సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు

  సికింద్రాబాద్‌లో తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీం అధికారులు పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  పాత స్కూల్‌ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం అధికారుల బృందం వారిని విచారిస్తోంది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించినట్టు సమాచారం. మత్తు మందును తరలిస్తున్న సమయంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. వారి వద్ద నుండి కోటి రూపాయల విలువైన మత్తు మందు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూన్‌‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం : రామ్మోహన్‌నాయుడు

  విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తియ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులు, పురోగతిపై అధికారులతో చర్చించారు. వర్షాలు కురుస్తున్నా జీఎం‌ఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా విశాఖ నుంచి  రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.   వచ్చే ఏప్రిల్ నాటికి ఈ రహదారి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే వైజాగ్ బీచ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. తొలి దశలో రూ.4,592 కోట్లతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తున్నారు. మొత్తం 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు ఇతరత్రా అవసరాల కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి మరో 500 ఎకరాల భూమిని అదనంగా కేటాయించింది.  

ఏపీలో 14 జిల్లాలకు నూతన ఎస్పీలు

  ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు నూతన అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ రాహుల్‌ మీనా బాపట్ల- ఉమామహేశ్వర్‌ కృష్ణా- విద్యాసాగర్‌ నాయుడు నెల్లూరు- అజితా వేజెండ్ల తిరుపతి- సుబ్బరాయుడు అన్నమయ్య- ధీరజ్‌ కునుగిలి కడప- నచికేత్‌ గుంటూరు- వకుల్‌ జిందాల్‌ నంద్యాల- సునీల్‌ షెరాన్‌ విజయనగరం- ఏఆర్‌ దామోదర్‌ పల్నాడు- డి.కృష్ణారావు ప్రకాశం- హర్షవర్ధన్‌ రాజు  ప్రకాశం– హర్షవర్థన్ రాజు  చిత్తూరు – తుషార్ డూడి శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్  

ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి : ప్రధాని

    మణిపూర్ పర్యటలో భాగంగా అల్లర్ల బాధితులను  ప్రధాని మోదీ పరామర్శించారు. భారీ వర్షం కారణంగా హెలికాప్టర్ అనుమతి లభించకపోవడంతో ప్రధాని ఇంఫాల్ నుంచి 65 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి చురచంద్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడ పురావాస కేంద్రాలను సందర్మించి బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.  బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 8,070 కోట్ల వ్యయం అయ్యింది. సవాళ్లతో కూడి కొండ ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ రైల్వే లైన్‌ కింద 45 టన్నెల్స్, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలను కూడా నిర్మించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని  దేశ ప్రగతికి మణిపూర్‌ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని ప్రధాని అన్నారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 2023లో ఘర్షణల తర్వాత రెండేళ్లకు ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క సరెండర్

  మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్​ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో మృతి చెందిన అగ్రనేత కిషన్‌జీ భార్య సుజాతక్క, ఛత్తీస్‌గఢ్‌ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెపై 106 కేసులు నమోదు కాగా, రూ.1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్​జీ భార్యనే సుజాతక్క. 1984లో కిషన్‌జీని ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​ సౌత్​ సబ్​ జోనల్​ బ్యూరో ఇన్​ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సుజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమె లొంగుబాటు గురించి మధ్యాహ్నం డీజీపీ జితేందర్​ మీడియాకు వివరాలను వెల్లడించనున్నారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం.  

నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం

  నెల్లూరులో దారుణ ఘటన  చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ  దారుణ హత్యకు గురైంది.  ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్ అయితే, మైధిలిప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.  బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైధిలి ప్రియ.. సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో.. మూడో తేదీ నెల్లూరుకు వచ్చింది మృతురాలు. మాట్లాడాలి రూమ్‌కి రమ్మంటు మైదిలికి ఫోన్ చేసిన నిఖిల్.. రూమ్ కి వెళ్లిన తర్వాత మైధిలిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.   మృతి చెందిన తరువాత.. మృతురాలి చెల్లి సాహితికి నిందితుడు ఫోన్ చేశాడు. సాహితీ స్పాట్ కి వెళ్ళగానే మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం  ఉంది.గొడవ జరిగింది, చంపేశానని సాహితికి నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. యువతిని హత్యచేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం, స్వాతి బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు క్లాస్మేట్స్.  మరోవైపు మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని బోరును మృతురాలి తల్లి లక్ష్మి విలపిస్తున్నది. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని‌ కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  

శ్రీశైలం జలాశయానికి వరద... 3 గేట్లు ఎత్తివేత

  ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్‌ నుంచి 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,20,279 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,79,,104 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  3 స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 82,824 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా కొనసాగుతోంది.

