తిండి పెట్టకుండా పూజలు! ఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలనాలు

హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‎లో ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి రాగా..తాజాగా పూజలకు సంబంధించిన అంశాలు బయటికొస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోలేదట. అలా ఆహారం లేకుండానే విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు సమాచారం. విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు తెలుస్తుండంతో దీనికి బలంచేకూరుతోంది.  మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనేమంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ జరుపుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని  బుధవారం ఆత్మహత్య చేసుకుంది.   

బీజేపీలో కాంగ్రెస్ కల్చర్! పార్టీ కంటే మోదీనే గొప్పా? 

నెహ్రూ రింగ్ రోడ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇందిరమ్మ ఇళ్లు. నెహ్రూ జూపార్కు. మచ్చుకు హైదరాబాద్ లోని కొన్ని పేర్లు. ఇలా దేశవ్యాప్తంగా వందలు, వేలల్లో సంస్థలు, కట్టడాలు గాంధీల పేరు మీదుగానే ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అదే తీరు. బీజేపీ వచ్చాక ఆ గాంధీల గోల తగ్గింది. కమలం పార్టీలో వ్యక్తి స్వామ్యం ఉండదు. అంతా ప్రజాస్వామ్యమే. పార్టీ విధానమే. అలాంటిది.. మొదటిసారి ఓ నిర్మాణానికి మోదీ పేరు పెట్టడంతో అంతా ఆశ్చర్యం. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది ఊహించని పరిణామం. గుజరాత్ లోని మొతేరా స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం'గా నామకరణం చేయడం అనూహ్యం. అంతకు మంచి సంచలనం. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది.  బీజేపీలోనూ వ్యక్తి భజన మొదలైందా? గుజరాత్ లో ప్రపంచంలోకే ఎత్తైన సర్ధార్ పటేల్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరి అభిమానం చూరగొంది బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే గుజరాత్ లోని మొతేరాలో.. సర్దార్ పటేల్ పేరును కేవలం గ్రౌండ్ కే పరిమితం చేసి స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ఆశ్చర్యకరం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇలా చేసేవి. పథకాలు, ప్రాజెక్టులు, నిర్మాణాలు ఏది పడితే దానికి గాంధీల పేరు పెడుతూ ఊదరగొట్టేవి. బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఓ స్టేడియానికి మోదీ పేరు పెట్టడంతో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ సర్కారు సైతం నడుస్తోందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్ధార్ఱ పటేల్ ను కొంతకాలంగా బలవంతంగా తమ వాడిని చేసుకుంటోంది బీజేపీ. గాంధీలకు పోటీగా పటేల్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. పటేల్ జయంతి, వర్థంతిలను ఘనంగా జరపడం.. గుజరాత్ లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం లాంటి చర్యలతో పటేల్ ఇమేజ్ ను కమలం ఖాతాలో కలిపేసుకుంటోంది. అలాంటి బీజేపీ ప్రభుత్వం.. సడెన్ గా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతేరా స్టేడియానికి పటేల్ పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అది కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా స్టేడియం ప్రారంభోత్సవం అయ్యే వరకూ ఈ పేరు మార్పు వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అంత గప్ చుప్ గా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపైనా విమర్శలు వస్తున్నాయి.  