ఓడిపోయే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు!

  ఈ ఎన్నికలలో తెలంగాణలో గ్యారెంటీగా ఓడిపోయేవారికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తోందట. ఈ మాట అంటోంది వేరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళా కార్యకర్తలు. వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు అన్యాయం చేసిందని వాళ్లు పేర్కొన్నారు. అధిష్ఠానం ఎంపిక చేసిన చాలామంది అభ్యర్థులు ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయేవారేనని జోస్యం చెప్పారు. ఎవరికి గెలిచే సత్తా లేదో వాళ్ళనే వెతికిమరీ ఎంపిక చేసినట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ఎంతమాత్రం న్యాయం చేయలేదని వారు అన్నారు.

అమెరికా కేసు : సోనియా కుంటి సాకు

  సిక్కుల ఊచకోతకి సంబంధించి అమెరికా కోర్టు సోనియాగాంధీని నిను వీడని నీడను నేనే అన్నట్టు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు సోనియాగాంధీ పీకకి తాచుపాములా చుట్టుకుంది. ఎప్పుడు సోనియా సదరు పాము కాటుకి గురవుతుందో అర్థంకానట్టుంది. ఆమధ్య సోనియా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమెకు ఈ కేసుకు సంబంధించిన నోటీసులను అమెరికా ప్రభుత్వం జారీ చేసింది. వాటిని సోనియా లక్ష్యపెట్టకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా సోనియాని తన పాస్ పోర్ట్ కాపీ తమకు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సోనియమ్మ చాలా అతి తెలివిగా స్పందించింది. తన పాస్ పోర్ట్ కాపీ చాలా సీక్రెట్‌గా వుంచాల్సిన అవసరం వుందని, తన పాస్ పోర్ట్ వివరాలు బయటపడితే తనకు రక్షణకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుందని కుంటిసాకు చెబుతూ అమెరికా నోటీసులకు జవాబిచ్చింది. వీపు మీద కొడితే పళ్ళు రాలతాయన్నట్టు తన పాస్ పోర్ట్ కాపీ అమెరికాకి ఇస్తే సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు ఎందుకొస్తాయో సోనియానే చెప్పాలి. మొత్తమ్మీద ఈ ఇటాలియన్ బామ్మకి చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాగానే వున్నాయి.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: శంకర్రావు

  ఈసారి ఎన్నికలలో తాను ఇండిపెండెంట్‌గా కంటోన్మెంట్ నియోజకవర్గం బరిలో నిలువనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.శంకరరావు ప్రకటించారు. వివాదాస్పద వ్యక్తిగా నిలిచిన శంకర్రావుకు ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఎంత బాగా సోనియాగాంధీ భజన చేసిన శంకర్రావు పప్పులు ఉడకలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శంకర్రావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. పొన్నాల టిక్కెట్లను అమ్ముకుని తనకు టిక్కెట్ రాకుండా చేశాడని విరుచుకుపడ్డాడు. కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లో టిక్కెట్ల పంపిణీ వ్యవహారం జరగడంతో తనకు ఈసారి టిక్కెట్ రాలేదని శంకర్రావు వాపోతూ చెప్పాడు. టీ కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపు మీద సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కామెడీ డిమాండ్ చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వీర విధేయుడినని, కాంగ్రెస్ పార్టీని వీడిపోనని ఆయన ప్రకటించాడు. కాకపోతే ఈసారి ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు శంకర్రావు వెల్లడించాడు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై తాను అలుపులేని పోరాటం చేసినందునే తనమీదక కక్షకట్టినవాళ్ళు తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

బిక్షపతిని గెంటేశారు!

