ఈ అమావాస్య ముహూర్తమేంది సారు.. తలలు పట్టుకుంటున్న కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలలో నెగ్గిన కార్పొరేటర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చేసింది. ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేట‌ర్ సీటులో కూర్చుందామని ‌ త‌హ‌త‌హ‌లాడుతున్న ఆ నేత‌ల కోరిక తీర‌బోతోంది. అయితే ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం ముహూర్తం కొత్త కార్పొరేట‌ర్లను వ‌ణికిస్తోంది. వారి భయానికి కల ముఖ్య కారణం ఏంటంటే ఐదేళ్లపాటు ఉండాల్సిన ప‌ద‌వి కోసం చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజు పెట్ట‌డ‌మేంట‌ని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అసలే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. తమకు కావాల్సిన బ‌లం లేక‌పోయినా అధికార టిఆర్ఎస్ పార్టీ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌ను నిలబెడుతోంది. దీంతో గ్రేటర్ పాల‌క మండ‌లిలో ఏ క్షణం ఎలాంటి ముస‌లం పుడుతుందో.. త‌మ ప‌ద‌వుల‌కు గండం ముంచుకొస్తుందోన‌ని కొత్త కార్పొరేటర్లు టెన్ష‌న్ ‌ప‌డుతున్నారు. దీంతో ప్ర‌మాణ స్వీకార ముహుర్తంపై తమ అభ్యంత‌రాల‌ను అధికారుల దృష్టికిపార్టీలు తీసుకెళ్లాయి . అయితే ఇది ఎన్నికల సంఘం నిర్ణ‌య‌మ‌ని, దీంతో తామేం చేయ‌లేమ‌ని అధికారులు కూడా చేతులెత్తేశారు. దీంతో దేవుడిపై భారం వేసి కార్పొరేటర్లు ప్ర‌మాణ‌స్వీకారానికి సిద్ద‌మ‌వుతున్నారు.

విశాఖ ఉక్కును కాపాడుకుందాం.. కానీ !  విజయసాయి వ్యాఖ్యలతో రచ్చ  

సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో కార్మికులకు అండగా నిలవాల్సిన వైసీపీ నేతలే .. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరింత గందరగోళ పరుస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో  ఇప్పుడు రచ్చ జరుగుతోంది.              విశాఖలో జరుగుతున్న అఖిలపక్ష నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే  విజయసాయి మాట్లాడుతుండగా  కొందరు కార్మికులు అభ్యంతరం చెప్పారు. విశాఖ ప్లాంటును కొనసాగించే ప్రయత్నం చేద్దామని, కొన్ని సార్లు లక్ష్యం నెరవేరుతుందని, కొన్ని సార్లు నెరవేరకపోవచ్చని.. దేనికైనా పట్టువిడుపు ఉండాలి   అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రసంగాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ఉక్కు మంత్రి, ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయన్ని కలిసేలా ప్రయత్నిస్తానని విజయ్ సాయి రెడ్డి సర్ది చెప్పారు.    విజయసాయి వ్యాఖ్యలపై సీపీఎం నేతలు అభ్యంతరం తెలిపారు. ‘‘మీకు నచ్చినా...నచ్చకపోయినా నేను చెప్పేది వాస్తవం’’ అని విజయసాయి వాదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సహా మిగితా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెనుదిరిగారు. విజయసాయిరెడ్డి కారును ఆందోళనకారులు  అడ్డుకున్నారు. చివరకు పోలీసుల సహాయంతో ఎంపీ విజయసాయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయసాయి తీరుపై కార్మికులు భగ్గుమంటున్నారు. కార్మికులకు భరోసా కల్పించాల్సింది పోయి... కష్టమనే అర్ధం వచ్చేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయి వ్యాఖ్యలతో  కేంద్రంతో కలిసి రాష్ట్ర సర్కారే ఈ కుట్ర చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్! 

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలు  ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ కీలక నేత పూల రవీందర్ గులాబీ పార్టీకి రాజానామా చేశారు. తనకు పార్టీ కంటే ఉపాధ్యాయ సమస్యలే ముఖ్యమని ప్రకటించారు. తాను రాజీనామా చేయమడే కాదు.. మిగితా టీచర్ ఎమ్మెల్సీలతోనూ రాజీనామా చేయిస్తానని ప్రకటించారు పూల రవీందర్.  పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన మహాధర్నాకు పూల రవీందర్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. అయితే కొందరు ఉపాధ్యాయులు ఆయన మాట్లాడుతుండగా అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీచర్లను అవమానిస్తున్న టీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. దీంతో పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు.. ఆ సభా వేదికపైనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పూల రవీందర్. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు పూల రవీందర్. పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు.  నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గత ఏడాది వరకు పని చేశారు పూల రవీందర్. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన తర్వాత ఆయన ఆ పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు.   

