English | Telugu

ఏటిఎం ట్రైనర్ గా శ్రీవిష్ణు

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం లాగే నెక్స్ట్ వీక్ కూడా నవ్వించడానికి సిద్ధమైపోయింది. ఇక ఈ షో ప్రోమో రీలీజ్ అయ్యింది. ఈ రాబోయే ఎపిసోడ్ కి శ్రీవిష్ణు, రెబమోనికాజాన్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ "సామజవరగమన" మూవీ టీం వచ్చింది. ఈ మూవీ మే 18 న రిలీజ్ కాబోతోంది. ఇందులో రాంప్రసాద్ ఏటిఎం సెక్యూరిటీ గార్డ్ గా ఒక స్కిట్ వేసాడు. అందులో శ్రీవిష్ణు కూడా కొన్ని కామెడీ బిట్స్ చేసి నవ్వించాడు. ఒక కమెడియన్ వచ్చి మిగిలిపోయిన ఆహారపదార్థాలు తీసుకొచ్చి ఎటిఎంలో పెట్టేసరికి ఇదేంటని అడిగాడు రాంప్రసాద్. "మా ఇంట్లో ఫ్రిజ్ లేదు కదా..ఈ ఎటిఎం సెంటర్ లో ఏసీ ఉంటుంది కదా రేపటి వరకు పాడవకుండా ఉంటాయి" అనేసరికి అవాక్కయ్యాడు రాంప్రసాద్.

అమ్మ విలువ తెలిసేలా చెప్పిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -755 లో... జగతి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. "ఏంటి పిన్ని మీరు.. మిమ్మల్ని అమ్మ అని పిలవడం ఇష్టం లేని రిషి మీద.. మీకు ఎందుకంత ప్రేమ" అని శైలేంద్ర అంటాడు. దానికి జగతి చెంప పెట్టులాగా స్ట్రాంగ్ గానే ఆన్సర్ ఇస్తుంది. "కన్నకొడుకు మీద ప్రేమ ఎందుకంటే ఎవరైనా ఏం చెప్తారు శైలేంద్ర. నువ్వు ఒక ఆడదానివయ్యి, నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి ఒక బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు నీకు తెలిసేది ఆ తల్లి విలువ, ఒక తల్లి బిడ్డని ఎంత ప్రేమిస్తుందో. అయినా రిషి నాతో మొదటగా మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అలాంటిది నాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను. నాతో రిషి ప్రేమగా మాట్లాడుతున్నాడు" అంటూ జగతి శైలేంద్రతో అంటుంది.

లహరి న్యూ బేబీ బంప్...న్యూ ఫీలింగ్స్!

బుల్లితెర నటి లహరి అంటే తెలియని వారు ఉండరు.  ‘చక్రవాకం’తో సీరియల్‌ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది.  ‘మొగలిరేకులు’, ‘శ్రావణ సమీరాలు’  ‘రాధ మధు’,  ‘పుట్టింటి పట్టుచీర’ వంటి సీరియల్స్ లో నటించింది. ‘కల్యాణ తిలకం’ లో చేసిన డ్యూయల్ రోల్ కి అలాగే ‘ముద్దుబిడ్డ’ సీరియల్ కి అవార్డ్స్ అందుకుంది ఇంకా ‘రాధ మధు’ సీరియల్‌కి నంది అవార్డు కూడా దక్కింది. ‘పక్కింటి అమ్మాయి, అత్తో అత్తమ్మ కూతురో, మమతల కోవెల, గోకులంలో సీత ఇలా ఎన్నో సీరియల్స్ లో నటనకు స్కోప్ ఉన్న రోల్స్ లో చేసింది. కందిరీగ, డాన్‌ సీను, ఆరెంజ్, గ్రీకువీరుడు, రారా కృష్ణయ్యా వంటి మూవీస్ లో లో కనిపించింది. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన ఫాన్స్ కి, నెటిజన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు లహరి ఆమె భర్త ధీరేన్. 