కూకట్‌పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్

  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేణు అగర్వాల్ మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు రోషన్, హర్షను జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు, టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా ప్రత్యేక బృందం నిందితులను ఆచూకి తెలుసుకోని వారిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను హైదారాబాద్‌కు తరలిస్తున్నారు. హత్య అనంతరం క్యాబ్‌లో విశాఖపట్టణం మీదుగా రాంచీ పారిపోయిన నిందితులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చూసి నిందితులను గుర్తించి, పోలీసులకు క్యాబ్ డ్రైవర్  సమాచారమిచ్చారు. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్  దంపతులకు హైదరాబాద్ ఫతేనగర్‌లో స్టీల్ సామాన్ల దుకాణం ఉంది. వారి కూతురు తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుండగా.. కొడుకు శుభంతో కూకట్ పల్లిలోనే ఇంట్లో ఉంటున్నారు. స్వాన్ లేక్ లోనే రేణు బంధువుల ఇంటిలో రోషన్ 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనే జార్ఖండ్ లో తమ గ్రామానికి చెందిన హర్షను కొద్దిరోజుల క్రితం రేణు ఇంటిలో వంటమనిషిగా పెట్టించాడు. రాకేష్, శుభం తమ షాపుకు వెళ్లగా.. రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉంది.  ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ ఫోన్ చేసినా తీయకపోవడంతో 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో ప్లంబర్ ను పిలిపించి బ్యాక్ డోర్ ఓపెన్ చేయించారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి.. రక్తపు మడుగులో పడి ఉంది. శరీరంపై తీవ్రగాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో రేణును హర్ష, రోషన్ లు చంపినట్లు నిర్థారించారు. ఆమెను తాళ్లతో కట్టేసి డబ్బు, నగల కోసం చిత్రహింసలు చేసినట్లుగా గుర్తించారు. ఆపై కూరగాయల కత్తులతో గొంతుగోసి, కుక్కర్ తో తలపై బలంగా కొట్టడంతో రేణు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

తిరుపతిలో రౌడీ షీటర్ హల్చల్

  తిరుపతిలో  ఓ రౌడీషీటర్ హల్చల్ సృష్టించారు. ఇరువురు మహిళలను కిడ్నాప్ చేసి మాట వినకపోతే చంపేస్తా.... అంటూ కత్తులతో  బెదిరించాడు దుండగుడు.  కిడ్నాప్ కు గురైన మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. దీంతో  శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న సీఐ రామకిషోర్ బృందం రౌడీషీటర్ కోసం దర్యాప్తు చేపట్టారు.  పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే ప్రయత్నంలో  రెండు కార్లను,ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు.    ఎట్టకేలకు సినీ తరహాలో  వెంబడించి సీఐ బృందం పట్టుకున్నరు. తల్లి కూతుర్లను క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు.  నిందితుడు రౌడీషీటర్ ను అదుపులోకి....తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ అజీమ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా పలు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తెలిపింది.  రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక నిన్న శుక్రవారం 69,842 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

  అది సాయంత్రం సమయం.. కాలనీలో అందరూ అరగుల మీద కూర్చొని ముచ్చట పెడుతున్నారు.. ఇదే సమయంలో ఒక వ్యక్తి నడుచు కుంటూ వెళ్తున్నాడు.. అతని వెంబడిస్తూ ఒక స్కూటీ వెళ్తుంది.. ఒక్కసారిగా స్కూటీ ఆగిపోయింది. ఒకరు పొడవాటి కత్తి తీసుకొని కిందికి దిగాడు.. నడుస్తున్న వ్యక్తి పైన ఒక్కసారిగా దాడి చేశాడు.. సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడి పోయాడు.. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో చంపేశారు. ఈ సంఘటన కుషాయిగూడలో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.  అయితే బైక్ పై ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ని చంపు తుంటే అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయినప్పుటికీ  దుండగుడు వినిపించుకోకుండా కింద పడిపోయిన శ్రీకాంత్ ని విచక్షణ రహితంగా పొడిచి పొడిచి చంపేశాడు. అక్కడున్న స్థానికు లంతా వినోదం చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోవడమే కాకుండా తమ తమ ఫోన్లలో ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఇంతలో  బైక్ పై  ఉన్న వ్యక్తి దుండగుడిన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.  అయితే ఆ దుండ గుడు కసితీరా శ్రీకాంత్ ని చంపిన తర్వాత నేరుగా బైక్ తీసుకొని వెళ్ళి పోయి ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతని వెంబడించి పట్టుకుని రోడ్డు మీద కూర్చోబె ట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి శ్రీకాంత్ ని చంపిన వ్యక్తిని అప్పగించారు.. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్‌ను ఎందుకు చంపారు అనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం పోలీసులు దుండగున్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  

తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం

  తెలంగాణ రవాణా శాఖకు కాసుల పంట పండింది.. ఫాన్సీ నెంబర్ల వేలంపాట ద్వారా ప్రభుత్వానికి రోజు రోజుకుపెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు...ఒకటి నుంచి తొమ్మిది లోపు గల సింగిల్ డిజిట్ నెంబర్లను కైవసం చేసుకోవ డానికి వ్యాపార వేత్తలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఒకటి, తొమ్మిది నెంబర్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది.. ఈ నెంబర్ల కోసం వ్యాపారవేత్తలు లక్షల రూపాయ లను సైతం చెల్లించేందుకు సిద్ధపడుతూ ఉంటారు.   అయితే ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకం ద్వారా ఏకంగా ఒక్కరోజు లోనే రూ. 63 లక్షల రూపాయల ఆదా యం తెలంగాణ రవాణా శాఖకు వచ్చి పడింది.. 9999 ఈ ఒక్క  నెంబర్ అమ్మగా ఏకంగా రూ. 25 లక్షల రూపాయల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది. టీజీ 09 జీ 9999 నెంబర్ను హెటిరో డ్రగ్స్ కొనుగోలు చేసింది.. ఈ నెంబర్ కోసం చాలామంది పోటీ పడ్డారు..  ఆల్ నైన్ నెంబర్ కోసం పెద్ద ఎత్తున వేలం పాట నిర్వహిం చారు.ఈ నెంబర్కు హెట్రో  డ్రగ్స్ రూ.  25 లక్షల రూపాయలు చెల్లించి నెంబర్ను దక్కించుకుంది..అదే మాదిరిగా 0009 నెంబర్ కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.  

చేవెళ్లలో దారి దోపిడీ కలకలం

  దారి దోపిడీ చేయడానికి పక్కగా ప్లాన్ చేశారు... అనుకున్న పథకం ప్రకారమే కారును అడ్డగించి... నానా హల్చల్ సృష్టించి చివరకు ఓ వ్యక్తి వద్ద నుండి లక్షల రూపాయల బ్యాగును దోచుకున్నారు. ఇక తమను పోలీసులు ఎవరూ పట్టుకోలేరని.... ఈ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చునని సంతోష పడుతూ వెళ్తున్న సమయం లో విధి వక్రీంచింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో దుండగులు తాము ఎక్కడ పోలీసుల చేతికి చిక్కుతా మేమో నని భయపడి కారుతో పాటు కొంత డబ్బు అక్కడే వదిలేసి పారిపో యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్లే మండలం లోని కొత్తపల్లి గ్రామ సమీపంలో ఒక స్టీల్ వ్యాపారి తన కారు లో వెళుతున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి వెనుక నుండి ఢీ కొట్టడమే కాకుండా ముందుకు వచ్చి వ్యాపారి కారును అడ్డగించి... కారు అద్దాలు పగల గొట్టి... హంగామా సృష్టించారు. అనంతరం కారులో ఉన్న వ్యాపారి, డ్రైవర్ కళ్ళల్లో కారంపొడి కొట్టి.... వెంటనే వ్యాపారి వద్దనున్న 40 లక్షల రూపాయల బ్యాగును తీసుకొని అక్కడి నుండి పారిపో యారు.  దొంగిలించిన డబ్బుతో ఎంజాయ్ చేయ వచ్చునంటూ తెగ సంబరపడి పోతూ.. కార్‌లో అత్యంత వేగంగా  వెళుతుండగా కారు ఒక్కసారి గా అదు పుతప్పి బోర్ల పడింది. దుండ గులు కారులో చిక్కుకుపోయారు. ఎలాగైనా సరే కష్టపడి కార్‌లో నుండి దుండగులు బయటికి వచ్చారు. పోలీసుల చేతికి చిక్కుతా మేమో నన్న భయంతో కారుతో పాటు కారులో కొంత డబ్బు వదిలివేసి అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణం పూర్తిగా పరిశీలించగా కారులో బొమ్మ తుపాకి తో పాటు కత్తి, కారంపొడి ఉన్నట్లు గా పోలీసులు గుర్తించారు. దుండగులు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారు తో పాటు కారులో 15 లక్షల రూపాయలు కూడా వదిలివేసి వెళ్లినట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కారుతో పాటు 15 లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దుండ గులను పట్టుకు నేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  

వైసీపీ సీనియర్ నేత మృతి

  వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూ ఆయన ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన  గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతిపై  వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశాస్తూ.  ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి బంధువు. 

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

  తెలంగాణలో  రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.  ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనిపేర్కొంది.  

ఎకరం @రూ.800 కోట్లు

ఎకరం మహా రూ. కోట్లు పలికితే ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ కోకాపేటలో గతంలో ప్రభుత్వ భూముల వేలం సందర్బంగా ఎకరం వంద కోట్ల రూపాయలు పలికితే  అందరూ గుడ్లు తేలేశారు. భూముల ధరలకు రెక్కలు అంటూ నెలల తరబడి మాట్లాడుకున్నారు. అది అంతా గతం ఇప్పుడు ఏకంగా ఎకరం 800 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఎక్కడో తెలుసా?  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. ఔను ముంబైలోని ఒక ప్రాంతంలో ఎకరం దాదాపు 800 కోట్ల రూపాయల చొప్పున 4,16 ఎకరాల భూమిని అక్షరాలా 3 వేల 472 కోట్ల రూపాయలకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నామిమన్ పాయింట్ లో ఈ భూమిని రిజర్వ్ మ బ్యాంక్ ఆఫ్ ఇ     ండియా కొనుగోలు చేసింది.  ఈ లాండ్ పర్చేజ్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ముంబైలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీడ్ అని చెప్పవచ్చు. ఇంతకీ నారీమన్ పాయింట్ లో ఈ భూమిని ఆర్బీఐ తన కొత్త కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కోనుగోలు చేసింది. ముంబైలో నారిమన్ పాయింట్ ప్రైమ్ బిజినెస్ ఏరియా. 1970ల నుంచీ ఈ ప్రాంతం బిజినెస్ హబ్ గా కొనసాగుతోంది.  

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు తోడు తీరప్రాంతాలలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.   పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలలో శుక్ర, శని (సెప్టెంబర్ 12, 13)వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో   అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రజలకు సూచించింది. 

ఆయేషామీరా హత్య కేసులో ట్విస్ట్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసిన సీబీఐ ఆయేషామీరా  తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేర్కొంది.  17 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని , ఇంకా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారని, బాధితులైన తాము ఎన్నిసార్లు కోర్టుకు తిరగాలని తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2007 డిసెంబర్27వ తేదీన జరిగింది. తాను ఉంటున్న హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాగా ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో సంక్షోభాలు.. అసలేం జరుగుతోంది?

