internal clashes between trs leaders in warangal district

ఓరుగల్లు జిల్లాలో చక్రం తిప్పబోయేది ఎవరు...

  పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.  మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.

telangana cm kcr stand on runa mafi

రైతులకు రుణాలు ఇకపై అందేనా?

  అన్నదాతా సుఖీభవ అని అన్నం తిన్న ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అనే మాట.రెండేళ్లుగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకూ క్రమంగా చరమగీతంపాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ వడ్డీ లేని రుణం వడ్డీ రాయితీలను పూర్తిగా అటకెక్కించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డినీ రైతులకూ వెనక్కిస్తారు. అంటే నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వరకూ ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్టు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులలో లక్ష రూపాయల లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు.  రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అమలుచేసింది. ఈనేపధ్యంలో మొత్తం పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఏ రైతూ గడువు లోగా చెల్లించక పోవడంతో ఎవరికి పావలా వడ్డీ లేద వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్దిలో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకూ ఆర్బీఐ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ కింద బ్యాంకు లకు నగదు జమ చేస్తూ వస్తోంది. పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణం పథకం కింద రెండు వేల పద్నాలుగు, పదిహేను ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. మే ముప్పై ఒకటి న రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు జీవో వచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా విడుదల చేయలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పది వేలకు పెంచింది. ప్రతి సీజన్ కు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చినప్పుడు ఇతర పథకాల అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీ లేని రుణం పథకాన్ని నిలిపివేశారు. రుణమాఫీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటం లేదు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి కిసాన్ క్రెడిట్ కార్డులకు లింక్ పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. మూడు శాతం వడ్డీ రాయితీని రైతుల కిస్తున్న కేంద్రం బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డి రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడుల్లో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలూ బంగారం రుణం ప్రయోజనాలు అందవు. రైతన్నకు తోడుగా ఉంటూ 'జై కిసాన్' అని ప్రముఖ్యతను ఇస్తున్న రైతులకు రుణం అందుతుందో లేదో వేచి చూడాలి.

Dronamraju Srinivas Complaint to CM Jagan on Avanthi

విశాఖ జిల్లా వైసీపీలో కోల్డ్ వార్... మంత్రి అవంతిపై జగన్‌కు ఫిర్యాదులు..!

విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

Huzurnagar bypoll a prestige issue for TRS in Telangana

ఎన్నికల సమరంలో హుజూర్ నగర్..

  తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ఏకైక ఉప ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంపైనే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఒక్క సీటు కోసం అధికార టీఆర్ ఎస్ పార్టీ వందల సంఖ్యలో గులాబి సైన్యాన్ని నియోజకవర్గంలో మోహరించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ మళ్లీ ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని బైపోల్ పోరుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన టిడిపి తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఒంటరిగా పోరులో నిలబడింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతోనే త్వరలో జరగబోయే మున్సిపోల్స్ కి ఆ పార్టీ సన్నద్ధం కానుంది. ఇక ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అంటూ టీఆర్ ఎస్ ప్రదర్శించిన జోరుకి బ్రేక్ వేసినా బిజెపి హుజూరునగర్ బైపోల్స్ ద్వారా తన సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సిపిఎం సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగింది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి సిపిఐ అధికారికంగా మద్దతు ప్రకటించింది. అలాగే ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ ల పర్వం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించేందుకు అధికార టీఆర్ ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రుల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు వందల సంఖ్యలో గులాబీ సైన్యాన్ని దించుతోందని సమాచారం. ఇటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టీఆర్ ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత నెల ముప్పై న నిర్వహించిన హుజూర్ నగర్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతా రాగాన్ని వినిపించారు. ఈ సభలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, దామోదర్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ వంటి నాయకుల చేసిన ప్రసంగాలు హస్తం శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. పద్మావతి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక అవసరం అని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నాలుగుకోట్ల ప్రజలకు ఒక నియంతకు మధ్య జరుగుతున్నదని ఆ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ఇంత మంది టీఆర్ ఎస్ మంత్రులు రంగంలోకి దిగడం, ప్రజలు గమనించాలన్న వారి వ్యాఖ్యలు కూడా హుజూర్ నగర్ నియోజక వర్గంలో పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్న మహిళా ఓటర్లను ఆలోచనల్లో పడేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల ఓట్ల మెజారిటీ రాకుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం విదితమే, అయితే ఆయన మాటలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నియోజక వర్గ ఓటర్ల పై ఉన్న అపార అనుభవం నాన్ లోకల్ ఓట్ల క్లారిటీ ఉత్తమ్ కు కలిసి రానున్నాయి చెబుతున్నారు. అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. అయితే క్యాడర్ బలంగా ఉన్న టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. హుజూర్ నగర్ లో గత ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కారు పార్టీకీ మెజారిటీ తగ్గే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే మొన్నటిదాకా ఒకరంటే ఒకరికి పడని కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఏకతాటి పైకి రావడం ఉత్తమ్ పద్మావతి గెలుపునకు హస్తం పార్టీకి కలిసొచ్చే శుభపరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఒక్క సీటు గెలిపించుకునేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టడానికైనా టీఆర్ ఎస్ వెనుకాడడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. శాసన సభలో ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ కలిగిన టీఆర్ఎస్ కి ఈ ఒక్క స్థానంలో గెలిచే ఎమ్మెల్యేతో వచ్చే లాభం గాని, జరిగే నష్టం గానీ ఏమీ లేదు. కేవల ఉత్తమ్ కంచుకోటలో పాగా వేస్తామని తృప్తి పడడానికి కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిందని చాటి చెప్పడానికి గులాబీ నేతలు తహతహలాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను కూడగట్టుకొని యుద్ధాన్ని తలపించేలా ఓటర్లను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఇప్పటికే కులాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను విభజించి ఆయా సామాజిక వర్గాల వారీగా నియమించిన కమిటీల నాయకుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురి కావడం చర్చ నీయాంశంగా మారింది. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 సెట్ ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 30 మంది దాకా సర్పంచ్లుండటం గమనార్హం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్లు వేశారు. కాగా ఈ నెల ఒకటి న జరిగిన స్క్రూటినీలో సిపిఎం అభ్యర్థి పారుపల్లి శేఖరరావుతో సహా నలభై నాలుగు మంది అభ్యర్ధులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ కారు పార్టీ గెలిస్తే మహిళా అభ్యర్థిని పై ఇంత అధికారం మందీ మార్భలాన్ని మోహరించారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టే అవకాశాలున్నాయి. అలాకాక హస్తం పార్టీకి విజయం దక్కితే అధికార టీఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు జోరు పెంచే యోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ గుంపులు గుంపులుగా వచ్చే టీఆర్ ఎస్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు వేచి చూడాల్సిందే.

ex tdp minister jawahar facing financial problems

కనుమరుగైన నాటి ఎక్సైజ్ శాఖామంత్రి...

