English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి కన్నకూతురని కనిపెట్టేస్తారా.. కేక్ కట్ చేసిన మాణిక్యం, సుజాత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో... రామలక్ష్మిని తన పుట్టింటికి తీసుకొని వస్తాడు సీతాకాంత్. అక్కడ రామలక్ష్మిని సుజాత, మాణిక్యం చూసి షాక్ అవుతారు. నా కూతురు బ్రతికే ఉందని మాణిక్యం హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను మీ కూతురిని కాదు నా పేరు మైథిలీ అని చెప్తుంది. అయిన మాణిక్యం సుజాత వినిపించుకోకుండా రామలక్ష్మి అంటుంటారు.

నువ్వు కూడా తను రామలక్ష్మి కాదని నమ్ముతున్నావా అని సీతాకాంత్ తో మాణిక్యం అంటాడు. తను రామలక్ష్మి అని మనసుకి తెలుసు కానీ తనే వినిపించుకోవడం లేదని సీతాకాంత్ అంటాడు. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళని బాధపెట్టకండి అని సీతాకాంత్ తన అత్తమామలకి బట్టలు తీసుకొని వచ్చి రామలక్ష్మి చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిస్తాడు. వెళ్లి మార్చుకోండి అని వాళ్ళను పంపిస్తాడు. మరొక వైపు రామ్ గేమ్ ఆడుతుంటాడు. ఎప్పుడు గేమేనా అంటూ శ్రీలత కోప్పడుతుంది. నేనంటే ఎందుకు ఇష్టం లేదని చెప్పావ్.. నీకు ఏం చేస్తే నచ్చుతానని రామ్ తో రమ్య అంటాడు. నువ్వు సీతా పక్కన సెట్ కావని రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీతాకి నీకు పెళ్లి ఎలా చెయ్యాలో తెలుసు.. ఎవరు చెప్తే వింటాడో కూడా తెలుసని శ్రీలత అంటుంది.

సుజాత, మాణిక్యం ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని వస్తారు. కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత రామలక్ష్మికి జ్యూస్ ఇవ్వబోతుంటే రామలక్ష్మిపై పడుతుంది. దాంతో నా కూతురు గదిలో డ్రెస్ ఉంది మార్చుకోమని సుజాత చెప్తుంది. సుజాతని ఎవరో పిలస్తే బయటకు వెళ్తుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి బీరువా తాళం తీసి డ్రెస్ మార్చుకుంటుంది. రామలక్ష్మి డ్రెస్ వేసుకొని బయటకు రాగానే.. అదేంటీ గదిలో ఉన్నాయని చెప్పాను.. బీరువా తాళం ఎక్కడ ఉందో చెప్పలేదు కదా అని సుజాత అంటుంది. అయ్యో పొరపాటుగా తీసేసానంటూ బీరువా తాళం దానికే ఉందని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.