Read more!

బిక్షపతిని గెంటేశారు!

 

టీఆర్ఎస్‌లో కొత్తగా చేరిన కొండా సురేఖ దంపతులు పార్టీ మీద తమ ప్రభావం చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టిన సురేఖ అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్ఎస్‌లో చేరడమే ఒక వింత. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా డోన్ట్ కేర్ అన్నట్టుగా వున్న కొండా సురేఖ దంపతులు పార్టీ మీద పట్టు బిగిస్తున్నారు. ఏ స్థాయిలో పట్టు బిగించారంటే, వాళ్లిద్దరికీ టీఆర్ఎస్ నుంచి సీటు కన్ఫమ్ చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీలో తమకు ఇష్టంలేని వారిని దెబ్బతీసేంత స్థాయిలో పట్టు బిగించారు. వరంగల్ జిల్లాలో మంచి బలమున్న నాయకులైన వీరిద్దరికీ పరకాల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిక్షపతి అంటే పడదు. అతనికి టిక్కెట్ రానివ్వకుండా చేయాలని, ఆ స్థానంలో తమకు చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోవాలని కొండా సురేఖ దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేసి సకెస్స్ అయ్యారు. ఏ తప్పూ చేయని నాకెందుకీ శిక్ష అని బిక్షపతి కేసీఆర్ దగ్గర లబోదిబో అన్నా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తమ్మీద బిక్షపతిని పరకాల అసెంబ్లీ స్థానం నుంచి బయటకి గెంటేసినట్టే. కొత్తగా బయటి నుంచి వచ్చిన వారి కోసం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వున్నవారికి అన్యాయం చేయడం ఏం న్యాయమో కేసీఆరే చెప్పాలని టీఆర్ఎస్‌లో ఒక వర్గం వాపోతోంది.