కేంద్రం చేసిన మరోపని మరింత రాజకీయ రచ్చకు కారణమవుతోంది. స్టేడియంలో రెండు ఎండ్ లలో ఒకదానికి రిలయన్స్, మరోదానికి అదానీ పేర్లు పెట్టారు. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్లు చేశారు. ప్రభుత్వం ‘మేమిద్దరం - మాకిద్దరు’ అన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వాస్తవాలు అందంగా బయటపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియం - అదానీ ఎండ్‌ - రిలయన్స్‌ ఎండ్‌. జయ్‌ షా సారథ్యం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.    సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ను కేంద్రం అవమానించిందంటూ కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆసక్తికర సెటైర్లు వేశారు. మోదీకి రిటైర్ కావాల్సిన సమయం దగ్గర పడిందని అందుకే మొతేరా స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం ఉంది. అటల్ బిహారీ వాజిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘అటల్ చౌక్’ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత ప్రధాని పదవి కోల్పోయారు. ఇప్పుడు మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ పేరు పెట్టారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నరేంద్రమోదీ ప్రధాని నుంచి మాజీ ప్రధాని కాబోతున్నారనేది స్పష్టం’’ అని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. కాంగ్రెస్ విమర్శలను కమలనాథులు ఈజీగా తీసుకుంటున్నారు. మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడం ఆయన దార్శనికతను గౌరవించే ప్రయత్నమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేంద్రం తీరు, ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే.. బీజేపీ ఇన్నేళ్లూ నమ్ముతూ, ఆచరిస్తూ వచ్చిన సిద్ధాంతాలకు దూరమవుతోందా? అనే అనుమానం కలగకమానదు. కాంగ్రెస్ లో మాదిరి కాషాయ పార్టీలో వ్యక్తి ఆరాధన మునుపెన్నడూ లేదు. సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్న పార్టీ అది. వాజ్ పాయ్, అద్వానీల కాలం నుంచీ అలానే ఉంది. మోదీ వచ్చాకే బీజేపీలో కొత్త పోకడలు పొడచూపుతున్నాయి. నో డౌట్. మోదీ స్ట్రాంగెస్ట్ లీడర్. అయితే, పార్టీ కంటే మోదీ గొప్పేం కాదు. బీజేపీ వల్లే ఆయన పీఎం అయ్యారు. ఆయన వ్యక్తి గత ఇమేజ్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ అయింది. అంత మాత్రాన.. పార్టీని మించి మోదీ భజనే ఎక్కువగా చేస్తుండటం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. గతంలో కాంగ్రెస్ సైతం ఇదే తప్పు చేసిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే గాంధీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. వారి ఇమేజ్ పడిపోగానే పార్టీ సైతం కుప్పకూలిన సందర్భాలు అనేకం. ఇప్పుడు బీజేపీ సైతం కాంగ్రెస్ దారిలోనే తప్పటడుగులు వేస్తోందని.. గాంధీల మాదిరే మోదీని ప్రమోట్ చేయడం సరైనది కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మోదీకి రాజకీయంగా అంతా అనుకూలంగానే ఉన్నా.. ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఏమీ లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవడం కామన్.

