ఇక్కడ ఆఫీసులు పెట్టాలంటే వాచీపోయిద్దీ..!

ఆఫీస్..ఎలాంటి సంస్థకైనా గుండెకాయ లాంటిది. మొత్తం వ్యవస్థనే నియంత్రించే సత్తా ఆఫీసులకే సొంతం. అలాంటి ఆఫీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..సామాన్యులు కూడా త్వరగా వచ్చేందుకు సౌకర్యంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఎలాంటి రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే కార్పోరేట్ సంస్థలు లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ కార్యాలయాలను అందరికి పరిచయమున్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్యాలయ స్థలాలపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్ కన్సల్‌టెంట్ సంస్థ సీబీఆర్‌ఈ సర్వే చేసింది. దీని ప్రకారం హాంకాంగ్ సెంట్రల్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వస్తే ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ఏడవ స్థానంలో నిలిచింది. గతేడాది ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి ఏడాది అద్దె 149.71 డాలర్లు (మన కరెన్సీలో రూ.10,000 డాలర్లు). ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ 19వ స్థానంలోనూ, నారిమన్ పాయింట్ 34వ స్థానంలోనూ నిలిచాయి. ఖరీదైనా కార్యాలయ స్థలాలు ఇవే: 1. సెంట్రల్                      హాంకాంగ్ 2. సెంట్రల్ (వెస్ట్ ఎండ్)        లండన్ 3. ఫైనాన్స్ స్ట్రీట్                 బీజింగ్ 4. సెంట్రల్ బిజినెస్ డిస్ట్        బీజింగ్ 5. వెస్ట్ కౌలూన్                 హాంకాంగ్ 6. మరునౌచి, ఒటెమాచి       టోక్యో 7. కనాట్ ప్లేస్                    ఢిల్లీ 8. సెంట్రల్ (సిటీ)                 లండన్ 9. మిడ్‌టౌన్ మన్‌హట్టన్       న్యూయార్క్ 10. పుడాంగ్                     షాంఘై

రాహుల్ కాదు.. ప్రియాంక కాదు.. సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్..?

  ఉత్తర ప్రదేశ్ లో ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందు రాహుల్ ను నిలబెట్టాలని చూసినా.. ఆతరువాత రాహుల్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ నేతలు మొత్తుకోవడంతో ప్రియాంక గాంధీ తెరపైకి తీసుకువచ్చారు. ప్రియాంక గాంధీ అయితే  గెలిపు వరిస్తుందని.. యూపీ నుండి సీఎం అభ్యర్ధిగా ప్రియాంకానే దాదాపుగా బరిలోకి దింపుతారని అనుకున్నాం. కానీ అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాకుండా.. మరో పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు షీలా దీక్షిత్. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం  షీలా దీక్షిత్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందుకున్న ఆమె, నేడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి ఆఖరకి ఎవరూ బరిలో దిగుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

భారత్ మా మద్దతు ఓకే.. పాక్ కు కూడా ఇవ్వండి.. టర్కీ

  భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడానికి అగ్రరాజ్యమైన అమెరికా తన మద్దతు ఇవ్వగా.. చైనా మాత్రం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో పెద్ద దేశమైన న్యూజిలాండ్ కూడా భారత్ కు తన మద్దతు తెలిపింది. ముందు ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తన వైఖరి మార్చుకొని భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై మద్దతు తెలిపింది.   ఇక అప్పటి వరకూ సైలెంట్ గా ఉండి ఎప్పుడైతే భారత్ ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుందని తెలుసుకుందో..  పాక్ అప్పుడు మేల్కొని తనకు కూడా సభ్యత్వం కావాలని ధరఖాస్తు చేసుకుంది. అయితే పాక్ కు టర్కీ మద్దతు తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది టర్కీ. ముందు భారత్ కు మద్దతు ఇవ్వడానికి మద్దతు తెలుపని టర్కీ.. ఆతరువాత భారత్ కు తన మద్దతు ఓకే కానీ.. పాక్ కు పాక్ కు కూడా సభ్యత్వమివ్వాల్సిందేనని మెలిక పెట్టింది. మరి ఏం జరుగుతుందో ఈ నెల 20న సీయోల్ ప్రారంభం కానున్న కూటమి భేటీలో తెలుస్తోంది.

పక్షుల ఫొటోకు.. ఓర్లాండో ఘటనకు సంబంధం ఏంటి..?

  ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తుంది. ఏముంది గాల్లో తేలుతున్న పక్షులను ఫొటో తీశారు అని అనుకుంటారు. అయితే ఈ ఫొటోకి ఓర్లాండో ఘటనకు సంబంధం ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఫొటోకి, ఘటనకు సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఒమర్ మతీన్ అనే వ్యక్తి కాల్పులు జరిపి 49మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారందరికి ఒకచోట చేర్చి వారికి నివాళులు అర్పిస్తుండగా.. అదే సమయంలో ఆకాశంలో ఒకేసారి పక్షులు ఎగరడం కనిపించాయి ఓ ఫొటోగ్రాఫర్ కు. అంతే ఆ అద్భుతాన్ని తన కెమెరాలో బంధించేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చనిపోయింది 49 మంది కాగా.. పక్షుల సంఖ్య కూడా 49 రావడం. ఈ విషయాన్ని ప్రసారం చేశారు కూడా. అయితే తన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచాల‌ని కోరింది. మొత్తానికి యాదృచ్ఛికంగా జరిగినా..సరిగ్గా 49 పక్షులే ఉండటం ఎంతైనా అద్భుతమే.

ఒక్క సెల్ఫీ.. చిక్కుల్లో టాప్ మోస్ట్ నక్సల్...

  సెల్పీ వల్ల ప్రాణాలు కోల్పోవడం లాంటి చెడు పరిణామాలు ఎదురవుతున్నా.. ఈమధ్య ఈ సెల్ఫీల వల్ల కొన్ని మంచి పనులే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యనే సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా.. ఎన్నో రోజులుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న హంతకుడు దొరికిపోయాడు. ఇప్పుడు ఇదే సెల్పీ మోజుతో కొన్ని సంవత్సరాలుగా సవాల్ గా మారిన ఓ మావోయిస్ట్ జాడ తెలిసిపోయింది. టాప్ నక్సల్ చలపతి అలియాస్ అప్పారావు చాలా కాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఈయన సోదరుడు ఆజాద్ గత నెలలో  గ్రేహాండ్స్ చేతిలో హతమైన నేపథ్యంలో ఆయన దగ్గర నుండి ఆయుధాలు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ ను  తెరచి చూడగా చలపతి ఆయన భార్య తీసుకున్న సెల్ఫీ ఫొటో దొరికింది. దీంతో పోలీసులకు చలపతి ఎలా ఉంటాడో అర్ధమైపోయింది. ఇక ఆ జంటను గుర్తించడం సులువేనని వైజాగ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా చలపతి తలపై రూ. 20 లక్షలు, ఆయన భార్య అరుణ తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.

మోడీకి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశ్న.. చిరునవ్వే సమాధానం...

  పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోడీకి తన కోరికను చెప్పారంట.. దానికి మోడీ ఓ చిరునవ్వు నవ్వి సమాధానం ఇచ్చారంట. ఇంతకీ ఆయన కోరిక ఏంటనుకుంటారో.. ఇమ్రాన్ ఖాన్ ఈమధ్య భారత్ పర్యటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీని కలిశారట. ఈ నేపథ్యంలో ఆయన భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ల గురించి మాట్లాడారంట. చాలా కాలంగా భారత్, పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగలేదని, ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని ఖాన్ కోరగా, మోదీ ఎలాంటి సమాధానమూ చెప్పలేదని.. ఒక చిరునవ్వు నవ్వారు అని చెప్పారు. తాను ప్రధానిని కవలడం ఇదే తొలిసారి అని.. ఒకవేళ రెండోసారి కలిసే అవకాశం వస్తే.. భారత విదేశాంగ విధానం అపరిపక్వంగా ఉందని చెబుతాను" అని అన్నారు. మరి ఇమ్రాన్ ఖాన్ కు ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి..

