ఇక కేసీఆర్ ఫోకస్ మొత్తం మునుగోడుపైనే!

దాదాపు తొమ్మిది పది రోజుల పాటు తెలంగాణను పట్టించుకోకుండా, మునుగోడు ఎన్నికల ఊసే ఎత్తకుండా హస్తినలో బసచేసి కాలం గడిపేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలి సారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ ఆక్కడ ఏం చేశారో? అన్ని రోజుల పాటు ఎందుకు మకాం వేశారో.. తెరస శ్రేణులకే కాదు ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. అసలు ముందుగా షెడ్యూల్ లో లేని హస్తిన పర్యటన ఎందుకు తెరమీదకు వచ్చిందో కూడా గోప్యంగానే ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియల కోసం అని యూపీ వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే హస్తిన బాట పట్టారు. జాతీయ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసేందుకు అక్కడ భేటీలు జరుపుతారనీ, జాతీయ మీడియాకు బీఆర్ఎస్ లక్ష్యలు, అజెండా వివరిస్తారనీ అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆసలు హస్తినకు ఎందుకు వెళ్లారు.. వెళ్లారు సరే.. అక్కడ అన్ని రోజులు ఎందుకు ఉన్నారు... ఉన్నారు సరే ఏం చేశారు.. అన్న ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు. సరే హఠాత్తుగా పర్యటన ముగించుకుని వచ్చేశారు. వచ్చిన తరువాత అంతా చెప్పే మాట కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు అనే.. కేసీఆర్ ఎంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారో.. అంతే సడెన్‌గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.   వచ్చీ రావడంతోనే అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో సమావేశమై మునుగోడు  ఉప ఎన్నికపై చర్చించారు.  కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది.   ఈసీ తీరుపై న్యాయపోరాటం చేయాలా లేక ప్రజల్లోకి వెళ్లాలా అన్నదానిపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు.  ఇక అన్ని విషయాలూ పక్కన పెట్టి మునుగోడుపైనే పూర్తిగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఫోకస్ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపైనే ఉండాలని ఆదేశించారు. తానూ స్వయంగా ప్రచార రంగంలోనికి దిగుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల పాటు మునుగోడులో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళిక రూపిందించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో కేసీఆర్ మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 30వ తేదీన చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక గురువారం నుంచి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే ఈ నెల 25 నుంచి తెరాస కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఈ మొత్తం ప్రచార పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జి అన్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం?

 వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే, ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్  టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు.అంతే కాదు, రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్’ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిల తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెదతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం, బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.  అదలా ఉంటే, మహా ప్రస్థానం  పాద యత్ర నుంచి ఆమె ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. రహస్యంగా ఎవరిని కలిశారో ఏమో కానీ, ప్రత్యక్షంగా మాత్రం, సీబీఐ డైరెక్టర్’ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైన అవినీతి పైనా ఆరోపణలు చేశారు .ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్ష 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐకి ఫిర్యాదు చేశారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరినట్లు చెప్పారు.  నిజానికి, ఆమె ఇప్పడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కొత్తగా చెప్పిన విషయమంటూ ఏదీ లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఇదరినీ మించి మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి, ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని మీడియా ముందుంచారు.అసలు  ఎవరి దాకానో ఎందుకు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంతటివాడు, కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇంతవరకు ఏమీ జరగలేదనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు షర్మిల ఇంత హటాత్తుగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ చెప్పి మరీ ఢిల్లీ ఎందుకెళ్ళారు? సిబిఐకి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  షర్మిల సిబిఐకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం పైనే అయినా, ఆమె టార్గెట్ మాత్రం, బ్రదర్ జగన్ రెడ్డి అనే అనుమానాలు ఇటు తెలంగాణ, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్’లో కొంచెం గట్టిగానే వినవస్తున్నాయి. అందుకే, జగన్ రెడ్డికి అత్యంత అప్తుడిగా భావించే మేఘా కృష్ణా రెడ్డిని షర్మిల టార్గెట్ చేశారని అంటున్నారు. అలాగే, సమయ సందర్భాలను బట్టి చూస్తే, బీజేపీ పెద్దలు కేసీఆర్’ను ఇరకాటంలోకి నెట్టేందుకు షర్మిలను రంగంలోకి  దించారని అంటున్నారు. అయితే గతంలో, కేఎ పాల్’కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రిని కలిసిన తర్వాతనే కాళేశ్వరం సహా తెరాస ప్రభుత్వ అవినీతికి సంబంధించి, సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల అమిత్ షా ను ప్రత్యక్ష్యంగా కలవక పోయినా, ఆయన, ఇతర బీజేపీ పెద్దల సూచనల మేరకే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్’గా ఇద్దరి అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డిపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం? షర్మిల టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకక ముందే ఈమె మరో సారి ఈ నెల 21న అంటే శుక్రవారం మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సారి ఆమె సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదునే ఈడీకి కూడా అందజేస్తారని చెబుతున్నారు. 

ఫిర్యాదులపై తగ్గేదేలే.. మళ్లీ హస్తినకు షర్మిల..ఈ సారి ఈడీకి కంప్లైంట్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి హస్తినకు పయనం అవుతున్నారు.  ఈ నెల 21న ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఒక సారి హస్తినలో పర్యటించి వచ్చిన షర్మిల అప్పుడు హస్తినలో తెరాస అవినీతిపై సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాశేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన షర్మిల ఇప్పుడు మరో సారి హస్తినకు వెళ్లనున్నారు. ఆమె హస్తిన పర్యటనకు కారణమేమిటన్న దానిపై వైఎస్సార్ టీపీ నుంచి కానీ, స్వయంగా ఆమె నుంచి కానీ  ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.. కానీ ఈ సారి ఆమె హస్తిన పర్యటన అజెండా కాళేశ్వరం అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేయడమేనని అంటున్నారు. అయితే రాజకీయ వర్గాలలో మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ షర్మిల బీజేపీపైన కానీ కేంద్ర ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలూ చేయలేదు. దీంతో ఆమె ఈ సారి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.   తెలుగు రాష్ట్రాల్లో ఎప్పకప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో..   షర్మిల ఢిల్లీ పర్యటన  ప్రాధాన్యత సంతరించుకుంది.   టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు   విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ టీఆర్ఎస్ పై బీజేపీ సహా అన్ని పార్టీలూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. ఒక్క షర్మిల  మాత్రమే విమర్శలకు పరిమితం కాకుండా  నేరుగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశారు. భారతదేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని పేర్కొన్నారు. సీబీఐ ఫిర్యాదుతో ఆగకుండా ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లి ఈడీకి ఇదే విషయంపై ఫిర్యాదు చేయాలని షర్మిల భావిస్తున్నారని వైఎస్సార్ టీవీ వర్గలు చెబుతున్నాయి. ఈడీతో పాటు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.   తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ హస్తిన ముఖం చూడని షర్మిల ఇప్పుడు వరుసగా ఢిల్లీ పర్యటనతో జోరు పెంచడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. తొలి సారి ఢిల్లీ వెళ్లినప్పుడు షర్మిల నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి   తెలంగాణ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ    ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా  దాదాపు ఇరే ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అవే ఆరోపణలతో షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత కాలం కేవలం ఆరోపణలే, కానీ ఇప్పుడు నేరుగా ఫిర్యాదు అందడంతో సీబీఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఎక్కువ అవుతోంది.  అయితే సీబీఐకి ఫిర్యాదు చేసి ఊరుకోకుండా షర్మల ఇప్పుడు మరో సారి హస్తిన పర్యటన పెట్టుకుని ఈడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,ఈడీ, ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరాస అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత, సమీప బంధువు, ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల  కాళేశ్వరం అవినీతిపై  ఫిర్యాదుల పరంపర కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

బీజేపీకి గుడ్ బై..తెలుగుదేశం గూటికి కన్నా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే బుధవారం వేగంగా సంభవించిన వరుస సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. అసలుఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.   మంగళ వారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను   కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ   సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తానే అ న్నట్లు సోము వీర్రాజు వ్యవహరించడం వల్లే   ఈ పరిస్ధితి దాపరించిందని..  పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. జేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు. అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా తన ముఖ్య అనుచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కన్నా వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు కన్నా వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ క్యాడర్ కు చెప్పారు. కన్నా వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇలా ఉండగా కన్నా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హై కమాండ్ ఆయన ప చర్యలకు సిద్ధమైందని అంటున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడాలని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతనే అసమ్మతి గళం విప్పారని అంటున్నారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు, మాజీ మంత్రి అయిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే ఆయన ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన తరువాత నుంచి పార్టీలో కన్నాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. కాగా తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అంటే తీర్మానం చేసిన సంగతి ఆయన గుర్తు చేస్తున్నారు. తన ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ రాజధానిగా అమరావతికి మద్దతుగా తీర్మానం చేయడం వల్లే తనను అప్పట్లో అధ్యక్ష పదవి నుంచి తొలగించారని కన్నా తన సన్నిహితుల వద్ద అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.    ఈ విషయంపై అనుచరులతో భేటీలో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్, ఆయన విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కన్నా అధికార వైసీపీ గూటికి చేరే అవకాశం లేదు. అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన  పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన గూటికి చేరుతారా అన్న కోణంలో కూడా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.  అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో  మద్దతుగా నిలుస్తున్న కన్నా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. తనకు, తన కుటుంబంలో ఒకరికి పోటీకి అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ అయితే నడుస్తోంది. తనకు, తన కుటుంబంలోని ఒకరికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశిసతున్న కన్నా,, నరసరావు పేట లోక్ సభ స్థానం సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా కన్నా లక్ష్మీ నారాయణ అసమ్మతి గళం విప్పడం బీజేపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది.     

25 రోటీల ఫ‌లితం!

చింటూకి తూగు వ‌చ్చింది. ఓ క్ష‌ణం పుస్త‌కాల మీద త‌ల‌వాల్చి ప‌డుకున్నాడు. ప‌క్క‌వాడు ఏదో రాస్తున్నాడ‌నుకున్నాడు. బోర్డు మీద లెక్క వేసి చెబుతున్న టీచ‌ర్ గ‌మ‌నించి చాక్‌పీస్‌ను క్రికెట్ బంతి వేసినంత వేగంగా విసిరింది. అంతే అదొచ్చి మాడు మీద ఠ‌ప్‌మ‌ని త‌గ‌ల‌గానే చింటూ త‌ల పైకెత్తి ఎనిమిదిరెళ్ల ప‌దారు.. అన్నాడు.. ఒరే అద‌యి పోయిం ది.. లెక్క చెబుతోంది టీచ‌ర్ అ న్నాడు ప‌క్క‌వాడు.. టీచ‌ర్‌కి కోపం వ‌చ్చి తిట్టింది. చింటూ చిన్న‌బుచ్చుకున్నాడు. అక్క‌డకి క‌థ అయింది. అది నాలుగో త‌ర‌ గ‌తి క్లాసు కాబ‌ట్టి ఏదో అయి పోయింది. కానీ ఈ పోలీసాయ‌న నిద్ర‌పోయింది మాత్రం శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో! పైగా సారీ అని త‌ప్పించు కోలేదు. తాను నిద్ర‌ పోవ‌డానికి కార‌ణం చెబుతూ ఉత్త‌రం కూడా రాసిచ్చాడు అధికారికి! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సుల్తాన్‌పూర్‌. కానిస్టేబుల్ రామ్‌ష‌రీష్ యాద‌వ్ ఈమ‌ధ్య శిక్ష‌ణాత‌ర‌గ‌తిలో క్లాస్ వింటూ చ‌క్క‌గా గుర్రుపెట్టి నిద్ర పోయాడు. క‌మాండ‌ర్‌కి కోపం వ‌చ్చింది. ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటావా, క్లాస్‌లో నిద్ర‌పోవ‌డ‌మేమిటి బుద్ధుందా అని తిట్టి మ‌రీ అవ మానించాడు. యాద‌వ్‌కి కోపం వ‌చ్చింది. క‌మాండ‌ర్ మీద కాదు.. త‌న‌కు ఆ ఉద‌యం భారీ తిండిపెట్టిన‌వాడి మీద‌. క్లాస్‌లో అలా నిద్ర‌పోవ‌డ‌మేమిటి? అపాల‌జీ చెప్ప‌మ‌ని క‌మాండ‌ర్ డిమాండ్ చేసి రుస‌రుస‌లాడుతూ వెళిపోయాడు. యాద‌వ్‌కి త‌న‌మీద త‌న కే కోపం వ‌చ్చింది. రొట్టెలు తిన‌నేల‌, తింటిపో.. అన్ని తిన‌నేల‌.. తింటిపో.. క్లాసులో గుర్రుపెట్టనేల‌.. అనుకుంటూ గ‌దికి వెళ్లాడు. వెళ్లి లెట‌ర్‌ప్యాడ్ అందుకుని అయ్యా నాకు క్లాసులో నిద్ర‌రావడానికి కార‌ణం ఇది అని రాశాడు.   సార్, న‌న్ను తిట్టారు బాగానే ఉంది. క్లాసు లో నిద్ర‌పోవ‌డం నా త‌ప్పే కానీ అందుకు కార‌ణం తిండే! క్లాసుకు వ‌చ్చే ముందు ఏకంగా 25 రోటీలు, కొద్దిగా అన్నం, కూర‌లు తిన్నాను. బ‌కాసురుడిలా అంత తినేస‌రికి సుఖంగా ఫ్యాన్ గాలికి నిద్ర రాక ఛ‌స్తుం దా సార్‌.. నాది బ‌ద్ధ‌కంకాదు, భుక్తాయాసంలో తూలాను అంతే. ఈసారికి కాసుకో దొరా! అని హిందీలో రాసి ఇచ్చాడు.   క‌మాండ‌ర్‌కి ఆ ఉత్త‌రం అందింది. ఆయ‌న కోపగించుకోలేదు.. న‌వ్వుకున్నాడు. వీడు సిన్సియ‌రే..అని. కానీ పైకి కాస్తంత కోపం ప్ర‌ద‌ర్శించి ఇక ముందు ఇలా క్లాసులో గుర్రుపెట్ట‌కు అని సున్నితంగా మంద‌లించి బురుగు మీసాలు దువ్వుకుంటూ వెళ్లాడు.  

