English | Telugu

రిషి, వసుధారల ఎంగేజ్మెంట్..  శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -759 లో.. సౌజన్యరావు ఇదంతా చేసింది నువ్వేనా అని రిషి అనగానే.. ఒకసారి ఏదో చేసానని అన్ని నేనే చేశానని అంటే ఒప్పుకోనని సౌజన్య రావు అంటాడు. రిషి ఆవేశపడుతూ మాట్లాడుతుండగా.. శైలేంద్ర తనని ఆపి.. నువ్వు వెళ్ళు రిషి నేను మాట్లాడి, మన జోలికి రాకుండా చేస్తాను. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని అంటాడు శైలేంద్ర. రిషి వెళ్ళగానే శైలేంద్ర నవ్వుతూ.. ఇలానే చేస్తూ ఉండమని అంటాడు. రిషి కార్ లో నుండి చూస్తుండగా.. సౌజన్యరావుకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతాడు. కాసేపటికి సౌజన్య రావు వెళ్ళిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త మలుపు.. రాజ్ కనిపెట్టేసాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో... రాజ్ ని కావ్య పక్కకి పిలిచి మాట్లాడుతుంది. అంతమంది ముందు ఇలా పక్కకి పిలిస్తే అందరూ ఏమనుకుంటారని రాజ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి.. మా అక్కని, తన లవర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని కావ్య అంటుంది‌. ఇప్పుడా.. పూజ జరుగుతుంది కదా.. ఇప్పుడెలా వెళతామని రాజ్ అనగానే.. మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. దానివెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే మీరు రావాలి.. లేదంటే నేను మీ ఇంటిదగ్గరే ఉండిపోతానని కావ్య అనగానే సరే అని రాజ్ అంటాడు. ఇద్దరు కలిసి అక్కడ నుండి బయల్దేరతారు.

ఇట్స్ నాట్ బోల్డ్.. గుర్తుపెట్టుకోండి నేనొక యాక్టర్!

ప్రియాంక సింగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీ. జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు సాయితేజ గా పరిచయం అయ్యాడు. అయితే జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ఎక్కువగా వేసిన సాయితేజ.. కొన్ని రోజులకి ఆపరేషన్ చేయించుకొని.. తనని తాను ట్రాన్స్ జెండర్ గా మార్చుకొని కొత్తగా మారిపోయాడు. ఇప్పుడు ప్రియాంక సింగ్ గా అవతారమెత్తాడు సాయితేజ. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత తను పడిన కష్టాలను, ఎదుర్కున్న ఇబ్బందులు అన్నింటిని చాలా సార్లు చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్. తను ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది.

అందరి అంతరంగాల్ని బయట పెట్టిన ఓపెన్ హార్ట్ విత్ రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇందులో రాంప్రసాద్ మ్యారేజ్ బ్యూరో కంపెనీ పేరుతో ఒక సెగ్మెంట్ చేశారు.  కొంతమంది కుర్రాళ్లకు పెళ్లి చేయడం కోసం రాంప్రసాద్ ఈ బ్యూరోని పెట్టాడు. జెస్సి, మెహబూబ్, ఆదర్శ్, జిత్తు ఇలా కొంత మందిని చూపించారు. "ఒక 5 వేలు ఎక్కువైనా పర్లేదు..మంచి అమ్మాయిని సెట్ చేయండి" అని ఆదర్శ్ అనేసరికి "ఏమనుకుంటున్నావ్ నువ్వు ఇది మ్యారేజ్ బ్యూరో..శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు సెట్ చేస్తారు" అని చెప్పాడు. ఇక ఈ షోకి "వ్యవస్థ" మూవీ నుంచి సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కార్తిక్ రత్నం వచ్చారు. ఈ మ్యారేజ్ బ్యూరోలో  అమ్మాయిలు  కావాలి అనుకుంటే అబ్బాయిలు స్కెటింగ్ షూస్ వేసుకుని వెళ్లి అమ్మాయిలను చేరుకోవాలి అనే టాస్క్ ఇచ్చారు

టైంకి షూట్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అనేదే నా డిమాండ్

సుమ అడ్డా షోలో ఈ వారం ఏజెంట్ టీం నుంచి హీరో, హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళతో ఎన్నో రకాల ఫన్నీ గేమ్స్ ఆడించింది సుమ. తర్వాత ఎన్నో ప్రశ్నలు కూడా వేసింది. "మీరు నటించిన హీరోయిన్స్ తో డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోయిన్ తో వెళ్తారు" అనేసరికి "పూజ హెగ్డేతో వెళ్తాను" అని చెప్పాడు అఖిల్. "బాగా ఇష్టమైన హీరో ఎవరు"..."రామ్ చరణ్ ". "ఇండియన్ క్రికెట్ టీంలో ఆడే ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారా" అని అడిగింది సుమ.."తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాను అది సాధ్యమా ? ఈ జన్మకు సాధ్యం కాదు" అని చెప్పాడు "బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్నకు  క్రికెట్ ఆడతాను" అన్నాడు .."మీరు చేసిన పనుల్లో నాగార్జునగారికి ఇప్పటికీ తెలియని ఒక పని చెప్పండి" "రాత్రి పూట గోడ దూకేసి బయటికి వెళ్ళిపోయి..రావడం..అదొక అడ్వెంచర్ నాకు. మా ఇంటి గోడ కూడా 25 అడుగుల ఎత్తు ఉంటుంది" అని చెప్పడంతో సుమ షాకయ్యింది.