బంధువు పెళ్ళికి వెళ్లి కరోడ్ పతి అయ్యాడు.. లక్ కలిసొస్తే అంతే...

ప్రతి వ్యక్తి జీవితంలో అదృష్టం ఏదో ఒక సమయంలో ఎదో ఒక రూపంలో తలుపు కొడుతుందని చెబుతూరు మన పెద్దలు. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక యువకుడికి ఇలాగె అనుకోని అదృష్టం తలుపుతట్టింది. బంధువుల ఇంట్లో పెళ్లికి పక్క రాష్ట్రానికి వెళ్లి.. మరీ కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...  కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన సోహాన్‌ బలరామ్ అనే యువకుడికి కేరళలో ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది. సోహాన్ ఈ నెల 5వ తేదీన తన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యానికి హాజరై.. తరువాత తన స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితుల బలవంతంపై తనకు ఇష్టం లేకపాయినా.. దేవదాసు దుకాణంలో ఉన్న కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్న సోహన్.. కుటుంబంతో కలిసి కారులో మాండ్య కు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో సోహన్ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని ఫ్రెండ్ చెప్పడంతో అతడు ఏదో తమాషా చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ మళ్లీ మరో కాల్ చేసిన ఫ్రెండ్ వెంటనే టికెట్‌ తీసుకుని వెనక్కు రా అని ఒత్తిడి చేయడంతో దారిలోనే వెనుదిరిగాడు. వెనక్కు వెళ్లిన సోహన్ డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే అతడి టికెట్ కు లాటరీ తగిలింది.దీంతో సోహన్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. అంతేకాకుండా లాటరీలో వచ్చిన డబ్బుతో తమకు వారసత్వంగా ఉన్న రైస్‌మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపాడు. తాజాగా సోషల్ మీడియాలో అతడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.

కన్నబాబుకు ఓటర్ల షాక్..

   వివాదాస్పద ఎమ్మెల్యే కన్నబాబుకు  ఓటర్లు బుద్దిచెప్పారు.. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు, ఇతర వైసీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం రాంబిల్లి మండలం వి.ఆర్‌.అగ్రహారం వెళ్లారు. తాను బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థినే సర్పంచ్‌గా గెలిపించాలని, లేకుంటే పంచాయతీకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావని హెచ్చరించారు. ఒకవేళ ప్రత్యర్థి వర్గానికిచెందిన వ్యక్తిని గెలిపిస్తే తన ఇంటి గుమ్మం ఎక్కనివ్వనని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓపిగ్గా విన్న గ్రామస్థులు... ఒక్కసారిగా కదిలి, ఎమ్మెల్యేపైకి దూసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గన్‌మన్‌ అప్రమత్తమై రక్షణ చర్యలకు దిగారు. అయినా గ్రామస్థులు వెనుకంజవేయకుండా నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కోపంతో ఊగిపోతూ, చేతిలో వున్న మైకును పడేసిన.. గ్రామస్థుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు తన వాహనం వద్దకు బయలుదేరగా. గ్రామస్థులు కూడా కన్నబాబు వెంటనడుస్తూ నిరసన తెలియజేశారు. అతికష్టంమీద వాహనం ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా...కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తన బెదిరింపులకు ప్రజలు ఎదురుకున్నారు.. నాయకుడైన.. సేవకుడైన.. లీడర్ అయినా.. ఫ్లీడర్ అయినా .. అధికారి అయినా.. అచొచ్చిన అంబోతైన ప్రజలకు కోపం రానంత వరకే.. ఒక సారి ప్రజల్లో కోపం పతాక స్థాయికి చేరితే ఎదురుతిరుగుతారు నాయకుల ఆధిపత్య విధానాలను ఎండగడతారు  అవసమైతే ఉప్పుపాతరేస్తారని.. యలమంచి ప్రజలు మరోసారి నిరూపించారు.

