థైరాయిడ్ కి చికిత్స వచ్చేసింది..

మెటబాలిజం సమస్యకు  పరిష్కారం దొరికింది  అంటున్నారు వైద్యులు .. థైరాయిడ్  వల్ల   వచ్చే ఊబకాయం ,హైపో థైరాయిడ్, డయాబెటీస్   వంటి సమస్యలకు  .           యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్ వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు శాస్త్రజ్ఞులు పరిష్కారం కనుగొన్నారు. శరీరంలో   థైరాయిడ్  గ్రంధి  ఎలా నియంత్రిస్తుందో  అందరికీ  తెలుసు. మెటబాలిజం సమస్యల వల్ల శరీరంలో వచ్చే  సమస్యలు అన్నీ ఇన్నీ కావు థైరాయిడ్  హార్మోన్ సెల్స్  ఎలా పని చేస్తాయో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అవగాహన లేదనే చెప్పాలి. ఈ అంశం పై పరిశోధనలు చేస్తున్న ప్రేల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్  విశ్వ విద్యాలయం థైరాయిడ్ మిస్టరీని ఛేదించింది . ఇది కేవలం ఆన్  ఆఫ్  డి మ్మర్ గా మాత్రమే పని చేస్తుందని నిపుణులు వివరించారు .థైరాయిడ్ వల్ల వచ్చే మెటాబాలిజం ఎలా ఉంటుంది.. ఎందుకు తగ్గుతోంది. సాంకేతికంగా జీన్స్ పై స్టడి చేయడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారం. జీన్స్ ను వృద్ధి చేసాక మరిన్ని సమస్యలు అధిగమించ వచ్చని శాస్త్రజ్ఞులు ధీమా వ్యక్తం చేశారు.  థైరాయిడ్ వల్ల వచ్చే  సాంకేతిక సమస్యలు పై సమగ్ర విశ్లేషణ పూర్తి పరిశోధన అవసరమన మరిన్ని మోడల్స్ పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే కాదని రి ప్రేషన్ ఆన్ ఎన్ హన్స్ మెంట్ అఫ్ జీన్ యాక్టివిటీ  అన్న అంశంపై పరిశోదన చేస్తున్న మితచెల్ లాజెర్  డయాబెటిక్, మెటబాలిక్ ప్రొ ఫెసర్  గా పని  చేస్తున్నారు.  థైరాయిడ్ హార్మోన్ లేకుంటే  వచ్చే సమస్యలు హైపో ధైరాయిడిజం గురించి వివరించారు. మాలిక్యుల్ ధైరాక్సిన్  ఉత్పత్తి చేస్తుందని దీనిని 1914 లోనే  కనుగోన్నట్లు  చెప్పారు. శరీరంలో మెటాబాలిజంకు కారణం ధైరాయిడ్ అన్న విషయం ఎన్ డ్రో క్ర నాల జిస్ట్ లు కనుగోన్నారు. దీని వల్ల వచ్చే సమస్యలు హై కొలస్ట్రాల్ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ సమస్యలు ఈ సమస్యకు ఎక్కువ మొతాదులో మందులు వాడాల్సిఉంటుంది. హార్మోన్ అని తీరుపై 4 ౦ సంవత్సరాలుగా పని చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ రీసేప్టర్  పని చేసే తీరు ను పరిశోదన కష్ట సాధ్యమని అయితే డి ఎన్ ఎ ద్వారా ధైరాయిడ్ హార్మోన్లు ఎలా వస్తాయో గుర్తించారు. డాక్టర్ ఎహుదా  లాజర్  ల్యాబ్  లో అమర్చిన ఒక బ్యాగ్ ను అమర్చారు . మేటాబాలిక్  హార్మోన్ ప్రభావం ఎక్కువగా లేదని తేల్చారు. టి ఆర్ బి ద్వారా ధైరాయిడ్ పని తీరును తెలుసు కోవాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పూర్తి పరీక్షల అనంతరం  దీని  వినియోగిస్తామని క్లినికల్ ట్రైల్స్ వచ్చిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. 

గర్భానికి కాలుష్యం దెబ్బ

వాయు కాలుష్యం వల్లే దక్షిణ ఆశియలో గర్భం కోల్పోతున్నారని పరిసోదనలు వేల్లదిస్తునాయి. దక్షిణ ఆశియలో 3 ౦ % మహిళలు గర్భం కోల్పోతున్నారని అందుకు కారణం కేవలం కలుషిత వాతావరణమే అని నిపుణులు తేల్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ దేశాలలో  వాయు కాలుష్యం నాణ్యత గణనీయంగా పడి పోయిందని డబ్ల్యు హెచ్ ఓ  పేర్కొంది. వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మొగిస్తోందని ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకో వలసిన అవసరం ఉందని నిపుణులు తమ పరిశీలనలో పేర్కొన్నారు.  దక్షిణా ఆశియాలో  గర్భిణీలు ప్రపంచం లోనే అత్యంత ప్రమాద కరమైన  దరిద్రమైన వాయుకాలుష్యం వాతావరణం లో మగ్గి పోతున్నారని ఇది దుర  దృష్ట కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది.   డబ్ల్యు హెచ్ ఓ చెప్పిన ప్రమాణాల కన్నా అత్యధిక వాయు కాలుష్యం ఉన్నదన్న విషయాన్ని గమనించి నట్లు నిపుణులు ఈ ప్రభావం వల్లే 3 ౦ % మహిళలు గర్భం కోల్పోవడం  బాధాకరమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. ల్యన్సర్ ఫ్లా నెట్ హెల్త్  లో ఈ అంశాన్ని ప్రచురించారు. 2 ౦ ౦ ౦ - 2 ౦ 1 6 లో ఈ పరిశీలన చేసినట్లుతెలుస్తోంది.ఎపిడమాలజీ  విధానం ద్వారా పి ఎం లెవెల్స్  పరిశీలించారు. వాయు కాలుష్యం తీవ్రత  2 .5 మైక్రాన్లు గా ఉందని కనుగొన్నారు.  వాయుకాలుష్యం వల్ల గర్భ విచ్చిన్నం కావడం, గర్భం దాల్చక పోవడానికి  2 ౦వారాలు పడు తోంది. ఇరవై రోజుల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం జరిగి పోడానికి కారణం   పుతిన వెంటనే చని పోవడం జరగడం పట్ల నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.  పుట్టిన పిల్లలు వారంలోనే చని పోవడాన్ని తీవ్ర పరిణామంగా పేర్కొన్నారు.  బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్,లలో సంవత్సరానికి 2 9 . 7% గర్భం దాలుస్తున్నారని   ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా 2 . 5 % మైక్రాన్ లెవెల్స్ పెరిగి పోయిందని. దీని వల్ల 3 5 % గర్భ నిరోధం  జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.  ఈ పరిశోధన డెమోగ్రాఫిక్  హెల్త్ సర్వ్ ప్రకారం  పరిశీలించి నట్లు నిపుణులు పేర్కొన్నారు. taoxueపోస్ట్ డాక్టర్ రీసెర్చర్ గా పని చేసారు. ఇన్స్టిట్యుట్ ఆఫ్ రిప్రోడక్టివ్ చైల్డ్ హెల్త్  హెల్త్ కీల్యాబో రెట్రీ రేప్రోదక్టివ్ హెల్త్ పికింగ్ యునివర్సిటీ  టోన్ హెల్త్ ప్రతి నిధి తో మాట్లద్దరు'  వాతా వరణ కాలుష్యం నియంత్రణ కు నూతన విధానం రూపకల్పన చెయడ పెద్ద సవాల్ అని టావో   పేర్కొన్నారు. గర్భం కోల్పోడానికి లెక్క పెట్ట లేనన్ని కారణాలు  కొన్ని  వాస్తవాలు  వెలుగు చూసాయని అన్నారు.   కుటుంబ నియంత్రణ  పద్దతులు అవసరం లేకుండానే నియంత్రణ తీవ్ర ఆందోళనకు  గురి చేస్తోందని కొంత మందిలో సాధారణం  గానే జన్మ నివ్వ  డం గమనించామని   తెలిపారు. వాయు కాలుష్యం 2. 5 % మైక్రాన్లు అంతకు మించి  ఎక్కువగా పెరిగితే  గర్భ విచ్చిత్తి, అబార్షన్ లు వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి.  వాతావరణం లో కాలుష్యం కీలక అంశం గా పేర్కొన్నారు. గర్భిని స్త్రీలు ఎదుర్కొంటున్న  గర్భ విచ్చిత్తి మరణాలు నియంత్రణ కావాలంటే  వాతావరణ వృద్ధి విధానాన్ని అమలు చేయాలని దీని వల్ల ఒత్తిడికి గురికావడం గర్భం తోనే మరణించడం వంటి సమస్యల నుండి బయట పడాలంటే దీని కోసం అయ్యే ఖ   ర్చు పెర్గి పోవడం స్త్రీలకు ఇచ్చే మెటర్నటీ హెల్త్  సెలవులు ఇవ్వడం అత్యవసరమని నిపుణులు సూచించారు.   ఒచ్చే ఆదాయం అంతంత మాత్రం కావడం వల్ల పెరు గు తున్న కాలుష్య ప్రమాదం పొంచి ఉందని వీటి పై సత్వర చర్యలు చెప్పడడం అవసరమని భారత్ కు చెందిన లలిత్ ధన్ దోనా పరిసోదనలు  పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాకు ప్రభుత్వ ప్రైవేటు భాగ స్వామ్యంలో నడుస్తున్న సంస్థ కాలుష్యం ప్రజా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యాక్తం చేసారు. కాలుష్యం  పెరిగితే  ఇతర అనారోగ్య సమస్యలు పెరిగి  మరణాలు సంభావించ వచ్చని నిపుణులు ఆభి ప్రయ పడ్డారు. సో మనుషులు కలుషిత మైనా సమాజానికి ముప్పు, వాతావరణం కలుషిత మైన ప్రజలకు ముప్పు. సచిన్ టి ఫిక్ గా ఆలోచించకండి కాస్త ప్రజా ఆరోగ్యం పట్ల ఆలోచించండి. 