అంతా అమ్మ‌ద‌య ...ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ల సేవను గుర్తించి పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌విని క‌ట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ  కొత్త  అద్య క్షునిగా ఎన్నిక‌యిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పార్టీ అధినేత సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృత‌జ్క్ష‌త‌లు చెప్పారు. ఆమె నాయ‌క‌త్వంలో కేంద్రంలో రెండు ప‌ర్యాయాలు అధికారంలోకి వ‌చ్చామ‌ని అన్నారు. రాజ్య‌స‌భ ఎంపీగా పార్టీ త‌ర‌ఫున స‌భ‌లో గ‌ళం వినిపించిన ఖ‌ర్గే పార్టీ అద్య‌క్ష‌ప‌ద‌వి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వెంట‌నే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నిక‌ల అధారిటీ చైర్మ‌న్ మ‌ధుసూద‌న మిస్త్రీ ఖ‌ర్గేను  విజేత గా ప్ర‌క‌టించారు.  పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌లో  మొత్తం 9,385 ఓట్లు ప‌డ‌గా, ఆయ‌న‌కు 7,897 ఓట్లు, థ‌రూర్‌కి 1,072 ఓట్లు వ‌చ్చాయ‌న్నారు. 416 ఓట్లు చెల్లలేదు.  అధ్యక్షునిగా ఈ నెల 26వ తేదీన పూర్తి బాధ్య‌త‌లు స్వీక రిస్తారు. ప్ర‌స్తు తం భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఖ‌ర్గే కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌తో  పార్టీ ప‌ద‌వికి  పోటీప‌డిన శ‌శి థ‌రూర్‌ని క‌లిసి పార్టీని విజ‌య‌ప‌థంలోకి తీసికెళ్ల‌డానికి అనేక అంశాల‌ను చ‌ర్చిం చాన‌ని ఖ‌ర్గే అన్నారు.  పార్టీ కార్య క‌ర్త‌లుగా అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని, పార్టీలో ఎవ‌రు పెద్ద‌, చిన్నాలేర‌న్నారు. అంద‌రం ఐక మ‌త్యం తో దేశంలో మ‌త‌మౌఢ్యంతో రెచ్చిపోతున్న శ‌క్తుల‌ను అడ్డుకోవాల‌న్నారు.  ఈనెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఆయా రాష్ట్రాల నుంచి బ్యా లెట్ పెట్టెలను న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని శశి థరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల ఓట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని ఓట్ల ను చెల్లనివిగా పరిగణించాలని కోరింది. 

పవన్ కు బీజేపీ నుంచి పిలుపు.. పవన్ వ్యాఖ్యలతో కమలంలో కుదుపు

మంగళగిరిలో మంగళవారం జరిగిన జనసేన కార్యకర్తల సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. మిత్రపక్షమైనా బీజేపీతో కలిసి నడవడానికి రాష్ట్రంలో ఆ పార్టీ  నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పెద్ద అవరోధంగా మారిందని పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హై కమాండ్ లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించింది. జనసేనాని పవన్ కల్యాణ్ ను హస్తిన రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింద. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే మంగళవారంమే పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తన అధిష్టానానికి ఏమి వివరణ ఇచ్చారో.. ఏమో గానీ.. బుధవారం మధ్యాహ్నానికల్లా సీన్ మారిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ‘నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖచిత్రం చూస్తారు’ అంటూ జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో సమయం గడిచిపోతోందంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే బీజేపీ వర్గాల్లో కంగారుకు కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి సుమారు గంట సేపు ప్రైవేటుగా చర్చలు జరపడం కూడా బీజేపీలో కంగారు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మీద, మోడీ మీద తనకు గౌరవం ఉందంటూనే   ‘అలా అని చెప్పి నా స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేను’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలం పెద్దలను ఇరుకున పెట్టాయని పరిశీలకులు అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడుస్తారని ఇప్పటి దాకా   బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు ప్రకటించడంతో కమలం పార్టీకి గాలి ఆడని పరిస్థితి ఎదురైందని అంటున్నారు. నిజానికి బీజేపీ- జనసేన మధ్య 2019 ఎన్నికల తరువాత నుంచీ పొత్తు ఉంది. అయితే  చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడప్పుడూ చెబుతున్నా కొంతకాలంగా ఆ రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉద్యమం కానీ కార్యక్రమం కానీ నిర్వహించలేదు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు రెండు రోజులు ఆయన బసచేసిన హొటల్ నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఆదివారంనాడు విజయవాడకు తిరిగివచ్చి ‘ఇక్కడే తేల్చుకుంటా’ అని చెప్పడం.. మంగళగిరి ఆఫీసులో తమ పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. విశాఖ ఘటన తర్వాత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి, మద్దతు తెలిపినప్పటికీ తనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిన దాఖలాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదు. మరో పక్కన విశాఖ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరి కంటే ముందుగా స్పందిచి పవన్ కు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం..  మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కు కలసి సంఘీభావం తెలపడంతో   బీజేపీ నేతల్లో కంగారు మొదలైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని అంచనా వేస్తున్నారు.  పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని బాంబు పేల్చడం గమనార్హం. పవన్ తో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమయ్యారని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు. అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి సెగలు హస్తినను కూడా తాకడంతోనే పవన్ కల్యాణ్ కు బీజేపీ హై కమాండ్ నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.  

