English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామ్ తల్లి సిరి అని తెలుసుకున్న రామలక్ష్మి.. సీతాకాంత్ ని తప్పుగా అర్థం చేసుకుందా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో....రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ కలిసి మేడ పైనుండి వస్తుంటే.. వాళ్ళు ఆ బాబుకి పేరెంట్స్ లా ఉన్నారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. హ్యాపీ బర్త్ డే రామ్ అని మమత అంటుంటే.. తల్లివి అయి ఉండి ఇంత లేట్ గా విష్ చేస్తారా అని రామలక్ష్మి అంటుంది. ఈ మేడమ్ ప్రవర్తన ఎందుకో మమత అక్క విషయంలో తేడా గా ఉందని సీతాకాంత్ తో శ్రీవల్లి అంటుంది. దాంతో మొదటి నుండి రామలక్ష్మి మమతతో మాట్లాడింది గుర్తుచేసుకుంటుంది. మమత గారిని రామలక్ష్మి నా భార్య అనుకుంటుంది. అసలు విషయం తెలిసేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు.

అమ్మాయిలతో దోరికిపోయిన హైపర్ ఆది

రాబోయే హోలీ రంగుల పండగను పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా బయట హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో వాళ్ళ సందడి వీడియోని టెలికాస్ట్ చేశారు. ఇందులో "ఆది గుల షాప్" అంటూ నటీ నరేష్ ఒక బ్యానర్ ని తీసుకొచ్చాడు. అది చూసి అదేంటిరా "రం" ఏది అని అడిగేసరికి "నాన్నగారు తాగేశారు" అని చెప్పాడు. ఈ ఎపిసోడ్ సౌమ్య వచ్చి డాన్స్ చేసింది. ఐతే సౌమ్య వేసిన డాన్స్ స్టెప్స్ అన్నీ తనవే అని వాటిని కాపీ కొట్టేసింది అంటూ ఆది ఫైర్ అయ్యాడు. దానికి హోస్ట్ రష్మీ ఐతే ఆ స్టెప్స్ వేసి చూపించండి అంటూ ఆదిని అడిగింది.

రంగస్థలం మూవీలో సమంత గెటప్ లో...విష్ణు ప్రియా 

చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కి పృద్వి -  విష్ణుప్రియ ఇద్దరూ కలిసి రంగస్థలం మూవీ గెటప్స్ వేసుకొచ్చారు. విష్ణుప్రియ రామలక్ష్మి గెటప్ లో వచ్చింది. "రామ లక్ష్మినే కానీ రాంగ్ స్థలంలో ఉన్నట్టు ఉంది" అంటూ సుమ సెటైర్ వేసింది. తర్వాత అమర్ దీప్ వచ్చి "బేసిక్ గా అక్కడ నడుము ఉండాలి. కానీ అక్కడ లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఫ్రస్ట్రేట్ ఐపోయిన విష్ణు ప్రియా.."పృద్వి ఏమీ మాట్లాడవేంటి" అని సీరియస్ గా అడిగేసింది. దానికి అంబటి అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. "నీ నడుము గురించి పృద్వి ఎందుకు చెప్తాడు" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఎందుకంటే రంగస్థలం మూవీలో హీరోయిన్ సమంత నడుము చాలా సన్నగా ఉంటుంది.

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్...జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా

 బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమెకు శునకాలంటే పిచ్చి ప్రేమ. ఏ మూగజీవానికి హాని జరిగినా ఊరుకోదు. అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్ ఉండేది. దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది. ఐతే అది కొంతకాలం క్రితం చనిపోయింది. ఇక రష్మీ తన పెట్ డాగ్ అస్థికలను గోదావరి నదిలో కలిపేసింది. ఆ వీడియోని అలాగే తన చుట్కితో గడిపిన క్షణాల వీడియోస్ ని కూడా పోస్ట్ చేసింది. "ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను.

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.....రామలక్ష్మి రామ్ కి టీసీ ఇస్తానని చెప్పడంతో.. నేను భోజనం చెయ్యనంటు రామ్ మారం చేస్తుంటాడు. నాకు ఆ మిస్ కావాలి. నాతో సరదాగా ఆడుకుంటుందని రామ్ ఏడుస్తుంటే.. నువ్వు ఆ స్కూల్ లోనే ఉంటావ్. నేను మేడమ్ తో మాట్లాడతానని రామ్ ని సీతాకాంత్ బ్రతిమాలతాడు. రామలక్ష్మి తన క్యాబిన్ లోకి వచ్చి తనకి సంబంధించిన వస్తువులు తీసుకుంటుంది. అప్పుడే ఇద్దరు టీచర్స్ వస్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ రామ్ కి ఇవ్వండి అని చెప్పి బయలుదేర్తుంది.

Illu illalu pillalu : డబ్బున్నోళ్ళలాగా నటిస్తున్న భాగ్యం.. రామరాజు కుటుంబం పసిగట్టగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో....రామరాజు వాళ్ళు ఇంటికి వస్తాను అనడంతో భాగ్యం టెన్షన్ పడుతుంది. మనం బాగా డబ్బున్నోళ్ళమని బిల్డప్ ఇచ్చినాం.. ఇప్పుడు వాళ్ళు ఈ కొంపని చుస్తే ఇంకేమైనా ఉందా నేను చదవిందే ఆరో తరగతి.. బిటెక్ అని చెప్పావని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ సమస్య కంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది. రేపు ఇంటికి వస్తే మనం ఉండే ఈ అద్దె కొంపని చూస్తారని భాగ్యం చిన్న కూతురు అంటుంది. అలా జరగకూడదు. ఇలాంటి బకరా సంబంధం మళ్ళీ దొరకదని భాగ్యం అంటుంది.

Karthika Deepam2 : సెంట్ నచ్చలేదని భార్యకి విడాకులిస్తానన్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో.... శ్రీధర్, కావేరి ఇద్దరు కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. శ్రీధర్, కావేరి తిన్న తర్వాత బిల్ కట్టడానికి డబ్బులు మర్చిపోయి వస్తారు. దీపని తిట్టాడని కోపంతో కావేరి కూడ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తుంది. పర్లేదు అని దీప అంటుంటే.. ఎందుకలా అంటావ్ ఇలాగేనా బిజినెస్ చేసేది ఇలా అంటూ ఉంటే మనం అప్పు ఎలా కడతామని కార్తీక్ అంటాడు. నేను అన్న మాటలు నాకే అప్పజెప్పుతున్నావా అని శ్రీధర్ అంటాడు. అన్న మాటలు అప్పుతో సమానమని కార్తీక్ అంటాడు.