Read more!

English | Telugu

దుగ్గిరాల ఫంక్షన్ లోకి వచ్చిన అనుకోని అతిథి.. అందరూ ఒక్కసారిగా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -79 లో.. దుగ్గిరాల ఫ్యామిలీలో చేస్తున్న ఫంక్షన్ కి కనకం, కృష్ణమూర్తి, అప్పులు రావడం చూసిన అపర్ణ.‌. వాళ్ళని చూసి చిరాకు పడుతుంది. ఎవరు పిలిచారని అడుగగానే.. ఇందిరాదేవి పిలిచిందని అంటారు. వాళ్ళని చూసిన ఇందిరాదేవి.. నేనే పిలిచానని చెప్తుంది. ఇక రాజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన రుద్రాణి.. "అన్నయ్య.. కావ్య వాళ్ళ అమ్మానాన్నలు వచ్చారు.. వదిన గొడవ చేస్తుంది" అని చెప్తుంది. దాంతో కోపంగా రాజ్ వాళ్ళ నాన్న అపర్ణ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఏం గొడవ చెయ్యకుండా ఉండు.. గొడవ చేస్తే పోయేది.. మన ఇంటి పరువే అని అనగానే.. అపర్ణ సైలెంట్ గా ఉంటుంది.

ఆ తర్వాత కనకం వాళ్ళని కావ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. కావ్య వాళ్ళందరిని చూసి సంతోషపడుతుంది. కావ్య వాళ్ళని తీసుకొని వెళ్లి వీఐపీ కుర్చీలో కూర్చోమంటుంది. ఇంతలో అపర్ణ వారి దగ్గరికి వచ్చి.. అవి వీఐపీ లు కూర్చొనేవి.. మీరు కాదంటూ కనకం వాళ్ళని అవమానిస్తుంది. ఆ తర్వాత వెనక్కి వెళ్లి నిల్చుంటారు కనకం ఫ్యామిలీ.. రాజ్, కళ్యాణ్ తో వాళ్ళకి భోజనలు పెట్టించమని చెప్పగానే కళ్యాణ్ వాళ్ళని భోజనానికి తీసుకొని వెళ్తాడు. భోజనం చేస్తుండగా రేఖ వచ్చి‌‌.‌. తినడానికే వచ్చారా అంటూ అవమానిస్తుంది. ఆ తర్వాత సీతరామయ్య ఇంద్రదేవీల వివాహ వార్షికోత్సవం సరదాగా జరుపుకుంటారు. రాజ్ కావ్యకి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనకం ఉహించుకొని మురిసిపోతూ ఉంటుంది. అందరు కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే కనకం వాళ్ళు దూరంగా నిల్చొని ఉండడం గమనించిన కళ్యాణ్.. వాళ్ళని కూడా పిలుద్దామని.. ఇందిరాదేవి, సీతరామయ్యలతో చెప్పగా వాళ్ళు సరేనంటారు. అపర్ణ మాత్రం వద్దని అనగానే.. కావ్యని మన ఇంటి కోడలుగా ఒప్పుకున్నాం కదా ఇప్పుడు ఏం గొడవ చెయ్యకు.. మీడియా ముందు పరువు పోతుందని తన భర్త అనగానే అపర్ణ సైలెంట్ గా ఉంటుంది. కనకం ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీతో  కలిసి గ్రూప్ ఫోటో దిగుతుంటే‌‌.. అప్పుడే స్వప్న ఎంట్రీ ఇచ్చి‌.. ఫ్యామిలీ ఫోటోలో నేను వద్దా అని అనగానే.. స్వప్నని చూసిన అందరూ షాక్ అవుతారు.

ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావని అందరూ స్వప్నని తిడతారు. రుద్రాణి మాత్రం నువ్వు పెళ్లిలో ఎవరితో లేచిపోయావ్? అని అడుగుతుంది. రాహుల్ మాత్రం.. తన గురించి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అనే భయంతో.‌. తనతో మాటలేంటి.. సెక్యూరిటీని పిలిపించి గెంటేయండని అంటాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి స్వప్నని చెంపదెబ్బ కొడుతాడు. మా పరువు తీస్తున్నావ్? నిన్ను ఎవరు రమ్మన్నారంటూ కోప్పడతాడు. ఈ గొడవ అంతా సీతారామయ్య ఇంద్రదేవీలు చూస్తారు‌. మనమే గొడవ చేస్తే ఇంటి పరువు ఏమవుతుందని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.