Eto Vellipoyindhi Manasu : రామ్ తల్లి సిరి అని తెలుసుకున్న రామలక్ష్మి.. సీతాకాంత్ ని తప్పుగా అర్థం చేసుకుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో....రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ కలిసి మేడ పైనుండి వస్తుంటే.. వాళ్ళు ఆ బాబుకి పేరెంట్స్ లా ఉన్నారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. హ్యాపీ బర్త్ డే రామ్ అని మమత అంటుంటే.. తల్లివి అయి ఉండి ఇంత లేట్ గా విష్ చేస్తారా అని రామలక్ష్మి అంటుంది. ఈ మేడమ్ ప్రవర్తన ఎందుకో మమత అక్క విషయంలో తేడా గా ఉందని సీతాకాంత్ తో శ్రీవల్లి అంటుంది. దాంతో మొదటి నుండి రామలక్ష్మి మమతతో మాట్లాడింది గుర్తుచేసుకుంటుంది. మమత గారిని రామలక్ష్మి నా భార్య అనుకుంటుంది. అసలు విషయం తెలిసేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు.