Read more!

English | Telugu

భవానికి కడుపు కోత మిగిల్చిన కృష్ణ.. వాళ్ళిద్దరు కలిశారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -139లో.. కృష్ణ, గౌతమ్ పెళ్లి మండపానికి వస్తారు. వాళ్ళని చూసిన ముకుంద వారి దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఈ అడ్రస్ మీకెలా తెలిసింది.. అయినా మీరు ఎందుకు వచ్చారని ముకుంద అనగానే.. నా ఆడపడుచు పెళ్లికి నేను రాకుండా ఉంటానా అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన కృష్ణ, గౌతమ్ లను అందరూ చూస్తారు. వాళ్ళని భవాని చూసి షాక్ అవుతుంది. 

కృష్ణ.. వీడిని ఎందుకు తీసుకొచ్చావని ఈశ్వర్ అంటాడు. పెళ్లి చెయ్యడానికి మామయ్య అని కృష్ణ అంటుంది. అలా కృష్ణ అనేసరికి ఈశ్వర్ కి కోపమొస్తుంది. వీడు ఇలా వినడు పదా తోసేద్దామని చెప్పి.. ఈశ్వర్, ప్రసాద్ లు బలవంతంగా గౌతమ్ ని లాక్కొని వెళ్తుండగా.. మీరు త్వరగా పెళ్లి చెయ్యండి పంతులు గారు అని భవాని అంటుంది. ఇక పెళ్లి కొడుకు నందు మెడలో తాళి కట్టే టైంకి.. "నందిని.. నందిని" అని గౌతమ్ పిలుస్తాడు. అప్పుడు గౌతమ్ ని చూసిన నందు.. సిద్దు సిద్దు అని వచ్చి గౌతమ్ ని హత్తుకుంటుంది. అలా హత్తుకున్న నందు దగ్గరికి కోపంగా వెళ్ళిన భవాని.. తనని కొట్టబోతుంటే మురారి అడ్డుపడతాడు. నందుని ఏం అనకు పెద్దమ్మ అని మురారి అనగానే.. ఈ ప్లాన్ లో నువ్వు కూడా భాగంగా ఉన్నావా మురారి అని భవాని అంటుంది. ఇక పెళ్లి కొడుకు తల్లి చూసి.. ఇదంతా ఏంటి? మా పరువు పోయిందంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. నిజానికి కృష్ణకి అడ్రెస్ చెప్పి రమ్మని చెప్పింది మురారి. ఆ తర్వాత ఈశ్వర్ ఇదంతా ఏంటని మురారిని కొట్టబోతుంటే.. కృష్ణ అడ్డుకుంటుంది. మామయ్య.. ఏసీపి సర్ తప్పేం లేదు.. నందు ఆత్మహత్య చేసుకోబోతుంటే అపి.. నందు బాగుండాలని ఇలా చేసాడని కృష్ణ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. పెద్దమ్మ మీ చేతుల మీదుగా నందు పెళ్లి చెయ్యండని మురారి అనగానే.. భవాని కోపంగా వాడేంటి వాడి స్థాయేంటి.. వాచ్ మన్ కొడుకు.. నా ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడని భవాని కోప్పడుతుంది.

ఆ తర్వాత నందు పెళ్లి చెయ్యండని భవానీతో కృష్ణ అనగానే.. ఆవేశంగా "దీనంతటికీ కారణం నువ్వే.. నా పరువుపోయింది.. నాకు కడుపు కోత మిగిల్చావు నువ్వు" అంటూ కృష్ణని భవాని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌.