చంద్రబాబు నివాసంలో ఎమోషనల్ సీన్స్

నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు.    తల్లి భువనేశ్వరి    ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని    ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.  నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు.    తల్లి భువనేశ్వరి    ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని    ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. లోకేష్ కోసం ప్రత్యేకంగా  కార్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఈ కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరింది.    తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసం నుంచి భారీ  బైక్ ర్యాలీతో లోకేష్ జూబ్లీహాల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లోకేష్ అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని కడపకు బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. గురువారం (జనవరి 26) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలోని వరద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన యాత్ర 400 రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్లు సాగనుంది. ఆయన యాత్ర విజయవంతం చేయడానికి తెలుగుదేశం అన్ని ఏర్పాట్లూ చేసింది. 

భారత్ తో కాళ్లబేరానికి పాకిస్థాన్.. ఎందుకంటే?

భారత్‌తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు, అనే  పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్థాన్‌  ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది.   బుద్ధి వచ్చిందని,   అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహజా షరీఫ్‌ ఓ ప్రకటన చేశారు.  భారత్‌ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు. ఆయన ప్రకటనలో  నిస్సహాయత ఉంది. అదినిజం. అలాగే కపటత్వమూ ఉంది. అదీ వాస్తవమే.  కాశ్మీర్‌తో సహా వివిధ కీలక సమస్యల మీద ‘నిజాయతీ’గా చర్చలు జరిపి, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని   షరీఫ్‌ అంటున్నారు.   అదే పాకిస్థాన్ లోని కపటత్వాన్ని ప్రపంచానికి మరో సారి ఎత్తి చూపింది. కాశ్మీర్‌ మీద చర్చించడానికి ఏమీ లేదు. కాశ్మీర్‌ భారత్‌లోని భాగమని, ఆర్టికల్‌ 370 రద్దుతో ఇది మరింత ధృవపడింది. కాశ్మీర్‌ మొదటి నుంచి భారతదేశంలో అంతర్భాగమనీ ఆర్టికల్‌ 370 రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని పాక్ ప్రపకటన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో అంగీకరించి ఉంటే.. ఆ దేశంలో మార్పు వచ్చిందనీ, వస్తోందనీ ఒకింత విశ్వాసం  కలిగేది. కానీ ఆయనా పని చేయలేదు. పాకిస్థాన్ విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిన అంశాలు ఉన్నాయన్నపాత పాటనే ఆయన పాడారు. అన్నిటికీ మించి భారత్ లో అశాంతి నింపడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం, మారణహోమం సృష్టించి అస్థిరత నెలకొల్పడం లక్ష్యంగా పాక్ భూభాగంలో శిక్షణ పొంది దొంగచాటుగా సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్ర చొరబాట్ల గురించి ఆయన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో ప్రస్తావించలేదు.   ఎందుకంటే వాస్తవంగా  ఈ విషయాలేవీ  ఆయన చేతుల్లో లేవు. ఆయన నియంత్రించలేరు.   కాశ్మీర్‌ సమస్యను రావణ కాష్టం లాగా మార్చడంపైనా అక్కడి సైనికాధికారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాశ్మీర్ కారణంగానే దేశంలో వారి పెత్తనం కొనసాగుతోంది. అందుకే భారత్ పాక్ ప్రతిపాదనకు స్పందించలేదు.   భారత్ తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించు కోవడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలని అన్యాపదేశంగానైనా పాక్ ప్రధానికి భారత్ విస్పష్టంగా చెప్పింది.    భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌తో చర్చలకు ససేమిరా  అని తేల్చి చెప్పేసింది.   అయితే పాక్ బేలగా భారత్ను బతిమలాడుకోవడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గోధుమ పిండి  కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదివరకటి మాదిరిగా యూరోపియన్‌ దేశాల నుంచి ఆ దేశానికి   ఎగుమతులూ జరగడం లేదు.   ఏవిధమైన సహాయమూ అందడం లేదు. అమెరికా నుంచి కూడా చాలా చాలా పరిమిత స్థాయిలోనే   విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. దీంతో ఇక రానున్నరోజులలో దిగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది.  దేశంలో వ్యవసాయ రంగం   కుదేలైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 60 శాతం, అంతకు మించి పెరిగిపోయాయి.  చైనా, యు.ఏ.ఇ, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్థాను సహాయం చేయడానికి ముందుకు వచ్చినా తక్షణసమస్యల నుంచి గట్టెక్కే అవకాశం లేదు.   ఆఫ్ఘనిస్థాన్‌ చెందిన తాలిబన్లతో పాకిస్థాన్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పోయాయి. ఈ పరిస్థితుల్లో పాక్ కు భారత్ సహకారమే దిక్కు. అందుకే పాకిస్థాన్ ఇంత బేలగా భారత్ తో శాంతి చర్చల కోసం పాకులాడుతోంది. బతిమలాడుకుంటోంది.  