ఇటీవలి  కాలంలో  భారత్ తో స్నేహ సంబంధాలకు దూరమైన ఒక్కో దేశం సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుంటోంది.   భారత్ తో విభేదించిన దేశాలన్నీ ఇలా సంక్షోభాలలో కూరుకుపోతుండటం కాకతాళీ యమనే చెప్పాలి.  బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవులు ఇలా ఈ దేశాలన్నీ వరుసగా, ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఆర్ధిక,రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. భారత్ ను వ్యక్తిగతంగా ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దౌత్యపరంగా ఆయాదేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పాలన్న భారత్ ప్రయత్నాలు ఏమంత ఫలించడం లేదు.  మాల్దీవుల విషయానికి వస్తే.. ఆ దేశాధ్యక్షుడు   ముయిజ్జూ  ఇండియా ఔట్ నినాదంతో గెలిచారు. అనంతరం చైనాతో చేతులు కలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ 2024లో తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. దాంతో కళ్లు తెరిచిన ముయిజ్జూ భారత్ తో  సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అర్రులు చాస్తున్నారు. అయినా ఆ దేశంలో ఇప్పటికీ రాజకీయ  అస్థిరత రాజ్యమేలుతోంది. గతంలో అంటే భారత్ కు మిత్రదేశంగా ఉన్నంత కాలం మాల్దీవుల్లో సుస్థిరత చెక్కు చెదరలేదు.   ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఆ దేశంలో  హసీనా ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ అస్ధిరత మొదలైంది.హిందువులపై దాడులు వారి ఆస్తుల ధ్వంసం జరిగాయి. ఆదేశంలో ఇప్పుడున్న స్రభుత్వం ఆర్మీ చేతిలో కీలుబొమ్మ.  పాకిస్థాన్, చైనాతో సన్నిహిత సంబంధాలు కోసం వెంపర్లాడుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావమే భారత్ జోక్యంతో ఏర్పడింది. ఆ విషయాన్ని మరచి భారత్ ను శత్రుదేశంగా చూడటం ప్రారంభించడంతోనే ఆ దేశం సంక్షోభ, కల్లోలాల నిలయంగా మారిపోయింది.  భారత అనుకూల విధానాలను అవలంబిచిన హసీనా అధికారంలో ఉన్నంత కాలం ఆ దేశం సుస్థిరంగా ఉంది. ప్రజాస్వామ్యదేశంగా సగర్వంగా నిలబడింది. ఆ తరువాతనే దేశంలో రాజకీయ అస్థిరత, అంతర్గత సంక్షోభం తలెత్తి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే..  ఆ దేశం కూడా అకారణంగా భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని అవలంబించి చైనాకు దగ్గర కావడం కోసం ప్రయత్నాలు చేసి సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్ విషయం చెప్పనే అక్కర్లేదు. దాయాది దేశానికి బారత్ తో ఎన్నడూ సయోధ్య, సత్సంబంధాలూ లేవు. ఆ దేశం ఆవిర్భావం నుంచీ సంక్షోభాలతో సహవాసం చేస్తున్నదని చెప్పడం అతి శయోక్తి కాదు.  అలాగే మయన్మార్.. 2021లో సైనిక తిరుగుబాటు తరువాత ఆ దేశం సంక్షోభాల వలయంలో కూరుకుపోయి ఉంది.  తాజాగా భారత్ పై సుంకాల యుద్ధం ప్రారంభించిన అమెరికా కూడా పెను ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట నిలిచింది. భారత్ పై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇది అమెరికాకు నిజంగా తట్టుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా రష్యా, చైనాలు భారత్ కు స్నేహహస్తం చాచడంతో అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పుట్టిమునగక ముందే భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇరుదేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రధాని మోడీతో చర్చలకు ట్రంప్ వెంపర్లాడుతున్నారు. ఇక అలాగే సంక్షోభాలలో కూరుకుపోయిన ఇరుగుపొరుగుదేశాలు కూడా తమ భారత్ తో వైరానికి ఫుల్ స్టాప్ పెట్టి స్నేహ మార్గంలో పయనిస్తే..  ఆర్థిక, రాజకీయ ఆస్థిరత నుంచి సుస్ధిరత దిశగా వాటి అడుగులు పడే అవకాశం ఉంటుంది.