నేను రాజీనామా చేస్తాను... నువ్వు పార్టీ మూస్తావా.. చంద్రబాబు వ్యూహం

  వైసీపీ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నప్పటినుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి స్పందించి జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీని వీడిన నేతలు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించడం సరికాదని భూమా అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా భూమా జగన్ కు ఓ సవాల్ కూడా విసిరారు. తాను, తన కూతురు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిస్తే జగన్ వైసీపీని మూసేస్తారా అని సవాల్ విసిరారు. జగన్‌ పుట్టకముందు నుంచే తాము రాజకీయాల్లో ఉన్నామని.. బ్రిటీష్‌కాలం నుంచే ధనవంతులమని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. అలాంటి తాము ఎలా అమ్ముడుపోతామని ప్రశ్నించారు?   మరోవైపు భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించటం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భూమా నాగిరెడ్డి అయితే రాజీనామా చేసినా మళ్లీ గెలవగల సత్తా ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించారని అనుకుంటున్నారు. అయితే భూమా నాగిరెడ్డి ఒక్కరే రాజీనామా చేస్తారా.. లేక అందరూ రాజీనామా చేస్తారా అన్నది తెలియని విషయం. అంతకన్నా ముందు భూమా సవాల్ జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది చూడాలి.

పాడేరు ఏఎస్పీ మృతి.. ఆత్యహత్యా..?

  పాడేరు ఏఎస్పీ శశికుమార్ ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందారు. ఆయన తన ఛాంబర్లో ఉండగా.. సడెన్ గా తుపాకీ పేలిన శబ్దం రావడంతో మిగిలిన సిబ్బంది వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో ఉన్నారు. తుపాకీ ఆయన తలలోని కుడివైపు కణితిలో నుంచి దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే శశికుమార్ కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ప్రమాదవశాత్తు పేలిందా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.   కాగా శశికుమార్‌ స్వస్థలం తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా. 2012లో ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా విధుల్లో చేరారు. అక్కడి నుంచి జనవరిలో పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు.

వైద్య పరీక్షలకు ఓకే కానీ...ముద్రగడ

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీక్ష చేపట్టి ఈరోజుతో దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఆయన మాత్రం వైద్య పరీక్షలకు అంగీకరించడంలేదు. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే జేఏసీ సభ్యులు పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు ఆయన వైద్యపరీక్షలకు అంగీకరించినట్టు తెలుస్తోంది. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముద్రగడకు వివరించామని, అరెస్టయిన పదిహేడు మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పామని.. దీంతో శరీరంలోకి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు ఆయన అంగీకారం తెలిపారన్నారు. అయితే ఆయన దీక్ష మాత్రం విరమించడానికి ఒప్పుకోవడంలేదని.. అది కొనసాగుతోందని తెలిపారు.

నేను రాజీనామా చేశానని ఎవరన్నారు- మాణిక్యాలరావు

తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ రాజీనామా చేస్తున్నట్టు తాను ముఖ్యమంత్రికి ఫోన్ చేశానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు సొంతనియోజవర్గంలో తాను లేకుండా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు వెలువడ్డాయని, అయితే అవన్నీ ఆవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. రేపు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుస్తానని ఆయన చెప్పారు.

జమ్మూలో పురాతన ఆలయం ధ్వంసం..ఉద్రిక్తత

జమ్మూకాశ్మీర్‌లో ఓ పురాతన ఆలయం ధ్వంసమవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రూప్‌నగర్‌లోని ఓ పురాతన ఆలయంలోకి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ప్రవేశించి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. మూడు వాహనాలను తగులబెట్టారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రూప్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు ఆలయాన్ని ధ్వంసం వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు వివేక్‌, వినోద్‌, భాస్క‌ర్ రావు, జువ్వాడి న‌ర్సింగ్ పలువురు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌కి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటోన్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ భ‌వ‌న్‌కి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌లం ఇప్పుడు 13కు ప‌డిపోయింది.   ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాం.. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై రాష్ట్రానికి అన్యాయం చేశారు అని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పడింది.. తెలంగాణ అభివృద్ది కోసమే నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని.. 2019 లో గెలిచే పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని.. 2019 నాటికి ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.

18 సింహాలు కస్టడీకి.. విచారణ కోసం

  సాధారణంగా నేరం చేసినందుకు నిందితులకు శిక్ష విధిస్తారు. ఎవరు నేరం చేశారో తెలుసుకునేందుకు వారిని విచారిస్తాం. అయితే ఇక్కడ వెరైటీగా సింహాలను విచారించేందుకు వాటిని అదుపులోకి తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదా.. అసలు మ్యాటరేంటంటే.. గుజరాత్ లోని ప్రఖ్యాత గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీలో నివసిస్తోన్న సింహాలు సమీప గ్రామాల్లోని ప్రజలపై దాడులకు పాల్పడి వారిని చంపి తింటున్నాయి. ఇప్పటికి ముగ్గురిని చంపాయి. దీంతో ఆ సింహాన్ని గుర్తించి జీవితఖైదు విధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే.. 18 సింహాలను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యకు పాల్పడింది ఏ సింహమో తెలుసుకునేందుకు వాటికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి వారికి ఆ సింహం దొరుకుతుందో లేదో చూడాలి.

సచివాలయ పనులపై చంద్రబాబు ఆగ్రహం.. అప్పుడు షెడ్డుల్లోనే పని చేశారు..

  ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. తాత్కాలిక సచివాలయం పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పనులు మరింత వేగంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను ఇటీవల వచ్చినప్పుడు నిర్మాణం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఆయన, ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను వేగవంతం చేయాలని సూచించారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. అన్ని విభాగాలు ఇక్కడికి రావాలి.. ఎవరికి మినహాయింపు లేదు..కుటుంబ సమస్యల కన్నా ప్రజాహితం ముఖ్యం అని అన్నారు. కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు షెడ్డుల్లోనే పని చేశారు.. హైదరాబాద్లో ఉండి పని చేయడం సరికాదు.. భవిష్యత్ లో అంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నిద్రరావడం లేదా.. మీకోసం యాప్..

  స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లకి యాప్ప్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల యాప్ప్ వినుంటాం. అయితే ఇప్పుడు మరో యాప్ వచ్చింది. అదేంటనుకుంటున్నారా. నిద్రపుచ్చే యాప్. నిద్రపుచ్చడానికి కూడా యాప్ ఉంటుందా..నిజంగానే నిద్రొస్తుందా అని అనుకుంటున్నారా. వస్తుందనే చెబుతున్నారు. సిమన్‌ ఫ్రేజర్‌’ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకుడు బ్యూడోయిన్‌. నిద్రరాని వారు ఆ సమస్యను అధిగమించేందుకు కెనడాకు చెందిన పరిశోధకులు ఓ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను అభివృద్ధి చేశారు. నిద్రపోవాల్సిన సమయంలో మెదడులో మెదిలే అనవసర ఆలోచనలను దూరం చేసేందుకు సీరియల్‌ డైవర్స్‌ ఇమేజినింగ్‌(ఎస్‌డీఐ) విధానాన్ని ఈ అప్లికేషన్‌లో వాడినట్లు.. మానసిక ప్రశాంతతను ఇచ్చే పదాల రికార్డులను ఈ యాప్‌ ప్లే చేస్తుందని. అందులోని అర్థానికి సంబంధించిన రూపాన్ని మనసులో వూహించేందుకు వీలుగా ఒక పదాన్ని 8 సెకన్లలో చెబుతుంది. ఆ తర్వాత మరో యాధృచ్చిక పదం వస్తుంది. అలా పదాలను వింటూ కొద్ది సేపటికే మానసిక ప్రశాంతత మెరుగుపడి నిద్రలోకి జారుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని యాప్ప్ వస్తాయో..

'ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్'.. తెలంగాణ ఉద్యోగుల ధర్నా..

  ఒకపక్క హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి ఏపీ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిస్తుంటే మరోపక్క ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నా కానీ.. ఉద్యోగులు మాత్రం అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు దీనికి తోడు తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు ధ‌ర్నాకు దిగాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ‌ సెక్ర‌టేరియ‌ట్ లో ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ వారు ర్యాలీ నిర్వహించి, నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వారు ఆంధ్రప్ర‌దేశ్‌లోనే ప‌నిచేయాల‌ని, తెలంగాణ వారు మాత్ర‌మే ఇక్క‌డ విధులు నిర్వ‌హించాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు ఏం చేస్తారో.. ఎలా ముందడుగు వేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.