తెలంగాణలో పోటీకి జనసేన సై

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారు. ఏపీలోనే కాదు, తెలంగాణ శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లోనూ జనసేన పోటీ  చేస్తుందని స్పష్టం చేశారు. నిజానికి గత కొంత కాలంగా జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా, అంత క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చేశారు. పూర్తి క్లారిటీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన, ఎలాంటి అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పొత్తుల విషయంలోనూ ఆయన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం, రాకున్నా ఓకే, ఒంటరిగానే పోటీ చేస్తాం.. జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలి.. కనీసం 10 మంది జన సైనికులు అసెంబ్లీలో ఉండాలనేది, తన ఆకాంక్ష అని అన్నారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఒక ఆశయం కోసం తాను పోరాడుతున్నట్లు పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఇక్కడి ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. ఆలాగే  జనసేన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని అంటూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో  బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలను విని తాను గళం విప్పానని గతాన్ని గుర్తు చేస్కున్నారు. అలాగే పరోక్షంగానే అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు సున్నితంగా చురకలంటించారు. తెలంగాణ  రాష్ట్ర  సాధన వరకు పోరాటాలు చేసింది, తెలంగాణ సాధించింది తెలంగాణ  ప్రజ లే అంటూ, భారాస నేతలు ప్రవచించే,  కేసేఆర్  ఒక్కడే  చావు నోట్లో తలపెట్టి  తెలంగాణ సాధించారనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే అదే సమయంలో  కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో సాధించాలని ముందుకు వెళ్తోంది ..  అందుకు నేను ఎదురు చూస్తున్నాను, అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన రీతిలో కేసేఆర్ ప్రభుత్వాన్నిపవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. అఫ్కోర్స్ అన్నప్రాసన రోజే ఆవకాయ  ఆశించలేము అనుకోండి.. ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడవలసి వుందని పరిశీలకులు అంటున్నారు.   అయితే తెలంగాణలో జనసేనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారు. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో తెలుగు దేశం, జనసేన పొత్తుకు ఇరు పక్షాల నుంచి సుముఖత వ్యక్త మవుతోంది. ఒక ప్రకటన మినహా మిగిలిన క్రతువంతా ఆల్మోస్ట్ కంప్లీటై పోయిందని పొలిటికల్ సర్కిల్స్  లో వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవరి మెడలో మూడు ముళ్ళు వేస్తారు, అనేది ఆసక్తికరంగా మారింది. అయితే  తెరాస భారాసగా పేరు మార్చుకుని ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నేపధ్యం ఒక  వైపు  కొద్ది రోజుల వ్యవధిలో టీడీపీ, జనసేన తెలంగాణ రాజకీయ వేదిక మీదకు వచ్చిన నేపధ్యం మరోవైపు .. చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజకీయం ముందు ముందు మరింత ఆసక్తి దాయకంగా మారుతుందని అంటున్నారు.

బీబీసీ డాక్యుమెంటరీ పై ముదురుతున్న దుమారం

ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పూర్వం 2002 గుజరాత్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు కథా వస్తువుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను ఇటీవల యూట్యూబ్‌ (ఇండియా)లో బీబీసీ అప్‌లోడ్‌ చేసింది. అయితే అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ధ్వజమెత్తారు. నిజానికి, ఆ డాక్యుమెంటరీ లో ఏముంది? ఏమి లేదు అనే విషయాన్ని, అలాగే  ఉన్నదంతా నిజమేనా అనే విషయాన్ని పక్కన పెడితే  ఈ డాక్యుమెంటరీ రాజకీయ దుమారాన్ని అయితే సృష్టిస్తోంది. నిజానికి గోద్రా దుర్ఘటన (గుజారత్ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటన) నేపధ్యంగా జరిగిన గుజరాత్ లో అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని మాత్రమే కాదు  ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్ లను  సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రభుత్వం నిషేధ  ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సహజంగానే  హిందూ వ్యతిరేక లౌకికవాద వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంతే కాదు నిషేధం ఉన్నా ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసక్తి చూపడం కాదు  ప్రభుత ఉత్తర్వులను ధిక్కరించి అయినా, ప్రదర్శించి తీరుతామని  కొన్ని వామపక్ష అనుబంధ విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. మరోవంక ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్  తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా అనేక పార్టీలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలనే డిమాండ్ తో గొంతు కలుపుతున్నాయి. కేరళ రాష్ట్ర పీసీసీ మైనారిటీ సెల్ మరో అడుగు ముందుకేసి, గణతంత్ర దినోత్సవం    ( జనవరి 26) ఆ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించింది.   డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.  డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది.. ఇది కేంద్రంపై మా (మైనారిటీ) నిరసన  అని కేపీసీసీ అడ్వకేట్ షహాబుద్దీన్ అన్నారు. ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి ఏది నిజమో ఏది కాదో  ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరారు.  ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఎలా అడ్డుకుంటుంది ? ఏది తప్పు ఏది కాదో ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోనివ్వండి. అల్లర్లలో వేలాది మంది మరణించిన గుజరాత్‌కు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఎలా విశ్వసిస్తాము  అని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ అన్నారు. ఈ అంశంపై బీజేపీకి చెందిన టామ్ వడక్కన్ స్పందిస్తూ..  ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర అని అన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన అన్నారు.  ఇదిలా వుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్ యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రెండు రోజుల కిందట స్పందించారు. భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలస రాజ్యాల మత్తు నుండి  బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు.అయితే ఎన్నికల సంవత్సరంలో బీబీసీ సృష్టించిన వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న భయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది.

