫింగర్ తెలిపారు. దీనికోసం వైద్య చికిత్చ లో ఫెరిఫెరల్ సెంట్రల్ కేతటర్ సరైన పద్దతిలో హైడ్రేషన్, నార్మల్ సెలైన్, అం పోటరి సిస్  బి ఇన్యుజన్-యాంటి ఫంగల్ థెరపిని  ఆరువరాల పాటు రోసిని రేడియో ఇమేజింగ్  తో రెస్పాన్స్ వ్యాధిని గుర్తించి చికిత్స చేయాలి.

మన ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుంది

మీ శరీరంలో రక్త ప్రసారం అందాలంటే రక్త నాళాలు సరిగ్గా పని చేయాలంటే  మీ గుండెకు మెదడుకు , శరీర అవయవాలకు రక్త ప్రసారం సరిగ్గా జరగా లంటే 13 రకాల ఆహరం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తీసుకునే ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుందని వివరించారు. మీ రక్త ప్రసారాన్ని పెంచే ఆరోగ్య కరమైన అలవాట్లు ఉండాలని అంటున్నారు. రక్త ప్రసారం పెరగాలంటే... రక్త ప్రసారం ద్వారా వచ్చే ద్రవం మనకు ఆక్షిజన్ ను ఇస్తుంది. ఇతర పౌష్టిక ఆహారాన్ని  మీ గుండెకు, మీ ఊపిరి తిత్తులకు శరీరం లోని ఇతర అవయవాలకు ఇస్తుందన్న విషయం మీకు తెలుసా?రక్త ప్రసారం బాగా జరగాలంటేపౌష్టిక ఆహారం న్యూట్రియాంట్స్ సరిగా అందడం అవసరం. ఏ ఆహారమై తే మీరు తీసుకుంటారో అది  రక్త సరఫరా పై ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ పెరగాలంటే మీరు తినాలి. అందుకోసం మీరు  మీ ఆరోగ్యపు అలవాట్లు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం శరీరపు బరువు తో పాటు ఆరోగ్యంగా ఉండడం అవసరం. మీరు ఒక వేళ పొగ తాగడం అలవాటు ఉంటె మానేయడం మంచిది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపు అలవాట్లు చేసుకోడం వల్ల శరీరంలో రక్త నాళాలలో రక్త ప్రసారం ఆగకుండా  జరుగుతుంది. మీరు కొట్టుకు వెళ్లి నప్పుడు మీరు తీసుకునే ఆహారం మీ గుండె రక్త నాళాలు సంతోషాన్ని ఇచ్చేవి కొనుగోలు చేయాలి. కారపు పొడి/లేదా ఆరంజ్ రెడ్ స్పైస్... రెడ్ పెప్పర్ లేదా ఆరంజ్ రెడ్ స్పైస్ శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచుతుంది. క్యాప్ సైసిన్ రెడ్ పెప్పర్ మీ కండరాలను రక్త నాళా లను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల శరీరంలో సులభంగా రక్త ప్రసరణ జరిగి రక్తం పై ఒత్తిడిని తగ్గిస్తుంది. బీట్రూట్... బీట్రూట్ లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది నైట్రేట్ ఆక్సైడ్ రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల రక్త ప్రవాహం మరింత పెరుగు తుంది. అని ఒక పరిశోదనలో వెల్లడి అయ్యింది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుందని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. మొట్ట మొదటగా వచ్చే బీపి రీడింగ్ తరువాత వచ్చే బీపి రీడింగ్ చూసుకోవచ్చని తేల్చారు. బెర్రీస్... మీ రక్త ప్రసారాన్ని పెంచుకోడం తెలిస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ నేపద్యంలో బెర్రీస్  యంతో సియానిన్ అది యాంటి  ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో రెడ్ అండ్ పర్పుల్ హ్యొస్ అంతో సియానిన్ అర్టిరీ వాల్స్ ను రక్త నాళాలు  పూర్తిగా మృదువుగా పని చేస్తాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాద కరమైన లో బీపి నివారించేందుకు నైట్రిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది.  ఫ్యాటీఫిష్... గుండెకి ఆరోగ్యాని ఇచ్చేది చేప అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఫ్యాటీ ఫిష్ ఎందుకు?ఇందులో సాల్మన్,హెర్రింగ్, మాకర్ట్, ట్రవుట్, హాలిబట్, లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రక్త ప్రసారాన్ని పెంచే ఆహారంలో చేప ఒకటి. ఒక్క విషయం చెప్పాలంటే మీ గుండె ఆర్టరీ లను రక్తం గడ్డ కట్టకుండా  ఆపుతుంది. దానిమ్మ గింజలు... దానిమ్మ పండులో ఉండే  దానిమ్మ గింజలు, టార్ట్ దానిమ్మ గింజలలో నైట్రేట్  చాలా విరివిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. దానిమ్మ గింజలు  తీసుకోడం వల్ల ఆర్టరీ లు పూర్తిగా తెరుచుకుంటాయి దీని వల్ల రక్త ప్రసారం మరింత సులభంగా జరుగుతుంది.రక్త ప్రసారం మెదడుకు మరింత సులువుగా  చేరుతుంది. అలాగే గుండె ధమనులు, నరాలు ఇతర అవయవాలకు, చర్మం లోకి టి ష్యూలకు చేరుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు దానిమ్మ గింజలు తినడం వల్ల అధిక రక్త  ప్రసారం తోపాటు శక్తి నిచ్చి, మరింత ఎక్కువసేపు పని చేయ గలదు.  వెల్లుల్లి... వెల్లుల్లి భారతీయ ఆహార వ్యవహారాలలో తర తరాలుగా ఇమిడి పోయింది. వెల్లుల్లి లో అత్యంత విలువైన అల్లిసిన్ లభిస్తుంది. వెల్లుల్లి వాడకం వల్ల రక్త నాళాలు కొంత ఉపశమనం పొందు తాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వెల్లుల్లి రెబ్బల్ని  తినడం వల్ల రక్త ప్రసారం పెరిగిందని  అంటూ ఉంటారు. దీనివల్ల గుండె నుండి రక్త ప్రసారం మరింత సులువుగా ప్రవహిస్తుంది. ఇది గుండె పని తీరుపై భారం పడకుండా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.అందుకే గుండెపై ఒత్తిడి పడినప్పుడుగుండె నుంచి రక్తం పంప్ చేయడం కష్టం.  వాల్ నట్స్... నట్స్ తినడం వల్ల అందునా ప్రత్యేకంగా వాల్ నట్స్ మీ గుండెకు రక్త నాళాల పై ఎంతో ప్రయోజనం ఉందని అంటున్నారు నిపుణులు. రక్త ప్రసారం చాలా మృదువుగా నెమ్మదిగా ప్రసరించడానికి సహకా రిస్తుంది. వాల్ నట్స్ ను ఎనిమిది వారాల పాటు తింటారో వారిపై జరిపిన పరిశోదన రక్త నాళాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు. దీనివల్ల రక్త పోటు ను తగ్గించిందని  వారి రాక్త నాళాలు చాలా ఫ్లెక్స్ బుల్ గా పని చేసాయి. ద్రాక్ష...  అందరికీ ఇష్టమైన పండ్లలో ద్రాక్ష ఒకటి పర్పుల్ రంగు లో ఉండే ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రక్త నాళాలలోని గోడలు చాలా ప్రశాంతంగా సేద తీరుతాయి రక్త నాళాలు మరింత సమర్ధవంతంగా  బాగా పనిచేయ డానికి వీలు కలుగుతుంది ద్రాక్షలో ఉండే రసాయనాల్ వల్ల ఇంఫ్లామేషన్  లేదా రక్త హీనతను తగ్గిస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ద్రాక్ష తీయటి విందును అందిస్తుంది. రక్త ప్రసరణ కు సంబందించిన సమస్యలను సహకరిస్తుంది. పసుపు... పసుపు హిందీలో హల్దీ భాష ఏదైనా దని ఉప యోగం ఒక్కటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే మూలిక అన్న విషయం దీని ఉపయోగాలు తెలుసుకుందాం. భారతీయులు నిత్యజీవితం లో శుభ కార్యాలలో ఆయుర్వేదం లో కీలక మైన యంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని నిపుణులు తేల్చారు. భారతీయ వంటకాలలో పసుపు  లేని వంట లేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.పసుపులో కుర్ కుమిన్  పదార్ధం నుంచి పసుపు నుంది లభిస్తుంది. పసుపు ద్వారా నైట్రిక్ ఆక్సైడ్  లెవెల్స్ ను పెంచుతుంది. రక్త నాళా లను వ్యాకొచం జరిగి రక్తం గుండెకు, మెదడుకు, శరీరంలోని అవయవాలకు  టిష్యు లకు చేరుతుంది. బచ్చలి కూర... మీకు హై బీపి ఎక్కువగా ఉంటె బచ్చలి కూర తీసుకోండిఇందులో నైట్రేట్స్  అధికంగా ఉంటాయి. మీశారేరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.దీని వల్ల రక్త నాళాలు పోర్తిగా తెరుచుకుంటాయి. బచ్చలికూర ను తినడం వల్ల ఆర్ట్రీలు చాలా మృదువుగా ఉండి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి.     నారింజ పండు - సిట్రస్ ఫ్రూట్... ప్రజలు నారింజ పండును ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే మీ జీవితంలో ప్రతిరోజూ నారింజ పండును తీసుకోడం వల్ల ఇంఫ్లామేషన్  తగ్గిస్తుంది. రక్త ప్రసారం సజావుగా జరగ డానికి తోడ్పడుతుంది. రక్త నాలాలలో వచ్చే క్లోట్ ను నివారిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఆరంజ్ జ్యూస్ ప్రతిరోజూ తాగుతారో వారిలో రక్త పోటు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చాక్లెట్... చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే అయితే మీరు అదృష్ట వంతులే. చాక్లెట్ లో ఉండే వివిధ రకాల పదార్ధాలురక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్త ప్రసారాన్ని సులభంగా సాగేలా చేస్తుంది. రక్త నాళాలను డ్రైలైట్  చేయడమే కాదు రక్త పోటును తగ్గిస్తుంది. రక్త పోతూ తక్కువ ఉన్నవాళ్లు డార్క్ చాక్లెట్లు తిన వచ్చు. మరీ ఎక్కువ తిన్నారంటే ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.  అల్లం... చాలా మందికి అల్లం గురించి దానిప్రభావం గురించి పోర్తిగా తెలుసు. ముఖ్యంగా ఆహారం అరుగుదలకు అల్లం బాగా పని చేస్తుంది. కాస్త జలుబు, ఏమాత్రం నిసత్తువ నీరసం,బడలిక అల్లం తో చేసిన టీ తాగితే అకిక్ వేరని అంటారు టీ ప్రేమికులు. అల్లం రక్త నాళాలు తెరుచుకునేలా చేసి రక్తం ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం ఆశియాలో ముఖ్యంగా భారత్ లోని వంటింట్లో ప్రాధాన్ మూలిక. అల్లంటీ తీసుకుంటే వైరస్లు కాదు కాదు శరీరంలో ఉండే ఖప్పం పోతున్దన్న్ది నిజం.మీ స్వాస్కోశంలో ఉండే ఖపాన్ని అల్లం తీసేస్తుంది.

గర్భ దారణ డయాబెటిస్...

