గంగా నదిలో కరోనా శవాలు.. 

కరోనా మరణాలకు స్మశానవాటికలు నిండుతున్నాయి. కొన్ని చోట్ల ఆ స్మశానాలు దొరకకపోవడంతో   కరోనా వల్ల చనిపోయిన వారి శవాలు చివరికి నదిలో కూడా ప్రత్యేక్షం అవుతున్నాయి. భారత దేశ ప్రజలు పవిత్రమైన నది గా భావించే గంగా నదిలో కొన్నీ కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు.  ఆ శవాలు కరోనా శవాలుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కరోనా మృతులను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికుల్లో భయాందోళన సృష్టించాయి. హామిర్‌పుర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని కొందరు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని కొన్ని మృతదేహాలను అధికారులు నదిలో వదిలేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.   కాగా ఈ విషయంపై హామిర్‌పుర్‌ ఏఎస్పీ అనూప్‌కుమార్‌ను ప్రశ్నించగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. హామిర్‌పుర్‌, కాన్పుర్‌ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరని.. నదిలో వదిలేస్తారని పేర్కొన్నారు. యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేవారు కూడా కొవిడ్‌ భయంతో నదిలో వదిలేస్తున్నారని.. దీంతో యమునలో కనిపించే మృతదేహాల సంఖ్య అధికంగా ఉంటోందని వెల్లడించారు. అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నా.. ఇతరుల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో దిక్కు తోచని స్థితో మరికొందరు నదిలో వదిలేస్తున్నారని తెలిపారు. బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది.   చైన్నైలో చిన్నారి కళ్ల ముందే  తండ్రి హత్య..  ఓ చిన్నారి కళ్ల ముందే ఆమె తండ్రిని కొంత మంది దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన తమిళనాడులోని తిరుచిలో జరిగింది. గోపి కన్నన్ అనే న్యాయవాది తన కుమార్తెతో కలిసి తిరుచిలోని భీమ్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం రోడ్డుపై తన కుమార్తెకు సైకిల్ తొక్కడం నేర్పిస్తుండగా.. హఠాత్తుగా వెనక నుంచి వచ్చిన  కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆయన చుట్టూ చేరి దాడి చేశారు. వేట కొడవళ్లతో విరుచుకుపడి అత్యంత పాశవికంగా హత్య చేశారు. దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.    

తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్

తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. మే 12 బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతూ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని డెడ్‌లైన్ విధించినందున మంత్రివర్గం అత్యవసర నిర్ణయం తీసుకుంది. టీకాలకు కొరత ఏర్పడిన దృష్ట్యా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్ళనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలో లాక్ డౌన్ ఎప్పటి నుంచి? 

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదా? అంటే అవుననే తెలుస్తోంది. లాక్ డౌన్ పై హైకోర్టు సీరియస్ గా స్పందిస్తుండటం,  మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో తెలంగాణలో లాక్ డౌన్ ఖాయమని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ ఎప్పటి నుంచి పెడతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈనెల 14న రంజాన్ పండుగ ఉంది. దీంతో రంజాన్ తర్వాతే.. అంటే మే 15 నుంచి లాక్ డౌన్ పెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే విపక్షాలు లాక్ డౌన్ అంశంపై సర్కార్ ను నిలదీస్తున్నాయి. ఓ వర్గం కోసమే లాక్ డౌన్ పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయని, కేసీఆర్ సర్కార్ మాత్రం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా మంగళవారం కూడా కరోనా కట్టడిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై బుధవారం జరగాల్సిన విచారణను.. అత్యవసరంగా ఈరోజే విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడింది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడం, ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ పలు ప్రాంతాల్లో అమలు కావడం లేదని.. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రోజే.. అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందని.. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. దీనికి బదులుగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. హైకోర్టుకు ఏజీ నివేదన ప్రకారం లాక్ డౌన్ పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే రంజాన్ తర్వాత నుంచే లాక్ డౌన్ విధిస్తారా లేక ముందే అమలు చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రంజాన్ ముగిసేవరకు ఆగకుండా వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. 

ఖాకీల‌కు మాన‌వ‌త్వం లేదా? అంబులెన్సులు ఆపేస్తారా?