చర్మ క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్..!

ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారా.. చర్మం పై ఎర్రని దద్దుర్లు, మంట పుడుతుందా.. అయితే కాస్త జాగ్రత అంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండేలాని సూచిస్తున్నారు. అంతే కాదు చర్మ సమస్యలతో బాధ పడుతున్న వారు విటమిన్ బి3 ఎక్కువగా తీసుకోవడంతో చర్మ క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం...   సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిదే. అలాగని ఎక్కువ సేపు ఎండలో ఉండటం మాత్రం అంత సురక్షితం కాదు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి వెలువడే అతి భయానక అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఇది కొందరిలో చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అయితే, తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.   ఇటలీకి చెందిన పరిశోధకులు నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన కొన్ని కణాలు (కెరాటినోసైట్స్) ఐసోలేట్ చేశారు. ఈ కణాలకు మూడు రకాల సాంద్రతలతో ట్రీట్మెంట్ చేశారు. నికోటినామైడ్ (NAM), విటమిన్-B3లను అందించి 18 నుంచి 48 గంటలు యూవీబీ కిరణాల ముందు ఉంచారు. ఫలితాల్లో.. యూవీ వికిరణీకరణానికి ముందు 25 మైక్రోన్ల NAMతో ప్రీట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల యూవీ ప్రేరిత ఆక్సీకరణ వల్ల కలిగే ఒత్తిడి, డీఏయే డ్యామేజ్ నుంచి చర్మ కణాలకు రక్షణ లభించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ స్టూడెంట్ లారా క్యామిల్లో మాట్లాడుతూ.. విటమిన్ బీ3 వినియోగం పెంచినకొద్ది చర్మం యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు తగ్గు ముఖం పట్టాయి. అయితే, విటమిన్‌-బీ3 రక్షణ ప్రభావం తక్కువ. కాబట్టి.. సూర్యరశ్మి సోకడానికి 24 లేదా 48 గంటల ముందు తీసుకోకూడదు అని తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యూవీ క్యాన్సర్‌కు గురయ్యే బాధితులకు ఊరటనిస్తోంది.

గుండెల్లో మంట.. అది కాన్సర్ కావచ్చు!

మీరు దీర్ఘ కాలంగా గుండెల్లోమంటతో బాధ పడుతున్నారా...  అయితే అది ఎసొఫెగల్ లారెక్ష్స్ కాన్సర్ కావచ్చు అంటున్నారు నిపుణులు.  దీర్ఘ కాలంలో గుండెల్లో మంటగా ఉంటె అది క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. యు ఎస్ ప్రభుత్వం నిర్వ హించిన పరిశీలనలో ఈ విషయం బయట పడింది. 50 సంవత్సరాలు పై బడినవారిలో నిర్వహించిన సర్వేలో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ సమస్య ఉంటె వారిలో రెండు ఇంతలు క్యాసర్ వచ్చే అవకాశం  ఉందని దీనీని ఎసోఫేగస్, లేదా లారీ ఎన్ ఎక్ష్ వాయిస్ బాక్స్ పోయేందుకు దోహద పడుతుంది. ఎప్పుడైతే పొట్టలో ఉండే యాసిడ్‌లు  మాయమై ఎసోఫెగస్ కు చేరుతాయో మాస్క్యులర్ ట్యూబ్ ద్వారా గొంతుకు కనక్ట్ కావడం వల్ల గుండెల్లో మంటరావడం సహజం.  అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటె వారిలో 20% అమెరికన్ ప్రజలలో ఉన్నట్లు గుర్తించారు.  నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్  దీనిని ఎడినా కాసినోమా లేదా ల్యారీన్ జీల్ కాన్సర్ గా నిర్ధారించారు. ఇది వాయిస్ బాక్స్ లో వస్తుంది. అయితే దీని వల్ల  పెద్దగా ప్రమాదం లేకపోయి నప్పటికీ ఇది క్యాన్సర్ గా మారదని జి ఆర్ డి పై పరిశోదన కేవలం ప్రజలను అప్రమత్తం చేసేందుకే అని అన్నారు.  క్రి స్టాన్ అబ్ నెట్ యు ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ చెందిన ఈ బృందానికి నేతృత్వం వహించారు. సెల్ కార్సినోమా సహజంగా ఉండేదే అని ఎసోఫెగల్ క్యాన్సర్ కు దానికి గల సంబంధం తెలుసుకోవాలని అన్నారు. 

ఆరోగ్యం దుమ్ముకొట్టుకుపోతోంది

మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్‌ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి.   పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట.      వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్‌ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది.   తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం.     దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.