ముకుందని విసిగించకుండా వెళ్ళమని చెప్పిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -149 లో.. కృష్ణ మోకాళ్ళపై గుడిమెట్లు ఎక్కుతుంటే.. అక్కడి పూజారి చూసి మురారికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు వెంటనే మురారి గుడికి వస్తాడు. తనని అలా మోకాళ్ళపై నడవడం చూసిన మురారి.. ఆగు కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావ్ అని అడుగుతాడు. కృష్ణ సమాధానమేం చెప్పకుండా.. తను ఇన్ని రోజులు మురారిని అపార్థం చేసుకొని తప్పు చేశానని తన కాళ్లకి మొక్కుతుంది. కృష్ణ ఏం చేస్తుందో అర్థం కాని మురారి మాత్రం ఆశ్చర్యంగా చూస్తాడు.

వీళ్లంతా నా పిల్లలు కారు స్టార్ మా పిల్లలు అన్న శ్రీముఖి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఇప్పటివరకు సీరియల్స్ లో సెలబ్రిటీస్ తో గేమ్స్ ఆడిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అసలే సమ్మర్ సీజన్.. పిల్లలందరికీ స్కూల్, కాలేజీ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాంటి చిల్డ్రన్స్ కోసం స్టార్ మా పరివారం టీం అంతా కలిసి "కిడ్స్ స్పెషల్" అంటూ ఒక ప్రోగ్రాంని రూపొందించారు. ఇందులో స్టార్ మా సీరియల్స్ లో నటించే చిన్నారులందరినీ తీసుకొచ్చి ఈ షోలో గేమ్స్ ఆడించారు. ఇక హోస్ట్ శ్రీముఖి ప్రతీ వారం కలర్ ఫుల్ గా కనిపించే పొట్టి డ్రెస్సుల్లో వచ్చేది. కానీ ఈ వారం చాలా పద్దతిగా కాటన్ శారీలో కనిపించి అలరించింది. "ఎప్పుడూ పాలేరులను వాళ్లనేనా పిలిచేది మాలాంటి కిడ్స్ ని పిలవకుండా సమ్మర్ స్పెషల్ షో ఎలా చేస్తావ్" అని అడిగారు. ఇక మధురానగరిలో కనిపించే బుడ్డోడు కూడా ఈ షోలో కళ్ళఅద్దాలు పెట్టుకుని వచ్చాడు. "అరే బుడ్డోడా కళ్లద్దాలు తీసి నాకు కన్ను కొట్టు" అని అడిగింది శ్రీముఖి.

మీలో ఎప్పుడూ ఫైర్ రగలాలి అంటూ కుందేలుతో ముచ్చట్లాడుతున్న కౌశల్

కౌశల్ మందా బిగ్ బాస్ సెకండ్ సీజన్ ను ఒక ఊపు ఊపేసిన స్టార్. విశేషమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుని ఆ సీజన్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అతని రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు. అందుకే సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన పిల్లల్ని స్కూల్ కి దింపుతూ, వాళ్ళను తీసుకొస్తూ, రెస్టారెంట్స్ కి వెళ్లి వెరైటీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా బీబీ జోడిలో కనిపించాడు. ఇలా కౌశల్ తన స్టయిల్లో తానూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపిస్తున్నాడు. ఇప్పుడు తాను పెంచుకునే బన్నీని చేతుల్లోకి తీసుకుని వాటికి ఫ్రూప్ట్స్ తినిపిస్తూ ఆ కుందేలుని బాడీ మీదకు ఎక్కించుకుని ఎంజాయ్ చేసాడు.

గుప్పెడంత మనసులోకి బ్రహ్మముడి కవి గారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేసి.. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ చేస్తున్నారు. బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిమ ఎందుకంటే రెండింటలోను కథ బాగుంటుంది. అందులో రిషి,-వసుధార, ఇందులో రాజ్-కావ్య .. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తోంది.

ముగిసిన అమెరికా టూర్.. ధన్యవాదాలు చెప్పిన సునీత

టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో సునీత ఫుల్ ఫేమస్. తన అద్భుతమైన గాత్రంతో వందల పాటలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీగా  తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఫోటోలు, పాటలు, తన కుమారుడి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత ఫేమస్ బిజినెస్ పర్సన్ రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే నెల రోజుల నుంచి అమెరికాలో సునీత మ్యూజిక్ కన్సర్ట్స్ లో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది.