English | Telugu

తమన్నాతో పులిహోర కలిపిన ఇమ్ము

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 మంచి హాట్ ఫైటింగ్స్ తో సరదాసరదా టాస్కులతో ఎండ్ ఐపోయింది. ఇక ఇప్పుడు సీజన్ 2 వచ్చేసింది. ఈ షో 29 వ శనివారం నాడు లాంచ్ కాబోతోంది.  ఆ గ్రాండ్ లాంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో ఇక ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి ఇక జడ్జెస్ కం మెంటార్స్ గా శేఖర్ మాస్టర్, అనసూయ వచ్చారు. అలాగే కంటెస్టెంట్స్ గా రోహిణి, డెబ్జానీ, పృద్వి శెట్టి, శ్రీ సత్య, బ్రహ్మముడి మానస్, తేజస్విని మాదివాడ, ఇమ్మానుయేల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బబ్లు ఇంకా కొంతమంది సీరియల్ నటీనటులు వచ్చారు. ఐతే ఈ లాంచ్ ఎపిసోడ్ కి మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చింది. ఇమ్ము ఏమంటూ ఈటీవీ నుంచి స్టార్ మాకి వచ్చాడో ఇక వచ్చే గెస్టులందరితో కూడా ఫన్ క్రియేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఈ షోలో కూడా మిల్కీ బ్యూటీ తమన్నాతోనే పులిహార కలిపాడు.

సమీరా బూందీ  లడ్డూలా ఉంటది..క్యారవాన్ లోకి సుప్రీతా...

​సమీరా భరద్వాజ్ సింగర్ గా ఎంతో అద్భుతంగా పాడుతుంది. "నారాయణ" అంటూ రీసెంట్ గా ఆమె చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈమె ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక జోడిగా వచ్చింది. ఈ వారం ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెఫ్ జీవన్ ఉగాది సందర్భంగా లడ్డూ చేసే టాస్క్ ఇచ్చాడు. రీసెంట్ గా రిలీజైన ఈ షో ప్రోమో బాగా నవ్వు తెప్పిస్తోంది. ఇక అందరూ లడ్డూ చేస్తున్నారు. సమీరా బూందీ లడ్డూ ప్రిపరేషన్ లో ఉండగా చెఫ్ జీవన్, సుమ వాళ్ళ దగ్గరకు వచ్చారు దాంతో సమీరా "మా బూందీ తింటే బ్రాందీ తాగినంత కిక్కెక్కుతుంది" అనేసరికి దీపిక వావ్ అంది. "మాకు బూందీ చాలమ్మ బ్రాందీ వద్దు" అంటూ సుమ కౌంటర్ వేసింది. తర్వాత ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ అనే కాన్సెప్ట్ ని సుమ యాదమ్మ రాజు - సుప్రీతకు ఇచ్చింది. "ఒక విలన్ వస్తాడు..అతన్ని చూసి మీరు భయపడాలి" అంటూ యాదమ్మరాజు సుప్రీతకు చెప్పాడు.

అవి బొగ్గులా..గోభి మంచూరియానా ?

చెఫ్ మంత్ర సీజన్ ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఇంకో కొత్త జంట వచ్చింది. వాళ్ళే విరాజిత - ప్రసాద్ బెహరా.. ఐతే గత ఎపిసోడ్స్ లో కనిపించిన విష్ణు ప్రియా - పృద్వి జోడి ఈ షో రాలేదు. కాబట్టి వాళ్ళ ప్లేస్ లోకి వీళ్ళను తెచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8  ద్వారా విష్ణు ప్రియా - పృద్వి జోడి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణు ప్రియా మీద కేసు ఫైల్ ఐన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు కూడా విష్ణు ప్రియా వెళ్ళింది. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ ప్లేస్ లోకి ప్రసాద్ బెహరా - విరాజిత ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. వస్తూనే గిన్నెలో మాడిపోయిన ఒక ఐటెంని తెచ్చాడు. "ఏదో తెచ్చినట్టున్నారు" అని సుమ అడగడంతో "బొగ్గులు, మీలాగా స్టవ్ మీద వండదు విరాజిత...బొగ్గుల మీద వండుతుంది..."అని చెప్పాడు.

Brahmamudi : కార్ నెంబర్ ద్వారా యామిని వివరాలని కావ్య తెలుసుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -678 లో.....ఆ కావ్య అంత ఖచ్చితంగా చెప్తుందంటే నిజంగానే రాజ్ బ్రతికి ఉన్నాడు కావచ్చని రుద్రాణి తో రాహుల్ అంటాడు. అది మనకి చెప్పి మంచి పని చేసింది.. ఒకవేళ వాడు బ్రతికున్నా కూడ మనం ఉండనివ్వం కదా అని రుద్రాణి అనగానే.. మనకి రాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా అని రాహుల్ అంటాడు. కావ్య ఖచ్చితంగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. కావ్య ద్వారా రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.. నువ్వు కావ్యపై ఓ కన్నెసి ఉంచమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.

అలాంటి ప్రేమ దొరక్కపోతే...నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే

బుల్లితెర మీద యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ కి యాంకర్ గా చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఏ షోకి వెళ్లినా అదే ప్రశ్న అందరూ అడుగుతూ ఉంటారు. ఐతే పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణాన్ని ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చెప్పుకొచ్చింది. "పేరుకు మాత్రం నాకు తల్లి తండ్రులు ఉన్నారు. నాకు 12 ఏళ్ళ వయసు వచ్చేసరికి వాళ్ళు విడిపోయారు. భార్యాభర్తల మధ్య నేను ఒక స్టెబిలిటీని, బాండింగ్ ని  చూసింది మా గ్రాండ్ పేరెంట్స్ మధ్యలోనే. ఇంటికి వెళ్ళడానికి నాకు వాళ్ళే మోటివేషన్ గా ఉండేవాళ్ళు. 2023 జనవరిలో అమ్మమ్మ తర్వాత 2024 ఆగష్టు లో మా తాతయ్య చనిపోయారు. అలా ఏడాది తేడాతో ఇద్దరూ చనిపోయేసరికి జీవితం మొత్తం ఖాళీ ఐపోయినట్టు అనిపించింది.