  టీఆర్ఎస్‌లో కొత్తగా చేరిన కొండా సురేఖ దంపతులు పార్టీ మీద తమ ప్రభావం చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టిన సురేఖ అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్ఎస్‌లో చేరడమే ఒక వింత. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా డోన్ట్ కేర్ అన్నట్టుగా వున్న కొండా సురేఖ దంపతులు పార్టీ మీద పట్టు బిగిస్తున్నారు. ఏ స్థాయిలో పట్టు బిగించారంటే, వాళ్లిద్దరికీ టీఆర్ఎస్ నుంచి సీటు కన్ఫమ్ చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీలో తమకు ఇష్టంలేని వారిని దెబ్బతీసేంత స్థాయిలో పట్టు బిగించారు. వరంగల్ జిల్లాలో మంచి బలమున్న నాయకులైన వీరిద్దరికీ పరకాల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిక్షపతి అంటే పడదు. అతనికి టిక్కెట్ రానివ్వకుండా చేయాలని, ఆ స్థానంలో తమకు చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోవాలని కొండా సురేఖ దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేసి సకెస్స్ అయ్యారు. ఏ తప్పూ చేయని నాకెందుకీ శిక్ష అని బిక్షపతి కేసీఆర్ దగ్గర లబోదిబో అన్నా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తమ్మీద బిక్షపతిని పరకాల అసెంబ్లీ స్థానం నుంచి బయటకి గెంటేసినట్టే. కొత్తగా బయటి నుంచి వచ్చిన వారి కోసం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వున్నవారికి అన్యాయం చేయడం ఏం న్యాయమో కేసీఆరే చెప్పాలని టీఆర్ఎస్‌లో ఒక వర్గం వాపోతోంది.

‘ఎక్స్ పీ’ వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్!

  కంప్యూటర్ వినియోగదారులకు గత 13 సంవత్సరాలుగా మంచి ఎక్స్ పీరియన్స్‌ గా మిగిలిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ ఎక్స్ పీ’ ఈరోజు ఎక్స్ పెయిర్ కాబోతోంది. అంటే ఈరోజుతో ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి విండోస్ సంస్థ తన సపోర్ట్ నిలిపివేయనుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పీ ఓఎస్ వినియోగిస్తున్న అనేక కోట్ల కంప్యూటర్లు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికీ ఎక్స్ పీ నుంచి తప్పుకోకుండా ఈ ఓఎస్ నే వినియోగిస్తున్న అనేక సంస్థలు సమస్యల్లో పడే ప్రమాదం వుంది. ఎక్స్ పీకి విండోస్ సపోర్ట్ నిలిపివేయడం వల్ల ఎక్స్ పీ వినియోగం మన కంప్యూటర్లకు, మన డేటాకి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అంచేత లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి మారిపోవడం మంచింది.

కేజ్రీవాల్ చెంప మళ్ళీ పగిలింది!

  ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చెంప మరోసారి పగిలింది. మొన్నీమధ్యే ఢిల్లీలో ప్రచారంలో వున్న కేజ్రీవాల్‌ని ఒక వ్యక్తి చెంపమీద లాగిపెట్టి కొట్టాడు. ఆ వ్యక్తిని ఆమ్ ఆద్మీ కార్యకర్తలు చావబాదారు. మంగళవారం నాడు ఢిల్లీలో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌ చెంప మీద ఒక ఆటో డ్రైవర్ లాగిపెట్టి కొట్టాడు. కేజ్రీవాల్‌కి మొదటి నుంచి ఇలాంటి అవమానాలు జరుగుతూనే వున్నాయి. గతంలో కేజ్రీవాల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారు. వారిలో కేజ్రీవాల్ మీద పెరిగిన ఆగ్రహమే ఇలా అవమానాల రూపంలో బయట పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రామ‘చంద్రుడు’ ఇతడూ...

      ఒకవైపు బీజేపీతో తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంది. మరోవైపు ఈరోజు శ్రీరామనవమి. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని శ్రీరాముడితో పోలుస్తూ మురిసిపోతున్నారు. ఆ పోలికలిలా వున్నాయి...   రాముడు క్రమశిక్షణ కలిగిన ఆదర్శపురుషుడు. చంద్రబాబు కూడా అలాగే డిసిప్లిన్‌కి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. నాయకులు ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి. రాముడు పీతాంబరధారం. చంద్రబాబు పచ్చ వస్త్రధారి. తండ్రి మాటకు కట్టుబడి రాముడు అరణ్యవాసం చేశాడు. ప్రజల తీర్పుకు కట్టుబడి చంద్రబాబు సమర్థమైన ప్రతిపక్షాన్ని నడిపారు. రాముడి లక్ష్యం రావణ సంహారం. చంద్రబాబు లక్ష్యం కాంగ్రెస్ సంహారం. రాముడి లక్ష్య సాధనకు వానరసేన అండగా నిలిచింది. చంద్రబాబు లక్ష్య సాధనకు బీజేపీ వానరసేన అండగా నిలుస్తోంది

కాంగ్రెస్ లిస్టులో పాయింట్లివి..

      కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన లిస్టులో ఆసక్తికరంగా వున్న అంశాలివి. మొత్తం 119 స్థానాలకు గాను 111 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా 42 మందికి మళ్ళీ సీట్లు దక్కాయి. ఏడుగురికి సీట్లు దక్కలేదు. అందులో ఓవర్ యాక్షన్ చేసినందుకు శంకర్రావుకి, అనారోగ్య కారణాల వల్ల టి.మణెమ్మకి, కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినందు వల్ల సబితా ఇంద్రారెడ్డికి టిక్కట్లు ఇవ్వలేదు. మిగతా సీట్లు పొత్తుల్లో పోయాయి.   కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే పాలసీని కాంగ్రెస్ పాటించింది. రెడ్యానాయక్, రాంరెడ్డి సోదరులకు మాత్రం మినహాయింపు లభించింది. అనేకమంది నాయకుల వారసులకు మొండిచెయ్యి చూపించింది. నాయకులు ఎంత మొత్తుకున్న ఒక కుటుంబంలో మరో వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదు. 8 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. రెడ్డి కులస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. లిస్టులో మొత్తం 47 మంది అగ్ర కులాలకు చెందినవారు వున్నారు. 32 మంది వెనుకబడిన కులాలకు చెందినవారున్నారు. 18 ఎస్సీ, 8 ఎస్టీ అభ్యర్థులున్నారు. టీ జేఏసీని ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా టిక్కెట్లు ఇవ్వలేదు. ఉద్యమంలో పాల్గొన్న గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న టిక్కెట్లు వస్తాయని ప్రచారం చేసిన కాంగ్రెస్ చివరికి వాళ్ళకి మొండిచెయ్యి చూపించింది.

శంకరన్న తిక్క కుదిరింది

      కంటోన్మెంట్ శాసనసభ్యుడు శంకర్రావు తిక్క కుదిరింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన శాసనసభ అభ్యర్థుల జాబితాలో శంకర్రావుకి స్థానం లేకుండా పోయింది. ఇంతకాలం శంకర్రావు చేసిన ఓవర్ యాక్షన్‌కి తగిన ఫలితం లభించింది. సోనియాగాంధీకి గుడి కట్టించినా, సోనియా రాహుల్ భజన నిర్విరామంగా చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు బతిమాలుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ వినిపించుకోలేదు. తనకు గానీ, తన కూతురికి గానీ టిక్కెట్ వచ్చేలా చేయమని తన బావమరుదులు, వీ బ్రదర్స్ అయిన వినోద్, వివేక్‌లను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. శంకర్రావు ఇప్పుడు సోనియమ్మని దేవత అంటాడో, దయ్యం అంటాడో చూడాలి. తాను కట్టించిన సోనియా గుడిని అలాగే వుంచి పూజలు చేస్తాడో, మొత్తం గుడినే కూల్చేస్తాడో వేచి చూడాలి.

ఇద్దరికీ బ్యాండ్ పడింది!

      ఇద్దరు తెలంగాణ నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. వారికి భారీ స్థాయిలో బ్యాండ్ పడింది. ఇటు ఇంటికూటికి, అడు బంతి కూటికి చెడ్డట్టు అయింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ శాసనసభ్యులు ఆకుల రాజేందర్‌కి అకస్మాత్తుగా బుర్ర తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయాడు. రాజేందర్‌కి మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ రావడంలో ఎలాంటి సమస్య లేదు. అయినా రాజేందర్ టీఆర్ఎస్ పంచన చేరాడు. టీఆర్ఎస్‌లో ఓ వారం రోజులు వున్న తర్వాత తనను మందకృష్ణ చంపుతానంటున్నాడని, రాజకీయాల్లో వుండనని హడావిడి చేశాడు. ఈయన పరిస్థితి ఇలా వుంటే టీడీపీలో బలమైన నాయకుడిగా వున్న మైనంపల్లి హనుమంతరావు తనకు మల్కాజ్‌గిరి స్థానం ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి టిక్కెట్ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ నుంచి హామీ కూడా పొందాడు. ఇంతలో ఆకుల రాజేందర్ తనకు జ్ఞానోదయం కలిగిందంటూ సోమవారం నాడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దర్లో మల్కాజ్‌గిరి స్థానం ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదో ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దర్నీ కాదని నందికంటి శ్రీధర్ అనే వ్యక్తికి ఆ స్థానం కేటాయించేసింది. దీంతో ఆకుల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరికీ జాయింట్‌గా బ్యాండ్ పడింది.

టీఆర్ఎస్ మూడో జాబితా

      టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మూడో జాబితాని విడుదల చేసింది. 8 ఎంపీ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తూ వుండగా, కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలోకి దిగుతున్నారు.   లోక్‌సభ అభ్యర్థులు.. మెదక్ - కేసీఆర్, పెద్దపల్లి - బాల్క సుమన్, జహీరాబాద్ - బీవీ పాటిల్, నిజామాబాద్ - కవిత, ఆదిలాబాద్ - నగేష్, హైదరాబాద్ - రషీద్ అలీ, మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఖమ్మం - బుడాన్ బేగ్‌షేక్. అసెంబ్లీ అభ్యర్థులు.. ఉప్పల్ - బేతి సుభాష్‌రెడ్డి, మలక్‌పేట్ - సతీష్ యాదవ్, చార్మినార్ - ఇనాయత్ అలీ, అంబర్‌పేట్ - ఎడ్ల సుధాకర్‌రెడ్డి, సనత్‌నగర్ - దండె విఠల్, యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ, ఎల్బీనగర్ - ఎం. రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్ - కొలను హన్మంత్‌రెడ్డి, ఖైరతాబాద్ - మన్నే గోవర్థన్‌రెడ్డి, కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్, గోషామహల్ - ప్రేమ్‌కుమార్‌దూత్, కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు, మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి, ఖమ్మం - జి. కష్ణ, వైరా - చంద్రావతి, పినపాక - శంకర్‌నాయక్, మధిర - బొమ్మెర రాంమూర్తి, నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా, మంచిర్యాల - దివాకర్‌రావు, నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి, కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి, ఆశ్వరావుపేట - ఎ. ఆదినారాయణ.

తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు

        రెండు రోజుల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయం 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.   జాబితా ఇలా ఉంది... జనగాం...పొన్నాల లక్ష్మయ్య, ఆందోల్...దామోదర రాజనరసింహ, మెదక్...విజయశాంతి, నిజామాబాద్ రూరల్... డి.శ్రీనివాస్, గజ్వేల్...నర్సారెడ్డి, సికిందరాబాద్... జయసుధ, సిర్పూర్...ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు... జి.వినోద్, మంచిర్యాల...గడ్డం అరవింద్ రెడ్డి, అసిఫాబా ద్... ఆత్రం సక్కు..., బోధ్...అనిల్, నిర్మల్...మహేశ్వర్ రెడ్డి, బోధన్...సుదర్శన్‌రెడ్డి,కామారెడ్డి...షబ్బీర్ అలీ, జుక్కల్...గంగారాం, కోరుట్ల... కొమిరెడ్డి రాములు, జగిత్యాల...జీవన్‌రెడ్డి, అంబర్‌పేట... వి.హనుమంతరావు, సనత్‌నగర్...మర్రి శశిధర్ రెడ్డి, నారాయణ పేట...వి.కృష్ణ, కొడంగల్...విఠల్‌రావు, జడ్చర్ల...మల్లు రవి, దేవరకద్ర...పవన్‌కుమార్, గద్వాల...డీకేఅరుణ, మక్తల్... రామ్మోహన్‌రెడ్డి, వనపర్తి...జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్...దామోదర్ రెడ్డి, అలంపురం.. సంపత్‌కుమార్, అచ్చంపేట...వంశీకృష్ణ, కల్వకుర్తి...వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్...ప్రతాపరెడ్డి, హుజూర్‌నగర్...ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మిర్యాలగూడ...భాస్కరరావు, ఆదిలాబాద్...భార్గవ్ దేశ్‌పాండే, నిజామాబాద్ అర్బన్...సురేశ్ గౌడ్, సంగారెడ్డి..జగ్గారెడ్డి, ఎల్బీనగర్...సురేశ్‌రెడ్డి, కుత్బు ల్లాపూర్... కూన శ్రీశైలం గౌడ్, ఉప్పల్...కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,బాన్స్‌వాడ..బాల్‌రాజ్, పరిగి...రామ్మోహన్, ఎల్లారెడ్డి... వేదుల సురేంద్ర, ఇబ్రహీంపట్నం...మల్లేశ్, సిరిసిల్ల... కె.రవీంద్రరావు..., గోషామహల్...ముఖేశ్ గౌడ్, ఖానాపూర్... అజ్మీర్ హరినాయక్, వేములవాడ...బొమ్మ వెంకన్న, జూబ్లీ హిల్స్...విష్ణువర్ధన్‌రెడ్డి, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, ముథోల్... విఠల్‌రెడ్డి, చార్మినార్...వెంకటేశ్, బహదూర్‌పురా...అబ్దుల్ నమి, మహబూబ్‌నగర్...ఒబేదుల్లా కొత్వాల్, యాకుత్‌పురా...సదానంద్ ముదిరాజ్, కంటోన్మెంట్...క్రిశాంత్, కొల్లాపురం...హర్షవర్ధన్‌రెడ్డి, సూర్యాపేట...ఆర్.దామోదర్ రెడ్డి, నకికేకల్...చిరుమర్తి లింగయ్య, స్టేషన్ ఘనపూర్...విజయరామారావు, వర్దన్నపేట్...శ్రీధర్, పరకాల...వెంకట్రామిరెడ్డి..., భూపాలపల్లి...గండ్ర వెంకటర మణారెడ్డి, ఖమ్మం...పువ్వాడ అజయ్, భద్రాచలం...కుంజా సత్యవతి, చొప్పదండి...సుద్దాల దేవయ్య, ఆర్మూర్... కేఆర్‌సురేశ్‌రెడ్డి, రామగుండం...సలీం పాషా, మంథని.. డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి భానుప్రసాదరావు, కుత్బుల్లాపూర్...కూన శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి...భిక్షపతి యాదవ్, వికారాబాద్...గడ్డం ప్రసాద్, నారాయణ్ ఖేడ్...పి.కిష్టారెడ్డి, జహీరాబాద్...జె.గీతారెడ్డి, మల్కాజిగిరి...నందికంటి శ్రీధర్, ఎల్బీనగర్..డి.సుధీర్‌రెడ్డి, తాండూరు...నారాయణరావు..., ఖైరతాబాద్...దానం నాగేందర్, నాంపల్లి...వినోద్‌కుమార్, చాంద్రాయణ గుట్ట...అశ్విన్‌రెడ్డి, ములుగు...వీరయ్య..., మధిర...మల్లు భట్టి విక్రమార్క, నర్సాపూర్...సునీతా లక్ష్మారెడ్డి.., దుబ్బాక...ముత్యంరెడ్డి, రాజేంద్రనగర్..జ్ఞానేశ్వర్..., నాంపల్లి... వినోద్‌కుమార్, కార్వాన్...రూప్‌సింగ్, నాగార్జునసాగర్... కె.జానారెడ్డి, నల్లగొండ...కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డోర్నకల్... విద్యానాయక్, వరంగల్ వెస్ట్ స్వర్ణ..., ఈస్ట్...బస్వరాజు సారయ్య, సత్తుపల్లి...సంభాని చంద్రశేఖర్, మానకొండూరు...ఆరెపల్లి మోహన్, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, దేవరకద్ర...పవన్‌కుమార్.