షర్మిల పార్టీకి వ్యూహకర్తగా పీకే ! పక్కా ప్లాన్ తోనే జగనన్న బాణం 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలన్న  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది.  జగనన్న బాణం షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు.. షర్మిల కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉందా.. జగన్ తో విభేదించడం వల్లే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు షర్మిల పార్టీ వెనుక బీజేపీ హైకమాండ్ ఉందని కొందరు.. కాదు కాదు అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. కేసీఆర్ బాణమే షర్మిల అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించగా.. సీఎం కేసీఆర్‌ను కాపాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు..  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. గులాబీ నేతలు మాత్రం షర్మిల పార్టీ గురించి స్పందించడం లేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు షర్మిలకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా... సాయంత్రానికి అంతా గప్ చుప్ అయ్యారు. తాము పెట్టిన పోస్టులను కూడా తొలగించారు. పార్టీ పెద్దల ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల విషయంలో  సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.  ఎవరి వాదనలు ఎలా ఉన్నా  వైఎస్ షర్మిల పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి సంబంధించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.  2023 ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో ఆమె అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ .. షర్మిల పార్టీకి కూడా వ్యూహకర్తగా ఉండనున్నారని చెబుతున్నారు. పీకే టీమ్ సేవలను తన కొత్త పార్టీ కోసం షర్మిల తీసుకుంటున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ చేత పాదయాత్ర చేయించడం, జగన్‌ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్  మొత్తం నడిపించింది ప్రశాంత్ కిశోరే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 2019లో  అధికారంలోకి తీసుకురావడంలో ఆయనదే కీ రోల్ అని వైసీపీ నేతలే చెబుతారు.    ఏపీ తరహాలోనే 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయనున్నట్టు తెలిసింది.  జనవరి 8వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక విమానంలో వచ్చి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగానే వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానులు, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గుకు రావొచ్చు, దానికి ఏమేం చేయాలనే అంశాలను పీకే, జగన్, షర్మిల చర్చించినట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అక్కడ ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. ఆ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణకు వచ్చేస్తారని, షర్మిల కోసం పనిచేస్తారని తెలుస్తోంది.  జగన్ తరహాలోనే షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. 106 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2 వేల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర ఉంటుందని షర్మిల వెంట ఉన్న తెలంగాణ నేత  కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడైతే పాదయాత్ర ప్రారంభించారో... అక్కడే చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. తెలంగాణలో పెట్టబోయే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా, ‘రాజ్యన్న రాజ్యం’ అనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా షర్మిల  అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరు, ఎజెండా, గుర్తులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తంగా పీకే టీమ్ డైరెక్షన్ లోనే తెలంగాణలో షర్మిల రాజకీయ గమనం ఉంటుందనేది పక్కాగా తెలుస్తోంది.  

ఏపి పంచాయతీ ఎన్నికలలో బోణీ కొట్టిన కాంగ్రెస్.. సంబరాలు చేసుకున్న నేతలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన దెబ్బతో ఏపీలో కుదేలై ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికలలోను కనీసం డిపాజిట్ల మాట అటుంచి కనీసా స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని స్థాయికి దిగజారిన సంగతి తెల్సిందే. దీంతో ఇక మరో 20 ఏళ్ల వరకు ఏపీలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీకి జోష్ నింపే వార్త వచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి విడత ఎన్నికలలో ఆ పార్టీ మద్దతుదారు ఒకరు గెలవడం ఇక్కడ విశేషం. ఆ పార్టీ గెలిచింది ఒక స్థానంలోనే అయినా, ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడా లేనంత ఉత్సాహాన్ని నింపింది. దాదాపు రాష్ట్రంలో కనుమరుగైన ఆ పార్టీ మద్దతు ప్రకటించిన ఒక అభ్యర్థి గ్రామ సర్పంచ్ గా గెలుపొందడంతో కాంగ్రెస్‌పై ఇంకా ప్రజల్లో అభిమానం అలాగే ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.   కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గొంది సురేశ్ విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు సురేశ్ విజయం సాధించాడు. దీంతో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

ఒక్క ఓటుతో విజయం

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో కొన్ని గ్రామాల్లో ఫలితం చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఒక్క ఓటుతోనే కొందరు విజయం సాధించారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెం సర్పంచిగా కరుణశ్రీ ఎన్నికయ్యారు.  ఆమె ఒకే ఒక్క ఓటుతో గెలుపొందారు. కృష్ణా జిల్లా కంకిపాడులోనూ వైసీపీ మద్దతుదారుడు బైరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతో విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై ఆయన గెలుపొందారు. అతిచిన్న గ్రామం కావడంతో కేవలం 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102, సుబ్రహ్మణ్యానికి 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. దీంతో అధికారులు నాగరాజును సర్పంచ్ గా ప్రకటించారు.  కంకిపాడు మండలంలోని జగన్నాదపురంలో వైసీపీ బలపరిచిన అభ్య్థర్థి పిన్నిబోయిన శ్రీనివాసరావు మూడు ఓట్ల తేడాతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో 40 ఏళ్ల తరువాత తొలిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో కింజారపు సురేష్ 1700 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన స్వయాన అచ్చెన్నాయుడుకు అన్న కుమారుడు.

కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 

వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారింది. తెలంగాణలో   ప్రకంపనలు స్పష్టిస్తోంది. రాజకీయ పార్టీల్లోనూ కొత్త పార్టీపైనే చర్చ జరుగుతోంది. అయితే  షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అన్నారు కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.  వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారని చెప్పారు.వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగానే చేశారని చెప్పారు. వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందన్న రేవంత్..  అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరని తెలిపారు.తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ... రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు.రాజన్న బిడ్డగా సారె పెట్టి పంపుతా కానీ, పార్టీ పెడితే ప్రజలు ఆమోదించరన్నారు.కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదని తేల్చి చెప్పారు.షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చేందుకు పార్టీ పెట్టిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్ర నుంచి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలన్నారు రేవంత్ రెడ్డి.   షర్మిలకు తన అన్నతో పంచాయితీ ఉంటే అక్కడే చూసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణ వద్దు... సమైక్యరాష్ట్రం ముద్దు నినదించారు కాబట్టి.. చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నని కాదని మా తెలంగాణ పక్షాన నువ్వు నిలబడే చిత్తశుద్ధి ఉందా అని షర్మిలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మన రాష్ట్రం మనం ఏలాలా... పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏలాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదన్నారు. 1200 మంది బిడ్డల బలిదానాలను అవమానించే వాడే షర్మిలకు స్వాగతం పలుకుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు  రేవంత్ రెడ్డి.   

వైసిపి ఎంపీకి షాక్.. సొంత ఊరిలో టీడీపీకి ఏకగ్రీవం..

ఏపీలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ రోజూ జరిచిన తొలివిడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరోపక్క ఓట్ల కౌంటింగ్ ఉద మొదలైంది. ఈ సాయంత్రం లోపు ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు జరిగిన పోలింగ్ లో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా అంతా సజావుగా సాగింది. ఇదిలా ఉండగా... రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులూ తమ సొంత గ్రామాలపై దృష్టి పెట్టారు. మరోపక్క ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఇది ఇలా ఉండగా అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సొంత ఊరు కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఊరిలో 10 వార్డుల్లో మొతం 1154 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ స్థానాలకు మొదట ఐదుగురు నామినేషన్ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో మధు సర్పంచ్ గా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

జగనన్న బాణం రివర్సైందా! వైసీపీలో ఎందుకా కలవరం ?

