సినిమా రేంజ్లో సస్పెన్స్... ఆ అజ్ఞాతవాసి అతడేనా?
స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వసుధార, రిషి లవ్ స్టోరీ కి కనెక్ట్ అయిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు ఈ సీరియల్ లో.. రిషి, వసుధారల లవ్ స్టోరీ పై కథ సాగుతుండగా.. వారిమధ్యలో గొడవలు అవుతూ మళ్ళీ దగ్గరవుతూ.. ఇలా కాస్త దూరం పెరిగి అన్ని సర్దుకుంటున్నాయి. అయితే జయచంద్ర రాకతో వసుధార రిషి ల మధ్య మనస్పర్థలు తొలగిపోయి కథ పెళ్ళి వరకు వచ్చింది. పెళ్ళి జరుగుతుందని అనుకునేలోపు శూన్యమాసమని దేవయాని చెప్పడంతో వీరిద్దరి పెళ్లికి అడ్డుపడినట్టైంది. ప్రస్తుతం రిషి, వసుధారలు ఒకే ఇంట్లో ఉంటూ కాలేజీ పనులు చూసుకుంటున్నారు