కొత్త సచివాలయం చూతము రారండి

అదేదో కమర్షియల్ యాడ్ లో  రావు రమేష్.. మావాళ్ళు ఏది చేసినా మాములుగా చేయరు ఘనంగా చేస్తారు.. అంటారు. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే, ఆయన ఏది చేసినా మాములుగా ఉండదు. ఘనంగా ఉంటుంది. అలాంటింది, ఇక రాష్ట్ర సచివాలయం అంటే మాటలా మాములు విషయమా? అందులోనూ ఇప్పుడు జాతీయ స్థాయిలో జెండా ఎగరేసేందుకు సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని అంతే ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయ  నిర్మాణ పనులు  తుది దశకు చేరుకున్నాయి. మరో వంక ప్రారంభోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  కాగా  తెలంగాణ కొత్త సెక్రటేరియట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఆధునిక హంగులు, అత్యాధునిక సొగబులతో కొత్త సచివాలయ నిర్మాణం జరిగింది. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చే నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ స్వయంగా సచివాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు  ఫిబ్ర‌వ‌రి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయస్థాయి నేతలు తరలిరానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన‌నున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున లలన్ సింగ్ (జేడీయూ జాతీయ అధ్యక్షుడు), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమానికి ముందు వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.   ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని   మంగళవారం(జనవరి 24) సందర్శించారు. సచివాలయ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ముఖ్యమంత్రి  వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో కేసీఆర్‌.. పనుల గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సచివాలయంలోకి సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.  తెలంగాణ కొత్త సచివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా ఐకానిక్ బిల్డింగ్‌గా కనిపించేలా కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించారు. 265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్ రూమ్, సిబ్బంది రూమ్స్ లాంటివి ఉంటాయి. బిల్డింగ్‌పైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు గల జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. భవనం ముందువైపు ఒకటి, వెనుకవైపు ఒక జాతీయ చిహ్నం ప్రతిష్టించారు. వీటిని ఢిల్లీలో తయారుచేయించి హైదరాబాద్‌కు తరలించారు. భారీ క్రేన్ల సహాయంతో వీటిని బిల్డింగ్ పైభాగంలో ఏర్పాటు చేశారు. బిల్డింగ్ నలువైపులా మొత్తం 2 ప్రధాన గుమ్మటాలు. 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేశారు. సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్ ఎదురుగా ప్రధాన ద్వారం ఉండనుండగా.. సీఎం కాన్వాయ్ ఈ ద్వారం గుండా లోపలికి వస్తుంది. ఇక ఎన్టీఆర్ గార్డెన్‌కు ఎదురుగా మరో గేటు ఏర్పాటు చేయగా.. ఉద్యోగులు ఈ గేటు గుండా ఆఫీసులకు చేరుకుంటారు. ఇక బిర్లామందిర్ వైపు మరో గేటు ఉండగా.. సామాన్యులకు ఈ ద్వారం కూడా ప్రవేశం ఉంటుంది. ఇక సచివాలయం వెనుక భాగంలో నాలుగు గేటు ఉంటుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే నాలుగో గేటు ఉపయోగిస్తారు. 300 కార్లు. 600 ద్విచక్ర వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునేలా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. సీఎంఓ ఛాంబర్‌లో 30 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. సీఎం, మంత్రులు, ఉద్యోగులు, సామాన్యులకు వేర్వురుగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. 100 ఏళ్ల పాటు ఉండేలా తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.

ఉలిపికట్టెలా తెలంగాణ సర్కార్.. రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు దూరం

ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వ వైఖరి.  దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాయి. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలికా లేదు.  సంప్రదాయం ప్రకారం ఈసారి పబ్లిక్‌ గార్డెన్‌లో ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును దేశ వ్యాప్తంగా గణతంత్రదినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటాం.  ఆగస్టు 15 వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాన్నీ, గణతంత్ర దినోత్సవాన్నీ  ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. జాతి పండుగలుగా జనం భావిస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రం గణతంత్రి దినోత్సవం సందడి కనిపించడం లేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి.   దీనికి కారణం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జెండా ఎగరేసి.. ప్రసంగించాల్సి ఉండటమే.   తమిళిసై గవర్నర్ గా వచ్చిన తొలి  రెండేళ్లు పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్ భవన్ లోనే గవర్నర్ పతాకావిష్కణ చేశారు.   ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ అంటే గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు వరకూ కూడా ఈ వేడుకలకు సంబంధించి   రాజ్‌భవన్‌కు ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు. రిబప్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు. ఎట్ హోం కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరుపై ఎటువంటి సమాచారం లేదు. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన ఇష్టాయిష్టాలు, పంతాలు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ ఒఖ నియంతలా వ్యవహరిస్తున్నారనీ,   మళ్లీ హైదరాబద్ స్టేట్ చేద్దామనుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే గవర్నర్ తో విభేదాల కారణంగా గణతంత్ర వేడుకలను పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని అని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వతంత్ర భారత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి.. హైదరాబాద్ స్టేట్ రోజులకు తిరోగమిస్తున్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా అక్కడి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు గవర్నర్ తో విభేదాలున్నా.. సంప్రదాయం ప్రకారం గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేశారనీ, ఆనవాయితీ ప్రకారం ఆయా రాష్ట్రాలలో గవర్నర్లే జెండా ఆవిష్కరించి ప్రసంగించనున్నారనీ గుర్తు చేస్తున్నారు. 

కివీస్ పై మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

టీమ్ ఇండియా  విజయాల యాత్ర కొనసాగుతోంది. వరుస సిరీస్ విజయాలతో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించి సరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.  ఇండోర్ వేదికగా మంగళవారం (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 386 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్..41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 85 బంతుల్లో 101 , శుభ్ మన్ గిల్  78 బంతుల్లో 112  సెంచరీలతో రెచ్చిపోయారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. గిల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. ఇరువురూ కలిసి తొలి వికెట్ కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.  ఈ విజయంతో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ ను వెనక్కు నెట్టేసి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కు ఎగబాకింది. 