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. చంద్ర నిప్పులు

జగన్ భయపడి 2024లో గాని, ముందు ఎన్నికలు జరిపినా, వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తా రు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్, ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు, అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరిం చాను,  రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించనన్నారు. జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. ప్రజల అప్పులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా రాష్ట్రాన్ని కాపాడుకుందాం...అందరూ సహక రించాలని కోరుతున్నా న‌న్నారు. అస‌త్యాలు చెప్ప‌డంలో జ‌గ‌న్ దిట్ట‌, రైతుల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు లేనే లేద‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌కుడు ఎద్దేవా చేశారు. ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నాదెండ్ల గ్రామంలో ప్ర‌తిపంట రైతుల‌ను బాబు క‌లిసి వారి క‌ష్టాలు విన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరా నికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా అన్నారు. రైతాంగానికి అంత ఇచ్చాం,ఇంత ఇచ్చాం అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డ‌మే త‌ప్ప వాస్త‌వానికి రైతుల‌ను ఆదుకోవ‌డానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ న్నారు. రైతుల‌కు ఇంత న‌ష్టం జ‌రిగితే అధికారులుగాని, ఎమ్మెల్యేగానీ రాలేద‌ని, రైతుల‌కు మేలు చేసే సీఎం రావాల‌న్నారు. అస‌లు రైతుల‌కు ఏమి ఇచ్చారో ప్ర‌తిగ్రామంలో బోర్డు పెట్టాల‌ని రైతుల‌కు క‌ట్టాల్సిన పంట‌ల భీమా డ‌బ్బులు కూడా క‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇది అంటూ బాబు మండి ప‌డ్డారు.    జ‌గ‌న్ ఎక్క‌డ కాలుపెడితే అక్క‌డ మ‌టాష్‌, ఆయ‌న సీఎం అయిన త‌ర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మ‌హ‌త్య లు పెరిగాయ‌ని, ఆయ‌న పాల‌న‌లో మూడువేల‌మంది రైతులు ఆత్మ‌హత్య చేసుకున్నార‌ని, ఈ విష‌యం లో మాత్రం రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని బాబు అన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షలు గా ఉందన్నారు.  మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా, జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారన్నారు.  భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరి గేషన్ పై ఖర్చు పెడితే, ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్ ఎక్కడ నుంచి వచ్చాడని, రైతు కుటుంబం నుంచి రాలేదా,  అమరావతి రైతులను హేళన చేస్తా రా....కార్లు, బంగారం అని హేళన చేస్తారా అని చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు.  పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా అని ప్ర‌శ్నించారు. మీ దోపిడీ, కబ్జాలు బయటపడ తాయనే  పవన్ను అడ్డుకున్నారా అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుం టే...ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారని, అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అనడం దారుణ‌మ‌న్నారు. పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కోసం వెళ్లి తాను మద్ద తు ఇచ్చాన‌న్నారు.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే, ఇక ప్రజల సంగతి ఏంటని, త‌ప్పుడు ఆరోపణ లకు సిఎం సమాధానం చెప్పాల‌న్నారు. టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి  చర్యలు లేవు, దీనికి  డిజిపి సమాధానం చెప్పగలరా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడు లకు తాను భయపడనన్నారు. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలని, సిబిఐ దర్యా ప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్ట‌డం ఎక్క‌డ‌యినా ఉంటుందా అని బాబు ప్ర‌శ్నించారు. 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..రోహిత్‌, కోహ్లీల‌కు పెద్ద ప‌రీక్ష‌!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఈసారి ఆస్ట్రేలియాలో ఆరంభ‌మ‌యింది. ఈ 8వ ఎడిష‌న్ ఎవ‌రు విజేత అవుతారు, క‌ప్ కొడ‌తారన్న చ‌ర్చ ఆరంభ‌మ‌యిన‌పుడు భార‌త్‌కే చాలా అవ కాశాలున్నాయ‌నే అందరూ అన్నారు. 2007 లో ధోనీ నాయ‌క‌త్వంలో టీమ్ ఇండియా క‌ప్ గెలిచింది. మ‌రి ఈ ఏడాది అంతే స్థాయిలో విజ‌యం సాధించేందుకు శ‌ర్మ నాయ‌క‌త్వ ప‌టిమ ప్ర‌ద‌ర్శించాలి. ఎందు కం టే మ‌న దాయాదులు పాకిస్తాన్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో టోర్నీలో నిలిచే అవ‌కాశాలు లేవ‌న్న ప్ర‌చారం ఇప్ప టికే ఉంది.  ఈమ‌ధ్య ఆసీస్ తో త‌ల‌ప‌డిన సీరీస్‌ను 2-1 తేడాతో  గెలిచి క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్యధిక టీ 20 మ్యాచ్‌లు గెలిచిన‌ దాయాదుల రికార్డును అధిగ‌మించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో టీ 20 లో 21 విజ‌యాలు సాధించిన‌ట్ల‌యింది. పాకిస్తాన్ 2021లో 21 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 2022లో ఇంత‌వ‌ర‌కూ భార‌త్  ప‌ది వివిధ జ‌ట్ల‌తో 32 టీ20లు ఆడింది. వాటిలో 23 గెలవ‌గా 8 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫ‌లితం తేల‌లేదు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డిన సిరీస్‌ను 3-0 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది. త‌ర్వాత లంక‌తో త‌ల‌ప‌డిన సిరీస్ కూడా అలానే సాధించింది స‌త్తా చాటి, ఆ విజ‌య‌ప‌రంప‌ర అలా కొన‌సాగి స్తోంది. కానీ ఆసియాక‌ప్‌లో మాత్రం జ‌ట్టులో కొన్ని లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డిన తొలి మ్యాచ్ లో గొప్ప‌గా ఆడ‌క‌పోయినా గెలిచింది. కానీ సూప‌ర్ ఫోర్ స్థాయిలో పాక్ చేతిలోనే ఓడిపోయింది. దీంతో ఫైన‌ల్ అవ‌కాశాలూ దెబ్బ‌తిన్నాయి. శ్రీ‌లంక కూడా భార‌త్‌ను ఓడించింది. చిత్ర‌మేమంటే పాకిస్తాన్‌ని కూడా చిత్తు చేసి శ్రీ‌లంక విజేత‌గా ఇంటికి వెళ్ల‌డం! దీని త‌ర్వాత ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా ల‌తో త‌ల‌ప‌డిన సిరీస్‌ల‌ను 2-1 తేడాతో గెలిచి జ‌ట్టు బ‌లం వీగిపోలేద‌ని నిరూపించింది.  అయితే భార‌త్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కార‌ణంగా ప్ర‌పంచ‌క‌ప్ కి దూరం కావ‌డం జ‌ట్టును దెబ్బ‌తీస్తుంది. అత‌ని స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి మ‌రో మంచి పేస‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అత‌ని లోటు మాత్రం క‌న‌ప‌డుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కి అత‌నంటే బాగా న‌మ్మ‌కం కూడా. అంతే గాకుండా, చివ‌రి ఓవ‌ర్ల‌లో ధాటిగా ప్ర‌త్య‌ర్ధిని ఇబ్బందిపెట్ట‌గ‌లిగే బౌల‌ర్ అత‌నికి క‌ర‌వ‌య్యాడు. మ‌రీ ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చిరుత లాంటి ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర‌జ‌డేజా లోటు మాత్రం ప్ర‌పంచ‌క‌ప్‌లో స్ప‌ష్ట‌మ‌ వుతుంది. ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌కు కూడా అత‌ని స‌త్తా తెలుసు.  2007 త‌ర్వాత ప్రపంచ‌క‌ప్‌ను అందుకోని భార‌త్ గ‌త టోర్నీలో సెమీస్ కూడా చేరుకోలేక‌పోయింది. ఈ ప‌ర్యాయం భార‌త్ ఉన్న గ్రూప్‌లో పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. అందువ‌ల్ల ఆరంభం నుంచే గ‌ట్టి పోటీని టీమ్ ఇండియా ఎదుర్కొ నుంది. మ‌రి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వ ప‌టిమ ఇపుడు తెలుస్తుంది. పాకిస్తాన్ ఎలాగ‌యినా భార‌త్‌ను టీ 20ల జోరును అడ్డుకో వాల‌న్న‌ ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. జ‌ట్టులో కింగ్ కోహ్లీ , రోహిత్ శ‌ర్మ‌, కెఎల్ రాహుల్ మ‌ళ్లీ త‌మ పాత గొప్ప ఫామ్‌లోకి తిరిగి రావ‌డం కూడా పాక్‌, ద‌క్షిణాఫ్రికాల‌ను కంగారుపెడుతోంది. 

కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు.. అంతే.. ఇంకేం లేదు!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు పది రోజుల పాటు హస్తినలో బస చేసిన ఆయన అక్కడ ఏం చేశారన్నది ఆయన పర్యటన ముగిసి తిరుగు పయనమైనా ఇంకా రహస్యంగానే ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు అన్న విషయంపై రాజకీయ వర్గాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలిసారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ తన జాతీయ రాజకీయ జెండా అజెండాను నేషనల్ మీడియాకు వివరిస్తారనీ, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ, ప్రజా సంఘాల నాయకులతోనూ, ఇతర వర్గాల ప్రముఖులతోనూ జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తారనీ అంతా భావించారు. అయితే ఆయన పది రోజుల హస్తినలో బస చేసినా ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. అన్నిటికీ మించి డిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత, మరో బంధువు సంతోష్ లను వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లడంతో తెరచాటు మంత్రాంగం నెరిపి వారిని ఆ కేసు నుంచి బయటపడేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. అయితే వీటిని వేటినీ కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పది రోజులూ కూడా ఆయన హస్తినలో దాదాపు అజ్ణాతవాసంలో ఉన్నట్లే గడిపారు. మధ్యలో ఒక సారి సీఎస్ ను, మరో సారి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను పిలిపించుకున్నారు. అలాగే పార్టీ వర్గాల నుంచి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ఉన్నారనీ, అందుకే ఎవరినీ కలవడం లేదనీ ఒక ప్రకటన జారీ చేశారు. అంతే.. అంతకు మించి కేసీఆర్ హస్తినలో బసకు సంబంధించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు.  దీంతో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కేసీఆర్ హస్తినలో ఏం చేస్తున్నట్లో అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. రాజకీయ వర్గాలలో కూడా పలు విధాల కేసీఆర్ మౌనంపై చర్చోప చర్చలు జరిగాయి. చివరకు ఆయన హస్తిన పర్యటన ముగించుకుని బుధవారం(అక్టోబర్ 19) హైదరాబాద్ చేరుకున్నట్లు ఆయన పీఆర్వో హజారీ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేసీఆర్ హస్తిన వెళ్లారు... పది రోజులు బస చేశారు.. తిరిగి వచ్చారు అంతే. చెప్పుకోవడానికి ఇంకే లేదు. దీంతో రాజకీయ వర్గాలలో కేసీఆర్ హస్తిన పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను తప్పించినట్లేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే  ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద  ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది. దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం. దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు. ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.  

ఆనందాన్నిచ్చే శ్ర‌మ‌!