సౌమ్య ఇంటికి లోకేశ్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  తంగిరాల సౌమ్య ఇంటికి వెళ్లారు. ఎన్నికల నేపత్యం లో వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఆయన పరామర్చించారు. కృష్ణా జిల్లాలో  లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసానికి చేరుకున్న లోకేష్ ఆమెను పరామర్శించారు. నందిగామ తంగిరాల సౌమ్య ఇంటికి భారీగా  టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఈనెల 21న సౌమ్య ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌమ్యను పరామర్శించేందుకు లోకేశ్ ఆమె ఇంటికి చేరుకున్నారు. సౌమ్య ఇంటి వద్దకు మాజీ మంత్రి దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, పలువురు నాయకులు చేరుకున్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం  రామచంద్రాపురంలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి దంపతులను, గొల్లమందల గ్రామంలో వైసీపీ నాయుకుల దాడిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త పాలకొల్లు సోమయ్య కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు.   

మదనపల్లి జంట హత్యల కేసులో మరో షాకింగ్!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తండ్రి పురుషోత్తమ నాయుడు,తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపినట్లు ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే తాజాగాఈ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. చిన్నకుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని డాక్టర్ల విచారణలో వెల్లడయింది. పెద్ద కుమార్తె అలేఖ్యే ఆ దారుణానికి ఒడిగట్టిందని తేలింది. అలేఖ్యే తన సోదరి సాయి దివ్యను హతమార్చిందనీ, ఆ తర్వాత తనను కూడా చంపితే ఇద్దరం బతికొస్తామని చెప్పడంతోనే, అలేఖ్యను పద్మజ చంపిందని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో సైకియాట్రిక్ నిపుణుల ఆబ్సర్వేషన్ లో పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులు ఉన్నారు. ప్రతీరోజూ నిపుణులు వీళ్లతో మాట్లాడుతున్నారు. వారిని మాటల్లో పెట్టి అసలు ఆనాడు ఏం జరిగిందన్న వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి నుంచి రాబట్టిన వివరాలతో డాక్టర్లు ఓ దారుణ నిజాన్ని బయటపెట్టారు. పురుషోత్తం నాయుడు చెప్పిన వివరాల ప్రకారమే.. ఆ రోజు తన సోదరి సాయి దివ్యను అలేఖ్యే చంపిందని ఆయన అంగీకరించారని తెలుస్తోంది. పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులతో వేరు వేరుగా మాట్లాడుతున్నాము. వారు ఈ ఘటనతో పూర్తిగా షాక్ లో ఉండిపోయారు. పద్మజ కోలుకుంటోంది కానీ, పురుషోత్తమనాయుడు ఇంకా ఆ పరిస్థితి నుంచి బయటపడలేదు. వారితో మాట్లాడుతూ, ఆనాడు అసలేం జరిగిందన్న వివరాలను రాబడుతున్నాం.‘ అని విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.  తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం లీక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం లీక్ఎన్ని ఆరోపణలు వస్తున్నా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటీవలే కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కొందరు సొంత పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడితే.. మరి కొందరు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ లైన్ దాటి మాట్లాడారు. నేతల తీరుతో గులాబీ పెద్దలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం బయటపడింది. టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌ల ఆడియో సంభాషణ లీకై వైరల్ గా మారింది. ఆడియోలో షబాజ్ అహ్మద్‌‌ను ఎమ్మెల్యే బూతులు తిట్టారు.  ఎమ్మెల్యే షకీల్ మంగళవారం బోధన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీకి ఎంఐఎం బీ టీంగా పని చేస్తోందని విమర్శించారు. దీనిపై స్పందించిన ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యే షకీల్ గతంలో బీజేపీ నాయకులతో ఉన్న ఫొటోలు, ఇటీవల ఎంపీ అరవింద్‌ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. బుధవారం ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌కు ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, పార్టీ బేస్‌గా సాగిన సంభాషణ చివరకు బూతు పురాణం వరకు వెళ్లింది. ఈ ఆడియోనిజామాబాద్, బోధన్‌లో వైరల్ అయింది. 

బాబుని అడ్డుకుంటాం.. వైసీపీ! కుప్పం లో టెన్షన్ టెన్షన్..

కుప్పం కు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయనను అడ్డుకుంటాం అంటున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే ఆగిన గుణపాఠం చెపుతామని టీడీపీ నేతలు అంటున్నారు. దాంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల తర్వాత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పం లో పర్యటించనున్నారు. 25 గురువారం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం వెళ్తారు. శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. మార్చ్ 1న   అమరావతికి తిరిగి వస్తారు. ఇక చంద్రబాబు పర్యటనతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కుప్పం టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసిన వైసీపీ ఫ్యాన్స్ ఇప్పుడు చంద్రబాబును అడ్డుకుంటామని అంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మీ గెలుపులో నిజాయితీ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు. బుధవారం రోజున టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నారు. ప్రస్తుతం కుప్పంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