స్త్రీలు గర్భధారణ చేసినప్పుడు కొందరికి బ్లడ్ షుగర్ చక్కెర వ్యాధి వస్తుంది. దీనిని నివారించడం అనివార్యమని అంటున్నారు నిపుణులు.  అయితే ఈసమస్యను ఇటీవల జరిగిన పరిశోధనలో ఇన్సూలిన్ మేటాఫామిన్ ను స్త్రీలకు వాడినప్పుడు పోస్ట్ ప్ల్ప్లాన్దియాల్ బ్లడ్ షుగర్ ను ఆహారంతో నియంత్రించ వచ్చు. గర్భునీలకు మేతాఫామిన్ ఇవ్వడం వల్ల ఒళ్ళు అంటే ఊబాకాయం తగ్గింది. హైపో గ్లై సీమియా  ప్రమాదం తక్కువే అని  నిర్ధారించారు.ఐసోలేటేడ్ చికిత్సవల్ల  ఫెయిల్యుర్ రేట్ తక్కువే అని నిర్దారించారు. ఈ పరిశోధన ద్వారా వచ్చిన ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ఓబ్బెటిట్రిక్స్  అండ్ గైనకాలజీ లో ప్రచురించారు. ఎవరైతే స్త్రీలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ లక్షణా లను ఉన్న వారికీ సరైన ఆహారం తో చికిత్స చేయకుంటే సహజంగా ఇన్సూలిన్ తీసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. ఇటీవలి కాలంలో చాలా రకాల పరిశోధనల పై ఫలితాలను ప్రచురించారు. అందులో మెటా ఫామిన్ ఇన్సూలిన్ తో సరి సామాన మైనఒబెస్తే ట్రికల్ పెరి నేటాల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి . ఈ మందును వినియోగించేందుకు అన్ని రకాల క్లినికల్ గైడ్ లైన్స్ హెటిరో జీనియల్ గా పేర్కొన్నారు. స్పైన్ దేశానికి చెందిన వి బి ఐఎం లో ని మాలాగా యూనివర్సిటీలోన్యుట్రిషియన్ ఆసుపత్రి ఎండోక్రనాలజీ విభాగానికి చెందిన గాబ్రయాల్ ఒలివెరపుష్టార్ శిష్య బృందంమెట్ ఫార్మిన్ ఇన్సూలిన్ కన్నా గ్లైసిమియా ను నియంత్రిస్తుందని ఒబెస్టే రికాల్ పెరినేటల్ ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. గర్భిణిగాఉన్నప్పుడు వచ్చే డయాబెటిస్ ఉన్న స్త్రీలలో పూర్తి రక్షణా త్మకమైన విధానం ఆహారంలో మార్పులు జీవన శైలితో నియంత్రించగాలిగా మని వివరించారు.ఈ పరిశోదన యొక్క ముఖ్య ఉద్దేశం మెటా ఫామిన్ గ్లైసిమిక్ ను ఎలా నియంత్రిస్తుందో అన్న అంశంపై మాత్రమే పరిశోదన చేసినట్లు  తెలుస్తోంది. పరిశోధకులు మేదిజెన్ ఒక మల్టి సెంటర్-ఓపెన్ లేబుల్ లో రెండు పద్దతులలో ర్యాండమైజ్ గా క్లినికల్ ట్రైల్స్ ను స్పెయిన్ లోని మల్లాలో రెండు ఆసుపత్రులలో నిర్వహించారు. ఈ ట్రైల్స్ కు 18 -నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మహిళలు దాదాపు 2౦౦ మంది హాజరు అయ్యారు. జి డి ఎం తో ఎవరికైతే ఫార్మా కాలజీ చికిత్స అవసరమో వీరిని మెటాఫామిన్ తీసుకునేందుకు  ర్యాండమైజ్ చేసి  లేదా ఇన్సూలిన్ ను గర్భం సమయంలో రెండవ మూడవ దశలలో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పారు. దీనిద్వారా గ్లైసిమిక్ నియంత్రణ                                                       హైపో గ్లైసీమియా వల్ల వచ్చే వివిదరకాల సమస్యలు ఫలితాలు.                                                       హైపర్ టేన్క్షన్ డిజార్డర్స్ లేబర్ ప్రి మెట్యురిటీ.                                                       మాక్రో సోమియా ,నియో నేటల్ కేర్.                                                       శ్వాస కొస సంబంధిత వ్యాధులు, హైపో గ్లైసీమియా ,జాండీస్,ఒత్తిడి ఇతర ఇన్ఫెక్షన్ లకు  చికిత్స చేయ వచ్చని నిపుణులు తేల్చారు.  

బ్రాంకైటిస్ ఆస్తమా...

ఊపిరి తిత్తుల్లో కి గాలిని గాలిని తీసుకు వెళ్ళే నాళా లు బ్రాంచి అదే బ్రాంచి కి ఇన్ఫెక్షన్ వస్తే దానిని బ్రాంకైటిస్అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఒక రక మైన  బ్యాక్టీరియా లేక వైరస్ వల్ల వస్తుంది. కొద్ది రోజులు జలుబు తరువాత ఆకస్మాతుగ్గా రావచ్చు ఇదే మెల్లిగా అక్యూట్ బ్రాంకైటిస్ గా  సంవత్సరాల తరబడి మాటి మాటికీ వస్తు ఉండవచ్చు. దీర్ఘ కాలంగా రావడం వల్ల శ్వాస నాళాలు, శ్వాస కోశాలు క్రమంగా చెడిపోతాయి. బ్రాంకైటిస్ కొందరు మనుషులకు తేలికగా సోకుతుంది. కొందరికి అసలు రాదు కారణం తెలియదు. బ్రాంకైటిస్ స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది. 1౦ మంది పురుషులకు ఒక స్త్రీ కి చొప్పున బ్రాంకైటిస్ రావడానికి పొగ తాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు5౦ రెట్లు అవకాశాలు ఉన్నాయి. బ్రాంకైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అక్యుట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ అక్యూట్ బ్రాంకైటిస్--లక్షణాలు..      విడవ కుండ దగ్గు.       పిల్లి కూతలు       కఫం లో చీము వుండి  ఆకుపచ్చ లేక పసుపు పచ్చ  తెమడ పడుతుంది.         ఆయాసం , ఆకలి లేక పోవడం , తల నొప్పి జ్వరం    ఎంత కాలం ఉంటుంది ?... వారం నుంచి మూడు వారాల దాకా వుంటుంది. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు దానికి అదే తగ్గి పోతుంది. బ్రాంకైటిస్ కారణాలు...  శ్వాస నాళాల లోకి ప్రవేశించిన రక రకాల సూక్ష్మ క్రిములు వైరస్ లు బ్యాక్టీరియా ఊపిరి తిత్తులోకి చేరుకుని, ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. శ్వాస నాళాల లోని పొరలు ఉబ్బి శ్వాసమార్గాన్ని  ఇరుకు చేస్తాయి. దానితో బయటికి పోవాల్సిన తేమడకు ఆటంకం కలుగు తుంది. ఆ తెమడను బయటికి పంపడానికి ఒకటే దగ్గి దగ్గి ఆయాస పడిపోతారు. కాంప్లికేషన్స్.. బ్రాంకైటిస్ తీవ్రంగా ఉంటె సీరియస్ అయితే మరీ చిన్న పిల్లలకు మరీ పెద్ద వయస్సు వాళ్ళకు న్యుమోనియాలోకి దింపే ప్రమాదం ఉంది. ఇంట్లో వైద్యం... వెచ్చటి వాతావరణాన్ని  కల్పించుకుని రాత్రి పగలుఇంట్లోనే రెండు మూడు రోజుల పాటు రెస్టు తీసుకోడం మంచిది. వేడి వేడి పానీయాలు పుష్కలంగా తాగాలి. డాక్టర్ ను ఎప్పుడు కలవాలి... శ్వాస పీల్చుకోడం మరీ ఇబ్బందిగా ఉండి దగ్గు తున్నప్పుడు చాతిలో నెప్పిగా ఉన్నట్టు గా వుంటే రోగి మరీ వృద్ధుడు లేదా మరీ చిన్న వాడు అయి వుంటే. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి. డాక్టరెం  చేస్తాడు... శారీరక శ్రమ లేకుండా ముందు విశ్రాంతి తీసుకోమంటారు. దాని వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తుల్లోకి జొరబడ కుండానూ తద్వారా న్యుమోనియా లోకి డింప కుండా వుంటుంది. న్యుమోనియా ప్రమాదం ఉన్నదనుకుంటే యాంటీ బాయిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు.దగ్గు తెరలు తెరలు గా వస్తుంటే దగ్గుమందు రాసిస్తారు. నివారణకు ఏమి చెయ్యాలి... పొగ తాగడం మానెయ్యాలి. చిన్న పిల్లలు వృద్ధులు చల్లగా ఉండే పడక గదిలో పడుకోకూడదు. జలుబు చేసిన వాళ్ళకు, చస్ట్ ఇన్ఫెక్షన్ వున్న వాళ్ళకు దూరంగా వుండాలి. అక్యుట్ బ్రాంకైటిస్ మూలంగా తర్వాత ఏర్పడే పరిణామాలంటూ ఏమి ఉండవనే చెప్పాలి.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్తమాపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 5న ప్రపంచ వ్యాప్తంగా  కార్యక్రమం చెపట్టింది. ఆస్తమా తీవ్రత దాని ప్రభావం వల్ల వచ్చే పరిణామాలు అత్యంత ప్రమాద కరమైన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం339 మిలియన్ల ప్రజలలో ఆస్తమా ఉందని. ఆస్తమా వల్ల కేవలం 4,17,918 మంది  మరణించడం దురదృష్టకరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. అయితే ఆస్తమాను పూర్తిగా నయం చేయలేమని.ఆస్తమా బారిన పడకుండా కొంత మేర నియంత్రించ వచ్చని ఆస్తమా పై ఉన్న ఎపిసోడ్స్  చెప్పవచ్చు.ఇందులో కొన్నిఎక్షెర్బాటిఒన్స్ ఉన్నాయి.ఈ సంవత్సరం ఆస్తమాకు వివిధ రకాల అపోహలు ఉన్నాయి.  దీనిని విస్త్రుత స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉందని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆస్తమాను మేనేజ్ చేయడం అక్కడి చుట్టుపక్కల స్థితి ని బట్టి ఆదార పడి ఉంటుంది. అస్తమా లేదా ఉబ్బసం చిన్నప్పటి నుంచే వచ్చే అవకాశం ఉంది.అది వయసుతో పాటే పెరిగే అవకాశం ఉందని మధ్య వయస్సు లో ఉన్నవారికి వృద్ధులకి వచ్చే  అవకాశం ఉందని పేర్కొంది. ఆస్తమా ఇన్ఫెక్షన్, బ్రోన్ కైల్ ఆస్తమా గా పేర్కొన్నారు. ఆస్తమా తో బాధ పడేవారు వ్యాయామం చేయకూడదు. ఆస్తమా తో బాధపడే వారికీ ఇచ్చే చికిత్చ లో ఎక్కువ మోతాదులో స్టేరాయిడ్స్ ఇవ్వరాదు. అయినా డాక్టర్ పర్వ వేక్షణ లో వాడాలి ఈ వ ఇష్యాన్ని ఆస్తమా రోగులు గుర్తించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులలో టిబికి ఇచ్చే సంవత్చరం కోర్స్ ను తప్పకుండా వాడాలి ఆస్తమా చిన్న పిల్లలో ఏ వయస్సులో అయినా రావచ్చు, ఆస్తమా ఇన్ఫెక్షన్ గా కాక శ్వాస కొస వైరల్ గా  చెప్పవచ్చు. సహజంగా జలుబు, ఫ్లూ, వల్ల ఆస్తమా వస్తుంది. చిన్న పిల్లలో ఆస్తమాకు కారణం ఎలర్జీ గా గుర్తించారు. ఎలర్జీ పెద్దలలోను వస్తుంది ఆస్తమా పై ఉన్న వివిధ రకాల అపోహలు మూడ నమ్మకాలు దురభిప్రాయం,అవగాహన రాహిత్యం పై సమావేశం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆస్తమా దినోత్స్చవం సందర్భంగా ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయాదేశాలలో వివిధ కార్యక్రమాలు అమలు చేయాలని' డబ్ల్యు హెచ్ ఓ ఆదేశాలు జారీ చేసింది. 

కోవిడ్ డయాబెటిస్ వస్తే ఇక మరణమే..

