Read more!

English | Telugu

అందరి అంతరంగాల్ని బయట పెట్టిన ఓపెన్ హార్ట్ విత్ రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇందులో రాంప్రసాద్ మ్యారేజ్ బ్యూరో కంపెనీ పేరుతో ఒక సెగ్మెంట్ చేశారు.  కొంతమంది కుర్రాళ్లకు పెళ్లి చేయడం కోసం రాంప్రసాద్ ఈ బ్యూరోని పెట్టాడు. జెస్సి, మెహబూబ్, ఆదర్శ్, జిత్తు ఇలా కొంత మందిని చూపించారు. "ఒక 5 వేలు ఎక్కువైనా పర్లేదు..మంచి అమ్మాయిని సెట్ చేయండి" అని ఆదర్శ్ అనేసరికి "ఏమనుకుంటున్నావ్ నువ్వు ఇది మ్యారేజ్ బ్యూరో..శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు సెట్ చేస్తారు" అని చెప్పాడు. ఇక ఈ షోకి "వ్యవస్థ" మూవీ నుంచి సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కార్తిక్ రత్నం వచ్చారు. ఈ మ్యారేజ్ బ్యూరోలో  అమ్మాయిలు  కావాలి అనుకుంటే అబ్బాయిలు స్కెటింగ్ షూస్ వేసుకుని వెళ్లి అమ్మాయిలను చేరుకోవాలి అనే టాస్క్ ఇచ్చారు తరువాత  మిర్చి తినే టాస్క్ ఇచ్చింది ఇంద్రజ. ఇక్కడి వరకు ఒక సెగ్మెంట్ అయ్యాక "ఓపెన్ హార్ట్ విత్ రష్మీ" అనే సెగ్మెంట్ కూడా నిర్వహించింది.

ఇందులో ముందుగా స్రవంతి వచ్చింది "స్రవంతి అనగానే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చులకనగా మాట్లాడతారు ఎందుకు" అని అడిగింది. దానికి ఏడుస్తూ ఏదో ఆన్సర్ ఇచ్చింది స్రవంతి. తర్వాత జెస్సి వచ్చాడు "మీకు బాగా పిచ్చి ఉందట" అని అడిగింది. "రీసెంట్ టైమ్స్ లో చాలా పెయిన్ ఫుల్ సిట్యుయేషన్ జరిగింది" అని మెహబూబ్ ని అడిగేసరికి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఏడ్చేశాడు. తర్వాత ఇంద్రజ రష్మిని అడిగింది "రష్మీ మీరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయారు ఎందుకు" అని అడిగింది. ఈ ప్రశ్నలకు అసలు వాళ్ళు ఏం ఆన్సర్స్ చెప్పారో తెలియాలంటే సండే వరకు వెయిట్ చేయాలి.