English | Telugu

Brahmamudi : సమాధుల దగ్గరికి వెళ్లిన యామిని.. అతనేమో కావ్యతో మీటింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -685 లో.... కావ్య రెడీ అయి వెళ్తుంటే రాహుల్, రుద్రాణి ఇద్దరు తనని ఫాలో అవుతుంటారు. కావ్య నిజంగానే రాజ్ ని కలవడానికి వెళ్తుందా.. ఎక్కడికి వెళ్తుందని అనుకుంటారు. మరొకవైపు రాజ్ కోసం యామిని వెతుకుతుంటుంది. బావ ఎక్కడ అని వాళ్ళ డాడ్ ని అడుగుతుంది యామిని‌‌. నువ్వు స్పృష్టించిన రాజ్ పేరెంట్స్ సమాధుల దగ్గరికి వెళ్ళాడని వైదేహి చెప్తుంది. ఎందుకు వెళ్ళనిచ్చారు.. తనకి ఎవరైనా ఎదరుపడితే పరిస్థితి ఏంటని వైదేహిపై యామిని కోప్పడుతుంది. నేను వెళ్తానంటూ యామిని బయల్దేర్తుంది.

టీవీ షోస్ లో ఎనెర్జీతో కనిపించే దీపికా సంతోషం వెనక ఉంది ఇదా

దీపికా రంగరాజు బుల్లితెర మీద అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రోల్ లో డీసెంట్ లుక్ లో కనిపిస్తుంది కానీ మిగతా షోస్ లో చూస్తే ఆమె అల్లరి మాములుగా ఉండదు. డాన్స్ ఐకాన్ లో ఐతే కంటెస్టెంట్స్ కి ఇచ్చే కామెంట్స్ , చేసే డాన్స్ లు, వచ్చే గెస్టులను భయపెట్టడాలు చేస్తూ ఉంటుంది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో చెఫ్ జీవన్ ని ఆట పట్టించడం, హోస్ట్ సుమతో పరాచికాలు ఆడుతూ కనిపిస్తుంది. అలాంటి దీపికా ఇప్పుడు తన నవ్వు వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ఇన్స్టా రీల్ ద్వారా చెప్పేసింది. పుష్పలో శ్రీవల్లి గెటప్ లో కనిపించిన దీపికా 100 రూపాయల నోటును మడత పెట్టి గాంధీ తాత బొమ్మను చూపిస్తూ "నేను ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను నవ్వించే వ్యక్తి ఈయనే.

లక్ష రూపాయలతో జుట్టు పెట్టించాను జాగ్రత్త

ఉగాది వెళ్ళిపోగానే శ్రీరామ నవమి వచ్చేస్తుంది. ఇక బుల్లితెర మీద శ్రీరామనవి కొత్త షోస్ రెడీ అయ్యాయి. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో  రిలీజ్ అయ్యింది. ఇందులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చాడు. ఐతే రాంప్రసాద్, ప్రదీప్, గెటప్ శీను కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ తో తెలుగు కాదు ఒక కొరియా సినిమా ప్లాన్ చేసాం అన్నాడు ప్రదీప్. వెంటనే రాంప్రసాద్ "ఏంటి మన డైరెక్టర్ నాకంటే ఎక్కువ గ్లామర్ గా ఉన్నాడు. కొంచెం గ్లామర్ తగ్గించుకో" అన్నాడు ప్రదీప్ ని . వెంటనే ప్రదీప్ గుండ్రంగా తిరిగి ముఖం మీద కొంచెం మేకప్ ని చెరిపేసుకున్నాడు.

తెలంగాణ ప్రభుత్వానికి ఆ పశుపక్ష్యాదుల ఏడుపులు వినిపించడం లేదా ....ప్రశ్నించిన రష్మీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఎంతలా వైరల్ అవుతోందో మనందరం చూస్తూనే ఉన్నాం. అక్కడ చనిపోతున్న పశువులు, పక్షుల హాహాకారాలు కూడా వింటూనే ఉన్నాం. దీనిపై ప్రకృతి ప్రేమికులు కూడా స్పందిస్తున్నారు. అలాగే రీసెంట్ గా యాంకర్ రష్మీ కూడా స్పందిస్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నేను డెవలప్మెంట్ కి విరుద్ధంగా ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఇన్ హెచ్సియు అని సోషల్ మీడియాలో చాలామంది  పోస్ట్ చేస్తున్నారు.

నాకు 44 ...రేపోమాపో పోతాను..ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు గాలి, నీరు అవసరం

అడవి అంటే చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలే గుర్తొస్తాయి.. అడవిలో ఉండే పక్షులు, పశువులు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, చిలకలు వాటి గురించి విన్నప్పుడు మనం కూడా అలా స్వేచ్ఛగా ఉంటె బాగుంటుంది కదా అని అనుకోని పిల్లలు, పెద్దలు ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అడవి ఆపదలో పడింది. నెమళ్ళ హాహాకారాలు చేస్తున్న వీడియో చూస్తున్న గుండెలు పగిలిపోయేంత బాధాగా ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నా విషయం మీద సినీ సెలబ్రిటీస్ అంతా గళం విప్పుతున్నారు. రష్మీ దీని గురించి మాట్లాడగా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన మాటలు వింటే ఉఫ్...ఎవరికైనా మనసు చలించక మానదు. "ఒక తల్లిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలాగో నా వయసు 44 ..రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు.

Brahmamudi: కూతరు కోసం మాట మార్చుకున్న యామిని తండ్రి.. రాజ్, కావ్య కలుస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-684లో.. రాజ్, కావ్య కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలోనే యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వస్తాడు. అంకుల్ నా జీవితంలో ఇంకెవరినైనా నేను మిస్ అవుతున్నానా.. అంతకముందు నా గతంలో ఇంకెవరైనా ఉన్నారా.. అని అడిగినప్పుడు యామినీ తండ్రి నిజం చెప్పబోతాడు కానీ వైదేహి అడ్డుపడి.. ఎవరుంటారు బాబు.. యామినీతోనే నువ్వు ఎక్కువ తిరిగే వాడివి.. ఎక్కువగా ఉండేవాడివి. మాకు తెలియకుండా ఎవరుంటారని అబద్దం చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత భర్తవైపు కోపంగా చూసిన వైదేహి‌.. నిజం చెప్పబోయాడని యామినీతో చెప్తుంది.

Illu illalu pillalu : చందు, శ్రీవల్లిల పెళ్ళి పత్రికలో వాళ్ళ పేర్లు.. మురిసిపోయిన వేదవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -121 లో..... రామరాజు ఇంటికి వస్తుంటే ఉల్లిపాయలు అమ్మే వ్యక్తి తమ వీధిలోకి వస్తుంటాడు. అతని దగ్గరున్న మైక్ ని తీసుకొని భద్రవతి కుటుంబానికి వినపడేలా.... మా పెద్ద కొడుకు చందుకి పెళ్లి ఫిక్స్ అయింది.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంబంధాలు చెడగొట్టినా మా వాడికి పెళ్లి జరగబోతుందని మైక్ లో మాట్లాడతాడు. ఆ మాటలు విని భద్రవతి కుటుంబం కోపంతో రగిలిపోతుంది. మన ఇంటి ఆడబిడ్డలని మోసం చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారని భద్రవతి కోప్పడుతుంది.

ఫీలైన ప్రదీప్ :  గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేసావుగా 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ ని బాగా చేస్తున్నాడు ప్రదీప్ . ఇక రీసెంట్ గా "అనగనగా ఈ ఉగాదికి" షోకి వచ్చాడు. రాగానే హోస్ట్ నందు భరతనాట్యం స్టైల్ లో గురువు గారు ప్రదీప్ కి వంగి నమస్కరించాడు. దాంతో ప్రదీప్ కూడా షాకయ్యాడు. "మీరు  గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేశారు" అంటూ ప్రదీప్ నవ్వుతూనే ఫీలయ్యాడు. దానికి హోస్ట్ నందు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నాడు. "మిమ్మల్ని రీప్లేస్ చేయలేను కానీ మీ ప్లేస్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది..ఇది ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా..మీరు సినిమాలు చేయాలి అలాగే త్వరగా మళ్ళీ మీ షోకి తిరిగి రావాలి అని ఎదురు చూస్తున్నా" అన్నాడు నందు. "అయ్యో మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకే ఏంటోలా ఉంది" అన్నాడు ప్రదీప్. ఇక రష్మీ ఐతే "పిందే పండయ్యింది" అంటూ ప్రదీప్ ని చూపించేసరికి ఒక్కసారిగా షాకై ఐనా "నీ తెలుగు వేరు మా అందరి తెలుగు వేరు కాబట్టి అనొచ్చు పర్లేదు" అంటూ రష్మీ డైలాగ్ ని కవర్ చేసేసాడు.