తెలంగాణ పోలీసులు మ‌రీ విప‌రీతంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌నీస మాన‌వ‌త్వం లేకుండా క్రూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతూ.. మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ వ‌స్తున్న ఏపీ క‌రోనా పేషెంట్ల‌ను స‌రిహ‌ద్దుల్లో అడ్డుకుంటున్నారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా తెలంగాణ బోర్డ‌ర్‌లో కొవిడ్ అంబులెన్సుల‌ను ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు.  సోమ‌వారం కూడా ఇలానే అంబులెన్సుల‌ను ఆప‌డం క‌ల‌క‌లం రేపింది. ఇరు రాష్ట్ర పోలీసులు చ‌ర్చించి.. కొన్ని కండిష‌న్లు పెట్టారు. త‌మ ఆసుప‌త్రిలో చికిత్స‌కు అనుమ‌తించామ‌ని హాస్పిట‌ల్స్ వారు ఇచ్చిన‌ లేఖ చూపిస్తేనే.. తెలంగాణ‌లోకి అనుమ‌తిస్తామ‌ని నిబంధ‌న పెట్టారు. లెట‌ర్ లేక‌పోతే.. త‌మ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. అంబులెన్సుల‌ను వెన‌క్కి తిరిగి పంపించేస్తున్నారు. మంగ‌ళ‌వారం ప‌లువురు పేషెంట్స్‌.. పోలీసులు చెప్పిన‌ట్టే హాస్పిట‌ల్స్ వాళ్లు పంపిన లెట‌ర్స్ చూపించినా.. పోలీసులు తెలంగాణ‌లోకి అనుమ‌తించ‌లేదు. లెట‌ర్స్ కాదు.. హాస్పిట‌ల్ ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ వ‌స్తేనే పంపిస్తామంటూ తిర‌కాసు పెడుతున్నారు.  ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్లే కరోనా రోగులను తెలంగాణ పోలీసులు రెండోరోజూ అనుమతించడం లేదు. ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద కొవిడ్‌ రోగులతో వచ్చే అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. ఆస్పత్రులు పంపిన అనుమతి పత్రాలు చూపించినా పోలీసులు అంగీకరించడం లేదు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల ల్యాండ్‌ లైన్‌ నుంచి ఫోన్‌ చేస్తే తప్ప తెలంగాణలోకి ప్రవేశం లేదని తేల్చిచెబుతున్నారు. అలా ఫోన్లు వచ్చిన వారినే అనుమతిస్తున్నారు. దీంతో గంటల తరబడి రోడ్లపైనే రోగులు, బంధువులు పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్‌ రోగులకు ఏమైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులను రక్షించాలని వేడుకుంటున్నారు.   మ‌రోవైపు, స‌రిహ‌ద్దుల్లో అంబులెన్సుల‌ను ఆపుతున్న విష‌యం తెలంగాణ హైకోర్టు దృష్టికి వ‌చ్చింది. పోలీసుల తీరుపై తీవ్ర‌ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. విపత్తు వేళ అంబులెన్స్‌లను నిలిపేయడం మానవత్వమేనా అని ప్రశ్నించింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల ద‌గ్గ‌ర అంబులెన్స్‌లు ఆపారని ప్రశ్నించింది. హైద‌రాబాద్‌లో హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా.. స‌రిహ‌ద్దుల్లో పోలీసుల తీరు మాత్రం మార‌లేదు. ఇప్ప‌టికీ ఏపీ నుంచి కొవిడ్ పేషెంట్స్‌తో వ‌స్తున్న అంబులెన్స్‌ల‌ను ఖాకీలు అడ్డుకోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. 

తల్లి కూతురు పెళ్లి ప్లాన్.. పది లక్షలతో జంపు..  

వాళ్ళు ఇద్దరు తల్లీకూతుర్లు. కూతురు పెళ్లి కుదిరిందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి పేరంటానికి పిలుద్దామని వెళ్లారు. అనుకున్నట్లుగానే పెళ్లి కార్డు చేతిలో పెట్టారు. ఆ రోజు రాత్రి అయిందని అక్కడే పడుకుని పొద్దునే వెళ్లిపోతామని చెప్పారు. ఆడవాళ్లు , అందులో పరిచయం ఉన్నవాళ్లు అని ఓ మహిళా ఉందని అని చెప్పింది. ఆ ఇద్దరు ఆడవాళ్లు పడుకున్నారు. పొద్దునే వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఇంటి మహిళ షాక్ తిన్నది. ఏం జరిగిందో మీరే చూడండి..  అది ప్రకాశం జిల్లా. ఒంగోలు. ఆమె పేరు మనీషా. అనీషాకు గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాధాదేవి కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. దీంతో పలుసార్లు గుంటూరు వచ్చి వాళ్ల ఇంట్లో ఉండి వెళ్లేవాళ్లు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 29న మనీషా తన తల్లి ఝాన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చారు. మనీషాకు వివాహం నిశ్చయమైందని పెళ్లికి పిలవడానికి వచ్చినట్లు తెలిపారు. రాత్రి పొద్దుపోవడంతో ఆరోజు ఆ ఇంట్లో ఉండి మరుసటిరోజు ఒంగోలు వెళ్లిపోయారు.  కట్ చేస్తే.. రాధాదేవి ఇంట్లోని బీరువాలో చూస్తే బంగారపు వడ్డాణం, నక్లెస్‌, చెవిదిద్దులు, పట్టుచీర మొత్తం రూ.10 లక్షలు విలువచేసే వస్తువులు కనిపించడం లేదు. ఆ వస్తువులు చోరీకి గురైనట్లు రాధాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ డీఎస్పీ సుప్రజ, పట్టాభిపురం సీఐ శివప్రసాద్‌లు కేసు నమోదు చేసి విచారించగా మనీషా, ఆమె తల్లి ఝాన్సీలు ఆ నగలు చోరీ చేసినట్లు తేలడంతో వారిని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేసి రూ.10 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు జప్తు చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ శివప్రసాద్‌, ఎస్‌ఐ సత్యన్నారాయణ, సిబ్బంది జానీ, సరస్వతీ, రమేష్‌బాబు, ఉమామహేష్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.      

రుయాలో ఏం జరిగింది? చనిపోయింది ఎంతమంది? 

తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రుయాలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. రుయాకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చనిపోయింది 11 మందని జిల్లా కలెక్టర్ ప్రకటించినా..  మొత్తం 29 మంది అని మరణించారని తెలుస్తోంది. మృతి చెందిన 11 మంది బెడ్స్‌తో పాటు తమతో వైద్యం తీసుకుంటున్న మరో 18 మంది బెడ్స్ కూడా ఖాళీగా ఉండటంతో వారంతా మరణించి ఉంటారని రోగులు చెబుతున్నారు.  ఉత్తమ సేవలతో ప్రాణదాతగా పేరొందిన తిరుపతిలోని రుయాలో ఈ విషాదానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం చెబుతున్నది నిజమా? వాస్తవం ఏంటి? అన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. సోమవారం రాత్రి హాస్పిటల్ లో ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. రెండు అంతస్తులు.. 6వార్డులలో ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్నారు బాధితులు. రాత్రి 8 గంటలకు ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకార్ పూర్తిగా కాళీఅయ్యింది. కొవిడ్‌ వార్డుల్లో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోవడంతో పరిస్థితి ఒక్క సారిగా భయానకంగా మారింది. ఎటు చూసినా బెడ్లపై అచేతనంగా పడి ఉన్న బాధితులు, శ్వాసకోసం ఇబ్బందులు పడుతున్న వారే కనిపించారు. వైద్యులు, సిబ్బంది వారి చుట్టూ చేరి.. ఛాతీపై నొక్కుతూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బాధిత బంధువులు.. వార్డులోకి పరుగులు తీశారు. అప్పటికే కొంతమంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వెంటిలేటర్ పై ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వారికీ... ఊపిరి అందించేందుకు బాధిత బంధువులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కన్నీరు పెట్టేలా చేశాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిందని, నామమాత్రంగా కొందరికి మాత్రమే ఆక్సిజన్ ను సరఫరా చేసారని కరోనా బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. 30 నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ అందక... బాధితుల బంధులువ అరుపులు కేకలతో రుయా ఎంఎంవార్డ్ దద్దరిలింది. తమ వారు కళ్ళముందే ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే ఎం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్లిపోయారు. మరి కొందరు గట్టిగ ఏడుస్తూ.. బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేసారు. వారిని ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆసుపత్రిలోని వార్డులోనే నిలువరించారు.  వార్డులోని డాక్టర్స్, సిబ్బంది పై అక్కడ ఉన్న సహాయకులు గొడవకు దిగడంతో సిబ్బంది వార్డులలో నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే 9 గంటల సమయానికి శ్రీపెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఇంతలోపే జరగాల్సిన విపత్తు అంతా జరిగిపోయింది. ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన జరిగిన ఆక్సిజన్ ప్లాంట్, ఎంఎం వార్డులను పరిశీలించారు. రుయాలో వెయ్యిమంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇందులో 700 ఆక్సిజన్, మరో 300 సాధారణ పడకలు ఉన్నాయన్నారు కలెక్టర్. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రాణవాయువు సరఫరా కొంత తగ్గడం వల్ల ఘటన జరిగిందని ఆయన నిర్ధారించారు.  ఆక్సిజన్ సరఫరా లేటవ్వడంతో కొంతమంది కొవిడ్ చికిత్స పొందుతున్న వాళ్లు చనిపోయారని కలెక్టర్ వెల్లడించారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా కొంత తగ్గిందని.. ఈలోగా ట్యాంకర్ రావడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినట్లయిందని అన్నారు. వెంటిలేటర్ల మీద ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. మృతుల బంధువులు మాత్రం హాస్పిటల్ యాజమాన్యం తప్పిదంతోనే ఈ ఘటన జరిదని ఆరోపిస్తున్నారు. వెయ్యి మందికి వైద్యం అందిస్తున్న ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పరిశులించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు మరణాల లెక్కలు తప్పు చెప్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు బాధితులు.

చిట్కావైద్యం చాలా డేంజర్ 

ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి ఆరోగ్య విపత్తులు సంభవించినప్పుడు, మీడియా పాత్ర చాలా కీలకంగా మారుతుంది. మీడియా విస్తరణ ఇంతగా లేని రోజుల్లో, పత్రికలు, రేడియో సామాజిక బాధ్యతను చక్కగా, పది మంది మెచ్చుకునే విధంగా నిర్వహించాయి. ఇపుడు, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా పరిధి బాగా విస్తరించింది.అయితే, దురదృష్ట వశాత్తు సామాజిక బాధ్యత కుదించుకు పోయింది. మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా సంబంధించి అనేక అవాస్తవాలు యధేచ్చగా ప్రచారంవుతున్నాయి. అవాస్తవాలు ప్రచారం కావడమే కాదు, సోషల్ మీడియాలో కరోనా చిట్కాలు, కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారుతున్నాయి.  ఈ నేపధ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రజలకు గట్టి హెచ్చరిక చేశారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) వైద్యులు రూపొందించిన ‘కరోనా పేషెంట్‌ గైడ్‌’ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు సోషల్‌మీడియాలో వచ్చే చిట్కాలను పాటించి, ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ పద్ధతులనే పాటించాలని సూచించారు.గూగుల్‌ సెర్చ్ ‘లో  వచ్చే చిట్కాలకు దూరంగా ఉండాలని, వైద్యులు అందజేసే సూచనలనే పాటించాలన్నారు. ఏఐజీ రూపొందించిన ‘కరోనా పేషెంట్‌ గైడ్‌’లో.. కరోనా సోకిందని తెలియగానే ఏంచేయాలి? ఐసోలేషన్‌లో ఎలా ఉండాలి? ఎలాంటి మందులు వాడాలి? ఆక్సిజన్‌ లెవల్స్‌ను ఎలా చూసుకోవాలి? వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉండే పరిస్థితులు ఏమిటి? అనే వివరాలనీ పొందు పరిచారు. ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చే నకిలీ సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని వివరించారు. తాము ఇప్పటి వరకు 20 వేల మంది కరోనా రోగులకు చికిత్స అందించామని, చికిత్సకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర వైద్యులకు అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైద్యంపై త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు డాక్టర్ నాగేశ్వర్ ప్రకటించారు.  రోగి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, స్థానిక వాతావరణ పరిస్థితులబట్టి  చికిత్సలో మార్పులుంటాయని అంటూ ఆయన  అందరికీ ఒకే చికిత్స పనిచేయదని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో, నగరంలో కరోనా చికిత్సను అందించే ఆస్పత్రులు, బెడ్ల సమాచారం సామాన్యులకు అందుబాటులో లేదు. అందరికి సంకాహ్రం అందే విధంగా త్వరలో నగరంలోని అన్ని ఆస్పత్రులతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి.. ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్ల వివరాలను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా డాక్టర్ నాగేశ్వర్ వివరించారు.

టాబ్లెట్ పట్టు.. కరోనా పట్.. 

ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు సంవత్సరం పైగా అందరినోట ఒకటే మాట, అదే కరోనా మాట. ఏ ఇంట చూసిన ఒక్కటే చావు, అదే కరోనా చావు. కరోనా వల్ల దేశం అతలాకుతం అవుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మాయదారి కరోనా వల్ల. ఇప్పటికి దేశవ్యాపితంగా వేలమంది మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాపితంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా విలయం వల్ల ప్రజల్లో భయాందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక కరోనా కి చెక్ పెడుతామంటున్నారు శాస్త్రవేత్తలు.  అదెలా అనుకుంటున్నారా.. అదే  ఐవర్‌మెక్టిన్.  ఐవర్‌మెక్టిన్ అంటే ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి.  ఐవర్‌మెక్టిన్ అంటే నోటి ద్వారా  తీసుకునే ఔషధంతో కరోనా దరిచేరకుండా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ పరాన్న జీవులతో సంక్రమించే ఇన్‌ఫెక్షన్లను నయం చేసేందుకు ఉపయోగించే దీనితో కొవిడ్‌కు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ‘ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికల్ కేర్ అలయెన్స్’ (ఎఫ్ఎల్‌సీసీసీ) సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 2500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో కొవిడ్ నివారణలో ఐవర్‌మెక్టిన్ సమర్థంగా పనిచేస్తుందని తేలింది. క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని తీసుకున్న వారిలో కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. కొవిడ్ బాధితులపైనా ఇది అద్భుతంగా పనిచేస్తుందని 42 ప్రయోగాల డేటాను విశ్లేషించినప్పుడు తేలిందని ఎఫ్ఎల్‌సీసీసీ అధ్యక్షుడు పీయర్ కోరీ తెలిపారు. కొవిడ్ బాధితుల్లో మరణాన్ని ఈ ఔషధం ఆపుతుందని పేర్కొన్నారు. అలాగే శరీరంలో ఉన్న వైరస్‌ను ఇది వేగంగా నిర్మూలిస్తుందని వివరించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాప్టిక్స్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. 

ఏపీలో మరో ఘోరం... ఆక్సిజన్ అందక 11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మహా విషాదం చోటు చేసుకుంది.ఆక్సిజన్‌ అందక...11 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది చనిపోయారని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. కాని మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చునని, కనీసం పాతిక మంది చనిపోయి ఉంటారని వివిధ వర్గాలు  చెబుతున్నాయి.  తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేలలీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. దీని నుంచే రుయా ఆస్పత్రిలోని వెంటిలేటర్‌, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లకు ప్రాణవాయువు సరఫరా అవుతుంది. సోమవారం సాయంత్రం 6 - 7 గంటల సమయానికి ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోయే అవకాశముందని సిబ్బంది ముందుగానే అధికారులకు చెప్పారు. దానికనుగుణంగా తమకు ఆక్సిజన్‌ సరఫరా చేసే చెన్నైకి చెందిన లిండేన్‌ కంపెనీకి సమాచారం అందించారు. చెన్నైలో సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. నిబంధనల ప్రకారం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించవద్దు. దీంతో... అది తిరుపతికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాత్రి 7 గంటలకు ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు 3 కేఎల్‌కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా పీడనం అందలేదు. ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువమంది చనిపోయారు. ఆ అరగంటలోనే...: సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. కానీ... ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్‌ అందక గిలాగిలా కొట్టుకుంటూ విగత జీవులుగా మారడంతో బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని నిందిస్తూ... వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. భయంతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. రాత్రి 10.45కు ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో 700 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స అందిస్తున్నారని, ఐదు నిమిషాలు ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు  రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు. 

సీఎం జగన్ పై కేసు పెట్టాలి! రుయా హాస్పిటల్ లో మరణ మృదంగం 

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మందిపైగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. రుయాలో ఇప్పటికి పరిస్థితులు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. రుయా ఘటనపై టీడీపీ తీవ్రంగా స్పందించింది.  ఆక్సిజన్ అందక చనిపోయిన వారివన్నీ  ప్రభుత్వ హత్యలే అని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై  పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి  నోటీసులు ఇస్తున్నారు తప్ప,  ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సీజన్ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.  హాస్పిటల్లలో రోగులకు సరిపడా మందులు లేవని, ఆక్సిజన్ లేదని, బెడ్లు లేవని, ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు చనిపోతున్నా జగన్ రెడ్డికి మాత్రం కనీస మానవత్వం లేదని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయడం  ఎంత వరకు సమంజసమని అచ్చెన్న ప్రశ్నించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అచ్చెన్నాయుడు  . చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన పట్ల  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను గవర్నర్ ఆదేశించారు. 

రైతు ఉద్యమకారిణిపై.. అత్యాచార* 

అది దేశ రాజధాని. కొత్త కాలంగా రైతుల హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఆ రైతులకు మద్దతుగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా తమ మద్దతు తెలుపుతున్నారు. ఒక బీజేపీ పార్టీ తొత్తులు తప్పా.. తాజాగా  ఆ రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ సామాజిక ఉద్యమకారిణి వెళ్ళింది. ఆమెపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..   ఎస్‌కేఎం ప్రకటన ప్రకారం, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువ ఉద్యమకారిణి(25), ‘కిసాన్‌ సోషల్‌ ఆర్మీ’కి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరియాణాలోని టిక్రీ సరిహద్దుకి బయలుదేరారు. ఏప్రిల్‌ 11న అక్కడి రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి బయలుదేరారు.   కట్ చేస్తే.. ఆ నలుగురు వ్యక్తులు మార్గంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ఉద్యమకారిణికి తీవ్ర జ్వరం, అస్వస్థతకు గురైయింది. ఆ బాధిత మహిళను దిల్లీలోని జగ్గార్‌ ఆసుపత్రిలో చేరారు. అదే క్రమంలో పరీక్షల్లో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో ఏప్రిల్‌ 30న ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సమాచారం. అయితే, యువతి చనిపోయే ముందు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె తండ్రికి ఫోన్‌లో తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాల ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన యువతిపై అత్యాచరం జరిగినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), మహిళలపై ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రకటించింది.     ఈ   ఘటన గురించి తెలిసిన వెంటనే కిసాన్‌ సోషల్‌ ఆర్మీపై చర్యలు తీసుకున్నామని టీక్రీలోని రైతు సంఘం వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. టిక్రీ సరిహద్దులో కిసాన్‌ సోషల్‌ ఆర్మీకి చెందిన టెంట్లు తొలగించడంతో పాటు ఆ బృందానికి చెందిన వారిని ఉద్యమంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన తమ సహఉద్యమకారిణి పక్షాన న్యాయం కోసం పోరాడుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది.   ఒక వైపు దేశంలో కరోనా విలయం. మరోవైపు దేశం మృత్యువు వలలో నిద్ర పోతుంది. అదే మృత్యువు వలతో ని నిద్ర లేస్తుంది. ఇలాంటి టైం లో కూడా అమ్మాయిలపై దాడులు మానడం లేదు. నమ్మి వెంట వచ్చిన వాళ్ళని నమ్మకద్రోహం తో చంపేస్తున్నారు కొంత మంది కామాంధులు.  