కోవిడ్19 ఎవరికీ ఉన్నట్లు తెలియదు.ఒక వేళ కోవిడ్ డయాబెటిస్ ఎక్కువగా ఉంటె మాత్రం ప్రమాదమేఅంటున్నారు పరిశోదకులు. ఒక నూతన పరిశోదన లో ఒక రోగికి కోవిడ్19 డయాబెటిస్ ఉంటె ప్రమాదం అని వెల్లడించింది. డయాబెటిస్ మామూలుగా ఉండి కోవిడ్ ఉంటె మాత్రం ఆరోగులు చని పోవడం ఖాయం అని. కోవిడ్ తో చని పోతున్న వారి సంఖ్య పెరగడానికి కారణం  డయాబెటిస్ అని చెప్పక తప్పదని నిపుణులు విశ్లేషించారు.డయాబెటీస్ ఎక్కువగా ఉంటె మాత్రం ఇది కాక ఇతరఏ కారణాలైనా ఉండచ్చని తేల్చారు అయితే అటు డయాబెటిస్ కోవిడ్ 19 తో యుద్ధం చేయడం కష్టమని లిబినేచ్ సెంటర్ ఫర్ డయాబెటీస్ పరిశోదన హేన్రిచ్ పైన్ యూనివర్సిటీ జర్మనీ కి చెందిన  పరిసశోదకుడు నాయకత్వం వహించిన సాబ్రినా ఎస్ హెచ్ ఎల్ సింగర్  డస్టిల్ డార్ట్. పురుషులు లేదా వృద్ధులు ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉండి ఇన్సూలిన్ తో చికిత్చ తీసుకుంటే లేదా మెటా ఫామిన్ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని డయాబెటాలజియా జర్నల్  లో ప్రచురించింది. డయాబెటిస్ చికిత్చకు ఇన్సూలిన్ వాడడం అంటే డయాబెటిస్ తీవ్రంగా ఉందని అర్ధం.అని ఎస్ చేల్ఎసిన్గేర్ గ్రూప్ పేర్కొంది. ఎవరతే ఇన్సూలిన్ చికిత్చ ద్వారా డయా బెటిస్ను నివారిస్తున్నారో కోవిడ్19 తో 75 % మంది మరణిస్తున్నారని. ఇన్సూలిన్ వాడని వారు మెటా ఫామిన్ తో  నివారించే ప్రయత్నం చేస్తున్నారో కోవిడ్19 తో 5౦% కన్నా తక్కువ మరణాలు ఉన్నాయని, మెటా ఫామిన్ వాడని వారని పరిశీలించారు. కోవిడ్19 డయాబెటిస్ తో ఉన్న పురుషులు28%, కోవిడ్19 డయాబెటిస్ ఉన్న స్త్రీలు 65 సం వయస్సు ఉన్న వారు. 3 రెట్లు చని పోతున్నారని. 5 సం డయాబెటిస్ ఉందా కోవిడ్ ఉన్నవారు 43% మరణించే అవకాసం ఉందని నిపుణులు తేల్చారు. చక్కర వ్యాధిని తక్కువ నియంత్రించు కునే వారిని ఆసుపత్రిలో చేర్చగా మరణాలు ఉన్నాయని యు ఎస్ కు చెందిన ఇద్దరు వైద్యనిపుణులు పెద్దగా ఆశ్చర్య పోలేదు. ఏమైనా డయాబెటిస్ తీసుకు పోతోంది. ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాధాన్యత ను ఇవ్వడం.శరీర వ్యాయామం, ఆహార నియమాలు పాటించడంఅవసరమని నిపుణులు  సూచించారు. న్యూయార్క్ కు చెందిన లినోక్స్  హిల్ ఆసుపత్రికి చెందిన ఎందోక్రనాలజిస్ట్  డాక్టర్ మనీషా సూద్ మాట్లాడుతూ మెటా ఫామిన్ కొంత మేర రక్షణ కవచమని పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.గ్లెన్ ఆసుపత్రికి చెందిన బర్బాస్ ఫ్యామిలీ మెడిసిన్ ఈ పరిసోదనలు కనుగొన్నారు. కోవిడ్ కన్నా డయాబెటిస్ తో జీవించడం సులభమని ఆమె నమ్మకం.ఈ రోగులు ప్రమాదానికి కనుగొనేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని అన్నారు. ఈ రోగులు అంతకు మోనో క్లోనల్ కాంబినేషన్ తో కూడిన యాంటి బాయిటిక్స్ తీసుకోవాలని ఆమె సూచించారు.ఇందుకోసం మరిన్ని ఫలితాలు రాబట్టాల్సి ఉందని ఆమె అన్నారు.                                                  

శరీరానికి కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు తప్పని సరి

జనాభాలో7౦ % మంది ఒమేగా 3  ఫ్యాటీ ఎమినో యాసిడ్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. రీఫైండ్ చేసిన నూనెల వల్ల కొలస్ట్రాల్ ఎక్కువగా పెరిగి పోతుంది. దీనివల్ల గుండెజబ్బులు, హార్మోన్ లోపాల తో ఊబాకాయం అందరిలో వస్తుంది. మానవ శరీరానికి ఆహారంలో కొవ్వు పదార్ధాలు అవసరం. ఒమేగా3 ఒమేగా6 వంటివి ఆహారం ద్వారా లభిస్తుంది. శరీరం లో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయా లంటే ఒమేగా కొవ్వు పదార్ధాలు అవసరం. అని అంటున్నారు నిపుణులు శరీరంలో ఉన్న హార్మోన్ విధానం. ఫ్యాటీ యాసిడ్స్ తో పోరాడుతుంది.ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లివర్, కిడ్నీపని తీరు తగ్గుతుంది.అసహజమైన సైజులో ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది.ఇమ్యూన్ పని తీరులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ అవయవాలు ఒత్తిడికి గురి కావడం మానసిక అనారోగ్య సమస్యలు వస్థాయి.నూనెలు కొవ్వు పదార్ధాలు అవసరమైన మేరకు శరీరానికి అందించాలి. కొవ్వు పదార్ధాలు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.అతిరో క్లిరోసిస్ నిరోధిస్తుంది. ముఖ్యంగా గుండేసమస్యలు, గుండెపోటు వంటి సమస్యల నివారణకు కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు అవసరం. స్త్రీలలో అల్సరేటివ్ కోలై టిస్, రుతు శ్రావం లో వచ్చే నొప్పి కీళ్ళ నొప్పులు, ఫ్యాటీ3 యాసిడ్ లెవెల్స్ సరిగా ఉంటె క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందుకోసం ఒమేగా3 అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఫ్యాటీ యాసిడ్స్ సరైన మోతాదులో సమాన నిష్పత్తిలో ఉండాలి.వాటిని సక్రమంగా  వినియోగించాలి ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే ఒమేగా6 ఒమేగా3 యాసిడ్ లు 2:1 గా ఉండాలి. శరీరంలో కొవ్వు నిచ్చే నూనెలు సమానంగా లేక పోవడానికి కారణం కేవలం రిఫైండ్ ఆయిల్సేకాదు , అది కేవలం ఫ్రైడ్ రైస్ ప్రోసెస్డ్ ఫుడ్ ఆహారం వల్లే అని నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ఆధునిక ఆహారంలో సర్వ సాధారణమై పోయింది. నేడు చాలా మంది ఆధునిక ఆహారంలోలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.   అందులో ఒమేగా3 కోవ్వు పదార్ధాలు ఒమేగా6 లో ఒమేగా౩లొ సరిగా ఉంటె దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుండేసమస్యలు, డయాబెటీస్ ఊబకాయం ,హార్మోన్ లోపాల సమస్యలు ఒత్తిడి వంటి సమస్యలు సమర్ధంగా ఎదుర్కొంటాయి. అందుకే తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం తీసుకోడం తప్పనిసరిగా తీసుకోవాలి. ఖనిజ లవణాలు ఉన్నఆహారంలో ఒమేగా3 ఒమేగా6 సహజంగా ఉంటాయి. మానవాళికి ఈ నూనెల గురించిన అవగాహనలేదు ఈ అంశం పై మూల్యాంకనం చేయాలని అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఒమేగా6 ఒమేగా3 బయోలాజికల్ గా చాలా శక్తి వంతం గా ఉండడమే కాదు మానవ శరీరాన్ని మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. కొవ్వునిచ్చే నూనెలు సమ పాళ్ళలో శరీరానికి అందించాలి. ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే కణాలు విష తుల్యం అవుతాయి. దీనివల్ల వరుస క్రమంలో కొన్ని ప్రతి చర్యలు ఉంటాయి. ఒమేగా3 ఒమేగా6 వంటి ఫ్యాటీ యాసిడ్ లు ఇకో సనాయిడ్స్ ను శరీరంలో ఉత్పతి చేస్తాయి.ఇవి ఆధునీకరించిన ఫ్యాటీ యాసిడ్స్ కణాలలో చేరతాయి. అది శరీరం పని తీరు పై కీలక పాత్ర పోషిస్తుంది. అది శరీరానికి సంకేతాలు పంపడం ,ఇమ్మ్యునిటీ, ఇంఫ్లామేషన్, ఫ్యాటీ యాసిడ్స్ ఒక దానికొకటి పోటీ పడతాయి. ఒమేగా6 ఎక్కువగా ఉంటె ఒమేగా3 శాతం తక్కువగా ఉండాలిఒక వేళ ఒమేగా3 తక్కువగా ఉంటె ఒమేగా6 తగ్గితే ఒమేగా6 మరింత ఎక్కువగా  ఎక్కువశాతం కావాలి ఒమేగా3 తగ్గితే వ్యాధిని ఆహ్వానిన్చినట్లే అని నిపుణులు విశ్లేషించారు. అందుకే అది తక్కువైనా ఏది ఎక్కువైనా ముప్పే నని నిపుణులు సూచించారు. మీ శరీరానికి చెడు కొవ్వు పదార్ధాలు అంటే బాగా సాచురేట్ చేసి రిఫైండ్ ఆయిల్స్ అని చెప్పవచ్చు.  అసలు సేచురేటేడ్ఆయిల్స్ అంటే... జంతు శరీరం నుంచి వచ్చే నూనెలు గుడ్లు కూడా ఉంటాయి అవి అనారోగ్యానికి దోహదం చేస్తాయి. బయట మనం తీసుకునే రుచికరమైన బిరియానిలో వేసే ఆయిల్స్ జంతు కళేబరాల నుంచే అన్న కధనాలు మనం చూసాం. రీఫైండ్ ఆయిల్స్ లోనే ఎక్కువ కొవ్వు పదార్ధాలు... చాలా మంది ప్రజలు కూరగాయాల ద్వారా వచ్చే నూనెలు ఆరోగ్యవంతమైన వని అనుకుంటారు. అందులో కేవలం కూర గాయలు అన్న పదం మాత్రం చేర్చారు. అయితే దీనిని పోషక విలువలు ఉన్న పదార్ధాలలో వీటిని చేర్చారు. కొన్ని సంస్థలు వాటిని తింటున్నామని ప్రచారం చేసాయి. వారి ఉద్దేశ్యం ప్రకారం సేచు రేటెడ్ నూనెల కన్నా సేచు రేషన్ లేని కొవ్వు నూనెలు చాలా ఆరోగ్యమని  నిపుణులు వివరించారు.చాలా పరిశోదనలు చేసి రీ ఫైండ్ నూనెలు చాలా ప్రమాద కరమని నిరూపించారు .అయితే ఈ అంశాల పై ఎప్పుడు మూల్యంకనం చేసారుఅయితే ఫ్యాటి యాసిడ్స్ తో పోల్చినప్పుడు మిగిలిన వాటికన్నా భిన్నమైనవి.వీటిని ఎప్పటికీ మూల్యాంకనం చేయాల్సిందే. ఎందుకంటే ఆ నూనెలను మనం ఎప్పటికీ మూల్యాంకనం  చేయాల్సిందే.ఇది శారీరకంగా చాలా మార్పులకు కారణం అవుతుంది. దీనివల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ట్రాన్స్ ఫాట్స్... ట్రాన్స్ ఫాట్స్ అంటే హైడ్రో జనేషన్ ద్వారా వచ్చేది. ఆరోగ్య కరమైన నూనెలను ఘనపదార్ధంగా మారుస్తాయి. కూరగాయల నుంచి వచ్చే నూనెలను వేడి చేసినప్పుడు ఒత్తిడి నుంచి హైడ్రోజన్ ఖనిజం వస్తుంది.దానిని పల్లాడియం- హైడ్రోజన్ - ఆతంస్ తో పాటు కార్బన్ ఉండడం వల్ల ఆనూనే ఘన పదార్ధంగా మారు తుంది. దీనివల్ల కాయ గూరలు మరింత ఆరోగ్యంవంతంగా తయారు చేస్తాయి. సేచురేట్ చేసిన నూనెలు ఆరోగ్య కరం కాదని,నిపుణులు సూచించారు. సేచు రేట్ చేసిన కొవ్వు పదార్ధాలు ఉన్న నూనెలు మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక పదార్ధం పేరుతో లేబుల్ ఉంటుంది. ఇలాంటి నూనెలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి దారుడు అందులో ఉండే పదార్ధం చాలా భయంకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా హైడ్రోజ నేటెడ్ నూనె అని రాసి ఉంటుంది. అంటే దీని ఆర్ధం ప్లాస్టిక్ కు ఒక మాలిక్యుల్ మాత్రమె తేడా అని నిపుణులు వెల్లడించారు. ట్రాన్స్ ఫాట్స్ లో లైపో ప్రోటీన్ తక్కువ శాతం ఉంటుందని రక్తంలో కొలస్త్రాల్ ఎక్కువగా ఉంటుంది.   ట్రాన్స్ ఫ్యాట్స్  వల్ల  ఇంఫ్లామేషన్ వస్తుంది.దీని వల్ల  గుండే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. దీనివల్ల డయాబెటిస్, ఇతర దీర్ఘ కాలిక సమస్యలు వచ్చేఅవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. ఇలాంటి నూనెలు వాడడం వల్ల ఇన్సూలిన్ ను తట్టుకునే శక్తి  ఉంటుందని దీనివల్ల పబ్లిక్ హెల్త్ టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాసం ఉందని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోదనలో వెల్లడించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ను కొద్దిగా2౦ % వాడినా ఆరోగ్యానికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రతిరోజూ వాడితే హృద్రోగ సమస్యకు దారి తీస్తుంది దీని వల్ల ఆరోగ్య లాభాలు లేవని తేల్చి చెప్పారు.మనల్ని మనం కాపాడు కోవడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరించారు. మంచి ఫ్యాటీ ఉన్న నూనెలు అంటే... అంటే సాచురేటెడ్ కానీ, రీఫైండ్ చేయని నూనెలు అంటే ఫల్లి, ఇతర విత్తనాలు అంటే, కుసుమ, నువ్వులు,ఆవ నూనె తదితరాలు ఇవి సేచురేటేడ్ నూనె కన్న భిన్నంగా ఉంటాయి. అంటే అందులో కళే బరాల నుండి వచ్చిన నూనెలు ఇందులో సాచు రేటెడ్ పోలి అనే సేచురేటేడ్ మోనో అనే సేచు రేటెడ్ ఫ్యాటీ గా నిర్ధారించారు. మోనో పోలి సేచురేటేడ్ ఫ్యాట్... అంటే ఇప్పటికీ మనం ఫ్యాటీ సేచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్ ను వాడు తున్నాం. ఉదా -- అదే రైస్ బ్రెయిన్ ఆయిల్, సన్ఫ్లవర్సఫోల,అందులో తప్పనిసరిగా ఫ్యాట్స్ ఉంటాయి. అయితే అవి మన శరీరానికి సహజంగా పని చేసేందుకు ఉపయోగ పడతాయి. ఎందుకు అంటే మనశరీరం ఫ్యాట్స్ ను ఉత్పత్తి చేయదు. అది మనం మన ఆహారం ద్వారానే పొందాలి.పోలి సచురేటెడ్ సెల్ మేమ్బెరెన్స్ ను నిర్మిస్తాయి.నరాలను సరి చేస్తాయి. అవి శరీరం లో రక్తం,గడ్డ కట్టేందుకు అవసర మౌతాయి అలాగే శరీరంలో ఉన్న కండరాలు కదలికకు దోహదం చేస్తాయి.ఇంఫ్లామేషన్ ను నివారిస్తుంది. పోలి నేచు రేటెడ్ ఫ్యాట్స్ ప్రాధాన మైనవి రెండు ఒమేగా3 ఒమేగా6 సంఖ్యా పరంగా ఒక దానికంటే మరొకటి ఎక్కువగా ఉన్న వీటివల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ రకమైన పోలీ అన్ సేచురేటేడ్ వల్ల లాభాలు ఉన్నాయి. రీఫైండ్చేయని పోలీ అన్ సేచురేటేడ్ ఫ్యాట్స్ కు బదులు రీఫైండ్మూమేలు ప్రమాదకరమైన  కోలస్త్రాల్ ను నివారిస్తాయి. కొలస్త్రాల్ ప్రొఫైల్ ను మెరుగు పరుస్తాయి. ట్రై గ్లిజరైడ్స్ తగ్గిస్తాయి ఒమేగా3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లక్ష్ సీడ్స్,ఫాలుదా, వాల్నట్స్, లో ఉంటాయి .ఇవి గుండె సమస్యలు రాకుండా కాపాడు తాయి. రాక్తపోటును తగ్గిస్తుంది ట్రై గ్లిజరాయిడ్స్ పోలి అన్ నేచురల్ ఫ్యాట్స్ తగ్గిస్తాయి. మనకు తెలియని నూనెలు శరీరానికి ఏమి కావాలి ఏవి వద్దు దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేసాము. అసలు నూనెలు తక్కువైనా ముప్పే ఎక్కువైనా ముప్పే జాగ్రత్తదేనికైనా సమానంగా వాడితే ఎక్కువ తక్కువలు వస్తే  శరీరానికి సమస్య వచ్చినట్టే తస్మాత్ జాగ్రత్త.                                            

మీ శ్వాస మీ అనారోగ్యం గురించి చెపుతుంది

మీరు ఒక వేళ వివిధ రకాల దుర్వాసన ను పీలుస్తున్నారా? అయితే అది మీరు తిన్న ఆహారమే కావచ్చు. ఉల్లి పాయ, లేదా వెల్లులి పాయలుకొందరికి  తినడం అలవాటు. లేదా ఇతర ఆహారం ఏదైనా దుర్గంధ మైన శ్వాసకు కారణం కావచ్చు. గురక... అసలు నోటి దుర్వాసన లేదా నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటి?అన్న ప్రశ్నకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. నిపుణులు మీకు గురక వచ్చిందంటే అది మీ గొంతులో అయ్యి ఉండవచ్చు. మీ గురక వల్ల నోటిని గొంతుని ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల మీ నోటిలో లాలా జలం  ఉత్పత్తి జరగదు. అలా జరిగి నప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దీని వల్లె దుర్వాసనకు కారణం అని చెప్పవచ్చు. బోర్లా పడుకోవడం వల్ల కూడా గురకకు కారణం గా చెప్పవచ్చు.  చిగుళ్ళలో వ్యాధులు... ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన నోరే అన్ని అనారోగ్యలకి రహదారి అంటున్నారు వైద్యులు. ఇది నిజం నోటి దుర్వాసనకు ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారం. అసలు ఉదయం లేస్తూనే మొదట దంతావదానం అదేనండి పళ్ళు శుభ్రంగా కడుకోడ్డం నిత్య కృత్యం. చిన్నప్పటి నుంచి నోటిని పరిశుభ్రమగా రుద్దుకుని కడుక్కోడం లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పళ్ళు మాత్రమే కాదు చిగుళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాలి  అలా చేయ కుండా మీరు రాత్గ్రి ఆహారం తీసుకున్నాక నోటిని శుభ్రంగా కడుక్కొక పోతే ఆక్రిములు మీ నోటి చిగుళ్ళలో, పంటి సందులలో ఉండిపోయి  పళ్ళు పుచ్చి పోవడం చిగుళ్ళకు  ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళలో వాపు నోటి దుర్వాసనకు దారి తీస్తుందని పంటి వైద్యులు పేర్కొన్నారు. మీరు తీసుకునే ఊపిరి ఒక రాసాయనాల వాసన వస్తుంది. దీనికి కారణం చిగుళ్ళలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా చిగుళ్ళు పలు వరుసలో వాచి ఉంటాయి. దీనికి కారణం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా పోగతాగుతారో పళ్ళు శుభ్రంగా ఉంచుకోరో వారికి మాత్రమే చిగుళ్ళలో సమస్యలు వస్తాయి. .యాసిడ్ రిఫ్లక్స్... యాసిడ్ రిఫ్లక్స్ ఒక స్థితి ఇందులో పొట్టలో ఉండే యాసిడ్ రసాయనాలు ఇసో ఫెగస్ పైకి రసాయనాలు ఎగతంతాయి. దీని వల్ల నోటి దుర్వాసన కు కారణం కావచ్చు. ఇందులో పుల్లటి రసాయనం లేదా తిన్న ఆహారం గొంతులోకి రావచ్చు. రసాయనం వల్ల మీ నోరు గొంతు పాడైపోతుంది. డయాబెటీస్... మీరు డయాబెటీస్ వల్ల నోటి దుర్వాన వచ్చే అవకాశం ఉంది మీ శరీరం తయారు చేసే కీ టోన్స్ విడుదల చేస్తుంది. గ్లూకోజ్ కి బదులు కీటోన్స్ విడుదల చేస్తుంది. డయాబెటీస్ ఉంటె నోటి దుర్వాసన రావచ్చు. ఇన్సులిన్ తకువగా ఉన్న నోటి దుర్వాసన రావచ్చు. హెచ్ ఫై లోరీ... హెచ్ పైలోరి ఒక బ్యాక్టీరియా అది మీనోటిలో పుళ్ళు లేదా అల్సర్స్ కు కారణం అవుతుంది.లేదా పొట్టలో క్యాన్సర్ కు కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన, గుండెల్లో మంట, అసహనం, గ్యాస్ వల్ల వచ్చే నొప్పి ఆహారం అరగక పోవడం దీనివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది మీ నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లను డాక్టర్లు పరీక్షించి దీనికి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేస్తారు.  శ్వాస సంబందిత ఇన్ఫెక్షన్లు... సైనస్, సైనో సైటిస్, బ్రోన్ కైటిస్, జలుబు,దగ్గు, మరిన్ని శ్వాసకొస సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే శరీరంలో పూర్తిగా బ్యాక్టీరియా తో నిండి ఉంటుంది. ముక్కులో మ్యుకస్, నోటిలో అల్సర్స్ నోటిదుర్వాసనకు కారణం కావచ్చు. మందులు... ఎదో ఒక అనారోగ్యంతో దీర్ఘ కాలంగా మందులు వాడే అలవాటు ఉంటుంది అయితే దీని వల్ల గొంతు ఎండిపోయినట్లుగా ఉంటుంది. నోటిలో లాలాజలం  ఊరకుండా పోతుంది దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. గుండె కోసం వాడే మందులు, నైట్రేట్లు, వల్ల నోటి దుర్వాసన రావచ్చు. లేదా నిద్ర మాత్రలు, కీమో తెరఫీ, విటమిన్ల వాడకం వల్ల నోటి దుర్వసనకు కారణం కావచ్చు. గొంతులో టాన్సల్స్... టాన్సల్స్ లిం ఫాటిక్ విధానంలో టాన్సల్స్ అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. గొంతు వెనుక భాగం లో ఇవి ఉంటాయి. మీరు తిన్న ఆహారం గొంతు వెనుక భాగం లో లోకి చేరి గొంతులో అడ్డు కుంటూ ఉంటాయి. అవి రాళ్ళలా ఏర్పడతాయి.వాటి చుట్టూ కాల్షియం,  బ్యాక్టీరియా ఏర్పడి టాన్సిల్ రాళ్ళలా ఏర్పడతాయి. దీనివల్ల మీ శ్వాస నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.కొంత మంది టాన్సల్ ద్వారా ఏర్పడే రాళ్ళను తొలగించేందుకు టూత్ బ్రష్ లు, కాటన్ స్వాప్ లు, వాడతారు. లేదా వేడి నీళ్ళలో గార్లింగ్ చేస్తూ ఉంటారు. పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటారు. అలా టాన్సల్ పెరిగితే వాటిని తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నం చేస్తారు. డీ హైడ్రేషన్... నోటి దుర్వాసన లేదా దుర్గంద మైన శ్వాసను ఎలా నిరోదించ వచ్చు. అని ఆశ్చర్య పోతున్నారా ఎక్కువ నీరు తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ వల్ల సలైవా ఉత్పత్తి తగ్గుతుంది.సలైవా వల్ల బ్యాక్త్రీరియా పెరుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి నోరు ఎండి పోతుంది. దీనివల్ల సాల్పెర్లీ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే నోరు ఎండి పోయి నోటి దుర్వాసన వస్తుంది. ఇన్ఫెక్షన్లు... నోటిలో సహజంగా కొన్ని రకాల ఇంజురీస్ జరగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవుతుంది.నోటిలో గాయాలు లేదా చిన్న చిన్న కురుపులు లేదా ఒక ప్రమాదం వల్ల జరగచ్చు.లేదా మీ నోటిలో ఓరల్ సర్జరీ లేదా మీ చిగుళ్ళలో సమస్యలు లేదా మీ నోటిలో పళ్ళు తొలగించినప్పుడు మీ పక్కనే ఉన్న మరోదంతం ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు. ఈ సమయంలో మీ దంత వైద్యులు ఓరల్ సర్జన్ ఇచ్చే సూచనలు క్రమం తప్పకుండా పాటించండి.పంటికి సంబందించిన వివిధ పద్దతులు అవలంబించిన తరువాత ఏదైనా మీ పంటికి సమస్య  వస్తే లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా మీ డాక్టర్ యాంటీ బాయిటిక్స్ చికిత్స చేస్తారు. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా మీ నోరు ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా నుండి దూరంగా ఉంచు తుంది. లివర్ ఫెయిల్ అయితే... లివర్ ఫెయిల్ అయితే నోటి దుర్వాసన వస్తుంది. లివర్ ఫెయిల్ల్యూర్ హేప టైకస్ చాలా తీయగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం లివర్ వ్యాధి వచ్చినందుకే అని నిపుణులు తేల్చారు. లేదా కళ్ళు పచ్చగా ఉండడం కంటికి పచ్చ కామెర్లు వచ్చాయని అంటారు. లేదా వైద్య పరిభాషలో జాండీస్ వచ్చిందని అంటారు. రక్తంలో బిల్ రూబిన్ పెరిగి నప్పుడు ఈ సమస్య వస్తుంది.  కిడ్నీ సమస్యలు కిడ్నీలో సమస్యలు వస్తే చాపల ఖంపు కొడుతుంది కిడ్నీ సైజు తగ్గి నప్పుడు ,లేదా కిడ్నీ ఫిల్టర్ చేసే శక్తి తగ్గి నప్పుడు,కిడ్నీ ఫేయిల్యుర్ చివరి క్షణం లో రినాల్ద్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్అయ్యింది అంటే డయాలసిస్ చేయడం ద్వారా రక్తశుద్ధి చేయవచ్చు. మీ శ్వాస మీ అనారోగ్యాన్ని గురించి చెపుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.  

పుట్ట గొడుగులతో అద్భుత చికిత్స..

ఆశ్చర్యంగా ఉంది కదా. ఇటీ వాలి వరుస ఘటనలతో చాలా మంది యువతీ యువకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ నేపద్యం లో ఒత్తిడి వల్ల స్త్రీలలో ఎక్కువగా గుండె సంబందిత సమస్యలు వస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ఒత్తిడిని అదిగ మించడానికి పుట్ట గొడుగులు  అద్భుత మైన మందుగా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి కొన్ని పరిశోదనలు చేసినట్లు తెలిపారు. ఎస్సిటటో ప్రాం(lexapro)  దీనికి వ్యతిరేకంగాసైకిడేటిక్, హెల్లుఇంగేనిక్ అనే పదార్ధం పుట్టగోడుగులలో  ఉంది. ఈ అంశం పై 59 మంది రోగుల పై ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న వారిపై యాంటి దిప్రసేంట్ గా వినియోగించారు. ఆ తరువాత రెండు రోజుల సిలో సీబిన్చాలా ప్రభావ వంతం గా  పని చేసిందని అన్నారు. ఎస్సిటలోప్రం పిల్ల్స్ తో పాటు కొన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. రోగులలో ఈ చికిత్చ తరువాత ఒత్తిడి స్థాయి తగ్గిందని కానీ సిలో సీబిన్ వాడిన రోగులు చాలా నిలకడగా ఉన్నరని ఒక వారంలో రెండు సార్లు వాడిన వాళ్ళలో పూర్తిగా ఒత్తిడి తగ్గిందని పరిశోధకులు చేసిన పరిశోదనలు  చాలా ఆశా జనకంగా ప్రోత్సాహకరంగా  ఉన్నయని అన్నారు. ఈ అంశం పై మరింత లోతైన పని చేయాల్సి ఉందని సిలో సిబిన్ ఒత్తిడిని అదిగమించేందుకు ఒక తెరఫి గా పని చేస్తుందన్న విషయాన్నీ ద్రువీకరించాల్సి ఉందని అన్నారు.  సిలో సీబిన్ తెరఫి ఒక కాంబి నేషన్ చికిత్చ మాత్రమే అని ప్రాధాన శాస్త్ర వేత్త రాబిన్ కార్ హార్ట్ -హారిస్ సెంటర్ ఫర్ సైకి డేటిక్  పరిశోదనకు ఇంపీరియల్ కాలేజ్ లండన్ లో పని చేస్తున్నారు. అయితే మందు మాత్రం తీసుకుంటే ఏ విధమైన ఫలితం ఉండదని. సైకో దేరఫీ అవసరమని ఆయన విశ్లేషించారు. వారి పరిశోదన బృందం చేసిన పలు అంశాలను న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. అద్భుతం చేస్తున్న పుట్టగొడుగులను చాలా సుదీర్ఘంగా హాలు సినో గెన్స్ గా వినియోగించారని అది వారి వారి అభిప్రాయంగా పేర్కొన్నారు. వైద్య పరిశోదన ప్రకారం సైక్ డేటిక్స్ సిలో సీచిన్ మరియు ఎల్ ఎస్ డి 195౦ లో ప్రారంభ మైదని 196౦ వరకు ఒక సాంప్రదాయంగా మాత్రమే సాగిందని వివరించారు. ఇటీవలి కాలం లో సిలో సీచిన్  దేరఫిని యుఎస్ ఏ లో పరిశోదనలు జరిపారు. న్యూయార్క్ యునివర్సిటీ లో  యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జాన్ హప్ కిన్స్ విశ్వ విద్యాలయం వీటి పై పరిశోదనలు చేస్తుంది. సిలో సీబిన్ దేరఫీ ఈటింగ్ దిజాస్తార్స్, ఎడిక్షన్ ఒత్తిడికి ఉపయోగ పడుతుందని తేల్చారు. అసోసియేట్ ప్రొఫెసర్ డైరెక్టర్ జాన్ హాప్ కిన్స్ సెంటర్ ఫర్ సైకిదేటిక్ కాంక్షస్ నెస్ కు చెందిన బాల్టీ మోర్  జాన్సన్ వారి బృందం  చేసిన పరిశోధనలో ఒక డోస్ సిలో సీచిన్ తో కలిపి మానసికంగా దేరపీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రోగులలో సైతం ఒత్తిడి తగ్గిందని యాన్క్షయిటీ  లక్షణాలు తగ్గాయని వివరించారు.  జాన్సన్ మాట్లాడుతూ శాస్త్రజ్ఞులు సిల్ సీచిన్ పై అవగాహన ఉందని సత్వరం మెదడు పై సైకో డేటిక్ ప్రభావం స్టిములేషన్ సెప్టర్ గా వారి మూడ్ ను మారుస్తుంది. సహజంగా ఇచ్చే యాంటీ డిప్రసేన్ట్స్ తో పాటు ఎస్కిటోలోప్రాం  సిరో టాసిన్ పని తీరు పెరుగు తుంది. ఆ మందులు ప్రతి రోజూ వాడాల్సిందే.  ఒత్తిడి పై సిలో సీచిన్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని సైకి డేటిక్ ద్వారా సైకో సైకో దేరఫీ కంపోనేంట్ ఎలా పని చేస్తుందో నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే చార్ హార్ట్ హారిస్ బృందం59 మంది రోగుల పై ఒత్తిడి పై పరిశోదన చేసిందని ర్యాన్ డం గా రెండు గ్రూపులు గా విభాజించారని. కొంత మంది రోగులు సిల్ సీచిన్ రెండు డోసులు ఇచ్చారని మెంటల్ హెల్త్ ప్రొఫెసర్స్ సలహా సూచనలమేరకు వీరు ప్లాసిడో ఇన్ యాక్టివ్ క్యాప్సుల్స్ ఇంటి వద్ద వాడినట్టు  తెలిపారు. మరో వర్గం  ఎస్ సిటోలో ప్రాం క్యాప్సుల్ ప్రతి రోజూ తీసుకున్నారు. ప్లాసీబో కు బదులు సిలో సీచిన్ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు తీసుకున్నారు. అందరు సిక్లాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆరు వారాల తరువాత రెండు గ్రూపులు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయని ఒత్తిడి లక్షణాల శాతం పరిసీలించామన్నారు. సిలో సిచిన్ వాడిన గ్రూప్ వారిలో57 % ఒత్తిడి తగ్గిందని ఇతర యాంటి డిప్రేసేంట్ రోగుల కంటే28%తగ్గింది. వారిలో ఇతరుల లాగానే సహజంగా అన్ని కార్యక్తమాలలో  పల్గొంటు న్నారని చారాట్ హారిస్ అన్నారు. సైడ్ ఎఫ్ఫెక్ట్స్ విషయంలో సిల్ సీచిన్ చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.24గంటల వ్యవధిలోనే అప్పు డప్పుడు మాత్రమే తల నొప్పి వచ్చిందని తెలిపారు. ఎస్కి టలోప్రాం లో సహజంగా సమస్యలు ఉన్నాయని తల నొప్పి, నాజియా, ఫాటిగో సమస్యలు ఉన్నాయని అన్నారు. సైకిడేటిక్స్ గురించి జాన్సన్ మాట్లాడుతూ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఆరోజు మాత్రమే ఉన్నాయని రోగులు మాసంరక్షణ లోనే ఉన్నారని అన్నారు. ఒత్తిడిలో ఉన్న వాళ్ళు  వారికై వాళ్ళు చికిత్చ చేసుకోడం సరికాదని వారికీ సరైన కౌన్సిలింగ్  ఇవ్వడం కీలక మని అని అన్నారు. పుట్టగొడుగుల వల్ల కొంత ప్రమాదం ఉందని అన్నారు. కొందరిలో వారికై వారు చికిత్స చేసుకోడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయన్నారు. ఒత్తిడిని ఎదుర్కుంటున్న రోగులకు ఇంకా ఎంతకాలం తరచుగా  చికిత్చ చేయాలి సిలో సీచిన్ ఏ మేరకు ఒత్తిడిని నియంత్రిస్తుంది అన్న అంశం పై మరిన్ని పరిశోధనలు జరగాలని జాన్సన్ అన్నారు. సైకి డేటిక్ అనేది యాంటి డిప్రెషన్ కు ఒక ప్రత్యామ్నాయం మాత్రమే అని చారాట్-హారిస్ అన్నారు. మరిన్ని ప్రత్యామ్నాయాలు కావాలని జాన్సన్ పేర్కొన్నారు.  

నిద్రభంగంతో మహిళలు చనిపోతారా?

మీకు నిద్ర సరిగా పట్టడం లేదా -- మాటి మాటికీ నిద్రభంగం కలుగుతుందా ? అయితే ఇలాంటి లక్షణా లు ఉన్న మహిళలు చని పోయే అవకాసం ఉందని  శాస్త్రజ్ఞ్యులు హెచ్చరిస్తునారు. మొట్ట మొదటి సారిగా ఒక పరిశోధనలో రాత్రివేళ సరిగా నిద్ర పోవడం పై పూర్తిగా నిద్రపోయి నట్లుగా కాక మధ్యలో తరచుగా మెలుకువ రావడం వంటి సమస్యలు వస్తే గుండె మరియు రక్త నాళాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య వస్తే త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అంశం పై 8౦౦1  మంది పురుషులు స్త్రీలలో  ఒక పరిశోదన  చేసినట్లు యురోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించింది. మత్తుగా ఉండడం మెలకువగా తరచుగా ఎక్కువ సేపు దీర్ఘ కలాం పాటు వస్తూ ఉంటె మాత్రం కార్డియో వాస్క్యులార్ డిసీజ్ తో చని పోతరని శాస్త్ర వేత్తలు నిర్ధారించారు. ఈ అంశం పై దాదాపు 6 నుంచి 11 సంవత్సరాల పాటు పరిశోదనలు జరిపినట్లు తెలిపారు. స్త్రీలు పురుషులను వేరు వేరు గా పరిశీలించి నప్పుడు పురుషులకంటే  స్త్రీల లోనే ఎక్కువగా ఉందని పురుషులలో ఎక్కువ మరణాలు నమోదు కావడం గమనించినట్లు తెలిపారు. మత్తులో ఉంటూనే మేలుకువుగా ఉండడం కార్డియో కేర్ ఎరోజల్ సహజంగా నిద్రలో ఉంటుందని శరీరంలో ధానికి అదే స్పందిస్తుందని శరీరం శక్తి వంతంగా బలంగా  ఉన్న ఒక్కోసారి ప్రమాద కరంగా మారతాయి ఒక శబ్దం లేదా శ్వాస తీసుకోడం ఇబ్బంది కలుగు తుంది. తీవ్రమైన నొప్పి తో కండరాలు కదలక పోవడం తీవ్రత ఎక్కువగా ఉండడం జ్వరం వచ్చినట్లుగా ఉండడం వంటివి సంభవిస్తాయి. మస్చేర్డ్ విశ్వ విద్యాలయం కార్డియాలజీ విభాగానికి చెందిన అసోసియేటేడ్  ప్రోఫెసర్ డోమ్నిక్ లింసే లింజ్ నెదర్ల్యాండ్స్, నాక్యుర్నాల్ ఎరోజల్స్ నిద్రాభంగం , ఊపిరి ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటె మన శరీరం ఎలా ఉంటుందో తెలియ చేస్తుందిఅని అంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఊపిరి ఆగి పోతుందో ఎరోజల్ విధానం  శరీరం మళ్ళీ యాక్టివేట్ కావాలని సూచిస్తుంది. మనం నిద్ర పోయే విధానం పై నుండి ఊపిరి పోయే భాగం మరోకారణం. లేదా శబ్ద కాలుష్యం మరో కారణం కావచ్చు. ఉదాహరణకు-- రాత్రివేళ విమాన రకాపోకల శబ్దాలు ఎరోజల్ కు కారణం కావచ్చు. చుట్టుపక్కల వాతావరణం ప్రదాన కారణమని ప్రభావం తెలుసుకోవాలి. అదే తరచుగా కారణం కాక పోవచ్చు. ఉదయం వేళ తీవ్రంగా అలిసిపోవడం . వల్ల కూడా మరో కారణం కావచ్చు. అయితే వారికి వ్యక్తి గతంగా ఎరోజల్స్ ఉన్నాయన్న విషయం తేలియదు. గతంలో చేసిన పరిశోదనలు నిద్ర పోయే సమయం, చాలా తక్కువ, లేదా ఎక్కువ సేపు నిద్ర పోయే అంసాల పైన ముఖ్యంగా కార్డియో వ్యాస్క్యులర్ ఇతర కారణాలు ఉండవచ్చని తేల్చారు. ఎరోజల్ భారంగా మారడం కావచ్చు. ఎక్కువ శాతం ఆరోజల్ రాత్రివేళ లో నిద్రలో వస్తే చని పోయే అవకాసం ఉందని తేల్చారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ అడిలాయిడ్ కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్  యేతి యాస్ బమేర్ట్ ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ లింజ్ ఒక స్లీప్ మానీటర్ ద్వారా పరిశీలించారు. స్త్రీ పురుషులు ఒకరి తరువాత ఒకరిపై రాత్రి వేళ మూడు సార్లు పరిశీలించారు. 2782 మంది పురుషులలోఆస్టియో ప్రోరోటిక్ ఫ్రాక్చర్ ఉన్నట్లు కనుగొన్నారు. 424  మంది స్త్రీలలో ఆస్టియో ప్రోరోటిక్ సమస్యలు ఉన్నాయని ఉన్నాయని కనుగొన్నారు. 2221 మంది పురుషులు 2574 స్త్రీలు  స్త్రీలలో నిద్ర గుండె అనారోగ్య సమాస్యల పై పరిసీలించారు. 77 -83 , లేదా 84 సంవత్సరాల వారిలో ఈ పరిశీలన చేసారు. వీరిని 6నుండి 11 సంవత్సరాలు పరిశీలించారు. వారి వయస్సు, ఎంత సేపు నిద్ర పోయారు, వారి అనారోగ్యం చరిత్ర, బి ఎం ఎస్  వారి బరువు, వారికి ఇతర అలవాట్లు, తడి తర అంశాలను పూర్తిగా పరిశీలించారు. ఎరోజల్ బర్డెన్ పురుషుల కంటే స్త్రీలాలో తక్కువే అని 6.5% పురుషులలో రాత్రి పూట నిద్ర పోని కారణంగా కార్డియో వాస్క్యులర్  డిసీజ్ తో మరణిస్తున్నారని తేలింది.