ఒక్క యాపిల్‌తో 9 రకాల లాభాలు

ఒక్క యాపిల్ పండు తింటే చాలు శరీరానికి9 రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో ఏ పద్దతిలో పండించిన యాపిల్‌నైనా తింటే చాలు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. ప్రపంచంలో ఉత్తమ మైన పండు ఏది అని అంటే మాత్రం యాపిల్ అని అందరు అంటారు. ప్రపంచం లో 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయని నిపుణులు పేర్కొనారు. యాపిల్ ను ముక్కలు కోసుకుని తిన్నా లేదా యాపిల్ మొత్తంగా తిన్నా, జ్యుస్ తీసుకుని తాగినా, ఒక్కో యాపిల్‌లో 80 క్యాలరీల ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. 1 గ్రాము న్యుట్రీన్ 19 గ్రాముల సహజ మైన చక్కెర ఫ్యాట్ సోడియం  కొలస్ట్రాల్ ఉండదు. యాపిల్ లో 2/3 వంతుల పీచు పదార్ధం ఉంటుంది. అది మీ ఆహారం అరుగుదలకు ఉపయోగ పడుతుంది. యాపిల్ పైన ఉండే తళ తళ లాడే తొక్క యాంటీ ఆక్సిడెంట్ సబ్ స్టన్స్ గా పని చేస్తుంది. మీ ఇతర సెల్ల్స్ ద్వారా వచ్చే డ్యామేజ్ ని క్యాన్సర్ ను నివారిస్తుంది. గుండె సంబందిత సమస్యలను నివారిస్తుందని నిపుణులు తేల్చారు.  అయితే  తినే ముందు యాపిల్ ను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి తినాలని సూచించారు. యాపిల్ ద్వారా వచ్చే ఫ్లవో నోయిడ్స్ సెల్ ను రక్షిస్తుంది. మీ మెదడులో  జ్ఞా  పక శక్తి  ని తగ్గించే అల్జీమర్స్  వ్యాధిని  యాపిల్ నివారిస్తుంది. మెదడులో  జరిగే  రక రకాల  డ్యామేజి లను  నివారించేందుకు యాక్సిడెంట్  శాతం  చాలా  ఎక్కువగా  ఉంటాయి. ఒక పరిశోదనలోయాపిల్ జ్యూస్  అతనిలో వారి ప్రవర్తన  మూడ్ ను  గమనించామని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఫ్యంక్రియటిస్, క్యానర్ ను నివారిస్తుంది. యాపిల్ నుండి వచ్చే  ఫ్లవొనొయిడ్స్ వాతా వరణం లో  హాని చేసే  వివిధ రకాల రసాయనాల నుండి యాపిల్ రక్షిస్తుంది.  శరీరంలో చర్మం కణాలు అందులో ఉండే రసాయనాలు బ్రెయిన్ సెల్ల్స్ , ఫ్యంక్రియా టిక్  సెల్ క్యాన్సర్ రాకుండా కాపాడు తుంది. ఇంకా వీటి పై  పరిశోధన  కోన సాగిస్తున్నారు. ఫ్యంక్రియాస్ విడుదల చేసే ఇన్సూలిన్ సరిగా లేకుంటే వచ్చే టైప్ 2  దయాబె  టిస్  ఫ్లవో నోయిడ్స్ ఫ్యాంక్రియాస్ ను  ఆరోగ్యంగా  ఉంచుతుంది. టైపు 2 డయాబెటిస్ ను  కొంత వరకు  రిస్క్  తగ్గిస్తుంది.      రోజుకు2  కంటే ఎక్కువ యాపిల్స్ తింటే  2 8 % డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.  ఒక యాపిల్  లో  3 గ్రాముల పీచుఉంటె మీ ఆహారం అరుగుదల  కు ఉపయోగ పడు తుంది. ఆకలి వేసినప్పుడు ఒక యాపిల్ తింటే బరువు తగ్గి పోయే అవకాశం ఉందని తెలిపారు. కొలస్ట్రాల్ క్యాన్సర్.   రోజుకు ఒక్క యాపిల్ తిన్న వారిలో కాలాన్ క్యాన్సర్  వచ్చే అవకాశం తక్కువే అని ఫ్లవొనొయిడ్స్  వాళ్ళ ఇపెద్ద పేగులు, చిన్న పేగులు, ఆరోగ్యంగా ఉంచు తాయి. గట్ హెల్త్ ----  యాపిల్ నుంచి వచ్చే పెక్టిన్ లో బల మైన పీచు పదార్ధం  మీ డైజేస్టివ్ సిస్టం  ను కాపాడు తుంది. మన శరీరం లో కి పెరు గు  ద్వారా  వచ్చే  బ్యాక్టీరియా ను పెక్రి యాస్ క్యాన్సర్  ను నిరోదిస్తుంది.  బరువు తగ్గించేందుకు యాపిల్ దోహదం చేస్తుంది----- ఒక యాపిల్ లో 3 గ్రాముల  పీచు పదార్ధం ఉంటుంది. మీ అరుగుదాలను పెంచు తుంది. దీర్ఘ కాలం పాటు  ఆకలి లేకుండా చేస్తుంది. అయితే చాలా తక్కువ శాతం గ్లై సిమిక్ ఉండడం వల్ల  ఇది మీ శరీరంలో చక్కర శాతాన్ని పెంచు తుంది.  అది ఇంకా మీ ఆకలిని పెంచు తుంది.  దీనిని ఒక  స్నాక్ గా తీసుకుంటే అది మీ బరువును  తగ్గించడంలో   ఉపక రిస్తుంది.                    గుండె ను ఆరోగ్యంగా ఉంచేది యాపిల్.. ఒక ల్యాబ్ లోనిర్వహించిన పరీక్షలో కొన్ని రకాల మొక్కల లోని ఉన్న రసాయనాలు పెక్టిన్ యాపిల్ లో ఉండే పీచు పదార్ధం గుండెను, రక్తనాళాన్ని  కణాలను డ్యామేజ్ చేయకుండా సహక రిస్తుంది. పెక్టిన్ పీచు పదార్ధంl d c అంటే చెడు కొలస్ట్రాల్ వల్ల ఆర్తరైటిస్, హార్ట్ డిసీజ్, కు దారి తీసుస్తుంది. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్.. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్ ఎంతో ఉప యుక్తమని అంటున్నారు వైద్యులు. యాపిల్ లేదా ఇతర పండ్లు కూరాగాయలు శరీరంలో ఉండే ఇంఫ్లమేషన్ కు వ్యతి రేకంగా ఆస్తమా కు వ్యతిరేకంగా ఇతర ఊపిరి తిత్తుల సమస్యలను యాపిల్ పూర్తిగా ఉపయోగ పడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణగా గర్భ వతిగా ఉన్న మహిళకు యపిల్ ను తిని పిస్తే ఆమె ప్రసవించిన పిల్లలకు ఆస్తమా లక్షణాలు లేక పోవడం గమనించామని నిపిణులు తేల్చి చెప్పారు. ఎవరైతే తక్కువ పండ్లు ఫలాలు తీసుకుంటారో, వారికీ ఆస్తమా వచ్చే అవకాశం తాక్కువే అని తేల్చారు.  యాపిల్ ఇమ్యూన్ బూస్టర్... శరీరం లో ఇమ్యునిటి లేక ఇబ్బంది పడు తున్న వారికీ  శుభ వార్త. ఇమునిటీ పెరగ దానికి  ఒక ఒక బత్తాయి మాత్రమే కాదు. యాపిల్ లో 1 ౦ % విటమిన్ సి  ప్రతి రోజూ ఇస్తుంది. యాపిల్ లో ఉండేపీచు పదార్ధం ద్వారా పెక్టిం లభిస్తుంది. ఇది అత్యంత రుచికరమైన పండు మాత్రమే కాదు. ఇతర క్రిముల వల్ల మన శరీరం లోని ఇమ్యునిటీ పై దాడి చేయ కుండా  నిలువ రించేశక్తి యాపిల్ కు  ఉందని నిపిణులు స్పష్టం  చేసారు. మీరు అనా రోగ్యంతో సత మత మౌతున్నప్పుడు ఒక్క యాపిల్ తింటే చాలు. మళ్ళీ మీరు లేచి తిరగడం ఖాయం.   స్టీర్ర్ క్లియర్ విత్తనాలు.. స్టీర్ర్ క్లియర్ విత్తనాలు యాపిల్ లో ఉండే స్టీర్ క్లియర్ విత్తనాలు ఇందులో అమ్యగ్దలింగ్ ఉంటె సైనిడ్ ఉన్నట్టే. ఒక వేళ ఆవిత్తనాన్ని  అను కోకుండా తిన్న అది మీకు విషం కాదు.  సైనిడ్ ఉన్న శరీరంలో డి టాక్సీఫై  చేస్తుంది. ఆ విత్తనాలు యాపిల్ లోనే ఉంటాయి. అందుకే యాపిల్ ను తినే టపుదు జాగ్రత్తగా తినాలి. అమ్యగ్దన్ కనుక మీశరీరంలో ఉంటె చాలా జాగ్రత్తగా ఉండాలి. చదివారా   యాపిల్ వల్ల  ఎన్ని లాభాలో సో -- యాపిల్ తినండి ఆరోగ్యంగా ఉండండి.

బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స

చాలా మంది కళ్ళు తిరిగి పడి పోతే బిపి,లేదా షుగర్ వచ్చి ఉండచ్చు... లేదా హార్ట్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. అయితే  బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితలు వచ్చినా సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. గతంలో మెదడులో కణితలకు సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అప్పట్లో 50,50 మాత్రమే బతకడానికి అవకాసం ఉండేది. ఇప్పుడు వచ్చిన ఇమ్యూన్ తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ కు సైతం చికిత్స చేయవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. బ్రెయిన్‌లో వచ్చే వివిధ రకాల ట్యూమర్‌లకు ఇమ్యూన్ తెరఫీ పద్దతిని వైద్యులు కనుగోన్నారు. క్యాన్సర్  చికిత్సకు ఈ వైద్యం చేయవచ్చని అన్నారు. ఈ పద్ధతి వల్ల శరీరంలో ఇమ్యూనిటి పెరిగిందని ఈ తెరఫీ పై ల్యాబోరేట్రీలో చేసిన పరిశోదనలుమంచి ఫలితాలు ఇచ్చాయని శాస్త్రజ్ఞులు వివరించారు. ఇమ్యూన్ తెరఫీ అంశంపై వారు మాట్లాడుతూ  నూతనంగా కనుగొన్న ఇమ్యునో తెరఫీ ద్వారా మాలిగ్నెంట్, బ్రెయిన్ ట్యూమర్‌ను ఇమ్యునిటీని పెంచడం ద్వారా దీనిని సాధించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇమ్యునో తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స అంశాన్ని సెల్ జర్నల్ లో  ప్రచురించారు. ల్యబో రేట్రీలో చేసిన పరిశోదనలో ఈ చికిత్స సత్వరం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని శాస్త్రజ్ఞులు తెలిపారు. దానా ఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మసాచుసెట్స్ ఆసుపత్రి, బ్రాడ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎం ఐ టి కు చెందిన హార్వార్డ్ మాట్లాడుతూ మా లిక్యుల్ క్యాన్సర్ ను నిరోదిస్తుందని తేల్చారు. ఇమ్యూన్ సెల్ తో పోరాడడం ద్వారా తెల్ల రక్తకణాలు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్  ట్యూమర్ గా మారతాయని కనుగొన్నారు.  ట్యూమర్ నివారించేందుకు cd 1 61 malikyul resepterను కనుగొన్నామని వివరించారు. టి సెల్ల్స్ ఐసోలేట్  అయి ఫ్రెష్ బ్రెయిన్ ట్యూమర్ శాంపిల్ తీసుకుని వాటి పై ప్రయోగించామని ఈ విధానంతో ట్యూమర్ సెల్ల్స్ లేకుండా పోవడాన్ని గమనించా మని స్పష్టం చేసారు. వైరస్  వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్ లేదా ట్యూమర్ సెల్ల్స్ లేదా క్యాన్సర్ సెల్ల్స్ c d161 యాక్టివ్ కాగానే  clec2d మాలిక్యుల్  బ్రెయిన్ ట్యూమర్ సెల్ల్స్ ను నిరోదిస్తుందని. పరిసోదకులు  వివరించారు. c d 16 1  యాక్టివ్ అయిన వెంటనే టి సెల్ ట్యూమర్ సెల్ల్స్ స్పందించడం  తాము గమనించా మని  నిపుణులు అయితే టి సెల్ల్స్ శక్తిని అలాగే  ఉంచుతాయని అవి గ్లోమల్ సెల్ల్స్ పై దాడి చేస్తాయని  వివరించారు. ఈ పద్దతిలో క్యాన్సర్ కణాలను చంపి వేయ వచ్చని విశ్వాసం వ్యక్తం చేసారు. ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోదన  విజయ వంతమైనదని అన్నారు . క్యాన్సర్ సెల్ల్స్ బ్రెయిన్ లో  వచ్చే ట్యూమర్ లు మేలినోమా, లంగ్, కోలాన్, లివర్ క్యాన్సర్, ను నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తామని అయితే టి సెల్ల్స్ పెరగడం పెద్ద సమస్యగా మారిందని ఈ సమస్యను అదిగ మిస్తే  పూర్తిగా  క్యాన్సర్ పైన విజయం తో ఇమ్యూన్ తెరఫీ చికిత్స అందుబాటులో కి తేవచ్చునని డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ ఇమ్యునో తెరఫిస్ట్  మసాచు సెట్ట్స్  జనరల్ ఆసుపత్రి కి చెందిన మారి యో సువా  వెల్లడించారు. కాగా బ్రాడ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన అవివ్ రేగేర్ డానాఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ లో  న్యూరో క్లినికల్ ఆంకాలజీ  డేవిడ్ రేఅర్దోన్  మాట్లాడుతూ  చాలా మందికి క్యాన్సర్ రోగులకు ఇమ్యునో తెరఫీ మందును మా లిక్యుల్ వల్ల క్యాన్సర్ సెల్ల్స్ తగ్గి పోయాయని అన్నారు. ఈ పరి సోధనలో  శరీరం లో ఇమ్యునిటీ సిస్టం మెకానిజం చేయ గలిగామని అన్నారు. ఆధునిక సాంకేతిక  త తో సింగల్ సెల్   r n a   t cell  ను ఉపయోగించి క్యాన్సర్ పెరగడం  నివారించ గాలిగా మని అన్నారు. కొత్తగా వచ్చిన ట్యూమర్ సెల్ల్స్ ను  3 1 మందినుండి   సేకరించి నట్లు చెప్పారు. సి డి1 6 1 ప్రోటీన్లు కే ఎల్ అర్  బి 1 జీన్ ను ఉపయోగించి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ తో సి డి 1 6 1 తో ట్యూమర్ సెల్ల్స్ ను చంపేస్తామని తెలిపారు  ఈ విధానాన్ని ఇప్పటికే రక రకాల జంతువులపై  ప్రయోగించామని అన్నారు  మనుషులపై  ట్రైల్స్ల్స్ చేసిన తరు వాతే తెరఫీ అందుబాటులోకి వస్తుందని  నిపుణులు స్పష్టం చేసారు.