నిరుద్యోగం నిజం కాదా? కేసీఆర్ ను నిలదీస్తున్న యూత్

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది, ఏమి చేయలేదు అనేది అందరికీ తెలిసిందే. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, సుమారు రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన తెలుగు దేశం ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఆంధ్ర పాలకులు అందరూ అన్యాయమే చేశారు. అది నిజం అయినా కాకపోయినా,ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారు అన్న పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణమైంది.ఆ ఉద్యమం నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకొచ్చింది. అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు గనుకనే కేసీఆర్ సారధ్యంలో సుమారు పుష్కర కాలం పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్ధులు అయితే ఉద్యమంలో పాల్గొనడమే కాదు, ప్రాణ త్యాగాలు చేశారు. సుమారు 12వందల మంది తెలంగాణ బిడ్డలు రాష్ట్ర సాధన కోసం ఆత్మాహుతి చేసుకున్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాల పుణ్యానే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయింది. అయినా ఇంకా ఇప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను, ఆంధ్రా పాలకుల పాపాలను పదే పదే ప్రస్తావిస్తూ, పోలికలు తెచ్చి, ఎన్నికల రేవు దాటాలనుకోవడం, ఏమిటని తెలంగాణ యువత, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో  పదేళ్ళలో పదివేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ఆరేళ్ళలోనే లక్షకు పైగా ఉద్యగాలు ఇచ్చిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే లేదని చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కేకాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలకు లేదని లేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలతో పాటుగా విద్యార్ధులు, నిరుద్యోగ యువతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.  కేటీఆర్, ఆరేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించడాన్ని కూడా, ప్రతిపక్షాలతో పాటుగా,విద్యార్ధులు యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నిర్ధారణ కోసంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ,తమ నివేదికలో ప్రభుత్వ శాఖలలో రెండు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్న విషయం వాస్తవం కాదా అని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.యువ తెలంగాణ నాయకురాలు నల్గొండ-వరంగల్ఖ-మ్మం ఎమ్మెల్సీ అభ్యర్ధి రాణి రుద్రమ,ఏఏ శాఖలలో ఎన్నెని ఖాళీలు ఉన్నాయో వివరిస్తూ. రాష్రం ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు ఎన్ని?ఈ ఆరేళ్లలో భర్తీ చేసిన ఖాళీలు ఎన్ని? కొత్తగా ఏర్పడిన ఖాళీలు ఎన్ని? ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఎన్ని? వంటి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.  అలాగే విశ్వ విద్యాలయాలకు వీసీలు లేక పీహెచ్డీ చేసే అవకాశాలు సైతం విద్యార్ధులకు లేకుండా పోతున్నాయని, చివరకు, చదువులు పూర్తిచేసుకున్న వారికి  సర్టిఫికేట్ ఇచ్చే నాధుడు కూడా యూనివర్సిటీలలో లేరని యువ తెలంగాణ పార్టీ నాయకురాలు, నల్గొండ,వరంగల్,ఖమ్మంఎమ్మెల్సీ రాణీరుద్రమ చేసిన ఆరోపణకు తెరాస నాయకులు సమాధానం చెప్పాలని తెలంగాణ యువత ప్రశ్నిస్తోంది.చివరకు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్’నే ఖాహళీ గా ఉందని, వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, అసత్యాలు అర్థ సత్యాలతో నిరుద్యోగ యువతను ఎల్లకాలం మోసంచేయలేరని అంటున్నారు.  

వైసీపీ నేతల బెదిరింపులు! భయంతో యువకుడు సూసైడ్ 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పంచాయితీలు మాత్రం ఆగడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు బూత్ ఏజెంట్‌గా పనిచేసిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ రచ్చ జరుగుతోంది.  తూర్పుగోదావరి జిల్లా అల్లవరం రూరల్ మండలం నడిపూడి గ్రామంలోని మెట్టరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా 11వ వార్డుకు ఓ పార్టీ తరపున బూత్ ఏజెంట్‌గా పనిచేశాడు.పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు కొందరు రిగ్గింగుకు పాల్పడ్డారని, అడ్డుకోబోయిన తనను చంపేస్తామని బెదిరించారని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లేఖలో రవిశంకర్ ఆరోపించారు. ఆ తర్వాత కూడా వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు వారే కారణమన్నాడు. రవి తల్లిదండ్రులు కూడా కుమారుడి ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.   

జగన్ తో సంబంధం లేదు! షర్మిల 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల.. తన పార్టీ గురించి సంచలన విషయాలు చెప్పారు వైఎస్ షర్మిల. తాను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదన్నారు. అయినా మా అనుబంధాల్లో తేడాలుండవని తెలిపారు. మాటలు,  అనుబంధాలు, రాఖీలు ఉంటాయన్నారు. తమ మధ్య ఉన్నవి విబేధాలో భిన్నాభిప్రాయాలో తనకు తెలియదని చెప్పారు షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగాలన్నారు. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా  తామెక్కటే అన్నారు.  తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు షర్మిల. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వారా అని ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని చెప్పారు. తనకు హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. తాను తెలంగాణ కోడలినని షర్మిల స్పష్టం చేశారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరలేదన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదన్నారు.ఉద్యమంలో  లేనంత మాత్రాన.. తెలంగాణపై తనకు ప్రేమ ఉండదా  అని  షర్మిల ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని చెప్పారు. తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని తెలిపారు వైఎస్ షర్మిల. 