పిల్ల‌ల‌తో వాళ్ల ఆట‌లు ఆడుతూండు, వాళ్ల ప‌క్క‌నే కూచుని చ‌దువుతూంటే గ‌మ‌నిస్తూండు నీ బాల్యం గుర్తొస్తుంది.. అదో ఆనందం, గొప్ప శ‌క్తినిస్తుందంటాడు పిల్ల‌ల ర‌చ‌యిత లివింగ్‌స్ట‌న్‌. అదేమోగాని, పిల్ల‌ల చ‌దువు అనగానే త‌ల్లిదండ్రుల‌కు కూడా పెద్ద ప‌రీక్ష‌ల‌తో సమానం. పెద్ద చ‌దువుల‌కు వెళ్లే కొద్దీ వాళ్ల‌తో పాటు చ‌దివినంత ప‌ని అవుతుంది. ద‌గ్గ‌రుండి హోమ్‌వ‌ర్క్ చేయించ‌డంతో ఆరంభ‌మై వాళ్ల‌కి పోటీ ప‌రీక్ష‌ల‌కు పుస్త‌కాలు తేవ‌డం, వీల‌యితే ఒక‌టి రెండు స‌బ్జెక్టులు కాస్తంత తెలుసుకోవ‌డం త‌ల్లిదం డ్రుల వంతే అవు తోంది. ఇపుడు రాకేష్ ప‌రిస్థితి ఇదే. అభిజిత్ అనే ఉద్యోగి ఆమ‌ధ్య ఉబ‌ర్ క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్‌కి బ‌య‌లుదేరాడు. ఆ  క్యాబ్ డ్రైవ‌ర్ రా కేష్ త‌న ఫోన్ లో అప్ప‌టివ‌ర‌కూ చూస్తున్న యూట్యూబ్ బంద్ చేశాడు. ఆ ఉద్యోగి ఏం చూస్తున్నావ్‌, చ‌దువుతున్నావ‌ని అడిగాడు. ఈ చాన‌ల్లో క‌రెంట్ అఫైర్స్‌, ఆర్ధిక‌శాస్త్రం సంబంధించిన అంశాలు చ‌దు వుతున్నానన్నాడు. అభిషేక్‌కి మ‌తి పోయింది. క్యాబ్ డ్రైవ‌ర్‌కి వాటితో అవ‌స‌రం ఏమొచ్చిందా అని  తెగ ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్లాడు. త‌ర్వాత క‌నుక్కుంటే త‌న కూతురు కోసం రాకేష్ చ‌దువుతు న్నాడ‌ని తెలు సుకుని చాలా ఆనందించాడు. ఏ ప‌నిచేస్తున్నా, తండ్రి తండ్రే.. పిల్ల‌ల భ‌విత‌కు త‌ప్ప‌ని శ్ర‌మ‌..ఎంతో ఆనందాన్నిచ్చే శ్ర‌మ‌! త‌న కూదురు యుపిఎస్‌సి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతోంది. అందుకే రాకేష్ ఆమెకు కావ‌ల‌సిన పుస్త‌కాలు కొన‌డ‌మే కాకుండా కొంత నోట్సు రాసుకోవ‌డానికి అత‌ను అధ్య‌య‌నం మొద‌లెట్టాడు. అత‌నికీ ఎంతో తెలుసుకోవాల‌న్న త‌ప‌నా పెరిగింది. పిల్ల‌ల్ని త‌మ‌కంటే ఎక్కువ చ‌దివించాల‌ని, మంచి స్థాయిలో చూడాల‌నే క‌దా త‌ల్లిదండ్రులు ఆశించేది. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో అద్భుతమేమీ జరగలేదు. అనూహ్యమైన ఫలితం ఆవిష్కృతం అవ్వలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మరో  416 ఓట్లు చెల్లలేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. దీంతో రిగ్గింగ్ సంస్కృతి ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా పాకిందా? ఇప్పటిదాకా అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ జాడ్యం పార్టీ సంస్థాగత ఎన్నికలకు కూడా పాకిందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఈ పదవికి పోటీ పడిన శశిథరూర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా.. శశిథరూర్ కు వెయ్యి 72 మంది ఓటు వేశారు. కాగా.. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తాజాగా నిర్వహించిన ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చవిచూసిన శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కొత్త అధ్యక్షుడు ఖర్గేను అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తరప్రదేశ్ లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి శశిథరూర్ బృందం రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది. ఒక పక్కన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన సల్మాన్ సోజ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయం మిస్త్రీ కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోవడంతో ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమగ్రత లోపించడం శోచనీయం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. యూపీలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా.. న్యాయంగా , పారదర్శకంగా జరిగినట్లు ఎలా అవుతుంది? అందువల్ల యూపీలోని ఓట్లన్నీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని థరూర్ బృందం ఆ లేఖలో పేర్కొన్నదని చెబుతున్నారు. అయితే.. అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు లీకవడంతో సల్మాన్ సోజ్, శశిథరూర్ స్పందించారు. సీఈఏకి అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు లీక్ అవడం దురదృష్టకరం.  కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే ఈ ఎన్నిక. విభజించేందుకు కాదు. ఈ విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణతో అనవసర వివాదానికి ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు.

విభ‌జ‌న హామీల పూర్తికి రాహుల్ హామీ

ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న హామీల విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు నీళ్లు వ‌దిలేశారు. జ‌గ‌న్ స‌ర్కార్‌తో ఏమీ అవ‌ద‌ని తేలిపోయింది. ఇపుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చి మ‌ళ్ళీ ఆశ‌లు రేపుతున్నారు. విభ‌జ‌న హామీల‌న్నీ త‌మ ప్ర‌భుత్వంతోనే నెర‌వేరుతాయ‌ని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు.  భార‌త్ జోడో యాత్ర ఏపీలోకి ప్ర‌వేశించింది. దీనిలో భాగంగా బుధ‌వారం రాహుల్ గాంధీ క‌ర్నూలులో ప‌ర్య టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌య‌లో ఇచ్చిన కొన్ని హామీలు తాము అధికారంలోకి రాగానే తీరుస్తామ‌న్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ ధాని విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకుని పూర్తిచేస్తామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ప్ర‌స్తుత ప్ర‌భుత్వం  ప్ర‌చారం చేస్తున్న మూడు రాజ‌ధానుల ఆలోచ‌న స‌ర‌యిన‌ది కాద‌న్నారు. రాష్ట్ర  విభ జన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్  కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నా రు. పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.  అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ ప్రకటిం చారు.  భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకు న్నానన్నారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచు తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. బీజేపీ దేశాన్ని విభజి స్తోందని.. ద్వేషాన్ని సృష్టిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఉల్లి రైతులు ధర లేక ఇబ్బం దుల్లో వున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలవరం నిర్వాసితు లు, అమరావతి రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్ కి అమరావతి జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు.  ఏపీకి అమరావతే  ఏకైక  రాజధానిగా వుండాలని రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు రాహుల్. రైతు లు రాజధాని కోసం భూములిస్తే.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు పెడతామని అంటోంద న్నారు రాహు ల్.  ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని.. అధికారంలోకి వస్తే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతుల సమస్యలు చూస్తుంటే బాధగా వుందని రాహుల్ అన్నారు. 