తెలంగాణలో లాక్ డౌన్?

తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ దిశగా పయనిస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రకటించిన కేసీఆర్.. తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు  సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించాలా? వద్దా? అనే అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు సైతం చర్చకు రానున్నట్లు సమాచారం.లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్  కావాలని కోరుకుంటున్నపరిస్థితి  వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియమీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది.  లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణలో విధిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.   దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా కట్టడి నిమిత్తం లాక్‌డౌన్‌ విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే రాత్రిపూట కర్ఫ్యూ మినహా ఎలాంటి కఠిన ఆంక్షలు లేకపోవడం గమనార్హం. దీంతో కొన్ని వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ విధించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి.  మరోవైపు తెలంగాణలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ విధించాలని  భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో వాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల రాష్ట్రానికి వాక్సిన్ కోటా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ మరణాలపై తప్పుడు నివేదికలు ఇస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుతూ  కేంద్రానికి తప్పుడు సలహాలిస్తున్నారని వెంకట్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

సిగ్గు సిగ్గు.. టీకాపై వైసీపీ డర్టీ పాలిటిక్స్ 

నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతల తీరు. కరోనా మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోని పాలకులు... కక్ష రాజకీయాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. కోవిడ్ కట్డడిని గాలికొదిలేసి.. వ్యాక్సినేషన్ ను వదిలేసి.. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వైసీపీ నేతల ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు మరింత జుగుప్సాకరంగా ఉంటున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లకు కులం కంపు రుద్దుతూ.. దిగజారి వ్యవహరిస్తున్నారు. జనాలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు.  ఏపీలో ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో పావుగంట‌కో ప్రాణం పోతోంది. ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయిన వారి సంఖ్య‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యావ‌త్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, చేత‌గాని త‌నం వ‌ల్ల‌ే కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్నా.. చేతులెత్తేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఆక్సిజ‌న్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. కేంద్రానికి లేఖ‌లు రాస్తూ.. త‌ప్పును ఢిల్లీపైన నెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్.. జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి, చేతగానితనానికి సాక్ష్యంగా నిలుస్తోంది.  డా:ఎల్లా - రామోజీ - బాబు  మీ మధ్య  బాంధవ్యాలు బంధుత్వాలు తెలియనివి కావు.  పిచ్చి రాతలు,పిచ్చి కూతలు మాని రాష్ట్రానికి కావాల్సినన్ని  కోవాక్సిన్  ఇప్పించండి! ఇది అంబటి రాంబాబు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ పైనే ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. అంబటికి సోషల్ మీడియాలో జోరుగా కౌంటర్లు పడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. అంతేకాదు కొవాగ్జిన్ పై వైసీపీ నేతలు మొదటి నుంచి పెద్ద ఎత్తున దుష్పప్రచారం చేశారు. కొవాగ్జిన్ ను ఉత్పత్పి చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా కమ్మ సామాజిక వర్గం కావడంతో.. ఆ సంస్థను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడే... సమర్ధవంతంగా పని చేయదంటూ పిచ్చి పోస్టులు పెట్టారు. ట్రయల్స్ అయిపోయాక కూడా ఏడుపు ఆపలేదు. కొవాగ్జిన్ కు అనుమతి ఇచ్చే ముందు ప్రధాని మోడీ ఆలోచించుకోవాలంటూ దిక్కుమాలిన రాతలు రాశారు.  ఇప్పుడు ట్రయల్స్ అన్ని పూర్తయ్యాయి. కొవాగ్జిన్ మార్కెట్ లోకి వచ్చింది. కొవాగ్జిన్  కావాలంటూ డిమాండ్ పెరిగింది. వేరే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ సమకూర్చుకోవడంలో విఫలమైన  జగన్ రెడ్డి సర్కార్.. జనాల దృష్టి మళ్ళించేందుకు కొవాగ్జిన్ పై మళ్లీ కొత్త నాటకాలకు తెర తీసిందని అంటున్నారు. అందులో భాగంగానే ఇలా.. డా ఎల్లాకు చంద్రబాబు, రామోజీకి లింక్ పెట్టి.. వ్యాక్సిన్లు ఇప్పించవచ్చు కదా అంటూ పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.  కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా కేంద్రం చేతుల్లో ఉందంటూనే ఎల్లాకు చంద్రబాబుకు లింకు పెడుతూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేయడంపై విపక్షాలతో పాటు వైద్య వర్గాలు, జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎట్టా... ఎల్లాతో రామోజీకి బంధుత్వం ఉంటే పద్దతి పాడు లేకుండా వ్యాక్సిన్ ఇవ్వాలా అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఏడ్చిన వాళ్లే.. ఇప్పుడు కావాలంటూ కథలు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.  వైసీపీ ఎమ్మెల్యే వాగినట్లు.. రామోజీతో బంధుత్వం ఉన్నందుకు కృష్ణా ఎల్లా కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే.. మరీ జగన్ అక్రమస్తుల కేసులతో లింకున్న హెటిరో సంస్థ నుంచి ఎందుకు రెమిడిసివర్ ఇంజక్షన్లు తెప్పించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో సంస్థ నుంచి కొవిడ్ మందులు ఫ్రీగా ఎందుకు ఇప్పించడం లేదో చెప్పాలంటున్నారు. రాంకీ సంస్థ ఆళ్ల ఫ్యామీలిది కదా.. పెద్దాయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు కదా.. వాళ్లతో రాష్ట్రమంతో ఫ్రీగా మందులు జగన్ రెడ్డి.. ఎందుకు ఇప్పియ్యలేకపోయారని నెటిజన్లు నిలదీస్తున్నారు. వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు ఒక రూల్.. సమర్ధించేవాళ్లకు ఒక రూలా అంటూ వైసీపీ నేతలను కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.  కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  మోడీ సర్కార్ కూడా మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ  చేతులెత్తేసింది. 13.5లక్షల వ్యాక్సిన్ల కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తొలి డోసు తీసుకున్నవారంతా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.  వ్యాక్సిన్ల సెంటర్లకు క్యూ కడుతున్నారు. అర్ధరాత్రే వెళ్లి క్యూలైన్లలో నిల్చుకుంటున్నారు. గంటలకొద్ది అక్కడే ఉంటున్నారు. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. అయినా సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో వ్యాక్సిన్ సెంటర్లే కోవిడ్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో నెపాన్ని కేంద్రంపై వేసి చేతులు దులుపుకునే యోచనలో జగన్ రెడ్డి సర్కార్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు, రామోజీకి.. కృష్ణ ఎల్లాతో బంధుత్వం కలుపుతూ కొత్త కుట్రలు చేస్తున్నారనే విమర్శలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి. 

గేట్స్‌-మెలిందా విడాకుల‌కు కార‌ణం అత‌నేనా?

ప్ర‌పంచంలోకే రిచెస్ట్ క‌పుల్స్‌. 27 ఏళ్ల వైవాహిక అనుబంధం. బిల్‌-మెలిందా గేట్స్ ఫౌండేష‌న్‌తో 4 ల‌క్ష‌ల కోట్ల దాతృత్వ‌ కార్య‌క్ర‌మాల‌కు క‌ర్త‌లు. 1994లో వివాహం. ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు. ఆ అన్యోన్య దంప‌తులు ఇటీవ‌ల విడిపోతున్న‌ట్టు ఉమ్మ‌డిగా ప్ర‌క‌టించారు. యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయింది.  ఇంత‌కీ బిల్‌గేట్స్‌-మెలిందా క‌పుల్స్ ఎందుకు విడిపోతున్న‌ట్టు? 27 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ఎందుకిలా తెగ‌దెంపులు చేసుకుంటున్న‌ట్టు?  వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మేంటి?  విడాకులు తీసుకునేంత పెద్ద స‌మ‌స్య ఎందుకొచ్చింది? కొన్ని రోజులుగా ఇదే చ‌ర్చ.   గేట్స్‌-మెలిందా దంప‌తుల విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదట‌. ఏడాదిన్నర కాలంగా గేట్స్‌ దంపతులు విడాకులపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపారట. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెర‌ప‌డం నచ్చక పోవ‌డం వల్లే.. మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" కథనం.    తమ దాంపత్య బంధం ‘తిరిగి కొనసాగించలేని విధంగా ముక్కలైంది’ అని చెబుతూ మెలిందా 2019 అక్టోబరులోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మారి విజృంభణ సమయంలో దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం విడాకులపై పరస్పర నిర్ణయానికి వచ్చారంటూ "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" క‌థ‌నం రాసుకొచ్చింది.  లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని బిల్ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం తెలిపింది. 2013లో ఓ దాతృత్వ కార్యక్రమం కోసం గేట్స్‌ దంపతులు ఎప్‌స్టీన్‌ను కలిశారు. అయితే అతడి ప్రవర్తనతో తాను సౌకర్యంగా లేనని మెలిందా అప్పుడే గేట్స్‌కు చెప్పారు. కానీ ఆమె అభ్యంతరాన్ని విస్మరించి గేట్స్‌, కంపెనీ ఉద్యోగులు కొందరు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించారు. గేట్స్‌, ఎప్‌స్టీన్‌ పలుమార్లు కలిశారని, ఒక రాత్రంతా గేట్స్‌ అతడి నివాసంలోనే ఉన్నాడని 2019లో అమెరికా పత్రికలు కథనాలు రాశాయి. అయితే తనని కలిసిన మాట వాస్తవమేనని, కానీ తమ మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు, స్నేహ బంధాలు లేవని అప్పట్లో గేట్స్‌ చెప్పారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడ‌వ‌లు వ‌చ్చి.. అవి ముదిరి.. విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్‌ తన కథనంలో తెలిపింది.    వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌.. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయ‌న చ‌నిపోయినా.. జెఫ్రీ బ‌తికున్న‌ప్పుడు అత‌నితో బిల్‌గేట్స్ డీలింగ్స్ జ‌ర‌ప‌డాన్ని అంగీక‌రించ‌లేక‌పోయింది మెలిందా. దీంతో.. ఆ ఇద్ద‌రు సుదీర్ఘంగా చ‌ర్చించుకుని.. విడాకులు తీసుకోవాల‌నే ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఇలా, ఆ 27 ఏళ్ల బంధం ముగిసిందంటూ అమెరికాకు చెందిన ప్ర‌ముఖ వార్తా సంస్థ "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" స్పెష‌ల్ స్టోరీ ప్ర‌చురించింది.

రెజ్ల‌ర్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. సుశీల్‌పై లుక్అవుట్ నోటీసులు

రెండుసార్లు ఒలంపిక్ మెడ‌లిస్ట్‌. ఓసారి ప్ర‌పంచ ఛాంపియ‌న్‌. అనేక జాతీయ స్థాయి ప‌త‌కాలు, అవార్డులు, రివార్డులు. ఇలాంటి ఘ‌న‌కీర్తుల‌తో పాటు ఇప్పుడు ఆయ‌న ఖాతాలో ఓ మ‌ర్డ‌ర్ కేసు, పోలీసుల లుక్అవుట్ నోటీసులు కూడా చేరాయి. ఇండియ‌న్ స్టార్ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ కోసం పోలీసులు ప‌లు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌దేశాలు మారుస్తూ.. చిక్క‌డు-దొర‌క‌డు టైప్‌లో త‌ప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో, తాజాగా ఆయ‌న‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు పోలీసులు.  ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్‌ దంకర్‌ అనే జాతీయ స్థాయి రెజ్లర్‌ మరణించాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్‌, అమిత్‌కుమార్‌లపై.. సుశీల్ కుమార్‌తో పాటు అత‌ని ఫ్రెండ్స్ క‌లిసి దాడి చేశార‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ అటాక్‌లో తీవ్ర‌గాయాల‌తో రెజ్ల‌ర్ సాగ‌ర్ చ‌నిపోయాడు. తమపై దాడికి పాల్పడింది సుశీల్‌, అతడి మిత్రులే అని గాయపడిన ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్‌ తప్పించుకొని తిరుగుతుండటంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. దాడి జరిగినప్పుడు రెజ్ల‌ర్‌ సుశీల్ కుమార్‌ స్టేడియంలోనే ఉన్నాడని అనేందుకు టెక్నిక‌ల్ ఎవిడెన్స్ సేక‌రించారు పోలీసులు. అతడిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నారు. తొలుత హరిద్వార్‌లో అతడు ఉన్న‌ట్టు స‌మాచారం అందింది. పోలీసులు అక్క‌డికి వెళ్లే స‌రికి అత‌ను అక్క‌డి నుంచి ప‌రార్ అయ్యాడు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన‌ట్టు ఇన్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని పోలీసులు అంటున్నారు. అందుకే, స్టార్ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌ను ప‌ట్టుకునేందుకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హ‌త్య కేసులో అత‌ని పాత్ర ఉంద‌ని తేలితే.. ఇక సుశీల్ కుమార్‌ రెజ్లింగ్ కెరీర్ ముగిసిన‌ట్టే. 

ఈటలకు సపోర్ట్ ఇచ్చేదెవరు? హ్యాండిచ్చేదెవరు? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రిపదవి నుంచి అవమానకరంగా తొలగించాలని భావిస్తున్న ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించారు. అయితే తన అనచరులు, నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపిన రాజేందర్... రాజీనామాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సమయం కొంత లేటైనా ఈటల రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనచురులు చెబుతున్నారు. జనాలంతా కరోనా భయంలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడం సరికాదనే భావనలో రాజేందర్ ఉన్నారంటున్నారు. ఈటల అనుచరుల వాదన ఎలా ఉన్నా.. ఆయన భవిష్యత్ కార్యాచరణపై మాత్రం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని దాదాపు నిర్ణయించిన రాజేందర్... కొత్త పార్టీ పెడితే తనతో కలిసి వచ్చేవారెవరు అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. బీసీ ఎజెండాగా జనంలోకి వెళ్లాలా లేక తెలంగాణ ఉద్యమకారుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నారంటున్నారు. బీసీ ఎజెండాతో పార్టీ పెట్టాలని ఆయనపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. అయితే ఈటలకు మాత్రం రెడ్డి వర్గం నేతల నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుందని అంటున్నారు. దీంతో ఏం చేయాలన్న అంశంపై తన అంతరంగీకులతో ఈటల సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.  కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవలే ఈటలను కలిశారు. కొత్త పార్టీపైనే ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని గతంలోనే ప్రకటించారు రాజేందర్. టీఆర్ఎస్ లో ఉన్న కొందరు అసంతృప్త నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలను కలిసి మద్దతు తెలిపారు. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలను కలవడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. హరీష్ రావు వర్గంగా చెప్పుకునే నేతలంతా రాజేందర్ తో టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో కొంత కాలంగా హరీష్ రావు సన్నిహిత నేతలను పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ఈటలతో ఏనుగు సమావేశం తర్వాత మరో చర్చ కూడా జరుగుతోంది. హరీష్ రావు డైరెక్షన్ లోనే ఈటలను రవీందర్ రెడ్డి కలిశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.  కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈటలకు మద్దతుగా ఉన్నారంటున్నారు. మొదటి నుంచి ఈటల మనిషిగా పేరున్న సదరు ఎమ్మెల్యే ప్రస్తుతానికి బహిరంగంగా ప్రకటన చేయకపోయినా... కొత్త పార్టీ పెడితే మాత్రం మద్దతు ఇవ్వడం ఖాయమంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొందరు సీనియర్ నేతలు రాజేందర్ తో రాయబారం నడుపుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లో గౌరవం లేదని భావిస్తున్న వరంగల్ జిల్లాలోని ఉద్యమ నేతలు కూడా ఈటల కొత్త పార్టీ పెడితే చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ నేతలంతా ఈటలకు మద్దతుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ సెకండ్ కేడర్ నుంచి ఈటలకు భారీగా సపోర్ట్ వస్తుందని అంటున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మధ్య ఆదిపత్య పోరు తీవ్రంగా ఉంది. బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం వలసొచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాంటి నేతలంతా ఈటల కొత్త పార్టీ పెడితే... అతనితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు ఇప్పటికే తమ అనుచరుల ద్వారా రాజేందర్ కు సంకేతం ఇచ్చారని అంటున్నారు.  మరోవైపు ఈటల రాజేందర్ పై నిఘా పెట్టిన అధికార పార్టీ... ఆయనను ఎవరు కలుస్తున్నారన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈటల పార్టీ పెడితే ఆయనతో వెళ్లేవారెవరు అన్న దానిపై గులాబీ నేతలు ఫోకస్ చేశారంటున్నారు. ఈటలను కలుస్తున్న నేతలను తమదారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ముందుగా ఈటల నియోజకవర్గం హుజురాబాద్ నుంచే ఆపరేషన్ ఈటల స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించిన తర్వాత ఆయనకు మద్దతుగా మాట్లాడిన నేతలకు తాయిలాలలతో ఎరవేస్తున్నారని చెబుతున్నారు. పదవుల్లో ఉన్న నేతలకైతే .. పదవి పోతుందని హెచ్చరిస్తున్నారట. ఆయినా దారికి రాకపోతే ఏదో ఒక కేసులో ఇరికిందే లొంగ దీసుకునే ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలీసు, రెవిన్యూ శాఖల్లో అధికారులను బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల చర్యలతో... గతంలో ఈటలకు మద్దతుగా నిలిచిన  కొందరు నేతలు ఇప్పుడు వెనకాడుతున్నారని తెలుస్తోంది.