వైఎస్ కుటుంబం చీలిపోయిందా? జగన్, షర్మిల మధ్య కొంత కాలంగా మాటలే లేవా? జగనన్న వదిలిన బాణం టార్గెట్ ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయమైంది. చేవెళ్లలో ఆమె పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ నేత రాఘవరెడ్డి ప్రకటించారు. అయితే ఆ తేదీ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. వైఎస్ షర్మిల తాజా అడుగులతో వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తెలుస్తోంది. తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా.. షర్మిల కొత్త పార్టీ పెడుతుండటమే సంచలనం కాగా... అభిమానులతో సమావేశం సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు మరింత కాక పుట్టిస్తున్నాయి.             లోటస్ పాండ్ లో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. షర్మిల మాటలను బట్టి జగన్ తో ఆమె కొంత కాలంగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టడమంటే సామాన్య విషయం కాదు. కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. కాని షర్మిల మాత్రం ఏపీ సీఎంగా ఉన్న తన అన్నతో కనీసం చర్చించకుండానే పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యాయని చెప్పడం విస్మయం కల్గిస్తోంది. అంటే జగన్ తీవ్రమైన విభేదాలు ఉన్నాయి కాబట్టే... అత్యంత కీలకమైన పార్టీ ఏర్పాటు విషయాన్ని షర్మిల అతనితో చెప్పలేదని భావిస్తున్నారు. జగన్ తో మీకు విభేదాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు కూడా  షర్మిల ఆసక్తికర సమాధానమే ఇచ్చారు. రాజకీయంగా తన దారి తనదేనని తేల్చి చెప్పారు షర్మిల. దీంతో జగన్ తో ఆమెకు గ్యాప్ భారీగా పెరిగిందనే అనుమానులు బలపడుతున్నాయి.     పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అంగీకరించారు. తెలంగాణలో పార్టీ ఎందుకు ఉండకూడదన్న అంశంపై గత మూడు నెలలుగా వైఎస్ కుటుంబంలో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఏపీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో పార్టీ వద్దని జగన్ సూచించారని, అయితే తెలంగాణలో మరో పార్టీ స్థాపించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల మధ్య ఉన్నది భిన్నాభిప్రాయాలేనని.. అంతేతప్ప అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు.   తెలంగాణలో తమ పార్టీ వద్దని సీఎం జగన్ దృఢ నిర్ణయంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల సొంత నిర్ణయం అని వివరణ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి.  వైఎస్ అభిమానుల ఆత్మీయ సమావేశం, షర్మిల తాజా కామెంట్లు, వైసీపీ ముఖ్య నేతల రియాక్షన్లు.. అంతా గమనిస్తే... వైఎస్ షర్మిల సొంతంగానే పార్టీ దిశగా అడుగులు వేస్తుందని స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాకా జగన్ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారు. గత టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాలకు రివర్స్ టెండర్లు చేపట్టారు. దీంతో జగన్ పాలనా అంతా రివర్స్ లో నడుస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  తాజాగా జరుగుతున్న  పరిణామాలతో జగనన్న వదిలన బాణం కూడా రివర్సైందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ గెలుపు కోసం జగనన్న వదలిన బాణం... ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీగా మారి... అన్నకే సవాల్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.     

కేవీపీ మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ డైరెక్షన్! షర్మిల పార్టీపై బీజేపీ సంచలనం 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. షర్మిల పార్టీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని కొందరు చెబుతుండగా.. కేసీఆరే అంతా నడిపిస్తున్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే  షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ బీజేపీ సంచలనం వ్యాఖ్యలు చేసింది.  సీఎం కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోడానికే తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇందులో భాగమే  షర్మిల కొత్త పార్టీ ప్రకటన అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కాపాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని తెలిపారు. షర్మిల కొత్త పార్టీ ప్రకటన అనేది ముమ్మాటికీ కేసీఆర్ కనుసన్నల్లో, కేవీపీ ఆలోచనలతోనే ముందుకు వెళ్తోందని ప్రభాకర్ స్పష్టం చేశారు.  మంత్రి కేటీఆర్ భజన పరులు పెంచిన ఒత్తిడి మూలంగానే కేసీఆర్ ఈ కొత్త సమీకరణాలకు తెరలేపారని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. మంత్రి కేటీఆర్ అనుచరుల ఒత్తిడిని తట్టుకోడానికి కేవీపీ సలహా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహకారాన్ని కేసీఆర్ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంత ప్రయత్నించినా, తెలంగాణ ప్రజానీకం మాత్రం ఆయన్ను నమ్మే స్థితిలో లేరని, కారుకు మబ్బులు కమ్ముకున్నాయని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ లో పుట్టిన ముసలాన్ని అధిగమించడానికే కేసీఆర్ కమ్యూనిస్టులను కలుపుకుంటున్నారని, కాంగ్రెస్‌కు లోపాయకారిగా మద్దతిస్తున్నారని  ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేక సార్లు ఉప ఎన్నికలకు వెళ్లారని, సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలపై ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు ఆయన సిద్ధమేనా? అని ప్రభాకర్ సవాల్ విసిరారు. 

దళితులు తినే అన్నంలో పేడ, మట్టి పోసిన ఎస్ఐ

ఏపీలోని అనంతపురం జిల్లాలో అముంశ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను కాపాడే బాధ్యతలో ఉన్న ఒక ఎస్ఐ ఏకంగా అన్నంలో పేడ, మట్టి కలిపాడు. అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ బలపరుస్తున్న దళితులు తమ ప్రచారం మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా బెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాషా వారి వద్దకు వచ్చారు. అనుమతి లేకుండా ఇక్కడ ఎలా వంట చేస్తున్నారంటూ దళితులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరి అనుమతి తీసుకుని ఇక్కడ వంట చేశారంటూ పరుష వారిని పదజాలంతో దూషించారు. ఆ ఎస్ఐ అంతటితో ఆగకుండా తనలోని క్రూర మనస్తత్వాన్ని బయటపెడుతూ తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం, కూరలలో పేడ, మట్టి వేశాడు. ఎస్ఐ చర్యతో భోజనానికి సిద్దమైన వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. 

షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో తెలిస్తే షాకే 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. లోటస్ పాండ్ లో వైఎస్సాఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల.. త్వరలోనే జనంలోకి వస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వస్తానన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. వైఎస్ షర్మిల తాజా ప్రకటనతో తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. జిల్లాలవారీగా నాయకులతో సమావేశాలు నిర్వహించాకా.. మార్చిలో షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ హాట్ గా మారింది. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి  తెలంగాణాలో పార్టీ పెట్టడమేంటనేది ఎవరికి అర్ధం కావడం లేదు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు అన్న జగన్ తో విభేదాలు వస్తే .. తన పార్టీని ఏపీలో స్టార్ట్ చేయాలి కానీ తెలంగాణాలో ఎందుకు లాంచ్ చేస్టున్నారు అనే డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయి.  ఆదివారం జరిగిన టిఆర్ఎస్ సర్వ సభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణాలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చి పోలేదు.. ఇది కూడా అంతే.. కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు అంటూ కామెంట్ చేసారు. దీంతో షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీ వెనుక కేసిఆర్ హస్తం లేదని స్పష్టమౌతోంది. షర్మిల తరుఫున తెలంగాణలోని వైసిపి సీనియర్ నేత, వైఎస్ కుటుంబ సభ్యుడే టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణలో పెట్టబోయే పార్టీకి వైఎస్ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.  షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ స్థాపన వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ  సీఎం జగన్ ఆశీస్సులతోనే షర్మిల కొత్త పార్టీ వస్తోందని తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా సమాచారం. బీజేపీ వత్తిడితోనే జగన్ సపోర్ట్ తో షర్మిల తెలంగాణాలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే.. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఇక్కడ ఉన్న సెటిలర్లు, క్రిస్టియన్లు , ఎంఐఎం పోటీ లేని ప్రాంతాల్లో ముస్లింలు, వైఎస్ అభిమానుల ఓట్లలో అధిక శాతం టిఆర్ఎస్ కు వెళ్లాయి. ఇది గ్రహించిన బీజేపీ పెద్దలు షర్మిలను రంగంలోకి దింపారంటున్నారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లకు గండి కొట్టడమే కమలనాధుల వ్యూహంగా ఉంది.  రెండు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణలోని వైఎస్ కు భారీగా అభిమానులున్నారు.  అంతేకాదు తెలంగాణలోని రెడ్డి సామజిక వర్గం బీజేపీ పై అంత ఆసక్తి చూపకపోగా.. వీరంతా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంట నడుస్తుండడంతో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. దీంతో షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరినీ దెబ్బ కొట్టవచ్చు. ఇప్పటికే తెలంగాణాలో పుంజుకుంటున్న బీజేపీకి వచ్చే ఎన్నికలలో ఎదురు లేకుండా చేయడం కోసం షర్మిలతో కొత్త పార్టీ పెట్టించారని చెబుతున్నారు. కేసీఆర్ కు వెళ్లే ఓట్లు చీల్చడం.. అటు రేవంత్ వెనుక రెడ్డి సామాజిక వర్గం చేరకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఏది ఏమైనా వైఎస్ షర్మిల పెట్టేబోయే  కొత్త పార్టీ ఏ పార్టీని దెబ్బ తీస్తుంది.. ఎవరిని అందలం ఎక్కించడానికి ఉపయోగపడుతుంది అనే అంశంలో  ముందు ముందు స్పష్టత రానుంది.    

షర్మిల పార్టీకి వ్యూహకర్తగా పీకే ! కాంగ్రెస్, కారు పార్టీల్లో టెన్షన్ 

తెలంగాణ రాజకీయాల్లో దివంగత వైఎస్సార్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించగా..  రాష్ట్రమంతా దీనిపైనే చర్చించుకుంటోంది. రాజకీయ పార్టీల్లోనూ ఇదే కీలక అంశంగా మారింది. షర్మిల పార్టీ ఎందుకు పెడుతున్నారు... షర్మిల పార్టీకి స్పేస్ ఉంటుందా.. షర్మిల పార్టీ బలపడితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే అంశాలపై జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి.     వైఎస్ షర్మిల పార్టీపై టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోందని తెలుస్తోంది. టీఆర్ఎస్ టార్గెట్ గానే షర్మిల పార్టీ వస్తుందన్న ప్రచారం గూలాబీ నేతలను కలవరపెడుతుందని చెబుతున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అన్న అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లాలని, తెలంగాణలో డ్రామాలు చేస్తే డిపాజిట్లు కూడా రావని పోస్టులు పెడుతున్నారు. అసలు తెలంగాణలో షర్మిల ఏం చేస్తారని సెటైర్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యమకాలంలో చెప్పుల దండలు వేసిన షర్మిల ఫ్లెక్సీలను ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవని మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని, వేరే పార్టీలు రావని.. వచ్చినా బతకవని కుండబద్దలు కొట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు గంగుల కమలాకర్.  వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందన్నారు సీతక్క. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు.   ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని షబ్బీర్‌ అన్నారు. వైఎస్‌కు కుటుంబసభ్యులు వారసులు కారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వైఎస్‌కు నిజమైన వారసులన్నారు షబ్బీర్ అలీ. వైఎస్‌ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనేని తెలిపారు,  వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై  సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ క్రమంలో ఇదే షర్మిల పార్టీ పేరు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ వైఎస్సార్‌సీపీ’గా షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేస్తారని మరికొందరు చెబుతున్నారు. మార్చిలో పార్టీ ప్రకటన ఉంటుందని.. ఈలోగా తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్య నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది.  త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు షర్మిల పాదయాత్ర నిర్వహిస్తారని చెబుతున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా షర్మిల పార్టీని అన్ని విధాలుగా చూసుకుంటారని సమాచారం.  ఇప్పటికే షర్మిలతో పీకే చర్చించారని, బెంగాల్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారని చెబుతున్నారు. 

మోడీ కి హితులు ఎవరు..? స్నేహితులెవరు..?

  మోడీ స్నేహితులు ఎవరు..? స్నేహితులెవరు..? ఒక మతం వాళ్ళా.. లేదంటే బిజెపి నాయకులా..  మోడీ స్నేహితులు ఎవరనే  ప్రశ్నకి సమాధానం మాత్రం ఒకటే అని చెప్పాలి..  దేశం హితం కోరే వాళ్ళే మోడీకి హితులు.. స్నేహితులు..ఇలా చెపుతూ  రాజ్యాసభ లో ప్రధాన మంత్రి మోడీ ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పై ప్రధాని మోడీ  రెండోరోజూ ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 15తో ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగియ్యనుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆజాద్ తో  ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఉన్నత పదవులు వస్తుంటాయి, పోతుంటాయి .. అధికారమూ వస్తుంది, పోతుంది.. కానీ  ఎన్ని పదవులు వచ్చిన..  ఎలా వుండాలో ఆజాద్ దగ్గర నేర్చుకోవాలని మోడీ అన్నారు.. ఇలాంటి స్నేహితుడు ఉంటే చాలదా అంటూ.. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.’’ అంటూ మోడీ  మాట్లాడారు.    ‘‘గుజరాతీ పర్యాటకులపై కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆజాద్ నాకు ఫోన్ చేసి, బాధపడుతూ ఏడ్చేశారని, నేరుగా విమానాశ్రయానికే వచ్చేశారని. ఓ కుటుంబ పెద్దగా బాధితులపై శ్రద్ధ చూపారని మోడీ చెప్పారు. ఆ సమయంలో మృత దేహాన్ని తరలించడానికి ఓ ఏయిర్ ఫోర్స్ విమానం కావాలని అప్పటి  రక్షణ మంత్రి ప్రణబ్ దాదా ఏదో ఒకటి కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారని తెలిపారు. ఆజాద్ మంచి  స్నేహితుడు మాత్రమే కాదు.. దేశ సేవకుడు కూడా అంటూ మోడీ హర్షం వ్యక్తం చేశారు.. గులాంనబీ ఆజాద్ కేవలం పార్టీ కోసమే ఆలోచించలేదని, దేశం కోసం  ఆలోచించారని ప్రశంసించారు.. ఆయన వల్ల  దేశానికి చాలా లాభం జరిగిందని, ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు చెపుతూ.. దేశం కోసం గులాంనబీ ఆజాద్ సూచనలు, సలహాలను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉంటాం అంటూ ఆజాద్‌కు మోడీ  సెల్యూట్ చేశారు. శరద్ పవార్ కూడా అచ్చు ఇలాగే ఉండేవారని మోడీ  వ్యాఖ్యానించారు. ఆజాద్ తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, చాలా సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుందన్నారు ప్రధాని మోడీ.  

