Read more!

English | Telugu

శ్రీముఖి తన చెల్లికి స్వయంవరం ప్రకటించింది!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో కాష్ తీసుకొచ్చే టాస్క్ లో "నాగపంచమి" సీరియల్ టీం గెలిచింది. దాంతో ఓడిపోయిన "మధురానగరిలో" సీరియల్ టీంకి పెళ్లి సంబంధం చూసే ఒక టాస్క్ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ లో రాధ క్యారెక్టర్ లో చేసే నటించిన కీర్తి భట్ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది కాబట్టి శ్రీముఖి తన చెల్లెలు ఫైమాకి పెళ్లి చేయడం కోసం స్వయంవరం ప్రకటించింది. అలా  రాధ స్టేజి మీదకు వచ్చింది..." వందకు పైగా సంబంధాలు చూసారని విన్నాను..నా చెల్లికి కూడా పెళ్లి చేసి  101 వ సంబంధం చూడాలని కోరుకుంటున్న" అని శ్రీముఖి చెప్పేసరికి "ఏమిటి నీకు ఇంత వరకు పెళ్లి కాలేదా" అని అవినాష్ ఫైమాని ఏడిపించాడు "ఇప్పటి వరకు నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు" అని ఫైమా  వాగేసరికి రాధ మధ్యలో వచ్చి "ఒక్క పెళ్లే చేసుకుంటారు వంద పెళ్లిళ్లు చేసుకోరు" అని చెప్పింది.

ఐతే "నా చెల్లికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో చెప్తుంది రాధ గారు మీరు వినండి" అంది శ్రీముఖి " నన్ను చిన్నపిల్లలా చూసుకోవాలి" అని ఫైమా అనడంతో "సరే మంచి మ్యాచ్ వస్తే ఫిక్స్ చేసి నన్ను పిలవండి అని చెప్పి శ్రీముఖి వెళ్ళిపోయింది. తర్వాత మధురానగరిలో  సీరియల్ హీరో   శ్యామ్ స్టేజి మీదకు వచ్చేసరికి అతన్ని చూస్తూ తెగ సిగ్గు పడిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఫైమాను రాధా  వెనక్కు లాక్కొచ్చింది. "పరాయి పురుషుడిని చూడొద్దని మా అక్క చెప్పింది" అనేసరికి అప్పుడు శ్రీముఖి "రాధ మీరు మీ తమ్ముడు పక్కకి వెళ్తే శ్యామ్, ఫైమా మాట్లాడుకుంటారు" అంది. "అక్క చూడు ఎంత హైట్ ఉన్నాడో" అనేసరికి "శ్యామ్ నీకు సెట్ కాదు మోక్ష సెట్ అవుతాడు అని రాధ అతనితో సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తుంది..నాకు ఎవరైనా ఓకే" అంది ఫైమా తన నిర్ణయం చెప్పడంతో ఇక మోక్ష స్టేజి మీదకు రావడంతో అతనితో పెళ్లి చేసింది.  "రాధా గారు ఫైనల్లీ మంచి సంబంధం సెట్ చేశారు" అని చెప్పి ఆ స్వయంవరం టాస్క్ ని కంప్లీట్ చేసింది.