  ఆ పార్టీ అధినేతకు అత్యంత విధేయుడు, పార్టీ పట్ల అంకితభావం కలిగిన నేత, అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీగళాన్ని ఎప్పటికప్పుడు మీడియాలో వినిపించేవారు. అలాంటి నాయకుడు మాజీ మంత్రిగా మారిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైపోయారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏర్పడిన అసంతృప్తి ఆయనను దహించి వేస్తోంది. ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి పెట్టి టిడిపిలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. నాటి ఎన్నికల్లో గెలుపొందారు కూడా అంతేకాదు నాటి సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే జవహర్ మంత్రి అయ్యే వరకు కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆయనతో ఉన్నాయి. మంత్రి పదవి వచ్చిన తర్వాత మాత్రం నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. స్థానికంగా కొందరు నేతలు జవహర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం హైకమాండ్ మొగ్గలోనే తుంచి వేయకపోవడంతో అది పెరిగి పెద్దదైంది. ఎన్నికల నాటికి ఈ వివాదం జవహర్ కు టికెట్ ఇవ్వొద్దనే వరకూ వెళ్ళింది. చంద్రబాబు దగ్గర కూడా అసంతృప్త నేతలు వెళ్ళి జవహర్ కు టికెట్ ఇవ్వొద్దని కోరారు. కానీ చివరి నిమిషంలో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి మార్చింది పార్టీ హైకమాండ్. నిజానికి ఆయన జన్మస్థలం తిరువూరు నియోజకవర్గమే అయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎదిగింది మాత్రం కొవ్వూరులోనే, ఇప్పటి వరకు తిరువూరు టిడిపి ఇన్ చార్జి గా ఉన్న నల్లగట్ల స్వామి దాసు జవహర్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారట. ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేసినప్పటికీ జవహర్ పరాజయం పాలయ్యారు. కొవ్వూరులో పోటీ చేసిన అనిత కూడా ఓడిపోయారు.  ఇదిలా వుంటే ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలనే హైకమాండ్ చెప్పడంతో అప్పులు చేసి తెచ్చిన జవహర్ ఇప్పుడు ఆ రుణం తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటు తనకు కొవ్వూరు లేదా తిరువూరులో ఏదో ఒక నియోజక వర్గాన్ని ముందే ఖరారు చేస్తే తాను రాబోయే ఎన్నికల నాటికి ఆ నియోజక వర్గంలో పనిచేస్తాననీ కేడర్ ను పటిష్ఠం చేసుకుంటానని ఆయన అధిష్టానం వద్ద ప్రతిపాదించారని సమాచారం. ఇంకా చాలా సమయం ఉంది కదా అని అగ్రనేతలు ఆ విషయాన్ని దాటవేశారు. ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయ ఉద్యమాల గురించి వచ్చిన తనకు ఎదురైన పరిస్థితి పై జవహర్ ఆవేదన చెందారు. తన బాధను అగ్రనేతలందరి వద్ద వ్యక్తం చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు జవహర్ దూరంగా ఉన్నారు. అటు ఆర్ధిక ఇబ్బందుల చుట్టుముట్టడం ఇటు రాజకీయంగా భవిష్యత్ కూడా కనిపించకపోవడంతో ఆయన డీలా పడ్డారు. రాజకీయాలకు దూరంగా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరితే నెలకు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల వరకు వేతనం వస్తుందని జవహర్ నేరుగా సహచర నేతల వద్ద వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కాస్తా పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు సూచన మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు జవహర్ తో ఫోన్ లో మాట్లాడి బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జవహర్ ఆవేదన చల్లారలేదని, ఇటీవల ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసి ఉపాధ్యాయ వృత్తి లోకి వెళితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. గుంటూరులో ఉన్న తన ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారని, అయితే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో తక్కువ ధరకు అడుగుతున్నారని పార్టీ నేతలు వద్ద ఆయన చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుకు తానేప్పుడ్డు విధేయుడినే అని ఉద్యమాల నుంచి వచ్చిన తనను విస్మరించడం భవిష్యత్ పై భరోసా ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోందని ఆయన బాహాటం గానే చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరమైన జవహర్ తో అగ్రనేతల సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.

is chandrababu campaign for tdp in huzurnagar by poll

హుజూర్ నగర్ లో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది?

  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు. దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Will Revanth Reddy Campaign In Huzurnagar Bypoll

హుజూర్ నగర్ లో కనిపించని రేవంత్? కాంగ్రెస్ కు ఊహించని నష్టం తప్పదా.!

  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు.  ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.

ycp leaders may campaign for trs in huzurnagar

టీఆర్ఎస్ కోసం రంగంలోకి వైసీపీ..! హుజూర్ నగర్ లో కుల రాజకీయం

  హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట.  హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

Power cuts to continues in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ కోతలు

  ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది. ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

Undavalli Arun Kumar Shocking Comments on YS Jagan Ruling

ఉండవల్లి నోట తిరుగుబాటు మాట... జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?

  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.

clashes between khammam district trs leaders

కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.

ys jagan in trouble with grama sachivalayam recruitment

కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు. ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Sakshi Employees Happy On CM YS Jagan

సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది... ఇక మిగిలింది కొమ్మినేని ఒక్కరే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది. ఒకరి తర్వాత మరొకరికి కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లను మించిన జీతాలు, సౌకర్యాలతో కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత సాక్షి ఉద్యోగులు కృష్ణమోహన్, హరికృష్ణలను సీఎంవోలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ జర్నలిస్టు దేవుపల్లి అమర్ ను జాతీయ మీడియా - ఇంటర్ స్టేషన్ మీడియా సలహాదారుగా నియమించుకుని నెలకు దాదాపు 4లక్షల జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక ఇఫ్పుడు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. అయితే, రామచంద్రమూర్తి కూడా తెలంగాణ జర్నలిస్టే. అయితే, వీళ్లందరికీ సాక్షిలో ఏ స్థాయిలో జీతాలు ఇచ్చారో తెలియదు కానీ, ప్రభుత్వం మాత్రం 4లక్షలపైనే వేతనమిస్తూ, అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తోంది. ఇక వీళ్లే కాకుండా, పీఆర్వోలుగా, ఫొటో-వీడియోగ్రాఫర్లుగా, ఆఫీస్ బాయ్ లుగా దాదాపు 150మంది సాక్షి ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ డిజిటల్ మీడియాలోకి మరో 150మంది సాక్షి ఉద్యోగులనే తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సజ్జల, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్, హరికృష్ణను వివిధ హోదాల్లో నియమించుకుని, పలువురికి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... వీరభక్తుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు మాత్రం అన్యాయం చేస్తున్నారనే మాట వినిస్తోంది. తెలంగాణ జర్నలిస్టులందరికీ పెద్దపీట వేసిన జగన్..... అసలుసిసలు ఆంధ్రా జర్నలిస్టుకు మాత్రం ఇంకా ఎందుకు పదవి ఇవ్వలేదని అంటున్నారు. సాక్షిలో పెద్ద తలకాయలందరికీ దాదాపు పదవులిచ్చేశారు... ఇక, కొమ్మినేనికి కూడా ఏదోఒక కీలక పదవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరి వీరభక్తుడికి జగన్ ఏ పదవి కట్టబెడతారో చూడాలి.

ntr health university cv rao resigns

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణాల్లో ఒకటని అంటారు. ఇక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో... రెడ్డి కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50శాతం కోటా అంటూ చట్టం తెచ్చినప్పటికీ, కీలక పదవుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే పెద్దపీట దక్కుతుందనేది ఆరోపణ. అయితే, ఈ కుల రాజకీయాలు... విశ్వవిద్యాలయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో ఇఫ్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, ఆ సామాజికవర్గ ప్రముఖులు.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పాగా వేయడానికి సిద్ధమయ్యారట. అందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సీవీరావును తప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఎందుకొచ్చిన తలపోటని సీవీరావు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇష్యూ... సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అతిత్వరలోనే, వీసీ సీవీరావును తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్వయంప్రతిపత్తి కలిగిన వైద్య విశ్వవిద్యాలయంపై వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారి అప్పుడే తనదైన శైలిలో పెత్తనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ముందు పెద్ద తలకాయలను తప్పిస్తేనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తాము అనుకున్నది చేయగలుతామని నిర్ణయానికి వచ్చిన జగన్ సామాజికవర్గ నేతలు, అధికారులు.... ముందుగా వీసీని వెంటనే తప్పించాలని జగన్ పై ఒత్తిడి పెంచారట. అంతేకాదు, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తొలగించాలని జగన్ సామాజికవర్గం డిమాండ్ చేస్తోందట. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలపై అక్కడి అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన సీవీరావును వీసీగా తప్పిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, యూనివర్శిటీ పేరు మార్చుతారన్న ప్రచారంపైనా ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.

ys jagan following chandrababu

చంద్రబాబు బాటలో జగన్... వన్‌మ్యాన్‌ ఆర్మీలా పరిపాలన..!

చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో తాను దూసుకుపోతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు... తన స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారట. అంతేకాదు తన అంచనాలు ఒకలా ఉంటే... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందని జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ ఫైరయ్యారట. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా మనమేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు... అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ క్లాస్ పీకారట. అయితే, జగన్ స్పీడ్‌ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. దాంతో ఒక్క సీఎం తప్పా...మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని, అదే సమయంలో పరిపాలన మొత్తం జగన్ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సాక్ష్యాలతో దొరికిన ఆమంచి.. సొంత పార్టీ వ్యక్తి పైనే దాడి!!

  చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులని వార్తలొచ్చాయి. అంతేకాదు అసలు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి.. ఆమంచి మరియు అతని అనుచరుల అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జున రెడ్డి కూడా తనపై.. ఆమంచి బంధువులు, అనుచరులు దాడి చేశారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆమంచి మాత్రం ఇదంతా పచ్చి అబద్దం, ఇది టీడీపీ ఆడిస్తున్న నాటకం అని కొట్టి పారేసారు. అంతేకాదు.. 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు. ఇటీవల ఎన్నికలలో టీడీపీ ఏజంట్‌ గా పనిచేసాడు. టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.' అని ఆమంచి చెప్పుకొచ్చారు.   అయితే ఆమంచి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అబద్దమని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఆధారాలు దర్శనమిస్తున్నాయి. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదని ఆమంచి అన్నారు. కానీ ఆమంచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, అదే పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థలో నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసారు.     అదేవిధంగా నాగార్జున రెడ్డి.. ఎన్నికలలో ఏజంట్‌ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ.. ఆయన పనిచేసింది టీడీపీ కోసం కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నాగార్జున రెడ్డి టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి చెప్పుకొచ్చారు. కానీ నిజానికి నాగార్జున రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతెందుకు వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.     మరి ఇవన్నీ తెలియకుండానే 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు, టీడీపీకి చెందిన వ్యక్తి' అని ఆమంచి వ్యాఖ్యలు చేసారా?. ఏది ఏమైనా ఆధారాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమంచిని ఏకేస్తున్నారు. అంతేకాదు ఆమంచి కుటుంబం మీద ఉన్న కేసుల లిస్ట్ ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమంచి తండ్రి మీద.. హత్య, దొంగసారా మరియు హత్యాయత్నం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి సోదరుడిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి వర్గీయలు చీరాలలో పలువురిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై గతంలో కూడా ఆమంచి సోదరుడు, అనుచరులు దాడి చేసాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమంచి వర్గీయులే తన మీద దాడి చేసారని నాగార్జున చెప్తున్నాడు. కానీ ఆమంచి మాత్రం సింపుల్ గా.. అతను జర్నలిస్ట్ కాదు, టీడీపీ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యక్తి అయితే జగన్ తో పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ఆమంచి మరియు అతని వర్గీయులపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. చీరాలలో వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటున్నారు. ఆమంచి మరియు అతని వర్గీయులు చీరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా సగానికి సగం కోత... అన్నదాతలకు జగన్ సర్కారు షాక్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే... కోటలు దాటుతున్నాయ్. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటపెడుతున్నారు. అమ్మఒడి పథకం నుంచి రైతుభరోసా పథకం వరకు అన్నింటా ఇదే జరుగుతోంది. వైసీపీ నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... లబ్దిదారులను సగానికి సగం తగ్గించేందుకు వడపోత ప్రారంభించారు. అక్టోబర్ నుంచే వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్... మార్గదర్శకాల పేరుతో అన్నదాతలకు ఊహించని షాకిచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో సర్కారు ప్రకటించిన లబ్దిదారుల సంఖ్య... సగానికి సగం తగ్గిపోయింది. కౌలు రైతులతో కలుపుకొని 64లక్షల పైగా(రైతులు 48.7లక్షలు, కౌలు రైతులు 15.37లక్షలు) సాగుదారులు ఉన్నారని, వారందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్న జగన్ సర్కారు... గైడ్ లైన్స్ అండ్ వడపోత తర్వాత ఆ సంఖ్యను దాదాపు 36లక్షలకు కుదించేసింది. ఎన్నికల టైమ్ లో ప్రతి రైతుకూ 12వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.... ఇఫ్పుడు కేంద్రం ఇస్తోన్న 6వేలు పోను... మిగతా 6500లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, కేంద్రం అమలు చేస్తోన్న గైడ్ లైన్స్ నే జగన్ సర్కారు కూడా ఫాలో కావాలని నిర్ణయించింది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం లబ్దిదారుల సంఖ్య  29.45లక్షలకు పడిపోయింది. ఎన్నికలవేళ కేంద్రం మొదటగా ఏపీలో దాదాపు 43లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ మనీ జమచేయగా, రెండో విడతకు వచ్చేసరికి పలురకాల కండీషన్స్ తో లబ్దిదారుల సంఖ్యను 33లక్షలకు తగ్గించేసింది. ఇక మూడో విడత వచ్చేసరికి ఆ సంఖ్య 29.45లక్షలకు పడిపోయింది. కేవలం మూడే మూడు నెలల్లో గైడ్ లైన్స్ పేరుతో ఏకంగా పదమూడున్నర లక్షల మంది రైతులను అర్హుల జాబితాలో నుంచి తొలగించేసింది. అయితే, కేంద్రం ఇస్తోన్న సొమ్ముతో కలిపే 12వేల 500 ఇస్తామంటూ మెలిక పెట్టిన జగన్ సర్కారు... అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టింది. కేంద్రం ఎవరి ఖాతాల్లో అయితే, మూడు విడతల్లో 6వేల రూపాయలు జమ చేసిందో... వాళ్లకే మిగతా ఆరున్నర వేలు వేయనున్నట్లు తెలుస్తోంది. సొంత భూమి కలిగిన రైతుల విషయంలో గైడ్ లైన్స్ ఇలాగుంటే, ఇక కౌలు రైతుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో, మొత్తం 12వేల 500 తామే ఇస్తామంటోంది జగన్ సర్కారు. అయితే, గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో కౌలు రైతుల సంఖ్యను కూడా 16లక్షల నుంచి ఐదారు లక్షలకు తగ్గించి, పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో వైఎస్సార్ రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టిన జగన్ సర్కారు... కేవలం 30లక్షల్లోపు రైతులకే సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.