మోదీజీ మీ జాబితాలో రేపిస్టుల‌నూ చేర్చండి...ఓవైసీ చుర‌క‌

మంచివారు ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌గా మారిపోతోంది. జైలు జీవితం గ‌డుపుతున్నంత మాత్రాన వారంతా చాలా మంచివారుగా, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో త‌మ జీవితాన్ని కొన‌సాగిస్తార‌ని బీజేపీ అభిప్రాయం కావ‌చ్చునేమోగాని విప క్షాలు అలా భావించ‌డం లేదు. కేవ‌లం త‌మ అధికారం చ‌లాయించ‌డానికి అడ్డుగోడ‌ల‌ను తొల‌గించు కోవ డానికే ఇలాంటి ప్ర‌చారాలు చేయ‌డం త‌ప్ప వాస్త‌వానికి స‌మాజంలో జ‌రుగుతున్న‌ది విరుద్ధ‌మ‌న్న‌ది విప క్షాలు మండిప‌డుతున్నాయి. ముఖ్యంగా బిల్కిస్‌బానో కేసులో ఇటీవ‌ల ప‌ద‌కండు మంది నిందితులు ఎంతో మారిపోయారంటూ విడుద‌ల చేయ‌డం పై పెద్ద దుమార‌మే లేచింది. తాజాగా ఏఐఎంఐఎం అధి నేత అస‌దుద్దీన్ ఒవైసీ మండిప‌డుతున్నారు.  బిల్కిస్ బానో కేసుకి సంబంధించి 11మంది నిందితుల‌ను విడుద‌ల చేశారు. అయితే ఇది కేంద్ర హోం మంత్రి ఆదేశం మేర‌కే జ‌రిగిం ద‌న్న విమ‌ర్శ‌లు ఇంకా ఉన్నాయి. బుధ‌వారంనాడు గుజ‌రాత్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ఆరం భోత్స‌వం సంద ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాట్లాడుతూ, దేశం పావురాళ్ల‌ను ఎగ‌రే య‌డం నుంచి  పులుల‌ను విడుద‌ల చేసే స్థితికి వ‌చ్చింద‌ని అన్నారు. దీనికి ఏఐఎంఐఎం ఛీఫ్ అస‌దు ద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.  ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌లో చీటాల‌తో పాటు రేపిస్టుల‌ను కూడా ఆ జాబితాలో చేర్చాల‌ని అస‌దుద్దీన్  విమ‌ర్శనా స్త్రం సంధించారు. ఇపుడు ఇది తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు దారితీస్తోంది. బీజేపీ ప్ర‌భుత్వం కేవ‌లం చిరుత‌ల నే కాదు అత్యాచారాల‌ను చేసేవారికి కూడా స్వేచ్ఛ‌నిస్తోంద‌ని ఓవైసీ ఎద్దేవా చేశారు. బిల్కిస్ బానో కేసులో 11 మందికి స్వేచ్ఛ‌నీయ‌డంలో  అర్ధ‌మేమంట‌ని ప్ర‌శ్నించారు. వారిని విడుద‌ల చేయ‌డం సీబీఐ కూడా వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ వారిని విడుద‌ల చేశార‌ని ఓవైసీ మండిప‌డుతున్నారు. వారి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎంతో మార్పు వ‌చ్చిందని, చాలా మంచివారిగా మారిపోయార‌నీ, పైగా వారి జైలు శిక్ష స‌మ‌యం పూర్తిగా అను భ‌వించారంటూ 11మందినీ  విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌క‌టించార‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. వారిలో ఒక‌ర‌యిన మితేష్ చిమ‌న్‌లాల్ భ‌ట్ పెరోల్ స‌మ‌యంలో 2020ల జూన్‌లో ఒక మ‌హిళ‌పై అత్యా చారం చేశాడ‌ని తెలిసింది.  అస‌లు మంచిప్ర‌వ‌ర్త‌న‌, మంచిగా మారాడ‌న్న‌దానికి అర్ధ‌మేమిట‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎం.పీ మ‌హువా మైత్ర ప్ర‌శ్నించారు. అచ్చేదిన్‌, అచ్చేలోగ్‌, బేటీకో బ‌చావో అంటూ బీజేపీ, మోదీ స‌ర్కార్ విజ‌యాల‌కు ప్ర‌చారం చేసుకుంటున్న‌పుడు ఈ విధ‌మైన ప్ర‌వ‌ర్త‌న కూడా మీకు ఎంతో మంచి ప్ర‌వ‌ర్త‌నే అవుతుందా అని ఎంపీ ప్ర‌శ్నించారు. బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే సంస్కార‌వంతులుగా మారిన రేపిస్టుల‌కు స్వేచ్ఛా జీవితం ప్ర‌సాదిస్తామ‌ని బీజేపీ త‌న మానిఫెస్టోలోనే పేర్కొంటుందేమో అని ఆమె ఎద్దేవా చేశారు. 

వివేకా కేసులో కీలక మలుపు! విచారణ వేరే రాష్ట్రానికి బదిలీకి సుప్రీం ఓకే

ఏపీ సీఎం జగన్  సొంత బాబాయ్, మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఎక్కడికి బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం(అక్టోబర్ 21) ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. వేరే రాష్ట్రానికి ఈ కేసు విచారణను ఎందుకు బదిలీ చేయాలో చెబుతూ బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ అందజేసింది. ఇరు పక్షాల లాయర్ల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి సమ్మతించింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సరిగా జరగడంలేదని, ఏపీలో కాకుండా విచారణ వేరే రాష్ట్రంలో జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సాక్షులను భయపెడుతున్నారని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైన కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని తన పిటిషన్ లో సునీతారెడ్డి   పేర్కొన్నారు. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం(అక్టోబర్19) విచారణ జరిపింది. కేసు విచారణను తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బదిలీ చేయాలా? అని సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు.. హైదరాబాద్ ఏపీకి దగ్గరగా ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ఛాన్స్, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. విచారణను కర్ణాటక సహా మరే ఇతర రాష్ట్రానికి బదిలీ చేసినా అభ్యంతరం లేదని వారు వెల్లడించారు. కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలా? అనే ప్రస్తావన కూడా రావడం గమనార్హం.