వెన్నుపూస నొప్పి తగ్గాలంటే..

వెన్ను నొప్పి మీ వీపుకు వెనుక భాగం తీవ్ర మైన నొప్పి తో బాధ పడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చుని పని చేసినా, అదే పనిగా ఎక్కువ సేపు బండిపై  కూర్చునిప్రయాణం   చేసిన సహాజంగా వెన్ను నొప్పి తో తీవ్రంగా ఇబ్బంది పడతారు. సహాజంగా మీ వెన్ను పూస ఒక పక్కకు వంగి పోవడం. నిటారుగా కూర్చోలేక ఒక పక్కకి ఓంగి కూర్చోడం అలవాటు చేసుకుంటారు. అది వెన్ను కింది బాగంలో డిస్క్ బోన్స్కు మధ్య  ఉండే మృదువుగా ఉండే కుషన్ లాంటి భాగం పాడై పోతుంది. ఇది ఆర్తరైటిస్ కు దారి తీస్తుంది. సహజంగా కొంచం మీతలను ముందుకు సాచి ప్రతి 1/2 గంటకు నాలుగు వైపులకు తిప్పాలి. ఒక వేళ ఏదైనా నొప్పి స్పాం జామ్ అలాంటి నొప్పి ఉంటె చల్లని ఐస్ ముక్కలను లేదా హీటింగ్ ప్యాక్ ను ఆప్రాంతం లో పెట్టాలి. అయితే మీశారీరాన్ని పల్చటి టవల్ లేదా ఒక గుడ్డలో డాక్టర్ సలహా మేరకు వ్యవహరించాలి.  ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరిగా లేకుంటే వెన్ను నొప్పికి దారి తీస్తుందా... మనం తీసుకునే ఆహారం సరైనది కాక పోతే శరీరం ఇంఫ్లామేషన్ కు గురి అయ్యే అవకాశం ఉంది. మీ శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్లు, పప్పు ధాన్యాలు పండ్లు ఫలాలు, కాయ గూరలు,అవకాడో సాల్మన్, వంటివి మీ ఆహారం లో తీసుకుంటే కండరాలు బలో పేత మౌతాయి. మీ శరీరంలో ఉన్న టిష్యుల ని మన శరీరానికి కాల్షియం, ప్రోస్ఫరస్, విటమిన్ డి , తీసుకోవాలి. ఎముకలలో లేదా కండరాలు బలహీన పడ్డ అరిగి పోయినాడిస్క్ లో సమస్యలు వస్తాయి.  మీరు నిదర పోయే పరుపులు, మెట్రేసేస్, సరిగా ఉండక పోవచ్చు... మీ వెన్ను పూసకు సరైన సపోర్ట్  ఇచ్చే విధంగా మీ శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండే మెట్రేస్సేస్ ను మీరు ఉపయోగించాలి.  అదే మీరు ఎలా నిద్ర పోవాలో మీకు సూచిస్తుంది. ఇప్పటికే మీకు వెన్ను నొప్పి ఉంటె ఆ పరుపు లేదా మెట్రిసెస్స్  గట్టిగా ఉంది ఉండవచ్చు.  అందుకే మీ పరుపు ఎత్తుపల్లా లుగా ఉండడం ,మీరు వేసుకునే పిల్లో సరిగా లేకాపోయినా అటు వెన్ను నొప్పి మెడ పట్టేయడం వంటి సమస్య రావచ్చు. అలా ఎన్ని పరుపులు, మాట్రిసెస్స్  మార్చినా పరిస్థితి అలాగే ఉంటె నేల పైన ఏమిలేకుండా అంటే చాప, దుప్పటి, పిల్లో లేకుండా పడుకునే ప్త్నం చేయండి. ఒక వేళ ఇతర వెన్ను నొప్పి తగ్గించే పరుపులు మాట్రేసేస్స్ వారానికి పైగా వాడినా తగ్గ కుండా ఉంటె వాటిని తిరిగి ఇచ్చేయండి. కొందరు వాళ్ళు పడుకునే తీరును బట్టి వెన్ను పూసకింది భాగంలో తీవ్ర మైన నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మార్చి పడుకోవడం చాలా కష్టం. అది మీకు అలవాటుగా మారితే చెప్పలేము. మీరు టవల్ ను చుట్టు కొడం, మీ కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోడం. వల్ల మీ వెన్నుపూస వెనుక వైపు వంకరగా మారుతుంది లేదా మరో పిల్లో తో చేయవచ్చు. మీ మెదవైపు నుండి కిందకి ఎలాంటి పరుపు ఉండాలో మీరు సుఖంగా నిద్రపోవాలంటే ఎలాంటి పరుపు ఉండాలో  మీకు ఏది సుఖ వంతమో ఎంచుకోండి. మీ పొట్టపై తలగడ పొట్టకింద తలగడ... అలా చేయకుండా ఉంటేనే మంచిది. ఒక వేళ మీకు వెన్ను పూస నొప్పి తీవ్ర సమస్యగ  ఉంటె మీకు మెడ లేదా వెన్ను కింది భాగం లో నొప్పి ఉంటె  మీ పోట్టకింది భాగం  వరకు పిల్లో పెట్ట వచ్చు. మీ స్థానాలను మార్చి మార్చి తలగడ మారుస్తారు. అదీ మీ తలను మెత్తటి పిల్లో పై   ఉంచి మీ మెడ పై స్థానం లో పెట్టవచ్చు. అసలు మనం ఎలా పడుకోవాలి... వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటె ఎదో ఒక వైపు కు తిరిగి పడుకోవాలి.అది కొంతవరకు వెన్ను నొప్పి ని నివారించవచ్చు మీ కాళ్ళ మాధ్య పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అది మీ పిరుదల కింది భాగం లో పడుతుంది. మీ చెస్ట్ ను దగ్గరగా మీ కాళ్ళను ఉంచి ముడుచుకుని పడుకోండి. ఒక వేళ అప్పటికే  వెన్ను నొప్పి ఉన్న వారికి చాలా ఉపయోగ పడుతుంది. దీర్ఘ కాలంగా కూర్చున్న వారికి వెన్ను నొప్పి... ముఖ్యంగా పని చేసే ఉద్యోగస్తులు. పని చేసేప్రదేశాలాలో దీర్ఘ కాలంగా  ఎక్కువ సేపు  కూర్చోడం వల్ల వెనుక భాగంలో ఉండే కండరాలు మెడ , వెన్ను పూస, పై తీవ్ర ప్రభావం పడడం వల్ల మీరు కూర్చునే ప్రదేశం లో నిటారుగా కూర్చోడం. అలా కాక పోయినా మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా కూర్చున్నారు ? అన్నది ప్రశ్న మీ వెన్ను పూస దీర్ఘకాలం ఎక్కువసేపు కూర్చోడానికి సహకరించదు. కొన్ని సార్లు లేచి అటు ఇటు కొన్ని నిమిషాలు తిరుగుతూ  నడుస్తూ ఉండాలి. మీ శరీరానికి ప్రతి అరగంటకీ కాస్త విరామం ఇవ్వాలి. శరీర వ్యాయామం తప్పించారా.. మన శరీరానికి వెన్ను క్రింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటె మేరు ఉత్చా హంగా పని చేయలేరు. మీ వెన్ను పూసకు  బలమైన పోట్టద్వారా సహకారం అవసరం వెనుక భాగంలో ఉన్న కండరాలు, సరిగ్గా ఉంటేనే బరువును లేపగలరు. ప్రతి రోజూ మీ శరీర వ్యాయామం చేయడం ద్వారా మీరు మెట్లు ఎక్కగలరు. మీ ఇంటికి అవసర మైన సరుకులు మోయడం , నడవడం, లేదా ఈత కొట్టడం వంటి అలవాట్లు ఎక్కువరోజులు  చేయకుంటే శరీరం బలహీన పడి పోతారు. చాలా కాలంగా అలాగే ఉంటె  ఒకేసారి చేస్తే శరీరానికి గాయాలు ఏర్పడు తాయి. పొగ తాగడం... మీరు అధికంగా పొగతాగడం వల్ల కింది భాగం లో వెన్ను నొప్పి రావచ్చు దీని వల్ల రక్త ప్రసారం  నిరోధిస్తుంది మీ వెన్నుపూసకు  రక్త .ప్రసారం నిలిచి పోతుంది. దీని వల్ల వెన్నుపూసకు  ఉండాల్సిన కుషన్  డిస్క్ మరియు ఎముకల మధ్య  అరిగి పోవచ్చు లేదా విరిగిపోవచ్చు. అవి మీ ఎముకలను మరింత బలహీన పరుస్తాయి. దీని వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వస్తుంది. మీరు పోగతాగడం వల్ల వెన్నునొప్పి కి కారణం అవుతుంది. మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే టట్లు అయితే పోగాతాగడం మానేయాలని మానేస్తే డాక్టర్ సహాయం తీసుకోండి.  అధికంగా తినడం... అతిగా ఆహారం తిన్న మీ ఎముకలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మీ శరీరం బరువు పెరుగు తుంది.మీరు తీసుకునే ఆహారం   ఆత్రంగా ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు మీరు తీసుకునే ఆహారం మెల్లిగా   తీసుకొండి. దీని వల్ల మీశారీరానికి సమపాళ్ళలో పోషకాలు అందుతాయి.దీని వల్ల మీ శరీరానికి కొన్ని క్యాలరీల లభిస్తాయి. మేరు కాస్త స్నాక్స్, వెన్న, చిప్స్ శాఖాహారానికి  బదులు కొంత పెరుగు తీసుకుంటే మంచిది. మీరు మోసే బరువు  మీశారీరం పై పడుతుంది.... మీరు మోసే మీ బరువైన సంచులు ముఖ్యంగా పాట శాలకు వెళ్ళే పిల్లలు పెద్దలు ఆబరువుకు  శరీరం అలిసి పోతుంది.  శరీర కండరాలు అలిసి పోతాయి. అది మీ వెన్నుపూసకు సపోర్టు చేయలేదు. ఇది చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బరువు మోయలేక  బాల్యం నుంచే స్కోలియోసిస్ వంటి సమస్యతో బాధ పడుతున్నారు. బాల్యం లోనే వెన్నుపూసవంగింది అంటే ముందు ముందు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు  స్పయిన్ సర్జన్లు ఒక్కోక్కసారి వెన్ను కింది భాగం లో డిస్క్ ఫ్రోలాప్స్ అయినా అవ్వచ్చు అలాంటప్పుడు స్పైన్ సర్జరీ చేసినా ఫలితం ఉండబోదని అంటున్నారు. వైద్యులు. మీరు నడిపే వాహానం సరిగా లేకపోయినా నడుము నొప్పికి కారణం... మీరు నడిపే వాహానం కూర్హునే పోస్చర్ సరిగా లేకపోడం మీశారీరానికి సరిపడా ఎత్తు లేకపోవడం. అదేవిధంగా హ్యాండిల్ సరిగా లేక పోయినా వాహనాన్ని  సరిగా నడపలేరు. అదేపనిగా ఎక్కువసేపు వాహనాన్ని నడపడం కష్టం. మీ వెన్ను నొప్పితో బాధ పడుతున్నప్పుడు ఫిజియో తెరఫిస్ట్ సహకారంతో  వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. లేదా ట్రాక్స్ ద్వారా వెన్ను నొప్పి కి కొన్ని తెరఫీలు చేస్తారు అయితే నిపుణులైన వైద్యాధికారుల సమక్షంలోనే  కొన్ని తెరఫీలు చేయాలి.  హై హీల్స్...  హై హీల్స్ ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు వాడే హై హీల్స్ ఎగుడు దిగుడుగా ఉంటె ఆటు నడవలేక ఎత్తుపల్లాలు ఎక్కువై అది మీ వెన్ను పూస పై తీవ్రప్రభావం చూపిస్తుంది. అది మీ ఆఫీసులో వేసుకోవచ్చు. నడి చేందుకు వాకింగ్ షూ వాడచ్చు . మీరు సరైన షూ వాడక పోవడం వల్ల కాలి మడమలకు సరైన రక్త  ప్రసరణ జరగదు. అది మీ వెన్ను పూసపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్య తీవ్రం కాక ముందే  సిట్టప్స్ యోగా చేయడం వల్ల కొంత ఉపసమనం ఉంటుంది.  వెన్ను చూపని వాడె మగాడు వెన్ను పూసకు సమస్య వచ్చిందో ఇక అంతా సమస్యే.

Go and get some Sunshine Vitamin

  Remember your mom telling you when you were young “Go out and get some Sunshine” ! The adage holds good for people even today. It is reported that close to 40 per cent of Indians are vitamin D deficient. Which is quite surprising , since most parts of the country get abundant sunlight throughout the year. “Vitamin D, also known as the sunshine vitamin, is created in the body with sunlight exposure. Its major function is to maintain normal blood levels of calcium and phosphorus, which keeps the bones strong which we all know. Our modern lifestyle is one of the major reasons for vitamin D deficiency. We are working from dawn to dusk in air-conditioned offices and time spent indoors  and from professionals and students to housewives, no one comes in contact with adequate sunlight, due to which vitamin D deficiency is rampant today. Shunning the sun, people are reluctant to go out in the sun. Those who stay indoors a lot or cover their body when outside are most likely to suffer from the deficiency. Glass windows don’t help either, so you don’t generate vitamin D when sitting in your car or while at home. Child-birth is also a major reason for women who later suffer from osteoporosis and other bone related issues because of not taking enough supplements during the post pregnancy time. Lack of awareness also is one of the reasons for women to suffer from this deficiency. The previous generations were by far healthier and no body suffered from fatigue and exhaustion because they played in the sun and were exposed to the healthy sunlight. Being overweight also adds to the problem. Vitamin D is extracted from the blood by fat cells, altering its release in the body. People with a body mass index of 30 or greater often have low blood levels of vitamin D, Your body may lack the sunshine vitamin if you eat a largely vegetarian diet. “Vitamin D is found primarily in animal products such as dairy foods, liver, eggs, fish and fish oils,” However, diet alone cannot provide an adequate amount of vitamin D. Sunlight exposure is the only reliable way to generate it. Quick tips ·         Twenty minutes of good exposure, two to three times a week, with bare arms and face, is enough to achieve healthy vitamin D levels through the year. But don’t go overboard. The sun’s rays can also cause sunburn, so don’t expose yourself to it for a very long time. ·         Get  into a right diet  and consume foods rich in vitamin D and calcium .Include foods like fish, eggs and meat, breakfast cereals, soy products, dairy products, and low-fat spreads in your diet. Our traditional Indian foods like sesame seeds consumed during the month of the January Harvest season and our dairy products show the excellent blend of the calcium rich food we have used since ages. ·         The most highly recommended tip is a good rigorous outdoor physical activity to achieve adequate vitamin D levels and control obesity. And that applies to all age groups. So go out and get some Sunshine Vitamin!

చక్కర ఎక్కువ తీసుకుంటే.. పిల్లలకు ప్రమాదమే.. 

పిల్లలు చక్కర ఎకువగా తింటే మెదడు అభివృద్ధి మందగిస్తుంది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకి తాయిలాలు పెట్టనిదే మాట వినరు. అలా తాయిలాలకి అదేపనిగా అలవాటు పడ్డపిల్లల లో అతిగా చక్కర శాతం ఉన్న పానీయాలు అలవాటు చేస్తే  వచ్చే తదితర సమస్యలపై పిల్లల బ్రెయిన్ పెరుగుదల పై చేసిన పరిశోదన కొన్ని సూచనలు చేసింది. జార్జియా విశ్వ విద్యాలయం జరిపిన పరిశోదనాలో చక్కెర వాడడం వల్ల లేదా చక్కెర తో కూడిన కూల్ డ్రింకులు ఎక్కువ తీయగా ఉండే వస్తువులు తీసుకుంటారో ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారు . ముఖ్యంగా సాధన నేర్చుకునే వారిలో ప్రయత్నంలో ఉంటారో జ్ఞాపక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద వయస్సు ఉన్నవాళ్ళలో ముఖ్యంగా బాక్టీరియా లో వచ్చే మార్పువల్ల  జ్ఞాపక శక్తి సరిగా ఉండదని తేల్చారు. సహజంగా మీరు కొనుక్కునే చక్కెర తో చేసే పదార్ధాలు   దుకాణాలలో  లభిస్తుంది. అవి పిల్లల కోసమే పెట్టి అమ్ముతూ ఉంటారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్దాలాను ఇతర వస్తువులను వాడేది పిల్లలు మాత్రామే అతిగా తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపు తుంది. ఒక వైపు నేర్చు కుంటూనే జ్ఞాపకం ఉంచుకోవాలి  దీనిని హేప్పో క్యాంపస్ అంటారు. జార్జియా విశ్వ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయ బృందం సదరన్ కాలిఫోర్నియా సమన్వయం తో పలు అంశాలపై పరిశోదనలు చేసింది. యుక్త వయస్సు నుంచి ఎదిగే వరకు  ఒక పక్క నేర్చుకోడం. సాధన చేయడం గుర్తుపెట్టుకోడం . ఒక్కసారి వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి జ్ఞాపక శక్తికి సంబంధించి సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు. పారా బాక్టీరియాను ఎక్స్ పర్మెంట్ గా జంతువులకి ఇచ్చారు. అయితే వాటికి చక్కర ఇవ్వలేదు.ముందుగా చక్కర తీసుకున్న వాటిలో పారా బాక్టీరియా లెవెల్స్ పెరిగాయి. ఎక్కువ శాతంలో పారా బాక్టీరియా ఉన్న జంతువులలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. అధిక  చక్కర వల్లే వినికిడి సమస్య జ్ఞాపక శక్తి, కారణమని తేల్చారు.  చక్కెరను నియంత్రించాలి.----- మనం తీసుకునే ఆహారం లో కొన్ని సూత్రాలను తప్పని సరిగా పాటించాలని దిశా నిర్దేశంచేసారు.యు ఎస్ వ్యవసాయ విభాగం, ఆరోగ్యం మానవ వనరుల విభాగం సంయుక్తంగా చక్కర శాతం ఎంత ఉండాలి అన్న అంశాన్ని సంయుక్తంగా ఒక ప్రచూరణ చేసింది. ప్రతిరోజూ 1 ౦ %  క్యాలరీల కంటే మించరాదని సూచించింది. డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్  విభాగం తమ వద్ద ఉన్న డాటా ప్రకారం  9- 18  సంవత్చ రాల వయస్సు ఉన్న వారు చక్కెర ద్వారా ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయని ఎక్కువ చక్కెర శాతం ఉన్న ఆహారం వల్ల మైక్రో బ్యాక్టీరియా ను చిన్న చిన్న ఎలుకలలో చక్కర పదార్ధాలను ఇచ్చామని వాటి ప్రభావం పనితీరు పరిశీలించారు. ఎలుకలలో జ్ఞాపక శక్తి వినికిడి సమస్యలు వచ్చాయని గమనించామన్నారు. జంతువులలో గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి తగ్గిందని చక్కర పదార్ధాలు వాడడం వల్ల 1 ౦ ౦ మిలియన్లమైక్రో ఆర్గానిజమ్స్ గ్యాస్ట్రో ఇంటర్స్తైనల్ సమస్యలు మానవ ఆరోగ్యం పై తీవ్ర తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా మెదడు వృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ప్రతి వ్యక్తిలో ఉండే బ్రెయిన్ వల్ల అతని మెదడుకు  ఏమి అవసరామో  తెలియ చేస్తుంది.                    

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

మీరు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారా ?

మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా ? మీ ఇల్లు మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తోందా ? మీ ఇంట్లో ఎల్లప్పుడూ జలుబూ, దగ్గు  గొంతు నొప్పి గొంతు గరగర దురదలు ఇవన్ని ఎలార్జీకి కారణాలు. అవి ఊపిరి తిత్తుల సమస్య కావచ్చు. లేదా మీలో రోగనిరోదక శక్తి తగ్గి ఉండవచ్చు. అందుకు కారణం మీ ఇంటి గోడల పై మోల్డ్ దాని చుట్టూ బూజు దుమ్ముకొట్టుకోని ఉండచ్చు. లేదా మీఇంటి గోదాల్ పై నాచు లేదా  బూజు పేరుకు ని పోయి ఉండవచ్చు. మీఇంలో ఉన్న బాత్రూములు లో ఉన్న నీటి కనక్షన్ల లో లీకేజీ ఉండి ఉండవచ్చునీరు చేరడం. లేదా గోడలలో ఎసి అమర్చడం  అందులో తేమ శాతం 5 ౦% కంటే తక్కువగా ఉండవచ్చు. మీ ఇంటి బయట ఉన్న మోల్డ్ లను కిటికీని ముఖ్యంగా వంటింటి పై ఉండే ఎక్సాస్ట్ ఫాన్స్ చుట్టూ నాచు దుమ్ము కొట్టుకు పోవడం వంటి కారణాలు కావచ్చు.మోల్డ్ ను ఎల్లప్పుడూ సబ్బు లేదా సర్ఫ్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే బ్లీచింగ్ ఒక మిల్లె లీటర్ తీసుకుని ఒక గ్యాలన్ నీటిలో కలిపి శుభ్రంగా  చేసుకోవాలి. ర్యాండం...  మన ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఉండే రాయి మట్టి గ్యాస్ విడుదల చేస్తుంది. అది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది.అది మీ ఇంట్లోమే బంధించి ఉంచితే అది మీఇంట్లోనే ప్రమాదమే. అలాగే మీ ఇంట్లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ద్యామేజికి కారణం కావచ్చు.ఆగలిని పీల్చినా ,మింగినా అది మన ఇంటినే మింగేస్తుంది. గోడలలో పగుళ్ళు, కన్నాలు ఒక చిన్న పరీక్ష చేసిన పరికించి చూసినా మీకే తెల్స్తుంది.ఇంటి నిర్మాణం చేసే గుర్తింపు పొందిన బిల్డర్ కాంట్రాక్టర్ వీటిని ఫిక్స్ చేయాలి.  ఇంట్లో కార్పెట్లు... ఇంటి అవరణలో  అడుగు పెట్టగానే అందమైన కార్పెట్లు ఉంటాయి. అయితే ఆ కార్పెట్ దుమ్ము చేరుకుంటుంది. మోల్డ్ లో దుమ్ములేదా క్రిమి కీటకాలు మురికి ఇతరాలు మనలను ఇరిటేషన్ కలిగిస్తాయి. కార్పెట్ల కోసం వినియోగించే రసాయనాల వల్ల హాని జరగ వచ్చు. ఖటిన మైన ఫ్లోర్ల కన్నా  రగ్గులను,కర్పెట్లను ఇంటి బయటి శుభ్రం చేయాలి. కార్పెట్ ను వ్యాక్యూం క్లీనర్  ద్వారా శుభ్రం చేయాలి. బొద్దింకలు.... ఒక వేళ మీఇంట్లో దుమ్ము ధూళి పెరుకుపోతే అటు బొద్దిం కలు దోమలు, బల్లులు స్తావారాలను ఏర్పాటు చేసుకుంటాయి. లేదా మీఇంట్లో ఉండే పశువులు ఇతర ఫర్నీచర్. వాటిలో ఉండే దుమ్ము పీల్చినప్పుడు. ఇరిటేషన్ వస్తుంది. ఇదే ఎలర్జీ కి కారణ మౌతుందని. లేదా ఊపిరి తిత్తుల సమస్యలు రావచ్చు. ఆస్తమా నిమోనియా వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీ ఇంటిని ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బట్టలు లేదా కార్ప్పెట్లు ఎల్లప్పుడూ ఉతికి శుభ్రం చేసుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్.. ఫర్నేస్ లు ,వంటిల్లు , వంటగదులు, వాటర్ హీటర్లు, డ్రైయర్లు, కార్లు ఉన్నచోట ఆగ్యాస్ ను వాటి వాసన చూడ లేము. ఆవసన పీల్చలేము. అలాంటి గ్యాస్ బయటికి వెళ్లిపోవాలి. లేకుంటే ఆగ్యాస్ ఇంట్లోనే ఉండి పోతుంది.అది కా ర్బన్  మోనాక్సైడ్ గా మారి తల నొప్పికి దారి తీస్తుంది. గాలి పీల్చుకోడం. సమస్య కావచ్చు దీని ప్రభావం వల్ల కంటి చూపు మందగించ వచ్చు . తల తిరిగి నట్టు గిడ్డిగా ఉండవచ్చుదీనివల్ల  కన్ఫ్యూజన్ లేదా జలుబుతో ఇబ్బంది పడతారు. అలంటి సమాస్యలు ఎదుర్కొంటారు. నేరుగా ఇంట్లోకి ప్రకృతి నుంచివచ్చే సహజమైన గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి  తేమ తక్కువగా ఉండేందుకు హ్యుమిడి ఫియర్.. గాలిలో తేమా శాతం పెంచడానికి దానిని సెట్ చేసి మర్చి పోకండి. గాలిలో తేమ 5 ౦ % ఉంటె బ్యాక్టీరియా ను ఆహ్వానించి నట్టే. నాచు ఫంగస్ చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు కిటికీలలో చేరితే ఇంటి చుట్టూ పక్కల6౦% కన్నా ఎక్కువ ఉంటె హ్యుమిడి ఫైయర్ ఒక మోల్డ్ గా మారు తుందని గాలిలో బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని శుభ్రం చేయకుండా ఎండా బెట్టకుండా ఉంచితే బ్యాక్టీరియా ఇంట్లోకి చేరుతుంది .హైడ్రో మీటర్ ద్వారా మీ ఇంట్లో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉందొ గుర్తిలని నిపుణులు సూచించారు. కర్టెన్లలోనూ దుమ్ము ధూళి ---ఇంట్లో కిటికీకి ఇంటి ముందు గుమ్మానికి సహాజంగా అందంగా ఉంటుందని కర్టెన్లు అమరుస్తారు. ఆకర్తెన్లలోనే దుమ్ము ధూళి క్రిమి కీటాకాలు,పిట్టల రెట్టలు, మోల్డ్ ఇతర ఎలర్జీలు ఉంటాయి. అలాగే మనం వాడే దిప్పట్లలోను బట్టలు, రగ్గులు, మీ ఇంటి చుట్టూ ఇందే ఫ్యాబ్రిక్స్ లో దుమ్ము ధూళి ఉంటుంది. అందుకే కర్టెన్లను తరచుగా శుభ్రం చేసుకొడం కష్టం. అయితే 1 3 ౦ డిగ్రీల సెంటీగ్రేడ్ లో వేడినీళ్ళలో కర్టేన్లనుశుభ్రం చేయాలని దీని వల్ల ఇంట్లో దుమ్ము ధూళి పోయి అందారు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడె  ఉత్పత్తులు... ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ఉత్పత్తుల వల్ల వచ్చే ఘాటైన వాసనలుగొంతు, కంటికి తీవ్రసమస్యలు వచ్చే అవకాసం ఉన్దాని వైద్యులు హెచ్చరిస్తున్నారు, తల నొప్పి, ఊపిరి తిత్తుల సమస్యలు, ఇంట్లో ఉండే రేణువులు, సైతం క్యాన్సర్ కారకంగా మారవచ్చు  అందులో వాడే ఆర్గానిక్ కంపౌన్డ్స్  రసాయనాల వల్ల శరీరం పై తీవ్రప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యంగా అమోనియా , బ్లీచింగ్ , అత్యంత ప్రమాదకరం  వాటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అవి వాడినప్పుడు మీ ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం మంచిది. అవి అత్యంత ప్రమాదకరమైన సాంద్రత ఉన్న రసాయనాలు కావడం వల్ల వాటికీ అంటుకునే స్వభావం ఉంది. అవి వాడి నప్పుడు  చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  అయిర్ కన్దీష్ణర్లు, హీటింగ్... మనం ఇంట్లో వాడే ఎయిర్ కండీషన్లు ఎయిర్ కూలర్లు మన ఇంట్లో ఉందే తేమ శాతాన్ని మార్చేస్తాయి. అదేపనిగా మీ ఇంట్లో తేమ దుమ్ము కిటికీలు ఉంటె మీ వస్తువులను ఫిల్టర్స్ మార్చు కోవాలని అన్నారు. అందుకోసం ప్రతేక ఫిల్ట ర్స్  ను వాడుకోవాలనిఒక వేళ ఇంట్లో ఇతర జంతువులు ఎలుకలు, దోమాలు బల్లులు, బొద్దింకలు ఉంటె మందులు పిచికారీ చేయండి. ఇంటికి వేసిన సున్నం పెచ్చులు పెచ్చులు గా ఊడి పోతుందా ? మీ ఇల్లు 1 9 7 8 కి ముందు నిర్మించిన ఇల్లు అయితే లేద తో కూడిన రంగును ఇంటి ముందు వేయించుకోవాలి. ఒకవేళ మీ ఇంటి పైన రంగు పెచ్చులు పెచ్చులు గా ఊడిపోవడం, రాలి పోవడం వంటి సమస్యలువస్తే అది కేవలం దుమ్ము ధూళి వల్ల కావచ్చు. బలహీన పడవచ్చు అది మీ మెదడు ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది నీటిని ఎక్కువగా పీల్చుకోడం వల్ల సమస్య రావచ్చ. ఈ సమస్యలను వృత్తి రీత్యా నిష్ణాతులైన వ్యక్తుల సలహా మేరకు  పనులు చెప్పట్టాలని నిపుణులు సూచించారు . మీఇంటిని ఇంటిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆరోగ్యంగా ఉండండి.

