ఐసిస్ హిట్లిస్ట్లో రామేశ్వరం..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. మన నిఘా, పోలీస్ వ్యవస్థలు అప్రమత్తమై ఐసిస్ కుట్రలను భగ్నం చేశాయి. తాజాగా మరోసారి భారత్పై ఎక్కు పెట్టింది. తమిళనాడులోని రామేశ్వరంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రపన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 2008 తరహాలో పలు రాష్ట్రాల్లోని 180 ఓడరేవులను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపాయి. రామేశ్వరంలోని ఓడరేవు, పాంబన్ వంతెనపై దాడులు జరగవచ్చని హెచ్చరించడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు జలాశయాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.