ఎండాకాలం చిట్కాలు

A)ఎండాకాలం వచ్చిందంటే సహజంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అప్పుడు ఏం  చెయ్యాలి, ఏమి లేదు. ఈ చిట్కాలు ప్రయత్నించండి. డీ హైద్రేషణ్ ను తగ్గించుకొండి.                                                                                       1) చింతపండు పులుసులో నీరు కలిపి పచ్చిపులుసు లేదా చారు చేసుకుని తాగండి.                                                           2 ) పచ్చి మామిడికాయను ఉడకబెట్టి పిసికి అందులో ఉప్పు చక్కెర , జీల కర్ర పొడి కలిపి చల్లార్చి తాగండి .                                         3) బెల్లం పానకం అంటే బెల్లాన్ని నీళ్ళలో కరిగించి ఇలాచి  పొడి నిమ్మరం కలిపి తీసుకొండి. లేదా బెల్లం నీళ్ళలో  కాస్త మిరియాల పొడి  కలిపి తీసుకోండి శ్రీరామ నవమికి ఇచ్చే పానకం అదే.                                                             b)ఎండాకాలంలో అందరు ఎదుర్కునే మరో సమస్య  మూత్రంలో మంట. మూత్రంలో మంటగా ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చిట్కా.                                 1) ధనియాలు ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళలో  కలిపి బాగా మరిగించి వడబోసి అందులో కొంచెం పంచదార కలిపి తాగండి . దెబ్బకి మూత్రంలో మంట పారిపోతుంది.                                                  2) మోదుగపూలు పది తీసుకుని 2 ౦ ౦ మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించి వడబోసి అందులో కాస్త పంచదార కలిపి తీసుకొండి మూత్రంలో మంట కాస్త తగ్గుతుంది.                                                                                                                                     3) సతావరీ చూర్ణం ఒక చెంచా నీటిలో లేదా పాలతో తీసుకుంటే  మూత్రంలో మంట తగ్గుతుంది. c) ఎండాకాలంలో వచ్చే నీరసం బలహీనత వస్తే ఏమి చేయాలి. ఎలాంటి చిట్కాలు పాటించాలి .ఒక వైపు నది నేతిన్న సూరీడు తింటే ఆయాసం తినక పోతే నీరసం దీని ఎలా అడిగ మించాలి అన్నది మరో సమస్య  అందరిని వేదిస్తుంది.                                                                                                                                                                   1)  అందరికీ తెలిసిన ఉసిరికాయ రసంలో, క్యాండీ చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి పాటికబెల్లం తీసుకోవచ్చు. అలా చేస్తే వెంటనే నీరసం తగ్గిపోతుంది. ఉత్తి ఉసిరికాయను సైతం తీసుకుంటే దాహం తాగించుకోవచ్చు. ఉప్పువేసిన నిమ్మరసం సైతం బాగా నీరాసాన్ని తగ్గిస్తుంది.                                                                                                                                                       2) సహజంగా వేసవిలో మంచినీరు బాగా తాగుతారు అయితే  ఎక్కడ  దొరికిన నీళ్ళని తాగుతూ ఉంటారు. దానివల్ల నీళ్ళ విరోచనాలతో బాధపడడం చూస్తూ ఉంటాం దీని నుంచి బయటపడాలంటే  నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది లేదా వడదెబ్బ తగిలినా చాలా  నీరసంగా అయిపోతారు ఆవిషయాన్ని గమనించి మామూలు  విరోచానానికి 1) మారేడు చూర్ణం బెల్లం తో కలిపి తీసుకోవాలి.                                                                                                                 2 ) వట్టి వేర్లను ఒక గుడ్డలో చుట్టి నీటి కుండలో వేసి రోజూ ఆ నీటిని  తాగితే వెంటనే విరోచనలు తగ్గుతాయి.

మకో రోబోటిక్‌తో కీళ్ళమార్పిడి!

మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే  కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో  మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన  ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది. మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్  విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ  సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్  మీనాక్షి  నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్  హ్యుజన్  మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్  ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స  మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల  తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్  జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్  టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని   మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.

హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేసే క్యారెట్..!

  కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం  ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని  వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు.   సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.   క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..

సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం

శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి.                             కూరాగాయాలలో:  తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు.  పళ్ళలో:  నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ.  చిక్కుళ్ళు:  బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ.   మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు.  మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. 

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ ! రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్  

కోవిడ్ వైరంట్  N44OK తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది  ఇప్పటికే  పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో రోజురోజుకు  సెకండ్ వేవ్ చూపిస్తుందని అనుమానం కలుగు తోంది. అయితే రెండవ దశ కోవిడ్ కు  N44OK సిసిఎంబి శాస్త్రవేత్తలు  చేసిన పరిశోధనలో   N44OK  వైరస్ వేరియంట్ గా గుర్తించారు. కోవిడ్ వైరంట్ 1 9 దక్షిణాదిలో శర వేగంగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరంట్ రూపాంతరం చెందుతోందని దీనిని పూర్తిగా అధ్యయనం చేయడానికి క్షుణ్ణంగా  గమనించాలని శాస్త్రజ్ఞులకు సూచించారు. దీని ప్రభాల్యం తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని  రాకేశ్ తెలిపారు.   కోవిడ్ 1 9 రెండవ దశ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది అని  కేంద్ర నివేదికలు చెపుతున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , కేరళ, చతీస్ ఘడ్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రరూపం చూపుతోందని కేంద్ర కుటుంబ సంక్షేమం ఆరోగ్య శాఖ  ఒక నివేదికలో వెల్లడించింది. 17 రోజుల తరువాత దేశంలో మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి. సోమవారం మళ్లీ కేసులు పెరిగిపోయాయి.  వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కల్గిస్తోంది.  దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.. 1)  ఆర్టీపిసిఆర్ పరీక్షల  సంఖ్య పెంచాలి.                                                               2) నెగెటివ్ ర్యాపిడ్ అంటిజన్ పరీక్షలు తప్పని సరిగా చేయాలి                              3) ఆర్టీపీసీఆర్ ద్వారా నెగెటివ్ వ్యక్తులు మిస్ కారాదు                                                         4) ఎంపిక చేసిన జిల్లాలలో కన్ టైన్ మెంట్  జోన్లు ఏర్పాటు                                                              5) జీనోమ్ సీక్వెన్స్ ప్రకారం క్లస్టర్ల నిర్వహణ  అయితే గతం కంటే ఇప్పుడు  అపార్ట్ మెంట్లులలో కోవిడ్ విస్తరిస్తోందని  అవసరమైతే ఆ అపార్ట్ మెంట్ ను సైతం సీజ్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికే ప్రకటించింది. 

పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు

ఊసురోమని మనుషులుంటే దేశమేగతి  బాగుపడు నోయ్!  అన్నాడు  మహా కవి గురజాడ.  అది నిజమే కదా. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే  సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య వంతమైన సమాజంతోనే అభివృద్ధి  అన్నది నిజం అయినా  ఏ కార్యం సాధించాలన్నా  మొదట ఉత్సాహం ఉంటేనే ఏ పనైనా చేయగలం ఇది నిజం . శారీరకంగా గానీ, మానసికంగా కానీ శరీరంలో శక్తి హరించుకుపోయినట్లుగా నీరసంగా అలసటగా ఉంటే ఆవ్యక్తి ఏపని  చేయలేడు దీనినే వైద్య పరిభాషలో  fatigue అంటారు. జీవితంలో ప్రతి వాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు fatigue  తో సమస్యలు ఎదుర్కోడం సహజం. అలా ఉండకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి. శరీరంలో నీరసంగా అలసటగా వున్నట్లు అనిపించడానికి  రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్య కారణం సరైన పోషక ఆహారం తీసుకాకపోవడం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం లేదా మానసిక ఒత్తిళ్లకు లోనుకావడం కారణమని వైద్యులు అంటున్నారు.  శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లేకపోతే శరీరంలో శక్తి  సరిపడా ఉత్పత్తి కాదు. దీని వల్ల జరిగే మొట్టమొదటి నష్టం జీవితం పట్ల ఉత్సాహం చచ్చి పోవడం. చర్మంలో మృదుత్వం పోతుంది. రోమాలు రాలిపోతాయి. గోళ్ళలలో  పగుళ్ళు వస్తాయి. ఇవన్ని ఆ మనిషి అనారోగ్యానికి గురౌతున్నడానికి  ప్రధమ సూచనగా  భావించాలి. ఇందులో నుండి బయట పడాలంటే  నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. 1)   వారానికి ఒక్క రోజైనా పళ్ళు ఫలాలు తీసుకోవాలి.                                                                                                                                                                 1) అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకునే మాంసం కొవ్వు, జున్ను లాంటి ఆహారాలను తప్పుడు కాంబినేషన్లో  రెగ్యులర్  గా  ఎక్కువ తీసుకుంటే మనిషిలో అలసట అనిపిస్తుంది. దురదృష్టం  ఏమిటి అంటే  చాలా మంది వారం పొడుగునా  నాన్ వెజ్ లేకపోతే ముద్దే దిగదు. అలా తింటేనే వాళ్ళకు భోజనం సంతృప్తిగా తిన్నట్లు ఉంటుందని అంటారు.                                                                                                                2)  వారంలో  ఒక్క రోజైనా మరి ఏ ఇతర ఆహారానికి పోకుండా కేవలం తాజా పళ్ళు ఫలాలను , మంచి నీళ్ళతోనూ మాత్రమే తీసుకుంటే వారమంతా తిన్న ఆహరం అరగడానికి పేగులు పడ్డ శ్రమకు కాస్త రెస్ట్  ఇచ్చినట్లు ఉంటుంది. శరీరంలో కొత్త ఉత్తాహం వస్తుంది.                                                                                                                                  2 )   ప్రేరక  పానీయాలు వద్దు.                                                                                                       ఉప్పు, పంచదార, కాఫీ, టీ  మసాల కూరలు  ఆల్కాహాల్ , సిగరెట్ లాంటివి మీ ఒంట్లో శక్తిని హరిస్తాయి, అలాగే అతిగా  సెక్స్ కార్య క్రమాలలో పాల్గొంటున్న పైన చెప్పిన వన్నీ అతిగా తీసుకుంటే అడ్రినాల్  వ్యవస్త  చిన్నా భిన్నమవుతుంది.                                                                                                                                                                             3)  ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.                                                            ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం  చాలా ముఖ్యం తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుంటే రక్తంలో గ్లుకోజ్  శాతం తగ్గిపోయి హై పోగ్లైసీమియా  సంభవించే ప్రమాదం ఉంది. దాని మూలంగా కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం మనస్సుకు శరీరానికి సమన్వయము లోపించి వ్యక్తి పూర్తిగా నీరసించిపోతారు. ఈ లక్షణాన్ని  గుర్తించి సత్వరం  ఆహరం తీసుకోడం అవసరం.                                                     4 )  రిలాక్స్ - రిలాక్స్                                                                                                             చాలా మంది  అన్నం తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోవడం లేక పనుల్లో నిమజ్ఞ మవ్వడం లాంటివి అలవాటుగా వుంటాయి. అలా కాకుండా భోజనం చేసిన  తరువాత తప్పకుండా కొద్ది సేపు రిలాక్స్ కావాలి . లేదా కొద్ది సేపు రెస్ట్ తీసుకోవాలి  ఆ తరువాత మాత్రమే  పనుల్లో పాల్గొనాలి.          భోజనం  తరువాత ఎంత సేపు రిలాక్స్ కావాలి తక్కువలో తక్కువ  పావుగంట అని వైద్యులు సూచించారు.                                           5)  బాగా నీళ్ళు తాగాలి.                                                                                                      నిజం చెప్పాలంటే చాలా మంది రోజూ తమకు సరిపడే నీటిని తాగుతూ ఉంటారు. మరీ తక్కువగా నీళ్ళు తాగడం వల్ల శరీరం లో మల బద్ధకం పెరుకుతుంది. శరీరంలోని  వ్యర్ధ  పదార్ధాలు బయటికి వెళ్ళక  అదే శరీరానికి అలసటకి దారితీస్తుంది.                                                                                                                                       6 ) పరిశుభ్ర మైన ఆహారం.                                                                                            ఈ రోజుల్లో కూరగాయలలో క్రిమిసంహారక మందులు చల్ల బడని  పళ్ళు , కాయగూరలు  ఉండడం  లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా  ఈ క్రిమిసంహార మందులు  పళ్ళు కూరాగాయలలో సైతం  లోపలికి  ఇంకిపోతాయి.అయినా వాటిని  శుభ్రంగా తుడిచి కదగకపోతే వాటి  వల్ల మన శరీరానికి  హాని చేస్తాయి. వీటిలో దుమ్ము ధూళి బ్యాక్టీరియా లాంటివి శుభ్రంగా  కడిగిన తరువాతే కూరగాయలు, పళ్ళను తినడానికి ఉపయోగించాలి. పళ్ళు ముఖ్యంగా  కృత్రిమ రసాయనలతో  పండిస్తారు ఎర్రగా కనపడడానికి వివిధ రసాయనాలు పూస్తారు.  అందుకే వాటిని కొనేటప్పుడు, వాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.                                                                           7 ) ఉదయాన్నే  గోరు వెచ్చటి నీరు తీసుకోవడం.  ఉదయాన్నే అంటే నిద్రనుంచి లేవగానే  మొహం కడుక్కొని ఒక గ్లాసు గోరు వెచ్చటి నేటిలో  తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగితే అది నిద్రమత్తును వడిలించి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.                                                                      ఇక్కడ గమనించాల్సిన  విషయం ఏమిటి అంటే  బాయిల్ చేసి  చల్లార్చిన  నీటిని గోరు వెచ్చటి ఉన్నపుడే తాగితే మంచింది . ముందే పిండుకున్న రసాన్ని లేదా నిల్వ ఉంచిన  నిమ్మ రసాన్ని కాకుండా అప్పుడే పిండుకుని తాగి తేనే  అందులో పోషక విలువలు నశించి పోకుండా వుంటాయి. అదే శ్రేష్టం. అంటున్నారు వైద్యులు.                                                                             8)  పళ్ళు ఫలాలు                                                                                                             కొందరు అన్నం తిన్నాక ఆకర్లో అరటి పండు తినడం లేక ఆయా సీజన్లో వచ్చే పళ్ళు  ముఖ్యంగా ఎండా కలంలో మామిడి పండ్లు  తింటారు. అన్నంతో గానీ , అన్నం  తిన్న వెంటనే గానీ  పళ్ళు  తీసుకుంటే అజీర్ణం , తేన్పులు , గుండెల్లో మంట లాంటి  వాటికీ దారితీస్తుంది.                                                                                                                                                           