తెలంగాణకు వివేకా హత్య కేసు విచారణ?.. రఘురామ రాజు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు దర్యాప్తు విష‌యంలో  జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే సజావుగా సాగదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందనీ ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వివేక హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా  హైద‌రా బాద్ లేదా ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌దిలీ చేయాల‌ని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. సునీత పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టుకు సీబీఐ ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా హత్య కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్న సంగతి వాస్తవమేనని పేర్కొంది. ఈ కేసు విచారణ ఏపీ నుంచి ఇరత రాష్ట్రానికి బదిలీ చేయాలని నిర్ణయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది.   ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసు విచార‌ణపై  వివేకానంద కుమార్తె ఎన్‌.సునీతారెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలు, అభ్యంత‌రాలు అక్షర సత్యాలని సుప్రీం కు సీబీఐ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నది. పేర్కొన్న‌ది. అంతేగాక రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ ఆరోపించింది.  సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించిన సీఐ శంకరయ్యపై రాష్ట్ర ప్ర‌భుత్వం  సస్పె న్షన్‌ను ఎత్తి వేయడమే కాక, ఆయనకు  ప్రమోషన్   కూడా ఇచ్చిన విషయాన్ని సీబీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్ర‌భు త్వం చేసిన మేలుకు  మాటమార్చడం ద్వారా సీఐ బదులు తీర్చుకున్నారని సీబీఐ పేర్కొంది. అందుకే  వాంగ్మూలం కోసం సీబీఐ ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించార ని తెలిపింది.  సాక్షులకు ముప్పున్న విషయం కూడా వాస్తవమే నని, ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరిం చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి కేసు విచా రణను బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. సీబీఐ వివేకా హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పడం, అంతే కాకుండా ఈ కేసులో నిందితులు,పోలీసులు కుమ్మక్కయ్యాని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వైఎస్ సునీత పిటిషన్‌కు బలం లభించినట్లయిందని న్యాయవర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి   ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారే అవకాశం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అంచనా వేశారు. అదే జరిగితే అది  ఏపీ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బే కాకుండా అవమానం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇంత వరకూ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమని ఆయన విమర్శించారు. 

తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ దాడికి ఏడాది.. చర్యలేవి?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ అరాచకత్వానికి, అధికార దుర్వినియోగానికి అంతు లేకుండా పోతోంది. విపక్షాలపై దాడులు, కేసులతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ఆ వ్యవస్థను చెప్పు చేతల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారు చేసింది. ఇక సీఐడీ విషయమైతే చెప్పనవసరం లేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి.. అర్ధరాత్రి అరెస్టులు, దాడులతో విపక్ష నేతల ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార వైసీపీ కనుసన్నలలో పని చేస్తున్నది. ఈ క్రమంలోనే ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు (అక్టోబర్ 11,2021) మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు.  వైసీపీ గూండాలు తెలుగుదేశం కార్యాలయంలోనికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పలు వాహనాలపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.  ఈ మెత్తం వ్యవహరం అంతా పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఆధారాలతో సహ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఈ ఏడాది కాలంలో ఆ దాడికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి రజనీకి రిటర్ గిఫ్ట్ ఇవ్వడానికి చిలకలూరి పేట రెడీ అయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు రెడిగా ఉన్నారన్న టాక్  ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ రేంజ్ లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ ఓ వైపు  రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే.. రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న నియోజకవర్గానికి చెందిన విడదల రజని మాత్రం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అంటూ ఇటీవల విశాఖలో  జరిగిన గర్జన సభలో మాట్లాడడం పట్ల.. జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా చిలకలూరి పేట నియోజకవర్గంలో  తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉండే అమరావతిని కాదని.. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని ఆమె పేర్కొనడంపై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.   ఎంత విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉంటే మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌.. అంటూ మాట్లాడడమేమిటని వారంతా మంత్రి రజినీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి  జగన్.. ఏం చెబితే దానికి తాన తందానా..   అంటూ తల ఊపడమేనా.. అని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు మంత్రి రజనిని నిలదీస్తున్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు... చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు  కనబడడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో విడుదల రజినీకి ఓటమిని ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయినా.. ఏ రొటి దగ్గర ఆ పాట అదీ ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టినట్లుగా పాడాలంటే మాత్రం ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యేగారికే చెల్లుతోందంటూవ్యంగ్యంగా పేర్కొంటున్నారు. మంత్రిగారి గత చరిత్ర తాలుక ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ఏకరువు పెడుతున్నారు.   2014 ఎన్నికల వేళ.. యూఎస్ నుంచి వచ్చి.. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారని.... ఆ క్రమంలో 2017లో విశాఖలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదిక పైనుంచి నరకాసురులంటూ వైయస్ రాజశేఖరరెడ్డిని, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రజనీ.. 2019 ఎన్నికల వేళ.. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి... భంగపడి, నాటి ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో  చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా రాజకీయంగా ఆమె ఎదిగే క్రమంలో... టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్పించిన ప్రత్తిపాటి పుల్లారావుపై రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసి గెలిపొందిందని.. అలాగే జగన్ పార్టీలో కీలక నేత, సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌ రాజకీయ భవిష్యత్తను విశాఖలో రిషికొండను గుండు కొట్టినట్లు కొట్టేసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ అనుచర గణం... విడదల రజినీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు.  చిలకలూరిపేటలో స్థానిక స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రమౌళి పేరుతో ఉన్న కూరగాయల మార్కెట్‌ పేరును   వైయస్ రాజశేఖరరెడ్డి కూరగాయల మార్కెట్‌గా మార్చడంపై కూడా నియోజవకర్గ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులను సైతం... ఈ రజినీ అండ్ గ్యాంగ్.. ఐ డొంటే కేర్ అన్నట్లు వ్యవహరిస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఈ పంచాయతీని  ఎంపీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం.  మొత్తం మీద విశాఖ గర్జనతో చిలకలూరి పేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నది మాత్రం వాస్తవమని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.