జగన్ సర్కార్ పై కేంద్ర మంత్రుల విమర్శలు.. చర్యలు తప్పవన్న హెచ్చరికలు

నిండా మునిగిన వాడికి చలేమిటన్నది నానుడి.  జగన్ ప్రభుత్వానికి సిగ్గు లేదని.. నిత్యం ఆయన సర్కార్ పై వెల్లువెత్తుతున్న విమర్శలకు ఇసుమంతైనా స్పందించని ఆయన తీరును చూసిన వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో విపక్షాలే కాదు.. అడుగడుగునా జగన్ కు సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిథులు సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర పర్యటనకు ఏ కేంద్ర మంత్రి వచ్చినా.. రాష్ట్రంలో పరిస్థితి చూసి నోరేళ్ల బెడుతున్నారు. ఇంతటి అధ్వాన పరిపాలన ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రాదని జోస్యం చెబుతున్నారు. ఒక్క లోక్ సభ స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి    దేవుసిన్హ్ చౌహాన్ కూడా అదే అన్నారు.   ఏపీలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పూర్తిగా చతికిల పడింద. మొత్తం మీద ఏపీలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. అర్ధిక క్రమశిక్షణ పూర్తిగా కట్టు తప్పింది. ఆర్థికంగా దివాళా అంచుకు చేరింది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తోంది. కేంద్రం నిధులతో చేపట్టిన పనులను కూడా తన ఖాతాలోనే వేసేసుకుంటోంది. ఎక్కడా కేంద్రం పేరు ప్రస్తావించడం లేదు. కేంద్ర పథకాలకు కూడా జగన్ ఫొటోనే వాడుతోంది. మోడీ బొమ్మే కనిపించడం లేదు. ఇవి సాక్షాత్తూ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చేసిన విమర్శలు. ఆయన కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇంత కాలం రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలనే మరో మారు చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం అప్పగిస్తే.. ప్రజల నమ్మకాన్ని అతి తక్కువ సమయంలోనే జగన్ ప్రభుత్వం కోల్పోయిందని దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు.   కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన ఫైనాన్స్ కమిషన్ నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని విమర్శించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది జగన్ సర్కార్ తీరు అప్పు చేసి పప్పుకూడు తింటున్న చందంగా ఉందని విమర్శలు గుప్పించారు. సుపరిపాలన అందించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారనీ, ఆయన పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని దేవుసిన్హా చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో గ్రామాభివృద్ధి అడుగంటిపోయిందనీ, గ్రామస్వరాజ్యం అన్న పూజ్య గాంధీజీ బాటలో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రణాళికా సంఘం సిఫార్సుల మేరకు కేటాయిస్తున్న నిథులను దారి మళ్లించి గ్రామ స్వరాజ్య లక్ష్యానికి తూట్లు పొడుస్తోందంటూ జగన్ సర్కార్ పై ఆమె నిప్పుల వర్షం కురిపించారు.  ఇక ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల పాట్లు చెప్పనలవి కావని  అన్నారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు అందక ఉద్యోగులు, పెన్షనర్లు నానా అగచాట్లూ పడుతున్నారన్నారు.  కేంద్రం రాష్ట్రానికి 20లక్షల గృహాలను కేటాయించిందనీ.. కానీ జగన్ సర్కార్ ఒక్కటంటే ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదనీ కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ విమర్శించారు. పేదలకు ఆయుష్మాన్ కార్డులు అందించలేదు.   ఇక విజయవాడలో జరిగిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లో భాగంగా విజయవాడ శివారులో నిర్మించిన ఆస్పత్రిని మరో కేంద్ర మంత్రి  భారతీ ప్రవీణ్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి లోపలికి వెళ్తూంటే   వైసీపీ కార్యాలయంలోకి వెళుతున్న భావన కలిగిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ లోగోను గానీ, ప్రధాని మోదీ ఫొటోలను ప్రదర్శించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  త్వరలోనే కేంద్ర   ఆరోగ్యశాఖ   అధికారుల బృందం వచ్చి విచారణ చేస్తారని.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తామని హెచ్చరించారు.   మొత్తంగా కేంద్రం అండ ఉందని భావిస్తూ చిత్తం వచ్చినట్లుగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు కేంద్ర మంత్రుల నుంచీ అక్షింతలు తప్పడం లేదు. సొంత పార్టీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న అసంతృప్తి, ఆగ్రహాం,  కేంద్రం కన్నెర్ర చేయడం, విపక్షాల జోరు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  

కమలానికి కన్నా గుడ్ బై

భారతీయ జనతా పార్టీ, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్నారా? ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారా? కొనసాగుతారా? అంటే అనుమానమే  అంటున్నారు  అయన సన్నిహితులు. నిజానికి  పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నది మొదలు, కన్నాపార్టీ వ్యవహారాలకు కాసింత దూరంగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.  నిజానికి ఒక్క కన్నానే కాదు, రాష్ట్ర విభజన తర్వాత కట్టకట్టుకుని కాషాయం కట్టి, కమల దళంలో చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు చాలావరకు 2019 తర్వాత సైలెంట్ అయిపోయారు. ఒక్క పురందేశ్వరి మాత్రమే కొంతలో కొంత ఆక్టివ్  గా ఉన్నారు. ఆమె కూడా పార్టీలో ఎంతకాలం ఉంటారనేది అనుమానమే అంటున్నారు. నిజానికి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇటీవల రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె కూడా అదే బాటలో క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేదు. పోనీ కాంగ్రెస్ లోకి వెళదామంటే ఆ పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా వుంది. అందుకే ఆమె, క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగి బీజేపీలో కొనసాగడమా, లేక మరో ప్రాంతీయ పార్టీలో చేరడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు.  సరే, పురందేశ్వరి విషయం  ఎలా ఉన్నా, కన్నా లక్ష్మీనారాయణ అయితే బీజేపీకి కటీఫ్ చెప్పినట్లే అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. అలాగే    మంగళవారం(జనవరి 24) భీమవరంలో  ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కన్నా డుమ్మా కొట్టారు.  బీజేపీ నేతలంతా భీమవరంలో ఉంటే కన్నా హైద్రాబాద్ లో ఉన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం  ఆయన హైద్రాబాద్ కు వచ్చినట్టుగా  కన్నా వర్గీయులు చెబుతున్నారు. అయితే  రాజకీయ విశ్లేషకులు మాత్రం కన్నా కమలాన్ని వీడినట్లేనని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే  గత డిసెంబర్ చివర్లోనే, కన్నాలో కదలిక మొదలైంది.  జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అప్పట్లో అదేమీ లేదు. పాత మిత్రులం  కదా, అందుకే, అలా ఓ సారి కబుర్లు చెప్పుకున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  ఇద్దరు నేతలు అప్పట్లో చెప్పుకొచ్చారు, అఫ్కోర్స్, ఆ మాటలు ఎవరూ నమ్మలేదను కోండి అది వేరే విషయం. అందుకే, అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ చేరుతారని ప్రచారం స్పీడ్ అందుకుంది.   నిజానికి  కన్నా  సోము మధ్య చాలా కాలంగా ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది. కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  ఇటీవల తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత గుంభనంగా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో  నామమాత్రంగా  సంబంధాలు ఉండడానికి సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. ఈనేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఇప్పడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఇక ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.  ఏ పార్టీ, ఎప్పడు చేరుతున్నారు అనేది మాత్రమే తేలవలసి ఉందని అంటున్నారు. అదలా ఉంటే, ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు  నిన్ననే కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కన్నాకు సూచించినట్టుగా కన్నా వర్గీయులు చెబుతున్నారు. అయితే, కన్నా ఒక నిర్ణయానికి వచ్చారని, త్వరలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. అదే జరిగితే, ప్రస్తుతం బీజేపీలో ఉండీ లేనట్లున్న మరి కొందరు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడం ఖాయమని అంటున్నారు.

ఏ క్షణంలోనైనా ఎంపి అవినాష్ అరెస్ట్?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కోరినట్లుగా మంగళవారం (జనవరి 24)న విచారణకు హాజరుకాలేననీ, బిజీ షెడ్యూల్ ఉందనీ పేర్కొంటూ.. మరో రోజు విచారణకు హాజరౌతాననీ, అందుకు   ఐదు రోజులు గడవు కోరుతూ సీబీఐకి బదులిచ్చారు. అయితే అవినాష్ సమాధానంతో సంతృప్తి చెందని సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పులివెందుల వెళ్లేందుకు అదనపు భద్రత కావాలంటూ సీబీఐ కడప ఎస్పీని, ఇతర ఉన్నతాధికారులను కోరింది. దీంతో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది.   సీబీఐ అధికారులు.. కడప నుంచి ఇప్పటికే పులివెందులకు బయలు దేరారు.   భారీగా భద్రతతో సీబీఐ బృందం పులివెందులకు బయలుదేరడంతో.. అవినాష్ ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి  వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సందర్బంలో కేసు దర్యాప్తునకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుతగులుతున్నారంటూ సీబీఐ సర్వోన్నత న్యాయ స్థానానికి నివేదించిన సంగతి విదితమే. ఇప్పడు సుప్రీం ఆదేశాలతో కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన అనంతరం సీబీఐ దర్యాప్తుజోరు పెరిగింది.   మొదటి నుంచీ ఈ కేసు విచారణను నీరుగార్చడానికి పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి. వివేకా హత్య జరిగినప్పుడు గుండెపోటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి , ఆ తరువాత గొడ్డలి పోటని తేలిన తరువాత అప్పటి  ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించి, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన న జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో న్యాయపోరాటం చేసి సీబీఐ విచారణకు కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చేలా చేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అవరోధాలు కలిగేలా అధికార పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ.. కేసును వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించారు.   ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కూడా సునీత పేర్కొన్న ప్రతి అంశం అక్షర సత్యమని సుప్రీం కు తెలియజేసింది. దీంతో కేసును తెలంగాణకు సుప్రీం బదలీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ అరెస్టు అనివార్యమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. పులివెందులకు భారీ భద్రతతో పయనమైన సీబీఐ అధికారులు అవినాష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. మర్యాద గీత దాటేసిన విభేదాలు

 వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,  గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది. గత మూడున్నరేళ్లుగా గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి. రోజు రోజుకూ రాజుకుంటూనే ఉన్నాయి. గత మూడున్నరేళ్లుగా ఇరువురూ అనివార్యమైన ఒకటి రెండు సందర్భాలలో వినా ముఖాముఖీ భేటీ అయిన దాఖలాలు లేవు. ఈ ఇరువురి మధ్యా విభేదాల ప్రభావం జాతీయ పండుగలపైనా పడుతోంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవాలు ఈ సారి రాజ్ భవన్ కు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సైతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశం కూడా కనిపించడం లేదు.   అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు  పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్   మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి తనకుఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై వివరించారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని,  తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నా..  కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని మౌనంగా ఉంటున్నట్లు తమిళిసై చెప్పారు.  తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి అన్నారు.   అంతే కాదు.. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది. రిపబ్లిక్ డే,  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరే చూస్తారుగా..   వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో  గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సర్కార్ ఏ  మాత్రం సిద్ధంగా లేదన్నది తేటతెల్లమౌతోంది. 

బిరియానీ బెంగళూరు టు ముంబై.. ఆర్డర్ ను ఒబే చేసిన జుమాటో

మత్తు తలకెక్కితే.. నింగిలోని చందమామను నేలకు దించేయాలనిపిస్తుంది. కొండ మీద కోతి చేత కల్లు తాగించాలనిపిస్తుంది.. ఇలా ఒకటేమిటి.. అసాధ్యమన్నదేదీ లేదన్న ధీమా పెరుగుతుంది. ముంబైకి చెందిన ఒక అమ్మాయి.. ఇంచుమించు అలాగే అనుకుంది. ఫుల్ గా మందు కొట్టేసిన తరువాత మంచి ఫుడ్ తినాలనుకుంది. అంతే వెంటనే తనకు బాగా ఇష్టమైన బిరియానీని జొమాటో ద్వారా ఆర్డర్ చేసేసింది. ఇందులో వింతేముంది అనుకోకండి.. ఆమెకు బిర్యానీ చాలా చాలా ఇష్టం.. అంతే కాదు ఆమెకు బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ బిరియానీ అంటే అంటే మరీ ఇష్టం. దీంతో ఆమె మంబై నుంచి బెంగళూరులోని ప్రసిద్ధ హోటల్ నుంచి బిరియానీ కావాలంటూ జొమాటోకు ఆర్డర్ చేసింది. జుమాటో కూడా చాలా సిన్సియర్ గా ఆమె ఆర్డర్ ను బుక్ చేసుకుని.. అంతే సిన్సియర్ గా డెలివరీ చేసింది. అయితే చాలా చాలా దూరం కదా.. అందుకు ఆ డెలివరీ ఆ మరుసటి రోజు  ఇచ్చింది. బిల్ కూడా పాతిక వందల రూపాయలు వేసింది. ఈ విషయాన్నంతా ఆ అమ్మాయి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. తాను చేసింది తప్పని తాను అనుకోవడం లేదనీ, బేంగళూరు నుంచి బిరియానీ తెప్పించుకుని తినడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. 