ఓంకార్ ని పెళ్లి చేసుకుంటానన్న స్రవంతి...

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 కి ఎంతో మంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిస్తున్నాడు యాంకర్ ఓంకార్. ఈ వారం ఫేమస్ టీవీ న్యూస్ రీడర్స్ తో పాటు బిగ్ బాస్ నుంచి కొంత మంది సెలబ్రిటీస్ కి కూడా ఇన్వైట్ చేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 నుంచి  గీతూ రాయల్, ఆదిరెడ్డితో పాటు ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ లో ఆడిన స్రవంతి, శివ కూడా వచ్చారు. "వచ్చినప్పటి నుంచి ఈ విషయం చెప్పకుండా ఉన్నా..అదేంటంటే..చిన్నప్పుడు నేను మా అమ్మకు చెప్పాను..నేను పెద్దయ్యాక ఓంకార్ గారిని పెళ్లి చేసుకుంటా అని..నాకు తెలీదు కానీ చిన్నప్పటి నుంచి మీ మీద క్రష్ ఉంది నాకు" అని చెప్పింది స్రవంతి. "పది లక్షల కోసమేగా" మాకు తెలుసులే అని గీతూ చెప్పేసరికి "అస్సలు డబ్బులు అవసరం లేదు. ఓంకార్ గారు ఉంటే చాలు" అంది స్రవంతి. బిగ్ బాస్ తర్వాత "ఆది నీలో ఇంత డాన్సా.. నీకు డాన్స్ వచ్చేసింది" అన్నాడు ఓంకార్. డాన్స్ వచ్చిన వాడికి స్టెప్స్ రావాలి..అదే డాన్స్ రానివాడికి వేసినవే స్టెప్స్ . నాకు చాలా ఈజీ..ఎక్కడైనా అవే స్టెప్స్ కదా.

తనపై ఎటాక్ చేయించింది ఎవరో రిషి కనిపెట్టగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-758 లో.. ఇంటి మేడ మీద జగతి ఒక్కతే కూర్చొని ఏడ్వడం చూసిన మహేంద్ర, వసుధారలు తన దగ్గరికి వెళ్తారు. ఏమైందని అడిగితే చెప్పకుండా నడుస్తుంది జగతి. ఆ తర్వాత రిషి మేడ మీదకి రాగానే.. జగతి తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రిషి ఎన్నిసార్లు ఏమైందని అడిగినా ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తుంటుంది జగతి. కాసేపటికి వసుధార జగతిని అర్థం చేసుకొని.. రిషి, మహేంద్రలని కిందకి వెళ్ళమని చెప్తుంది. నేను ఏం జరిగిందో తెలుసుకొని వస్తాను మీరు వెళ్ళండని వాళ్ళిద్దరికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత వసుధార ఏమైందని జగతిని అడుగగా.. నేను ఇప్పుడు చెప్తే ఎవరూ ప్రాణాలతో మిగలరని జగతి తన మనసులో అనుకుంటుంది. కానీ బయటకు ఏమీ చెప్పదు.

మురారి బర్త్ డే రోజున కేక్ కట్ చేపిస్తానని చెప్పిన ఆ ఇద్దరు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-152 లో.. ముకుంద తన గదిలో‌ రెడీ అవుతుంది. అప్పుడే తన గదిలోని అద్దంలో ముకుంద ప్రతిబింబం కనిపిస్తుంది. నువ్వు మారిపోయావ్.. భ్రమలో ఉన్నావని ఆ ప్రతిబింబం అడుగగా.. రోజురోజుకి కృష్ణకి మురారి దగ్గర అవుతున్నాడు అదే నా భయమని ముకుంద అంటుంది. నువ్వు మనుషులని నమ్మకు, ప్రేమని నమ్ము అది మారిపోదు..‌ మనసుతో ప్రేమించమని ఆ ప్రతిబింబం ముకుందతో చెప్తుంది. ఆ తర్వాత ముకుంద నిజంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ముకుంద గతంలో మురారితో కేక్ కట్ చేపించిన జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటుంది. 

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రాహుల్, స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -91 లో... కావ్యకి పదహారు రోజుల పండుగని గుడిలో కనకం జరిపిస్తుంది. దానికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాజరవుతారు. అపర్ణ మాత్రం ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది. మరొకవైపు కనకం వాళ్ళ ఇంటిలో ఒంటరిగా ఉన్న స్వప్న ఎక్కడికో బయల్దేరుతుందని తెలుసుకున్న అప్పు.. ఈ విషయాన్ని కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్తుంది. అక్కడ రాహుల్ ఉన్నాడా అని అప్పు అడుగుతుంది. ఇప్పుడే రాహుల్ ఎక్కడికో వెళ్తున్నాడని ఫోన్ లో అవతలివైపు నుండి కళ్యాణ్ చెప్తాడు. స్వప్నని కలవడానికని అప్పు అంటుంది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం.. ఇదే మంచి ఛాన్స్ అని అప్పు అంటుంది. సరే నేను రాహుల్ ని ఫాలో చేస్తానని కళ్యాణ్ అంటాడు.