నాన్న కనిపిస్తే గట్టిగా కౌగిలించుకుని అరిచి ఏడవాలనుంది

  బుల్లితెర నటి భావన గురించి పరిచయం అక్కరలేదు. ఆమె బాలనటిగా కుట్ర అనే మూవీలో నటించింది. ఆ తర్వాత "భారతంలో బాల చంద్రుడు, లాయర్ సుహాసిని, రాజేశ్వరి కళ్యాణం" వంటి మూవీస్ లో నటించింది. బుల్లితెర మీద "సంధ్య" అనే సీరియల్ తో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ సీరియల్స్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే ఆమెకు మంచి మైల్ స్టోన్ సీరియల్ ఏదంటే "అందం". ఈ సీరియల్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. అలా ఆత్మ కథలు, పుత్తడి బొమ్మ , స్నేహ, నా మొగుడు నాకే సొంతం, భాగవతం, సీతామహాలక్ష్మీ  లాంటి ఎన్నో సీరియల్స్ నటించింది ఇప్పుడు ఇంకా ఎన్నో సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అలాంటి భావన శ్రీదేవి డ్రామా కంపెనీలో అలరిస్తూ ఉంటుంది. ఈ వారం షోలో తన తండ్రి గురించి కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.

సైకిల్ తెస్తానన్నారు...కానీ శవమై వచ్చాడు నాన్న ....

ప్రసాద్ బెహరా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా విన్పిస్తున్న పేరు. షార్ట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే బుల్లితెర మీద షోస్ కి వస్తున్నాడు. ఇక రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చాడు. ఐతే ఈ షోలో బాగా ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళ నాన్నను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రష్మీ అతనికి వాళ్ళ నాన్న ఫోటోని ప్రెజెంట్ చేసింది. ఇక ఆ ఫోటో చూసాక ప్రసాద్ బెహరా తన నాన్న గురించి చెప్పుకొచ్చాడు. "నాన్న అనే ఎమోషన్ నాకు చాలా తక్కువ..ఎందుకంటే నాకు మూడేళ్లున్నప్పుడే ఆయన చనిపోయారు. ఆయనతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. వైజాగ్ లోని అచ్చాపురం అనే ఊర్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగా ఒక పిల్లాడు నా వయసు వాడే ఉండేవాడు. అతనికి వాళ్ళ నాన్న సైకిల్ ఇచ్చాడు.

కాస్ట్‌లీ కార్ కొన్న విరూపాక్ష నటి...

విరూపాక్ష మూవీ అంటే చాలు ముందు హీరో హీరోయిన్ కంటే సోనియా సింగ్ గుర్తొస్తుంది. అమాయకంగా ఉండే పల్లెటూరి అమ్మాయి రోల్ లో సోనియా అద్భుతంగా నటించింది. ఇక సోనియా మిత్రుడు సిద్దు కూడా అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో అందరినీ అలరించాడు. యూట్యూబర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్ళు తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. సిద్దుతో కలిసి "హే పిల్ల, రౌడీ బాబీ" వంటి యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలా సోషల్ మీడియాలో పాపులర్ కావడం స్క్రీన్ మీద చిన్నపిల్లలా ఆడియన్స్ ని అలరించడంతో 2023 లో రిలీజయిన "విరూపాక్ష" మూవీలో మంచి రోల్ కి అవకాశాన్ని కొట్టేసింది. అలాంటి సిద్దు, సోనియా కలిసి ఇప్పుడు ఢీ షోకి మెంటార్స్ గా వస్తున్నారు. వీళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాం అంటూ కూడా ఆ షోలో చెప్పుకొచ్చారు.

ఆదికి బలుపు ఎక్కువ...అంకుల్ ని ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు...

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "అనగనగ" మూవీ టీమ్ నుంచి సుమంత్, కాజల్ వచ్చారు. ఐతే సుమంత్ రావడమే సినిమాలోని ఒక డైలాగ్ ని అడిగాడు.. "నోటితో విసిరేసి చేత్తో ఏరుకునేది ఏమిటి" అని అడిగాడు. కానీ కొంతమంది సరిగా చెప్పలేదు. కొంతమంది మాత్రం అక్షరాలు అని చెప్పారు. ఇక రష్మీ ఆన్సర్ చెప్పమని అడిగేసరికి తనకు కూడా తెలీదని సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పాడు. ఐతే వస్తూనే షోకి మీమ్స్ రాసిన టీ షర్ట్స్ తెచ్చాడు. వాటిని తీసుకుని ఎవరికి సెట్ అవుతాయో వాళ్లకు ఆ టీ షర్ట్స్ ఇచ్చింది మూవీ టీమ్. "ఇవే తగ్గించుకుంటే మంచిది" అనే మీమ్ టీ షర్ట్ ని ఆదికి ఇచ్చింది. అది చూసిన ఆది మీరు ఎన్ని టీ షర్ట్స్ ఇచ్చినా ఈ పొట్ట మాత్రం తగ్గించను అని చెప్పాడు. అది పొట్ట కాదండి బలుపు తగ్గదు అంటూ ఇంద్రజ కౌంటర్ ఇచ్చింది. దానికి ఆది రికౌంటర్ ఇచ్చాడు.