వైసీపీలో మహిళలకు మరిన్ని టికెట్లు.. నాకు నోటికెట్.. బాలినేని

ఆంధ్రప్రదేశ్  లో  ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఆల్మోస్ట్  ఖరారు అయినట్లు వార్తలు వస్తున్ననేపధ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి  ఈ సారి తనకు వైసీపీ టికెట్  రాకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. నిజానికి, ఆయనకు ఆ మేరకు సంకేతాలు వచ్చాయా, లేక అటు నుంచి రియాక్షన్ చూసేందుకు ఒక రాయి వేశారా, ఆనేది పక్కాన్ పెడితే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని, బాలినేని తనంతట తానుగా ముందుగానే ప్రకటించారు. అయితే, తనకు బదులుగా తన స్థానంలో తన భార్య సచీదేవికి టికెట్ వచ్చే అవకాశం ఉందని మరో సంకేత మిచ్చారు.  నిజానికి, బాలినేని కేవలం మాజీ మంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు. అందకే  “నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అంటే నేనైనా చేసేదేం లేదు. ఈసారి మహిళలకే అవకాశాలు అని జగన్ రెడ్డి తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే” నని బాలినేని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి  2024 ఎన్నికలు - సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నిజానికి,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలోనూ అందరికంటే ముందుగా బాలినేని, తనంతట తానుగా మంత్రి పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకు తిరుగుతున్నాని ప్రకటించారు. ఒక విధంగా ఇతర సీనియర్ మంత్రులను మానసికంగా తయారు చేసేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి తన బంధువు బాలినేని చేత ఆ మాట చెప్పించారనే టాక్కూడా అప్పట్లో వినిపించింది. అలాగే, అప్పట్లో ఆయనలో ఎక్కడో లోలోపల,అందరికీ ఉద్వాసన పలికినా, బంధువు కోటాలో అయినా జగన్ రెడ్డి తనను మాత్రం మంత్రివర్గంలో కొనసాగిస్తారనే ఓ చిరు ఆశ లాంటింది ఏదో ఆయనలో ఉందని, అందుకే ఆయన, ఆ విధంగా మాట్లాడారనే వదంతులు అప్పట్లో  షికారు చేశాయి. అయితే,చివరకు బాలినేని ఒకటి తలిస్తే, జగన్ రెడ్డి ఇంకొకటి తలిచారు అన్నట్లు, బంధువు కావడం వల్లనే బాలినేనికి ఉద్వాసన పలికారని ఆ తర్వాత గానీ తెలిసిరాలేదుని అంటారు. జగన్ రెడ్డి తొలి  మంతివర్గంలో ప్రకాశం జిల్లానుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటుగా  ఆదిమూలపు సురేష్ కూడా మంత్రిగా ఉన్నారు. మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ముఖ్యమంత్రి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి, బాలినేనికి ఉద్వాసన పలికారు. దీంతో బాలినేని హర్టయ్యారు. అలక వహించారు. బందువును నన్ను కాదని, ఆదిములపు సురేష్ ను కొనసాగించడం ఏమిటని, కొంత కాలం ఆయన కొంచెం చాలా బాధపడిపోయారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా బాధపడ్డారు.అయితే ఆ తర్వాత సర్దుకుపోయారు. తీరా ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్‌ ఇవ్వకపోవచ్చునని అన్నారు.  అయితే, బాలినేనికి టికెట్  వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన పని కట్టుకుని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక కసరత్తుకు అప్పుడే శ్రీకారం చుట్టినట్లుందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, ఒంగోలులో బాలినేని తన వారసుడిగా కొడుకు ప్రణీత్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని వ్యవహారాలన్నీ ఆయన కొడుకు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్తగా తన భార్య సచీదేవి పేరు తెరపైకి తేవడం విశేషం. మొత్తమ్మీద బాలినేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఏపీ మొత్తం సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వాళ్లకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు ఉండదని క్లారిటీ ఇచ్చారు. పని తీరు బాగోలేకపోతే ఎవరినైనా పక్కన పెడతామని ఆయన  అనేకసార్లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో ఇప్పుడు బాలినేని చేసిన వ్యాఖ్యలతో, ఏరివేతలు మొదలయ్యాయనే ప్రచారం జోరందుకుంది. అయితే,  బాలినేని  భార్యకు ఇచ్చినట్లుగానే, టికెట్  ఇవ్వని ఇతర ఎమ్మెల్యేల భార్య లేదా ఇతర కుటుబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా? అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, సగం మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈసారి మహిళలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం లేక పోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

కర్ణాటకలో హస్తానిదే హవా !