లేఖ‌లు రాస్తే వ్యాక్సిన్లు వ‌స్తాయా? నేను తెప్పిస్తే మీరెందుకు?

వ్యాక్సిన్ల‌కు ఆర్డర్లు పెట్టకుండా.. అడ్వాన్సులు చెల్లించ‌కుండా.. కేవ‌లం లేఖలు రాస్తే వ్యాక్సిన్ ఎలా సరఫరా చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. "నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనం. నేను టీకా తెప్పిస్తే మరి మీరెందుకు సీఎంగా ఉండటం?" అని చంద్రబాబు మండిప‌డ్డారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే జగన్‌‌రెడ్డికి లెక్కలేనితనంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలన్నారు చంద్ర‌బాబు. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని చెప్పారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి  ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని తెలిపారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను కూడా పిలిచింద‌ని అన్నారు.  క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి బాధ తీర్చాలని తెలిపారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 500మందికి పైగా వైద్య సేవలు అందించామని ప్రకటించారు. కరోనా దెబ్బకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్ర‌బాబు. 

ప‌ర్మిష‌న్ ఉంటేనే హైదరాబాద్‌కు.. పోలీసుల క్లారిటీ..

కొవిడ్ రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. ఏపీకి చెందిన క‌రోనా పేషెంట్స్‌ను తెలంగాణ‌లోకి అనుమ‌తించ‌డం లేదు పోలీసులు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌రే రోగుల‌ను, వారి వాహ‌నాల‌ను ఆపేస్తున్నారు. ఎంత‌గా బ‌తిమిలాడుకున్నా తెలంగాణ పోలీసులు త‌మ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటున్నారు. హాస్పిట‌ల్‌లో త‌మ‌కు బెడ్ రిజ‌ర్వ్ అయింద‌ని చెప్పినా ఖాకీలు విన‌డం లేదు. సోమ‌వారం ఉద‌యం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఇదే ఆందోళ‌న‌. దీంతో.. తాజాగా, ఏపీ పోలీసులు హైద‌రాబాద్‌కు వెళ్లే వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు.  ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని..  సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.   ఉద‌యం నుంచీ ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ ద‌గ్గ‌ర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు తెలంగాణ‌లోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.  అనంత‌పురం నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను పుల్లూరు టోల్‌ప్లాజా ద‌గ్గ‌ర పోలీసులు అడ్డుకోవ‌డంతో అందులోని క‌రోనా పేషెంట్ ప‌రిస్థితి విష‌మంగా మారడం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. చికిత్స కోసం తెలంగాణ‌కు వెళ్తున్న వారిని ఆప‌డం బాధాక‌ర‌ణ‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా ఇరు రాష్ట్రాలు శ్ర‌ద్ధ చూపాల‌ని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తాజాగా ప‌లు సూచనలు చేశారు. ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళ్లాలంటే.. ముంద‌స్తు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించారు.

న‌దిలో 48 డెడ్‌బాడీస్‌.. క‌రోనా భ‌య‌మేనా?

న‌దిలో మృత‌దేహాలు తేలుతున్నాయి. ఒక‌టి, రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లో డెడ్‌బాడీస్ నీటిలో కొట్టుకొస్తున్నాయి. ప‌విత్ర గంగా, య‌మునా న‌దులు ఇప్పుడు మృత‌దేహాల దిబ్బ‌లుగా మారాయి. బిహార్‌లోని బ‌క్స‌ర్ జిల్లాలో మృతదేహాల కలకలం చెల‌రేగింది. గంగా నదిలో కిలోమీటర్‌ పరిధిలో 48 డెడ్‌బాడీస్ క‌నిపించాయి. మృత‌దేహాల‌ను చూసి స్థానికులు ఒక్క‌సారిగా బెదిరిపోయారు. వెంట‌నే పోలీసుల‌కు, అధికారుల‌కు స‌మాచారం అందించారు.  మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో న‌దిలో మృత‌దేహాలు తేలియాడుతుండ‌టం చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హామిర్‌పుర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని అంటున్నారు.  కరోనాతో చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి భ‌య‌ప‌డి.. ఇలా న‌దిలో వ‌దిలేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు, క‌రోనా మృతుల‌కు ద‌హ‌న సంస్కారాలు చేయాల్సిన కొంద‌రు సిబ్బంది సైతం ఇలా బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తూ న‌దిలో ప‌డేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.  యూపీలోని హామిర్‌పుర్‌, కాన్పుర్‌ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరు. వాటిని నదిలో వదిలేస్తారు. అందుకే, యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే, ఓవైపు క‌రోనా కార‌ణంగా మృతుల సంఖ్య భారీగా పెర‌గ‌డం.. మ‌రోవైపు,  కొవిడ్ భ‌యంతో అంత్య‌క్రియ‌లు చేయ‌కుండా చాలామంది మృత‌దేహాల‌ను ఇలా న‌దిలో వ‌ద‌ల‌డం వ‌ల్ల‌.. ఇటు గంగా నదిలో, అటు య‌మునా న‌దిలో ఇలా డెడ్‌బాడీస్ తేలుతూ క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. అయితే, గంగ‌లో కేవ‌లం ఒక‌ కిలోమీట‌ర్ ప‌రిధిలోనే 48 మృత‌దేహాలు తేలుతూ ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.