Read more!

ఓడిపోయే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు!

 

ఈ ఎన్నికలలో తెలంగాణలో గ్యారెంటీగా ఓడిపోయేవారికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తోందట. ఈ మాట అంటోంది వేరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళా కార్యకర్తలు. వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు అన్యాయం చేసిందని వాళ్లు పేర్కొన్నారు. అధిష్ఠానం ఎంపిక చేసిన చాలామంది అభ్యర్థులు ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయేవారేనని జోస్యం చెప్పారు. ఎవరికి గెలిచే సత్తా లేదో వాళ్ళనే వెతికిమరీ ఎంపిక చేసినట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ఎంతమాత్రం న్యాయం చేయలేదని వారు అన్నారు.