తెలంగాణలో రాజన్న రాజ్యం! ప్రతి ఇంటికి వెళ్తానంటున్న షర్మిల! 

తెలంగాణలో  కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు చిరునవ్వుతో అందరికీ ఆమె అభివాదం చేశారు. తన తండ్రి స్టయిల్లో చేతులు ఊపుతూ హుషారెత్తించారు. ఈ సందర్భంగా  ఆమె పొడిపొడిగానే మాట్లాడారు.  కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.అందరూ కాస్త ఓపిక పట్టాలని... అన్ని విషయాలు తర్వాత చెపుతానని చెప్పారు షర్మిల. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు.    కొత్త పార్టీపై మాట్లాడేందుకు నిరాకరించారు వైఎస్ షర్మిల. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు  చేశామని చెప్పారు. తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని... ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈ రోజు నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.  రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం దగ్గర సందడి నెలకొంది. అక్క‌డ పోస్ట‌ర్లు భారీగా వెలిశాయి. మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బ‌తుకులు మార్చే బాట అని అందులో పేర్కొన్నారు. ఆ బాట ఏంటో వైఎస్సార్ కుటుంబానికి తెలుసని, షర్మిలమ్మ నాయకత్వం వ‌ర్థిల్లాల‌ని ఫ్లెక్సీల్లో ఉంది. జనంలోకి షర్మిలక్క వ‌స్తున్నార‌ని, జనరంజకపాలన ముందుందిక అంటూ ప‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు కావ‌డం ఆసక్తిక‌రంగా మారింది. ఈ ఫ్లెక్సీలలో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫొటో ఎక్కడా లేదు.  

వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు

ఏది పడితే అది మాట్లాడటం.. తర్వాత సారీ చెప్పడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. రాజ్యసభలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని  ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరిని అవాక్కయ్యేలా చేశాయి. ఉపరాష్ట్రపతిపై విజయసాయిరెడ్డి  చేసిన అనుచిత వ్యాఖ్యలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ సభ్యులందరూ ఖండించడంతో విజయసాయిరెడ్డి దిగొచ్చారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  ‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు. ఆవేశంలో మాట్లాడాను.. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విధంగా జరగదని హామీ ఇస్తున్నాను’ అని విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలిపారు.  సోమవారం రాజ్యసభలో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. ‘మీ మనసు, ఆత్మ బీజేపీపైన! తనువు టీడీపీపైన’ అని వెంకయ్య నాయుడిని ఉద్దేశించి కామెంట్ చేశారు. విజయసాయి వ్యాఖ్యలతో పార్టీలకు అతీతంగా సభ్యులందరూ నివ్వెర పోయారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయసాయిరెడ్డి మాటలపై   కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి  ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు విజయసాయి రెడ్డిని పిలిపించుకుని మందలించారు. ‘ఉపరాష్ట్రపతి పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. రాజ్యసభ చైర్మన్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నిన్న జరిగింది నిందించదగినది. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి’ అని చెప్పారు. ప్రహ్లాది జోషి  మందలింపు తర్వాత రాజ్యసభకు వెళ్లిన విజయసాయి ‘ఐయామ్ సారీ’ అంటూ చెప్పారు. 

బ్యాలెట్ పేపర్లు కాదు .. కత్తులు..?   

  తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి . ఇరు వర్గాల ఘర్షణల మధ్యన ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇరు వర్గాల పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అంటూ ఘర్షణలకు దిగుతున్నారు.. ఎన్నికలు జరుగుతున్నాయా.. ? ఫ్యాక్షన్ పోరు జరుగుతున్నదా అంటుగావున్నాయి..  ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లకు బదులు కత్తులు కనిపిస్తుండండం ప్రజలను భయాందోళను గురిచేస్తుంది.. అధికార పార్టీ వాళ్ళు ఇతర అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఇటు పోలీసులకు, అటు ఎన్నికల కమిషనర్ కి ఎన్ని ఫిర్యాదులు చేసినా .. వారి ఆగడాలు తగ్గకపోవడంతో పాటు రోజురోజుకి పెరుగుతున్నాయి..   కాకినాడలో పంచాయితీ ఎన్నికల్లో  పోలింగ్ కేంద్రాలు, టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం కత్తులతో దాడులు జరుపుకోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. విజయవాడలో జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.  పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేశామని. పోలింగ్ కేంద్రాల దగ్గర 100 మీటర్ల మేరకు రెడ్‌జోన్‌గా పోలీసులు ప్రకటించారు.