వేగంగా జీర్ణమయ్యే పళ్ళు ఫలాలను నిదానంగా జీర్ణమయ్యే ప్రోటీన్ లు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారంతో పాటు తీసుకుంటే  వాటిలో ఏది సరిగ్గా జీర్ణం కాదు. అందుకని పళ్ళను  అన్నం తినడానికి బాగా ముందు కాని , భోజననికి, భోజనానికి మధ్య   సమాయంలో గాని  తీసుకోడం మేలు అంటున్నారు వైద్యులు.                                                                         9) ఆహారాన్ని బాగా నమలండి                                                                                                    ఆహారం జీర్ణం కావడం మొదట నోటిద్వారా ప్రారంభమౌతుంది.  అందుకని ఆహారంలోని ఉత్తమ విలువలు శరీరానికి లభించాలంటే  ఆహారం  బాగా నమిలి మింగాలి. మన నోటిలో దంతాలు ఉన్నది లాలాజలం ఊరుతోంది ఇందు కోసమే అందుకే ఆహారం లాలాజలంలో కలిసి  జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. సో.. ఆహారం గబాగబా మింగేసి పరుగు పెట్టకుండా  పూర్తిగా  నమిలి తినండి అంటున్నారు వైద్యులు.                10) వొంటికి నలుగు                                                                                                                                 శరీరానికి బాగా అలసట వచ్చినప్పుడు  శరీరానికి మర్దనా చర్మానికి మర్దన జరగడం వల్ల లోపల రక్త ప్రసరణ సక్రమంగా సజావుగా జరుగుతుంది. చర్మాన్ని మర్దనా చేయడం వల్ల శరీరంలో ని లింఫ్ గ్రంధుల వ్యవస్త రీచార్జ్ అవుతుంది శరీరం లోపల ఉన్న విషపూరిత పదార్ధాలు త్వరగా విస్తరించి  దీని వల్ల శరీరానికి కిక్ ఇస్తుంది గేర్ వేసినా బండిలా మనిషి దూసుకు పోతాడు.                                                                                                                     1 1 ) బరువు తగ్గండి                                                                                                              ఒళ్ళు చేయడం మంచిదే  అయితే ఒంటికి తగ్గబరువు ఉండాలి. అయితే వొళ్ళు  ఊబాకయంతో ఉంటే  త్వరగా అలిసిపోతారు. మరీ తక్కువ తిన్న కూడా అంతే జరుగుతుంది. అధికా శరీరాన్ని తగ్గించుకోడానికి తెలికైన మార్గం ఏమిటి  ఆహారంలో  గుజ్జు ప్రోటీన్లు కలిపి తీసుకోకూడదు.               ఉదాహరణకు ప్రోటీన్లతో కూడుకునివుండే   చేపలను స్ట్రాచ్ తో కూడుకుని ఉండే వరి అన్నంతో కలిపి ఒకేసారి  తీసుకోకూడదు. అందుకు బదులుగా చేపలను సలాడ్  తో కలిపి  లంచ్ టైంలో తీసుకుని సాయంత్రం వరి అన్నాన్ని కోరాగాయలతో కలిపి తీసుకోవాలి.                                                                                                                         లేదంటే లంచ్ కింద ఆమ్లెట్ ని తీసుకుని  సప్పర్ కింద అన్నంలో  బంగాళాదుంప కూరని తీసుకోవచ్చు. ఈ రకం ఆహార పద్దతులల వల్ల జీర్ణం తేలికగా జరిగి  మీ బరువు మీ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో ఉత్సాహం పుంజుకుంటుంది.                                 1 2 ) అవసర మైతే విటమిన్లు.                                                                                                                        మీకు మరీ నీరసంగా , అలసటగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఒక కోర్స్ కింద  విటమిన్ మాత్రలు వాడవచ్చు. ఏ విటమిన్ ఎలా తీసుకోవాలి వాటిని వాడాల వద్ద అనేది డాక్టర్ నిర్ణయించాలి. తప్ప మీకు మీ శరీరతత్వాన్ని బట్టి  మిత్రులా సలహా మేరకో, వేరొకరి సూచన మేరకో సొంత నిర్ణయంతో మాత్రలు .వాడొద్దు అవి ఒక్కోసారి వికటించడం లేదా తీవ్ర ఇబ్బందులు వస్తాయి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి.     1 3 ) విటమిన్ బి                                                                                                                                      శరీరంలో శక్తి పుంజుకోవాలంటే విటమిన్లు బాగా దోహదపడతాయి. అలిసిన శరీరానికి బ్యాలెన్స్ తో కూడుకున్న  బి కాంప్లెక్స్  విటమిన్ ఎంతో మేలు చేస్తుంది. అలసటగా నీరసంగా అనిపించే వాళ్ళు మెగ్నీషియం విటమిన్ సి తో పాటు  బి కాంప్లెక్స్  కల మందులకోసం డాక్టర్ ను సంప్రదించాలి.                                                                                   1 4 ) దీర్ఘ కాలం  దయిటింగ్  కు దూరంగా ఉండండి.                                                                                            బాగా లావుగా ఉన్నాను కాస్త డైటింగ్ చేయచ్చుగా. అని సలహా  ఇస్తే అదే పనిగా డైటింగ్ చేయడం వల్ల ముఖ్యంగా కొవ్వు తక్కువగా వుండే ఆహారాన్ని తీసుకుంటే చర్మం  పొడిబారడం  హార్మోన్ ఉత్పత్తి లోపించడం వల్ల థైరాయిడ్ , మేటాబాలిక్ డిజర్దార్లు  వస్తాయి హార్మోన్ ఉత్పత్తిలో సమాతూకం లేకుంటే స్త్రీలలో జననేద్రియంలో నీటి బుడగలు, సంతాన లేమివంటి సమస్యలు  కీళ్ళ నొప్పులు , అలసట, దీర్ఘకాలంతో  పాటు కొన్ని ఆనారోగ్య లక్షణాలు చోటు చేసుకుంటాయి.  సో సే నో టు డైటింగ్  ఏమంటారు ?                                                                                     1 5 ) వర్రేలకు దూరంగా ఉండండి.                                                                                                ఆధునిక సమాజంలో అన్ని సమస్యలే  వరీలకు  వయస్సుతో సంబంధం లేదు. అయినా మన మనసును క్రుంగదీసే వత్తిళ్ళు ఒత్తిడి మనిషిని హరించివేస్తాయి. మీ ఆందోళనలు సమస్యలు  పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరితో అయినా పంచుకుంటే ఆ భారం తగ్గుతుంది. అలా కాకుండా మీ మనసులోనే ఉంచుకుంటే  మానసికంగా కుంగిపోతారు, మామూలు అనారోగ్యానికి చికిత్సా  ఉందికానీ మానసిక అనారోగ్యానికి  చికిత్స లేదు.                                                             1 6 ) నిదానంగాఘా డ  శ్వాస.                                                                                                                                  ఒత్తిల్లతో కుంగిపోయే వాళ్ళు  శ్వాసను గాడంగా  తీసుకోకుండా  పై పైన గాలిని పీల్చుకుంటూ సరి పెట్టుకుంటారు. దీనిని హై పర్ వెంటివెంటి లేషన్  అంటారు. శ్వాసను ఇలా పై పైనే పీల్చుకోవడం వల్ల మీరు త్వరగా అలసటకు గురి అవుతారు. అలాంటి వాళ్ళు అపుడప్పుడూ  గాడ శ్వాసనకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు ను చేస్తూ ఉండడం మంచిది. కడుపును లోపలి లాక్కుంటూ మీలోపల ఉన్న గాలినంతా ముక్కు ద్వారా బయటికినేట్టి వేయండి. తరువాత నేమ్మదిగా గాడంగా ముక్కు ద్వారా గాలిని లోపలి కి  పీల్చుకోవాలి ఇలా పీల్చుకున్నప్పుడు చాతి కదలకుండా వుండి. పొట్ట అలలా పై కి లేవాలి. మీ ఊపిరితిత్తుల నిండా గాలి నిండడానికి 1 ౦ సెకండ్ల సమయం పడుతుంది. తిరిగి గాలి మొత్తాన్ని బయటికి వదిలేస్తూ రిపీట్ చెయ్యాలి. ఈ ఎక్సర్ సైజు ను చేస్తున్నపుడు  మీరు పీల్చేగాలి కలుషితంగా ఉండకూడదు.                          ముఖ్య గమనిక:-   సాధారణ అలసట విటమిన్ బి 1 2  లేక ఐరన్ లోఫంతో కూడుకున్న రక్త హీనత కారణంకావచ్చు. థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయక పోవటమూ కారణం కావచ్చు  పైన చెప్పిన సూత్రాల్నిపాటిస్తూ కూడా మీలో అలసట , నీరసం పోకపోతే డాక్టరు ను సంప్రదించి పరీక్ష చేయించండి. ఇవే పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు.   