లింగమనేని వర్సెస్ జగన్ సర్కార్... ఏపీలో కరకట్ట రాజకీయం...

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసముంటోన్న లింగమనేని రమేష్‌ ఇల్లు కూల్చివేత నోటీసులపై వైసీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తన ఇంటిని పక్కా నిబంధనలను పాటించే నిర్మించానని లింగమనేని చెబుతుంటే... రమేష్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు తన ఇంటిని కూల్చివేయవద్దంటూ సీఎం జగన్‌కు లింగమనేని లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై గెస్ట్‌ హౌస్ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన లింగమనేని రమేష్‌.... అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే, నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూల్చివేతల వల్ల తన ఒక్క కుటుంబమే ప్రభావితం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అవుతారన్నారు. నిర్మాణాల కూల్చివేత... రాజధాని ప్రాంతంలో లక్షలాది మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిందన్నారు. ఉండవల్లి అతిథిగృహానికి 2012లోనే చట్టపరంగా అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్‌ శాఖలోని కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నామని, 2014లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్‌ హౌస్‌ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందుల్లేవన్నారు. లింగమనేని లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఘాటుగా రియాక్టయ్యారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే... తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే... ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ లేఔట్లతో ప్రభుత్వ భూములను లింగమనేని ఎలా కొల్లగొట్టారో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మొత్తానికి కరకట్టపై కూల్చివేతల రాజకీయం రోజురోజుకీ హీటెక్కుతోంది. మరోవైపు లింగమనేని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ షాక్...

తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని నిర్ణయిస్తూ ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తమ కుమార్ రెడ్డి తన సతీమణి కి కాంగ్రెస్ టికెట్ కేటాయించి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి కి సోనియా గాంధీ షాకిచ్చారు. రేవంత్ రెడ్డి తన అనుచరుడు అయిన శ్యామల్ కిరణ్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ కి నివేదించుకున్నా సోనియగాంది కనికరం చూపలేదు. దీంతో పిసిసి లో ఉత్తమ్ మాటకు తిరుగులేదని తేలిపోయింది. హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోదాడ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. కోదాడ నుంచి టీ.ఆర్.ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపొందారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ అక్టోబర్ ఇరవై నాలుగున జరగనుంది. ఇక టీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైది రెడ్డిని సీ.ఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదురెడ్డికి సీఎం కేసీఆర్ బీఫారం కూడా అందజేశారు. ఆయన గత ఎన్నికలకు ముందు ఎన్నారై గా ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖగా ఉన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదన్న చర్చలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ ఖాయమని ప్రకటించాడు. దీంతో టీ.ఆర్.ఎస్ ఈ ఎన్నికను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఉత్తమ్ సొంత కోటాలో గులాబీ జెండా ఎగరవేసేందుకే టీ.ఆర్.ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మధ్యలో బిజెపి సైతం గణనీయంగా ఓట్లు సాధించేందుకు రెడీ అవుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కేసీఆర్ కు సవాల్ గా మారింది.