English | Telugu

పవన్ కళ్యాణ్ కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. నాజర్ షాకింగ్ కామెంట్స్!

తమిళ సినిమాల్లో తమిళ వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలంటూ 'ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా'(ఫెఫ్సీ) కొత్త నిబంధనను తీసుకొచ్చిందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని పలువురు తప్పుబట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే 'ఆర్ఆర్ఆర్' లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతారని సూచించారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై సీనియర్ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ స్పందించారు. అసలు ఫెఫ్సీ అలాంటి నిబంధన తీసుకురాలేదని, పవన్ కళ్యాణ్ కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

"తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే నియమాలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఒకవేళ అలాంటి నిబంధన తీసుకువస్తే ముందు నేనే వ్యక్తిరేకిస్తాను. కళాకారులుకు సరిహద్దులు ఉండవు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచ‌న‌లు చేశారు. తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లను పెట్టుకోమని సూచించారు. అంతే కానీ ఇతర భాషలకు చెందినవారికి తీసుకోవద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడన్నీ పాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది నటినటులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది." అంటూ ఈ అంశంపై నాజర్ క్లారిటీ ఇచ్చారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.