Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకోమన్న రామ్.. టెన్షన్ లో సవతి తల్లి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -376 లో..... రామాలక్ష్మిని రామ్ కలవడానికి వస్తాడు. మీరు నాతోనే ఉండండి మిస్.. ఎక్కడికి వెళ్లొద్దని రామ్ అంటాడు. లేదు వెళ్ళాలని రామలక్ష్మి అనగానే.. రామ్ కిందపడిపోతాడు. రామలక్ష్మి వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సీతాకాంత్, శ్రీవల్లి, సందీప్ , శ్రీలత అందరు హాస్పిటల్ కి వస్తారు. లోపల రామ్ కి ట్రీట్ మెంట్ జరుగుతుంటే నీ వళ్లే ఇదంతా.. మా రామ్ ని ఏం చేసావ్.. మొన్న ఎంగేజ్ మెంట్ రోజు ఏదో చెప్పి రామ్ ని వెళ్లేలా చేసావ్.. ఇప్పుడు ఏం చెప్పావో ఇప్పుడు ఇలా అయిందంటు రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది.