‘బ్రో’ మూవీ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 25వ సినిమా కావడం విశేషం. తమిళ సినిమా 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని, మాతృకకి దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్ట్ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మరి ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బ్రో' చిత్రం ఎలా ఉంది?..