Eto Vellipoyindhi Manasu : ఎమోషనల్ అయిన సీతాకాంత్.. రామ్ గురించి తన ఆలోచన!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -379 లో..... రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు రామ్ చెప్పాడని ఒకరికొకరు పాయసం తినిపించుకుంటారు. అదంతా చూడలేని శ్రీలత, సందీప్, శ్రీవల్లి బయటకు వచ్చి కుళ్ళుకుంటారు. అయిపోయింది అంతా అయిపోయింది బావ గారు , మైథిలీ భార్యాభర్తలు అయినట్టు అలా తినిపించుకోవడం నాకు నచ్చలేదని శ్రీవల్లి అంటుంది. ఇంతవరకు ఏం చేసిన ఈ ఆస్తికి నిన్ను వారసుడుగా చూడడం కోసమే.. కొన్ని రోజులు ఓపిక పట్టు సందీప్ అని శ్రీలత అంటుంది.