భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్... ఇంగ్లండ్ బ్యాటింగ్
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ముంబైలో ఆడుతుండటం ఆనందంగా ఉందని... ఇక్కడ తమకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. ఇండియన్ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టాస్ ఓడిపోవడం పెద్ద సమస్య కాదని.. గత మ్యాచ్ లలో ఆడిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా ఆడి, గెలుస్తామని చెప్పాడు.
ఇంగ్లండ్ జట్టు: ఏ.కూక్, జే.జెన్నింగ్స్, జే.రూట్స్, ఎం.అలీ, జే.బెయిర్స్టో, బి.స్టోక్స్, జే.బట్లర్, సి.ఓక్స్, ఏ.రషీద్, జే. బాల్, జే.అండర్సన్
భారత జట్టు: మురళి విజయ్, కేఎల్.రాహుల్, ఛతేశ్వర పూజారా, విరాట్ కోహ్లీ, కరణ్ నాయర్, పార్థీవ్ పటేల్, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్