ఎముకల దృఢత్వానికి వ్యాయామం...!

వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారుతాయి. ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌- డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాల నుంచి; పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్‌ - డి కి మూలం సూర్యరశ్మి. అలాగే ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్‌ - డి రెండూ లభిస్తాయి. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్‌ డ్రింక్స్‌, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది.  అలవాటు లేకపోయినా ఇప్పుడైనా తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం అంటే జిమ్ లకే వెళ్లక్కర లేదు. ఇంట్లోనూ తేలికపాటి ఆసనాలు వేయవచ్చు. నడక, సైక్లింగ్, స్కిప్పింగ్, జాగింగ్ రోజూ చేసినా ఎముకలు దృఢంగా ఉంటాయి.

గ్రీన్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు

గ్రీన్ బీట్రూట్ జ్యూస్ చాలా సులభంగా శక్తి నిచ్చే పానియమే కాదుఫయ్తో న్యూట్రి యాంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్లోరోఫిల్, కార్బోహైడ్రేడ్స్, యాంటీ ఆక్సి డెంట్ గా గ్రీన్ బీట్రూట్ జ్యూస్  పూర్తిగా డిటాక్స్ బూస్టింగ్ ప్రోపర్టీస్ దీని వల్ల చాలా సులభంగాపచ్చిగా వినియోగిస్తే  మీ కు ఉత్తమ  ఆల్కలైజర్ గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీ శరీరంలో మెటాబాలిజం, ఇమ్మ్యున్ వ్యాధి నిరోదకశక్తి, బూస్టర్ గా పని చేయడం వల్ల అనేక ఆరోగ్యలభాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల అనిమియా అంటే రక్తహీనత ఆహారం అరగక పోవడం, విరేచనం కాకపోవడం , పైల్స్ మొలలు , కిడ్నీలో సమస్యలకు, తలలో చుండ్రు, గాల్ బ్లాదార్ లో సమస్యలు. క్యాన్సర్, గుండె సమస్యకు , రక్త ప్రసారాన్ని, చేయడం చార్మ సమ్రక్షణ  చేస్తుంది. కంటికి సంబందించిన క్యాట్ రాక్ట్, దీర్ఘకాలిక శ్వాస కొస సంబందిత సమస్యలకు  బీట్రూట్ కు దానిలో ఉన్న పోషకాలు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ బీట్రూట్  తయారు చేయడానికి పట్టే సమయం15 నిమిషాలు. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ కు కావాల్సిన పదార్ధాలు ఒక మీడియం స్జిజ్ లో ఉన్న బీట్ రూట్ . అరకట్ట 1/2 పుదీనా కట్ట ఆకులు . ఒక కట్ట కొత్తి మీరి .ఆకులు . ఒక చెంచాడు నిమ్మరసం. ఒక చెంచాడు  తేనె   చిన్న అల్లం ముక్క చిటికెడు జీలకర్ర పొడి  ఉప్పు తగినంత.  రెండు చెంచాల మజ్జిగ. గ్ర్రెన్ బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం   ముందుగా శుభ్రంగా కడిగిన బీట్రూట్, కొత్తిమీర, తులసి ఆకులని రెండు కప్పుల వేడి నీళ్ళలో మెత్తగా బాగా చిక్కబడేదాకా  మరిగించాలి అందులో తగినంత కళ్ళు ఉప్పు వేసికాస్త చల్లార్చి న జ్యూస్ లో  తీసి పెట్టుకున్న నిమ్మరసంతీసుకుని బాగా కలాపాలి.అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు.ఈ రసాన్ని ఎంత పలుచగాచెసి తాగితే అంతఅందులో రెండు చెంచాల మజ్జిగ. ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆహా ప్రాకృతికంగా లభించే సహజ మైన కూరగాయాలు పచ్చి కూరల రసాల జ్యూస్ లు మనకు మేలు చేస్తాయి.

అన్‌లైన్‌లో ఆరోగ్య సలహాలు అనర్థమా!

ఇప్పుడు ఇంటర్నెట్‌ వాడని వారు అరుదుగా కనిపిస్తారు. అందులోనూ, ఇంటర్నెట్‌లో ఆరోగ్యం గురించి కనిపించే వ్యాసాలంటే అందరికీ ఆసక్తే! రోగం వచ్చిన వెంటనే వైద్యుడికంటే ఇంటర్నెట్‌నే సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కానీ ఈ ఇంటర్నెట్‌లో లభించే ఆరోగ్య సూచనలు ఎంతవరకు శాస్త్రీయం అంటే మాత్రం తెల్లమొగం వేయవలసి వస్తోంది.   ఓ కెనడా పరిశోధన కెనడాలో ఈ మధ్య కొందరు పరిశోధకులు ఇంటర్నెట్‌లో అల్జీమర్స్‌ వ్యాధి గురించి ఉన్న సమాచారాన్ని పరిశీలించారు. తమ పరిశోధనలో తేలిన విషయాలు చూసి, వారే కంగారుపడాల్సి వచ్చింది. అల్జీమర్స్ గురించి తాము చదివిన 300 వ్యాసాలలో నిరుపయోగమైన, తప్పుదారి పట్టించే సమాచారమే ఎక్కువగా ఉందట. పైగా వాటిలో దాదాపు ఐదో వంతు వెబ్‌సైట్లు ఏదో ఒక ఉత్పత్తిని ప్రచారం చేసేందుకే ప్రాధాన్యతని ఇచ్చాయట. సదరు ఉత్పత్తులను వాడితే అల్జీమర్స్ నయమైపోతుందనీ, అలా నయమవుతుందన్న హామీ ఇస్తామనీ సదరు వెబ్‌సైట్లు ఊదరగొట్టేశాయి. కెనడాలోని దాదాపు 80 శాతం మంది అల్జీమర్స్ రోగులు ఇలాంటి సమాచారం మీద ఆధారపడే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే రోగులలో ఇలాంటి సమాచారం లేనిపోని ఆశలను కల్పిస్తుంది. ఫలితంగా తమ వ్యక్తిగత వైద్యుల సలహాలను పెడచెవిన పెట్టి ఈ ఉత్పత్తులను వాడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. తప్పుడు సమాచారం, పనికిమాలిన ఉత్పత్తుల వల్ల రోగులకు తమ వ్యాధి నుంచి ఉపశమనం కలుగకపోగా... ఆరోగ్యమూ, డబ్బూ చేజారిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.     ఆన్‌లైన్‌లో అనర్థాలు ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారం, ఉత్పత్తుల సంగతి అలా ఉంటే... ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇచ్చేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే నేరుగా ఒక వైద్యుని సంప్రదించినప్పుడు చేసే రోగ నిర్ధరణకీ, ఆన్‌లైన్‌లో పారేసే సలహాకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. మన అలవాట్లు, గతంలో తీసుకున్న చికిత్సలు, శరీర నిర్మాణం, వంశపారంపర్య వ్యాధులు, ఇతరత్రా సమస్యలు, రక్తపోటు వంటి అనారోగ్యాలు... ఇన్నింటిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తగిన పరీక్షలను నిర్వహించి వైద్యలు ఒక సలహాను కానీ చికిత్సా విధానాన్ని కానీ సూచిస్తారు. ఎలాంటి వ్యక్తిగత పర్యవేక్షణా లేకుండా ఈ ఉత్పత్తి వాడితే మీరు సన్నబడిపోతారనో, ఈ తిండి తింటే మీ రక్తపోటు మాయం అయిపోతుందనో చెప్పే సలహాలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అందులోనూ వ్యాపార ధోరణితో ఇచ్చే సలహాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.     గూగుల్‌లో వెతికితే దొరకని విజ్ఞానమంటూ ఉండకపోవచ్చు. కానీ అది ఓ ప్రవాహం అనీ... దానికి అడ్డూ అదుపూ, మంచీచెడూ విచక్షణ తక్కువగా ఉంటుందని తెలిసిన రోజున ఎటువంటి సమాచారాన్నైనా ఆచితూచి ఉపయోగించుకునే విచక్షణ కలుగుతుంది. లేకపోతే ఆ ప్రవాహంతో పాటే మనమూ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. - నిర్జర.