నిరశన అస్త్రంగా నామినేషన్లు

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  నామినేషన్ల ఘట్టంలోనే అధికార తెరాసకు నిరసన సెగలు తాకాయ అంటే అవుననే అంటున్నారు నిరుద్యోగ  పట్ట భద్రులు. నామినేషన్ల చివరి రోజు  అధికార పార్టీ అభ్యర్ది పల్లా రాజేశ్వర రెడ్డితో సహా మొత్తం 28 మంది నామినేషన్’ దాఖలు చేశారు. అలాగే, మొత్తంగా నామినేషన్లు ముగిసే సమయానికి 76 మంది నామినేషన్ దాఖలు  చేశారు.  గత ఎన్నికలలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈ సారి ఎన్నికల్లో అంతకు మూడున్నర రెట్లు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉసంహరణకు ఈ నెల 26 ఆఖరు తేదీ, సో ... ఆపాటికి గానీ చివరకు ఎంత మంది బరిలో మిగులుతారు అనేది తేలదు.  అయితే ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల్లో ప్రభుత్వ పట్ల పెల్లుబుకుతున్నవ్యతిరేకతే కారణమని అంటున్నారు. గతంలో నిజామాబాద్ లో పసుపు రైతులు ప్రభుత్వ విధానాల పట్ల తమా వ్యతిరేకతను, ఆగ్రహాన్ని అధిక సంఖ్యలో నామినేషన్లు  దకాహాలు చేయడం ద్వారా వ్యక్త పరిచారు. ఇప్పడు కూడా, తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటైన నియామకాల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని చెప్పేదుకే ఇంట పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యుకలు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసిన వారంతా పోటీకి నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే నిరుద్యోగ యువతలో రగులుతున్న వ్యతిరేకతకు మాత్రం ఇదొక నిదర్శనంగా భావించవచ్చును

పోలీసుల వల్లే బీఫార్మసీ విద్యార్థిని చనిపోయిందా?

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన హెచ్ఆర్సీకి చేరింది. హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ పోలీసులపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని తప్పుబట్టారు. కిడ్నాప్‌ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన అన్నారు. ముద్దాయిలు అని పోలీసులే చెప్పి.. ఆ తర్వాత వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలన్నీ పూస గుచ్చినట్టు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్‌లు వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. యువతి ఆత్మహత్యకు పోలీసులే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాలని లాయర్ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.   

తెలంగాణలో ఉద్యోగాల్లేవ్.. విద్యార్థులకు అక్కలా ఉంటా.. 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీ ఏర్పాట్లపై రోజూ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ వ్యూహాలపై వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. దీంతో లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం నిత్యం సందడిగా మారుతోంది. తనను కలిసేందుకు వస్తున్న నేతలతో మాట్లాడుతున్నారు. బుధవారం విద్యార్థులతో సమావేశమయ్యారు షర్మిల. పార్టీ ఏర్పాట్లపై వారితో మాట్లాడారు.  విద్యార్థులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దని ఆయన భావించారన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని చెప్పారు. వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం ద్వారా.. ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వాళ్లంతా ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్‌కు దక్కుతుందన్నారు వైఎస్ షర్మిల.   

జయ జ్ఞాపకాల్లో విజయ..

అమ్మా, మీరెక్కడో రాజకుమార్తెగా మళ్లీ జన్మించే ఉంటారు. అంటూ జయలలిత జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. మీ స్నేహం, అభిమానం, ఆప్యాయత తీపి గుర్తులుగా అలాగే ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు. పిబ్రవరి 24  తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జయంతిసందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, 'అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటూ మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా  తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. అంటూ విజయశాంతి జయలలిత ఉన్న ఫోటోను షేర్ చేస్తూ,మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నా భద్రత కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు, ప్రచారంలో ఫిరంగి అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి' అని విజయశాంతి  ట్వీట్ చేశారు. 

విష్ణు రెడ్డిపై చెప్పుతో దాడి.. వైసీపీలో ఉలికిపాటు!

బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నందుకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ కాలి చెప్పుతో విష్ణును కొట్టారు. మామూలుగానైతే ఈ ఘనపై బీజేపీ నేతలంతా భగ్గుమనాలి. తమ నేతపై దాడి జరిగినందుకు ఊరూరా ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించాలి. కానీ అలా జరగలేదు. విష్ణవర్థన్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగినా బీజేపీ శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. కాని వైసీపీలో మాత్రం ఉలికిపాటు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలెవరు బహిరంగంగా కామెంట్ చేయకపోయినా.. వైసీపీ కేడర్ మాత్రం సోషల్ మీడియాలో ఎదో జరిగినట్లుగా తెగ హైరానా చేస్తోంది. విష్ణు రెడ్డిపై జరిగిన దాడిని ఘోరం, దారుణం అంటూ ఆవేశానికి పోతున్నారు జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు.  సింపుల్ గా ఇద్దరు బీజేపీ నేతలు దాడి ఘటనను ఖండించారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి తప్పక స్పందించాల్సిన పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్  చేశారు వీర్రాజు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ సైతం విష్ణుపై దాడిని తప్పుబట్టారు. అంతే. ఇంతకు మించి బీజేపీ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం శ్రీనివాస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో నానా రచ్చ చేస్తున్నారు. శ్రీనివాస్ ను టీడీపీతో లింకు కలుపుతూ విమర్శలు చేస్తున్నారు. తన పార్టీ నేతపై దాడి జరిగినా బీజేపీ నేతలే పెద్దగా పట్టించుకోకపోగా.. ఫ్యాన్ పార్టీ కేడర్ ఆవేశంతో ఊగిపోవడం చర్చగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి ఘటన తర్వాత.. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో.. ఎవరు ఎవరికి పెయిడ్ ఆర్టిస్టులో అనే చర్చ జోరుగా సాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అనే విమర్శ ఉంది. అతను ఎప్పుడు, ఏ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినా.. ఏ టాపిక్ వచ్చినా, అందులో వైసీపీ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతారని అంటారు. అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీనే టార్గెట్ చేస్తుంటారు. ఏ అంశం చర్చకు వచ్చినా.. అందులోకి చంద్రబాబును లాగి విమర్శిస్తుంటారని విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. ఆయన తీరును గమనించే వారంతా అధికార వైఎస్సార్ సీపీకి పెయిడ్ ఆర్టిస్టు అని చెబుతూ ఉంటారు. విష్ణుతో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ లు సైతం వైసీపీని సమర్థించే బీజేపీ నేతలని టాక్. బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారి పొత్తు ఉందని.. అందుకే ఈ ముగ్గురు దాదాపు అన్ని విషయాల్లో వైసీపీని వెనకేసుకు వస్తుంటారని చెబుతుంటారు. వైసీపీతో అంటకాగిన అలాంటి వ్యక్తి.. రాజధాని కోసం 400 రోజులకు పైగా పట్టుసడలని పోరాటం చేస్తున్న జేఏసీ నేతను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టు అనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరును సహించలేక కొలికపూడి శ్రీనివాస్ పట్టరాని ఆవేశంతో అలా చెప్పుతో దాడి చేశారని చెబుతున్నారు.  చెప్పుతో దాడి జరిగినా బీజేపీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై పార్టీలో ఉన్న వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది. బీజేపీ నేతగా ఉంటూ.. టీవీ డిబేట్లలో వ్యక్తి గత ఎజెండా ప్రకారం మాట్లాడుతుండటం.. వైసీపీకి అనుకూలంగా ఉండటం.. సొంత పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. అందుకే, తాజా దాడిపై వారెవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. మొత్తంగా విష్ణు రెడ్డిపై జరిగిన చెప్పు దాడి ఘటన బీజేపీ కంటే వైసీపీకే ఎక్కువ బాధ కలిగించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

రాహుల్ ఆ విషయంలో వీక్..

వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అవుతూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. అమేథీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌ మీద విషం  చిమ్ముతున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు. అమేథీ ఆయనకు అన్నీ ఇచ్చిందని, ఆయన అసమర్థత వల్లే అక్కడి నుంచి పారిపోయారని దుయ్యబట్టారు. చివరికి అన్ని ఇచ్చిన అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. అస్సాం వెళ్ళిన రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలను అవమానించడం అమానుషమని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే దేశ విద్రోహ  గ్యాంగ్‌కు రాహుల్ మద్దతు పలికారన్నారని. పదిహేనేళ్లపాటు అసమర్థ ఎంపీని అమేథీ ప్రజలు భరించారని  స్మృతి హిరానీ అన్నారు. గాంధీ కుటుంబం ‘విభజించు, పాలించు’ సిద్ధాంతాన్ని ఇప్పుడు చూపిస్తున్నారని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె  ప్రశ్నించారు. అమేథీ తన కుటుంబమని, అమేథీని అవమానిస్తే తాను భరించలేనని స్పష్టం చేశారు. అంతకుముందు స్మృతి ఇరానీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కతఘ్నుడు. జ్ఞానం లేకుండా వాగేవాడి గురించి లోకమంతా చెప్తోంది’’ అని చెప్పారు. రాహుల్ గాంధీ ఇటీవల కేరళలో మాట్లాడుతూ, తాను ఓ ప్రత్యేక తరహా రాజకీయాలకు అలవాటుపడ్డానన్నారు. కేరళకు రావడం చాలా ఉత్తేజభరితంగా ఉందన్నారు. ప్రజలు సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండటం, కేవలం పైపైని కాకుండా లోతుగా తరచి చూసే ప్రజలు కనిపించడం అకస్మాత్తుగా తనకు కనిపించినట్లు తెలిపారు.దీంతో  ఉత్తరాది, దక్షిణాది చర్చ మొదలైంది. అయితే  రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 

విశాఖ స్వరూపానంద ఆశ్రమం మూసేస్తారా? 

విశాఖపట్నంలోని శారధా పీఠం మూత పడనుందా? స్వరూపానంద స్వామికి షాక్ తగలనుందా? కొంత కాలంగా వివాదంలో చిక్కుకుంటున్నారు స్వరూపానంద. ఆయనకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన బహిరంగంగానే మద్దతు తెలుపుతుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్వరూపానంద మఠంపై ఓ వ్యక్తి ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఆశ్రమాన్ని మూసివేయాలని అందులో కోరాడు. విశాఖపట్నంకు చెందిన రామ్‌ స్వరూపానంద ఆశ్రమాన్ని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. స్వరూపానంద ఓ దొంగ స్వామి అని అతను మండిపడ్డారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని తప్పుబట్టారు. భీమిలిలోని 15 పంచాయతీల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇందులో ఆశ్రమం నిర్వాహకులకు సంబంధం ఉందని చెప్పారు. స్వరూపానంద ఆశ్రమాన్ని మూసివేయడంతో పాటు భీమిలిలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరామని రామ్ తెలిపారు.

హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

హైదరాబాద్ లో  ఐపీఎస్‌ అధికారినంటూ మోసం చేసిన శ్రుతిసిన్హా అరెస్టు అయింది. నిందితురాలిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 11 కోట్ల రూపాయలను శ్రుతి సిన్హా కొల్లగొట్టింది. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం జరిపిస్తాని చెప్పి... పెళ్లి పేరుతో వీరారెడ్డి వద్ద రూ.11 కోట్లు వసూలు చేసింది. బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి శ్రుతి  మోసం చేసింది.  వసూలు చేసిన డబ్బుతో శ్రుతి సిన్హా ఖరీదైన కార్లు కొనుగోలు చేసింది. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విషయం తెలిసి శ్రుతి బంధువు విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. నకిలీ ఐపీఎస్‌ అధికారి పేరుతో చేసిన మోసం కేసులో మహిళకు సహకరించిన ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.   

అనుమానంతో ప్రియురాలి హత్య..

ప్రేమోన్మాదం రెచ్చిపోతుంది. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాలుపడుతున్నారు దుర్మార్గులు.  ప్రేమించలేదని కొందరు,  తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో చనువుగా మాట్లాడుతుందని మరికొందరు. పేరు ఏదైతేనేమి  ప్రేమిచిన వారిపైనే దారుణాలకు పాలుపడుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్న, శిక్షలు పడుతున్న కానీ ప్రేమోన్మాధుల్లో మార్పు రాకపోగా ఇంకా బరితెగిస్తూ పోతున్నారు. నరసరావుపేట శివారులో దారుణం చోటు చేసుకుంది. కోట అనూష అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అనూష స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు. కృష్ణవేణి కాలేజిలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.