కిడ్నీట్రాన్స్ ప్లాంట్లలో భారత్ 2వ స్థానం..

కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువని ఒక పరిశీలనలో వెల్లడి. కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువగా  ఉన్నాయని సాదార ప్రజలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడించారు. ఈ పరిశీలన దేశంలోని 13 ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లలో నిర్వహించినట్లు సమాచారం. పరిశీలన వివరాలను ట్రాన్స్ ప్లాంట్ జర్నల్ లో ప్రచురించేందుకు అనుమతించారు.  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న 250మందిలో 226 మంది దాతలే ఉన్నారని అందులో 24 మంది కోవిడ్ వచ్చినవారే అని అన్నారు. మార్చి 23 నుండి సెప్టెంబర్ వరకు పరిశిలించినట్లు అందులో 29 మందికి కోవిడ్ సోకి మరణించారని పరిశీలకులు పేర్కొన్నారు. అహ్మదాబాద్ కు చెందిన హెచ్ ఎల్ త్రివేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవల విభాగానికి చెందినా వివేక్ కుటే మాట్లడుతూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య తక్కువే అని అన్నారు. కోవిడ్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కోవిడ్ వచ్చిందని దీనికన్న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సమస్యలవల్ల చనిపోయినవారి సంఖ్య ఎక్కువే అని అన్నారు. వైద్యుల బృందం పరిశీలనలో 250 మంది కిడ్నీ తీసుకున్నవారు 94% మంది మోర్ బి డిట్రేస్, ఆర్ టే రియల్,హై పర్ టెన్షన్ సహజంగా వచ్చే సమస్యే అని అన్నారు. కాగా 84% మంది డయాబెటీస్ వల్ల మరణించి ఉండవచ్చని వివరించారు. 32% మంది ఇతర అనారోగ్య సమస్యలతో మరణించి ఉండవచ్చని ఢిల్లీ అపోలో ఆసుపత్రికి చెందిన ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా, సర్ గంగారం ఆసుపత్రికి  నెఫ్రాలజీ విభాగానికి అధ్యక్షుడు డాక్టర్ ఎ కే బల్లా  నేతృత్వంలోని బృందం ఈ అంశాలను వెల్లడించింది. డాక్టర్ భల్లా పరిశీలనలో కోవిడ్ కన్నా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వల్ల మరణించిన వారి సంఖ్య 4 రెట్లు 4 8-౩౩% మరణించారని ఇటీవల జరిపిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే కిడ్నీదాతలు గణనీయంగా పెరిగారని భల్లా అన్నారు. చాలా మంది ట్రాన్స్ ప్లాంట్  చేయించుకున్న వారు ఎక్కువగా ఎక్క్యుట్ కిడ్నీ ఇంజ్యురితో బాధపడడం గమనించామని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఇదే సమాచారం అందిందని అన్నారు. ఆయా దేశాలలో 11 .6% మాత్రమే అని భారత్ లో  చాలా మంది యువకులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని డాక్టర్ భల్లా అన్నారు. అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా మాట్లాడుతూ కోవిడ్ ఉన్నవారికి ట్రాన్స్ ప్లాంట్ జరిగిందా? కోవిడ్ పాసిటివ్ ఉన్నవారు డయాలాసిస్  చేయించుకున్నవారు ఉండి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయం డయాలసిస్  సెంటర్లలో  నిర్వహించిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. భారత్ లో 12% నుంచి 3 7% మంది ఉండి ఉండవచ్చని దీనిని బట్టి కోవిడ్ సమయంలో ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లు చాలా యాక్టివ్ గా పనిచేసినట్లు తెలుస్తోందని డాక్టర్ గులేరియా అన్నారు. సర్ గంగారాం ఇన్స్టిట్యుట్ ఆఫ్ రెనాల్ సైన్సెస్ చైర్మన్  మేనేజ్మెంట్ బోర్డుకు చెందిన డాక్టర్ డి . ఎస్ రాణా మాట్లాడుతూ 4 9, 1 5 5 వేల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు నిర్వాహించినట్లు  చెప్పారు. 2013-2018  మద్య  కాలంలో 39,౦౦౦ మంది దాతలు వచ్చారని, వారిలో 2018 నాటికీ 10,155మంది సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ట్రాన్స్ ప్లాంట్లలో భారత్  2వ స్థానంలో ఉందని తెలిపారు. ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవల్సి ఉందని నొక్కి చెప్పారు. సమయానికి సరైన మందులు వాడడం అవసరమని అప్పుడే వారి ప్రాణాలు కాపాడగలమని అన్నారు. అసలు కిడ్నీ దాతలు ఎలా వచ్చారు?  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు ఎథిక్స్ కమిటీ అనుమతిన్చిందా?  దీని వల్ల వచ్చే పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అన్న సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఎవరైనా దాతలు ముందుకు రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి. అందుకు సవాలక్ష ఆంక్షలు, మరి ఇంత పెద్ద సంఖ్యలో దాతల సమీకరణ ఎలా చేసారు అన్నది సందేహం.? మామూలుగానే దాతలు దొరకడం కష్టం ఏళ్ల తరబడి ఎదురు చూసినా దొరకని దాత వీళ్ళకి మాత్రమే ఎలా దొరికారు? అసలు దీని వెనక ఉన్నది ఎవరు ? అన్న సందేహం ఉంది ? ఎవరు అనుమతించారు అన్నది మరో ప్రశ్న ?  ఇలా పుట్టుకొచ్చే ప్రశ్నలకు నిపుణులే చెప్పాలి.

హై బిపి వచ్చిందో ప్రమాదమే.. ?

రాత్రి వేళల్లో హై బిపి వచ్చిందో ప్రమాదమే అని హెచ్చరిస్తునారు వైద్యులు. ముఖ్యంగా వృద్ధులలో రాత్రి పూట హై బిపి కనక వస్తే డిమ్నీషియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు హై బిపికి  డిమ్నిషియాకు సంబంధం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. రాత్రి వేళ వచ్చే బిపిని రివర్స్ డిప్పింగ్ అంటారని నిపుణులు నిర్ధారించారు. రాత్రి వేళ  వచ్చే హై బిపి ముఖ్యంగా వృద్ధులను వేదిస్తోందని అన్నారు. దీనివల్ల వారికి నిద్రా భంగం కలగడంతో పాటు అల్జీమర్స్ లేదా, డిమ్నీషియా వంటి సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు వెల్లడించాయి . హై బిపికి ఇతర సమస్యలకు సంబంధం ఉందా? అన్న అంశంపై చేసిన పరిశోధన అంశాలను దిస్ వీక్ మెడికల్ జనరల్ లో ప్రచురించింది. ముఖ్యంగా హై బిపి వృద్ధులలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. రాత్రి వేళలో హై బిపి రీడింగ్స్  చూసినప్పుడు  డిమ్నీషియా వస్తుందని తేల్చారు. సంవత్సరాలుగా హై బిపి అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. హై బిపి అల్జీమర్స్ పగటి వేళ కన్నా రాత్రి వేళ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని వల్ల కార్డియో వాస్క్యులర్  సమస్యలు హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యుర్  కాగ్నటిక్. దిస్ ఫంక్షన్ ఉంటుందని డాక్టర్ జాషువా అబాక్ మాన్  డైరెక్టర్ అఫ్ వాస్క్యులార్ బయాలోజీ  కాన్సర్ ఎట్ ది వందేర్బిట్ల్ట్  మెడికల్ సెంటర్పలో చేసిన పరిశోధనలో కనుగోన్నారు.   స్వీడన్ లోని అప్ప్సలా  విశ్వ విద్యాలయం లో రాత్రి వేళలలో  వచ్చే హై బిపి అల్జీమర్స్  పై 1 ౦ ౦ ౦ మంది స్వీడన్ ప్రజల పై పరిశోధనలు జరి పింది. వృద్ధులపై హై బిపి వచ్చే సమయంలో 24 గంట లకు పైగా పరిశోదించామని తెలిపారు. 7౦ సంవత్సరాల వయస్సు పడ్డవారి పై 7 సంవత్స రాల తరువాత అంటే 9 ౦ సంవత్సరాల పాటు  అంటే 24 సంవత్సరాలు పరిశోధనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా వాస్క్యులార్  డిమ్నీషియా వల్ల కాగ్నేటివ్  స్కిల్ల్స్  పెరగలేదని నిపుణులు విశ్లేషించారు. పురుషులలో రివర్స్ డిప్పింగ్ వచ్చిందని హై బిపి దిమ్నీషియా వల్ల వివిధ రకాల  సమస్యలను పూర్తిగా అవగాహన కలగాలని అన్నారు. అల్జీమర్స్ డిమ్నీషియా మాత్రమే వచ్చిందని వ్యా స్కులార్ దిమ్నీషియా కాదని నిపుణులు స్పష్టం చేసారు. హై బిపి, రక్త పోటు, రక్త ప్రసారంపైనే పడదని వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామని నిపుణులు అభిప్రాయ పడ్డారు. అయితే హై బిపి డిమ్నీశియకు దగ్గర సంబంధం ఉందని స్త్రీపురుషులలో హై బిపి దిమ్నీషి యాకు కారణం కాగలదని  తేల్చి చెప్పారు.

మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు...

ఒక సంవత్సరం గడిచిపోయింది  కోవిడ్ 1 9  మనకు ఎన్నో గుణ పాఠాలు నేర్పింది. అసలు మన ఆరోగ్యం విషయంలో 2030 నాటికీ మన ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అబ్భివృద్ధి చెందుతున్న దేశాల్లో  సైతం ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  ప్రజలు, వ్యక్తులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంపై సంస్థలు వినియోగదారుడికి సేవలు అందించేందుకు సిద్ధం కావాలని ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవల్సిన అవసరం మరింత పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వాలు చేస్తున్నది ప్రజలకు చేరడం లేదనేదనే వాస్తవం. కోవిడ్ తరువాత  ఆరోగ్యరంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేసినప్పటికీ ఆరోగ్య విద్య, పరిశోధనలకు మాత్రమే నిధులు కేటాయించారు. అయితే రూరల్ హెల్త్ , ఆర్బన్ హెల్త్ పై దృష్టి పెట్టినప్పటికీ సామాన్యుడికి  వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పై ఒక విధానం అంటూ ఉండాలి.. అయితే కేవలం కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం.. అది మాత్రమే బాధ్యత అనుకుంటే సరిపోదు. దీర్ఘకాలంగా  ప్రజలకు భారంగా మారుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోక తప్పని స్థితి, అసలు ప్రజా ఆరోగ్యానికి అయ్యే ఖర్చు  ప్రభుత్వం భరిస్తుందా లేదా? చవకగా ఆరోగ్యం పొందగాలమా? కోవిడ్ తరువాత సాధారణ మధ్య తరగతి ప్రజలు ఆర్ధికంగా పూర్తిగా చితికిన నేపధ్యంలో ఆరోగ్యం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ప్రజా ఆరోగ్యం ఎవరు మానీటర్ చెయ్యాలి?  ఎవరు నిర్వహించాలి? ఇంట్లో ఆరోగ్య సంరక్షణ సాధ్యమేనా? ఎవరికీ అసుపత్రిలో సేవలు అవసరం? వీటిని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికి చికిత్స చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది..ఇక రిమోట్ హోం హెల్త్ సొల్యుషన్స్ లేదా టేలి మెడిసిన్, హోం ల్యాబ్, హోం వ్యాక్సినేషన్, హోం హెల్త్ మా నీటరింగ్ ఖర్చు తో కూడుకున్నది.  అటు ధర్మఅసుపత్రి లో రోగులను పట్టించుకోరు, ప్రైవేటు ఆసుపత్రిలో బాగానే ఉన్న ఆ ఖర్చు తట్టుకోడం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. అందుకే ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులు అనుకోక తప్పని స్థితి వాస్తవానికి కోవిడ్ కు ముందు కోవిడ్ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటికీ ట్రేస్, ట్రీట్ ఉండల్సిందేనా? డిజిటల్ హెల్త్ ఉన్నప్పటికీ ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించడం సాధ్యమేనా? ప్యాండమిక్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఎప్పటికీ తిస్కోవల్సిందేనా.. తీసుకున్న అనారోగ్య సమస్య నుంచి తప్పించుకోడం సాధ్యమా? ప్రజలు ఇక ప్రాత్యమ్నాయ వైద్యం కోసం చూసుకోక తప్పదా? సంప్రదాయ వైద్యం సిద్ధాంతాలు ఆచరించక తప్పదా? ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ఉన్న స్వయంరక్షణ ఎప్పటికీ తప్పదా? సహాజంగా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మళ్ళీ మనం బలికాకతప్పదా ? అన్నసందేహం ప్రజలను వేదిస్తున్నాయి? నీ నెత్తి మీద ఎదో ఉందంటే నువ్వే తీయి అన్నట్లు  మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు మాకు సంబంధం లేదని ప్రభుత్వాలు అంటాయా? వేచి చూద్దాం.