కర్ణాటక రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. మరో వంక అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, హంగ్ మీద ఆశలతో జేడీఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నాయకులు, ఇప్పటికే ఒకటి రెండు మార్లు రాష్ట్రంలో పర్యటించారు.  కాంగ్రెస్ పార్టీలో  మాజీ ముఖ్యమంత్రి సిద్దామయ్య,  పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్’ వర్గాల మధ్య   అంతర్గత విభేదాలు ఇంకా ఒక కొలిక్కి రాక పోయినా  ఎవరికి వారుగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో ఆయన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వ్యూహ రచన చేస్తున్నారు. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి  ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిలో పడ్డారు. అలాగే  బీజేపీ మాజీ నాయకుడు గాలి జనార్ధన్  రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ భారాస కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే ఎన్నికల ఫలితాలపై ఊహగానాలు, వ్యూహాగానాలతో పాటుగా  వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ప్రీ పోల్ సర్వేల ఫలితాలు కర్ణాటకలోనే కాకుండా, తెలంగాణలోనూ ఆసక్తిని కల్గిస్తున్నాయి. కాగా ఇంత వరకు వచ్చిన అన్ని సర్వేలు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  అధికార బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం అయ్యే పని కాదని, ఈ సారి అధికారం  హస్తం పార్టీదేనని అంటున్నాయి.  కాగా తాజగా హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా హస్తనిదే అధికారమని అంటోంది. రానున్న కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే అంచనా వేసింది. 224 స్థానాల్లో బీజేపీకి కేవలం 65 నుంచి 75 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 108 నుంచి 114 స్థానాలు, జేడీఎస్‌కు 24 నుంచి 34 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కర్ణాటకలోని ఐపీఎస్ఎస్ టీమ్‌తో కలిసి నవంబరు 20 నుంచి జనవరి 15 వరకు ఈ సర్వేను నిర్వహించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని, బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని వెల్లడైందని తెలిపింది. కాంగ్రెస్‌కు పడే ఓట్లు 38.14 శాతం నుంచి 40 శాతానికి, అంటే 1.86 శాతం పెరుగుతాయని తెలిపింది. బీజేపీకి పడే ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి, అంటే 2.35 శాతం తగ్గుతుందని తెలిపింది. జేడీఎస్ కూడా 1.3 శాతం మేరకు ఓట్లను కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చిన్న పార్టీలు, స్వతంత్రులు ఏడు స్థానాలను దక్కించుకోవచ్చునని అంచనా వేసినట్లు పేర్కొంది. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల నుంచి కాంగ్రెస్‌ గరిష్ఠ మద్దతు పొందుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఒక్కళిగ కులస్థుల్లో 50 శాతం మంది జేడీఎస్‌ను బలపరిచే అవకాశం ఉందని, వీరిలో 38 శాతం మంది కాంగ్రెస్‌కు, 10 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కొప్పల్, గంగావతి, బళ్లారి, కోలార్, దావణగేరే, రాయ్‌చూరులలో అభ్యర్థుల గెలుపోటములపై గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఏఐఎంఐఎం పోటీ చేస్తే కేవలం ఆరు లేదా ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపించగలదని అంచనా వేసింది. మరో వంక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీలోని 224 సీట్లకు కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసే విషయంపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ప్రజా ధ్వని' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోస్టల్ కర్ణాటకను హిందుత్వ లేబొరేటరీగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమాజాన్ని విడగొట్టేందుకు హిందుత్వ పేరుతో అబద్ధాలను బీజేపీ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైనవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ప్రసక్తి లేకుండా ప్రజలంతా కలిసిమెలసి ఆప్యాయానురాగాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని, బీజేపీకి అభివృద్ధి అంశాల కన్నా 'లవ్ జీవాద్' అశంపైనే మక్కువ ఎక్కువ అని ఆన్నారు. బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలు గ్రహించాలని సూచించారు.

నాట్ టుడే.. అనదర్ డే.. సీబీఐ నోటీసులకు ఎంపీ అవినీష్ రెడ్డి జవాబు

వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి మంగళవారం (జనవరి 24) హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాష్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు. అయితే మంగళవారం తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు మరో తేదీని విచారణకు నిర్ణయించాల్సిందిగా అవినాష్ రెడ్డి సీబీఐను కోరారు. అదలా ఉంటే.. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు కోర్టు ఆదేశాల మేరకు మార్చిన తరువాత సీబీఐ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ,  ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె  సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే.  దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసిన సంగతి విదితమే.   గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తి అయిన సీఎం జగన్ ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ  పదే పదే చెప్పడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అను మానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసింది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడి తెలంగాణకు బదలీ చేసింది.    

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఔట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది. డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా... జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  1996 బ్యాచ్ కు చెందిన సంజయ్ ను ఏపీ సీఐడీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.  జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్   ఉన్నారు. ఆయన హయాంలో.. సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే పని చేసిందన్న  ఆరోపణలు వచ్చాయి. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.    సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి వచ్చి నిండా నెలరోజులు కూడా కాలేదు. అంతలోనే హఠాత్తుగా ఆయనపై బదిలీ వేటు పడింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న సునీల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.   1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్  జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ సహా పలు కేసులలో సీఐడీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయిన దానికీ, కాని దానికీ విపక్ష నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికే సీఐడీ పని చేస్తోందా అన్నట్లుగా సునీల్ ఆధ్వర్యంలో సీఐడీ పని చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విపక్షాలను వేధించడం కోసమే అన్నట్లుగా సీఐడీ వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్ గా సునీల్ వ్యవహార శైలిపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు.. సరికదా ప్రొత్సహించింది. అలాంటిది ఏపీ సీఐడీ చీఫ్ గా ఆయనను హఠాత్తుగా బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడం విస్మయం గొలుపుతోంది. దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

సీట్ల సర్దుబాటుపైనే ఇప్పుడు దృష్టంతా?

జనసేన   తెలుగుదేశం  పొత్తు పై ఇక ఇప్పుడెవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. జనసేన సీనియర్ నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పొత్తు ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేశారు.  వైసీపీని  గద్దె దించాలంటే పొత్తులు తప్పవని ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం, ఆ తరువాత సీట్ల సర్దుబాటుపై నాగబాబు సంకేతాలివ్వడంతో  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా  ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ సాగుతోంది.  ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 40-50 స్థానాలపై జనసేన డిమాండ్   చేస్తున్నట్లుగా ఇరు పార్టీలలోనూ చర్చ అయితే జరుగుతోంది. కానీ చివరకు పాతిక సీట్లతో జనసేన సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ  వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఆ సీట్లన్నీ కూడా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నుంచీ ఎటువంటి ప్రకటనా రాకముందే.. తెలుగువన్  ఈ నెల 5వ తేదీనే జనసేన- తెలుగుదేశం పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి అన్న శీర్షికన ప్రత్యేక కథనంలో పేర్కొంది. పొత్తులో జనసేన పార్టీకి ఏడు జిల్లాల పరిధిలో 20 సీట్లు కేటాయించేందుకు తెలుగుదేశం అంగీకరించిందనీ, ఈ మేరకు ఇరు పార్టీల మధ్యా అవగాహన కూడా కుదిరిందనీ ఆ కథనం లో వెల్లడించింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై జనసేనాని నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడమే కాకుండా.. ఎవరూ ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని తేటతెల్లమైపోయింది.  తెలుగువన్ చెప్పినట్లు ఏడు జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఆరంభమైంది. ఇవి కాక మరి కొన్ని స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకూ  గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, చిత్తూరు,కర్నూలు జిల్లాలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందని చెబుతున్నారు. విజయనగరం, అనంతపురం జిల్లాల విషయంలో చర్చలు సాగుతున్నాయంటున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది.   ఏతా వాతా ఈ పొత్తు  కారణంగా జనసేన, తెలుగుదేశం కూడా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించడం అంటే.. ఆయా స్థానాలలో ఇంత కాలం అధికార వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన కొందరు నాయకులు తమతమ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.  అలాగే మిగిలిన స్ధానాల జనసేన త్యాగం చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద తెలుగుదేశం అధినేత ఇప్పటికే ఓ పాతిక స్థానాలను జనసేనకు కేటాయించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు 2019 ఎన్నికల ఫలితాలను బేస్ గా చేసుకున్నారని అంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఉండాలంటే.. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు అవసరం.  ఇరు పార్టీలకూ కూడా అది అవసరం.   అందుకే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పుపై జరుగుతున్న చర్చలో బీజేపీ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు.అందుకే వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య మైత్రీ బంధం తెగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి

కుప్పం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆయన పాదయాత్రకు నాన్చి నాచ్చి ఎట్ట కేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని షరతు విధించింది.  అలాగే  పాదయాత్రలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయరాదని కండీషన్ పెట్టింది.   తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం చిక్కన అవుతోంది. ఆయన పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించే విధంగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసింది. కుప్పం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. ఎన్టీఆర్ కుటుంబీకులు అంతా హాజరయ్యేం  అవకాశం ఉంది.   మొత్తం రాష్ట్రం  దృష్టి అంతా లోకేష్ పాదయాత్రపైనే ఉంది.  అందుకే పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసుల వైఖరి పట్ల సర్వత్రా అసహనం వ్యక్తం అవుతోంది. కావాలనే అనుమతి విషయం తేల్చకుండా పోలీసులు తాత్సారం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య లేఖకు డీజీపీ స్పందించిన తీరును రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పటికే అసందర్భం, అనుచితం అయిన జీవో 1తో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్ ప్రభుత్వం.. పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనడానికి వర్ల లేఖకు డీజీపీ స్పందనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. లోకేష్ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఒక  ప్రాంతానికో, నియోజకవర్గానికో పరిమితమైనది కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 400 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ కవర్ అయ్యేలా 4000 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో ఆయనను అన్ని వర్గాల ప్రజలనూ కలుస్తారు. తనను కలవడానికి వచ్చే ప్రజలందరితోనూ మాట్లాడుతారు. ఇందుకు ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగోళంగా తయారైంది. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించడానికీ,  చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కూడా తెలుగుదేశం స్పష్టమైన అవగాహనతో ఉందని అంటున్నారు. గతంలో అంటే విపక్ష నేతగా జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్బంగా ఎటువంటి అనుమతులూ లేకపోయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రకు పూర్తి భద్రత కల్పించిన సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం గుర్తు చేస్తున్నది. ఈ పరిణామాలన్నీ గమనించిన సర్కార్ ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కింద పడ్డా మాదే పై చేయి అని చెప్పుకునేందుకు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, నిబంధనలను మీరరాదనీ షరతులు విధించింది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు జోకులు పేల్చుతున్నాయి. ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చాలి అని గతంలో విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా అని ప్రశ్నిస్తున్నాయి. సంయమనంతో అంశాల వారీగా విశ్లేషణాత్మక విమర్శలు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చేస్తారనీ, అవి రెచ్చగొట్టేవిగా ఉండవనీ, జగన్ దుష్టపాలనను ప్రజలకు అవగతమయ్యేలా వివరణాత్మకంగా ఉంటాయనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర శాంతియుతంగా క్రమశిక్షణతో జరుగుతుందనీ, రెచ్చగొట్టే చర్యలూ, వ్యాఖ్యలకు పాల్పడకుండా పోలీసులు వైసీపీ గూండాలనే నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. 

టీటీడీ అనుమతితోనే తిరుమలపై డ్రోన్ సర్వే: అంగీకరించిన ఈవో ధర్మారెడ్డి

తిరుమత పవిత్రత, భద్రత విషయంలో టీటీడీకి ఇసుమంతైనా చిత్త శుద్ధి లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.  నోఫ్లై జోన్ అయిన తిరుమల కొండపై డ్రోన్ సర్వేకు సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్ధానమే అనుమతి ఇచ్చిందని తేలడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమలలో డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చింది సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానమేనని స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంగీకరించారు.   తిరమలపై డ్రోన్ సర్వేకు ఐఓసీకి అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతూ అయితే  తాము అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకూ మాత్రమే డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చామని,   టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీకి హై సెక్యూరీటీ వ్యవ‌స్థ ఉందన్నారు. అయితే డ్రోన్ ఆపరేటర్ అత్యుత్సాహంతో అనుమతించిన పరిధి దాటి చిత్రీకరణ జరిపారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాుకండా  తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలో తీసుకొస్తున్నామన్నారు. అయితే డ్రోన్ ద్వారా చిత్రీకరించారంటూ  సామాజిక మాధ్యమంలో వైరల్ అయనవి నిజమైనవేనా ఫేకా అన్నది తేలాలని ఈవో ధర్మారెడ్డి సమర్ధించుకోజూశారు. అలా కాకుండా అనుమతించిన మేర కాకుండా అత్యుత్సాహంతో పరిధి దాటి వీడియోలు తీసినట్లు తేలితే డ్రోన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే  డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  యూట్యూబ్‌లో ఉన్న వీడియోను తొలగించామన్నారు.    ‘నో ఫ్లై జోన్’గా ఉన్న తిరుమల కొండపై  డ్రోన్ వీడియో వైరల్ అయిన సంగతి విదితమే.   ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే డ్రోన్తో తిరుమల ఆలయాన్ని చిత్రించే అవకాశమే లేదని  చెప్పారు పాత చిత్రంతో యానిమేట్‌  చేశారని విచారణకు ముందే నిర్ధారించేశారు.