కేజ్రీవాల్ నోటి దురద

      ఈసారి ఎన్నికలలో తనకి, తన పార్టీకి అంత సీన్ లేదని అర్థం కావడంతోపాటు ఎక్కడకి వెళ్ళినా నిరసనలు, అవమానాలు ఎదురవుతూ వుండటంతో అరవింద్ కేజ్రీవాల్‌కి అయోమకంగా వున్నట్టుంది. తిరిగేకాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. ఆమ్ ఆద్మీ పార్టికి ఓట్లేయండంటూ అడగడానికి ఢిల్లీలోని గల్లీగల్లీలో తిరుగుతున్న కేజ్రీవాల్ కాళ్ళు హ్యాపీగా వున్నాయి. అయితే ఎవరో ఒకర్ని తిట్టందే ఊరుకోని నోరు మాత్రం సందర్భం కోసం ఎదురుచూస్తూ వుంటుంది. అందుకే కేజ్రీవాల్ వీలు దొరికితే తన నోటి దురద తీర్చుకుంటూ వుంటారు. సోమవారం ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనం నుంచి తప్పించుకని పారిపోవడానికి తానేమీ ఎవరి కూతుర్నీ లేవదీసుకుని పోలేదని అన్నారు. విద్యావంతుడు, సంస్కారవంతుడని కేజ్రీవాల్‌ విషయంలో కొంతమందికి వున్న భ్రమలు ఈ వ్యాఖ్యలతో తేలిపోయాయి. రాజకీయ పరంగా ఘాటైన విమర్శలు చేయవచ్చుగానీ, మరీ నేలబారు తరహాగా మాట్లాడ్డం కేజ్రీవాల్ లాంటి వ్యక్తికి తగదని పలువురు అంటున్నారు.

కట్టు తప్పుతున్న బీజేపీ క్యాడర్!

      కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీ. పార్టీ అగ్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పైనుంచి కింది వరకు అన్ని శ్రేణుల్లోని నాయకులు క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తారు. అయితే కాంగ్రెస్‌ని వ్యతిరేకించీ వ్యతిరేకించీ బీజేపీ కార్యకర్తలు కొన్ని కాంగ్రెస్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నట్టు వున్నారు. అది కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని కార్యకర్తలు. తెలుగుదేశంతో భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకత్వం ఎన్నిక పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణలో వున్న స్థానిక నాయకత్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.   కొంతమంది ధర్నాలు గట్రాలు చేస్తే, మరికొందరు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. తెలుగుదేశంతో పొత్తు తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తూ వుంటే, తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ, అగ్ర నాయకత్వం నిర్ణయాన్నే ప్రశ్నిస్తోంది. ఈ వర్గం వెనుక వున్నది బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డే అన్నది బహిరంగ రహస్యమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు కుదిరితే రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఇన్ఫీరియార్టీ కిషన్ రెడ్డిలో మొదటి నుంచీ కనిపిస్తోంది. అందువల్లే తెదేపాతో పొత్తును కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకించేలా కిషన్‌రెడ్డి కీ ఇచ్చి వదిలారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తల నుంచి ఎదురైన ప్రతిఘటనను, క్రమశిక్షణా రాహిత్యాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలలను అంతం చేయడానికి, మోడీని ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ అగ్ర నాయకత్వ నానా తంటాలూ పడుతూ వుంటే జనంలో పార్టీ చులకన అయ్యేలా కట్టు తప్పి వ్యవహరిస్తున్న వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మోడీ గొంతుకి ఏమైంది?

      భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గొంతు బొంగురుపోయింది. ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి నరేంద్ర మోడీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే వున్నారు. రోజుకి అయిదారు బహిరంగ సభల్లో మాట్లాడుతూనే వున్నారు. ఇంకా పార్టీ మీటింగ్స్ లో, తనను కలవటానికి వచ్చేవారితో మాట్లాడ్డం అదనం. సోమవారం నాడు బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ మాట్లాడినప్పుడు ఆయన గొంతు బొంగురుపోయి వినిపించింది. మాట్లాడేది నరేంద్ర మోడీయేనా అనిపించేలా ఆయన గొంతు మారిపోయింది. ఎన్నికల ప్రచారం మరింత వేడి పుంజుకుంటున్న సమయంలో మోడీ గొంతు బొంగురుపోతూ వుండటం పట్ల భాజపా శ్రేణులు కలవరపడుతున్నాయి. మోడీ గొంతులోంచి వచ్చే తూటాల్లాంటి మాటల ప్రభావం గొంతు పాడవటం వల్ల తగ్గిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. మోడీ దీని నివారణకు తగిన వైద్య సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నారు.

టీడీపీ ఫస్ట్ లిస్ట్

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభలకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలోని కొంతమందికి న్యాయం జరగలేదని, వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితా ఇదే..   టీ.టీడీపీ అభ్యర్ధులు వీరే... బాన్సువాడ- రెడ్యానాయక్‌ బాల్కొండ- ఏలేటి మల్లికార్జునరెడ్డి బోధన్‌- ప్రకాశ్‌రెడ్డి జగిత్యాల- ఎల్‌.రమణ మంథని- కర్రు నాగయ్య పెద్దపల్లి- విజయరమణారావు మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ నారాయణఖేడ్‌-విజయపాల్‌రెడ్డి జహీరాబాద్‌- నరోత్తమ్‌ గజ్వేల్‌- ప్రతాప్‌రెడ్డి కూకట్‌పల్లి- మాధవరపు కృష్ణారావు ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి రాజేంద్రనగర్‌- ప్రకాశ్‌గౌడ్‌ తాండూరు- ఎం.నరేష్‌ సనత్‌నగర్‌- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చాంద్రాయణగుట్ట- ప్రకాశ్‌ ముదిరాజ్‌ అచ్చంపేట- పి.రాములు దేవరకొండ- బిల్యా నాయక్‌ మిర్యాలగూడ- వెంకటేశ్వర్లు హుజూర్‌నగర్‌- వంగాల స్వామిగౌడ్‌ సూర్యాపేట- పటేల్‌ రమేష్‌రెడ్డి భువనగిరి- ఉమామాధవరెడ్డి మహబూబాబాద్‌- బాలూచౌహాన్‌ నర్సంపేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల- చల్లా ధర్మారెడ్డి ములుగు- ధనసరి అనసూయ(సీతక్క) టీ.టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు: ఆదిలాబాద్- రమేష్‌రాథోడ్‌ జహీరాబాద్‌- మదన్‌మోహన్‌రావు మహబూబాబాద్‌- బానోతు మోహన్‌లాల్‌

టీఆర్ఎస్ టిక్కెట్: పైసలుంటే చాలు భై!

      టీఆర్ఎస్‌లో టిక్కెట్ కావాలంటే పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినవాళ్ళు, త్యాగాలు చేసినవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదని, బాగా డబ్బుండాలి, లేదా వేరే పార్టీకి చెంది వుండాలని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. కేసీఆర్ విడుదల చేసిన మొదటి, రెండు లిస్టులను చూసి కడుపు మండిన తెరాస నాయకులు సొంత పార్టీ మీద, పార్టీ నాయకుడు కేసీఆర్ మీద గుర్రుగా వున్నారు. కేసీఆర్ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ సగానికి పైగా పార్టీకి చెందని వారు, బాగా డబ్బుండి సడెన్‌గా ఊడిపడినవారే వున్నారని  విమర్శిస్తున్నారు. డబ్బులుంటే చాలు సీటు ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్‌కి రావడం బాధాకరమని అంటున్నారు. పార్టీ కోసం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీని అభివృద్ధి చేయడానికి నిద్రాహారాలు మాని కృషి చేసిన వారికి మొండిచెయ్యి చూపించారని విమర్శిస్తున్నారు. ఇలా మోసం చేసిన పార్టీకి ఈ ఎన్నికలలో సహకరించడానికి మనసు రావడం లేదని అంటున్నారు.