11 సప్లిమెంట్లతో నొప్పి మాయం... ఒకసారి ప్రయత్నం చేయండి

ఇటివల కాలంలో వయసుతో సంబంధం లేకుండా వేదించే సమస్యలలో అర్థరైటిస్ ఒకటి, జాయింట్లలో విపరీతమైన నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ  లక్షణాలలో భాగంగా కీళ్ళలో వాపులు , కీళ్ళ మద్య కాట్లేజ్ అరిగిపోవడం వంటి సమస్యలు  ఎదుర్కుంటున్నారు.  మోకాళ్ళు  వంగకపోవడం కూర్చుంటే  లేవలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు.. అయితే దీనికోసం నొప్పులు తగ్గించే మందులు అంటే పెయిన్ కిల్లర్స్ వాడడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీకి ప్రమాదమని డాక్టర్స్ హెచ్చ రిస్తున్నారు. లేదా కీళ్ళు అరిగిపోతే కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స తప్పనిసరి అంటూ కీళ్ళ మార్పిడి శస్త్రా చికిత్స నిపుణులు ప్రత్యేక విభాగంగా ఏర్పడి మూడు పువ్వులు ఆరు  కాయలుగా సోమ్ముచేస్కున్తున్నారు.. లేదా రోగులు ఇతర ప్రత్యామ్నాయ వైద్యాన్ని వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా 11 రకాల  సప్లిమెంట్స్ తీసుకుంటే దీర్ఘకాలంగా  మీరు ఎదుర్కుంటున్న అర్థరైటిస్ వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ళ వాపుల మార్పిడి నుండి విముక్తి పొందచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇక వివరాలలోకి వెళ్తే .... అసలు ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి అన్నది తెలుసుకుందాం. glucoamin... గ్లూకోజ్ సమైన్ ఇది ఎమినో షుగర్ సహజంగా మీ జాయింట్స్ కీళ్లలలో గుజ్జును ఇస్తుంది.. గుజ్జు క్రమంగా తగ్గిపోవడం వల్ల మోకాళ్ళలో కాడ్జేజ్ అరిగిపోతుంది.. దీని వల్ల మోకాళ్ళు స్టిఫ్ గా ఉండడం వాపు వస్తుంటుంది. ఇది తగ్గడానికి క్యాప్సుల్స్ లేదా మాత్రలు ద్రవ పదార్ధాలు అంటే రసాలు, కషాయాలు  తాగుతుంటారు. ఇంకొందరు కొన్ని  మందులలో ఇంకొన్ని మందులు కలిపి chondrointin  ఉంటుంది..  మీ ఎముకలలొ సహజంగా టిష్యూ ను కనక్ట్ అయి ఉంటాయి .. లేదా ఎముకలలో కాట్లేజ్ తో కలిసి ఉంటుంది. దీనిని సప్లిమేంట్ గా  తీసుకుంటే జాయింట్స్ లో ఉండే రాపిడి అరుగుదల కొంతవరకు అబ్జోర్బ్  చేసుకుని జాయింట్స్  కు సహకరిస్తుందని..   అయితే ఈ సప్లిమెంట్ జంతువుల నుండి వస్తుందన విషయం మీకు తెలుసా? చేపల  ద్వారా వచ్చే నూనె ఒమేగా 3 ఎస్  ఇది కేవలం ఆయిల్ సప్లిమెంట్  మాత్రమే.. మీ శరీరంలో  ప్రోటిన్స్ ను తీసేసి , ఫ్యాటీ యాసిడ్స్  లేక పోవడం వల్లే  ఇంఫ్లామేషన్ గా పని చేస్తుంది. కొన్ని రకాల రసాయనాలు రిసాల్విన్ వంటి జాయింట్స్ లో ఉండే స్టిఫ్ నేస్ ను టెండర్ నెస్ ను తగ్గిస్తాయి.         methyl solfuny methane  సహాజంగా మనం తినే కూరాగాయాల్లో, పండ్లలో  సల్ఫరిక్ కాంపౌండ్ ఉంటుంది. పప్పు దినుసులు, మిల్లెట్స్  లో మనుష్యులలో , జంతువులలో ఉంటాయి . సల్ఫర్ మీ శరీరాన్ని  టిష్యులు అంటి పెట్టుకుని ఉంటాయి. ప్రతి రోజూ 1ooo మిల్లీగ్రాములు  నుంచి 3 ౦ ౦ ౦ మి గ్రా సహజంగా వచ్చే రసాయనాలు ఉపయోగపడతాయి. ఆస్టియో  అర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులకు వాపుకు సల్ఫర్ ఉపయోగపడుతుంది అందుకే హోమియోలో సల్ఫర్ ను ఎక్కువగా వాడతారు.. దీనికి బదులుగా మీరు పండ్లను తీసుకుంటే సల్ఫర్ శరీరానికి అంది  నొప్పులు తగ్గవచ్చనేది నిపుణులు సూచిస్తున్నారు.   vitaminD                       రుమటాయిడ్ ఆర్థరైటీస్ పై జరిపినా పరిసశోదనలో  కీళ్ళ నొప్పులకు విటమిన్ డి  లోపమే కారణమని  తేల్చారు. విటమిన్ డి తప్పకుండా తీసుకోవాల్సిన  న్యుట్రీయంట్స్ అని తేల్చారు..  విటమిన్ డి ని సప్లిమెంట్ గా తీసుకుంటే ఆర్ద రైటీస్ చికిత్చ కు ఉపకరిస్తుంది. అసలు ఖర్చు లేకుండానే సూర్య రశ్మి వల్ల  విటమిన్ డి  వస్తుంది. చేతిని వదిలి కాళ్ళు పట్టుకున్న చందంగా విటమిన్ డి  కోసం  వేలా రూపాయలు  ఖర్చు చేస్తున్నారు.  విటమిన్  డి ని వాడండి కొంతవరకు కీళ్ళు కాళ్ళ నొప్పులను తగ్గించుకొండి.   TARMARIK  సహజంగా అందరికీ తెలిసిన పేరు పసుపు  మీరు ప్రతి రోజూ  తినే ఆహారంలో  పసుపును తప్పకుండా వాడతారు. అసలు పసుపులేని కూర, ఉప్పులేని పప్పు ఎలా ఉంటుందో  మీకు తెలుసు. పసుపు వడకం వల్ల  శరీరంలో వచ్చే నొప్పులకు ఉపసమనం ఉంటుందని అంటున్నారు  డాక్టర్లు . పసుపులో ఉండే   CUR CUMIN   పదార్ధం బ్లాకులు కొన్ని ప్రోటీన్లు  ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందని..  పసుపు ఈ నొప్పులను రాకుండా చేస్తుందని, ఒక పరిశోదనలో వెల్లడించారు. దీనివల్ల కాస్త కాళ్ళలో కాస్త కదలిక వస్తుందని  నిపుణులు  విశ్లేషించారు.                                           BOROSE OIL                                                                                                                                                 ఇది విత్తనాల ద్వారా వచ్చే నూనె బోరోగో  మొక్కలలో గామా లినోలెనిక్ యాసిడ్ వల్ల ఫ్యాటీ యాసిడ్   ఇంఫ్లామేషన్ పై పోరాడుతుంది.  రోమటాయిడ్   ఆర్ద రైటీస్  చికిత్సకు  ఉపయోగాపడుతుంది.                                                                                         SAME( S- ADENOSYLMETHIONINE)                                                                                                                                        మన శరీరంలో ఉండే ప్రధాన అవయవాలలో ఒకటి  లివర్, లివర్ నుండి ఉత్పత్తి అయ్యే రసాయనం సప్లిమెంట్ గా పనిచేస్తుంది..  ఆ సప్లిమేంట్ మన శరీరానికి అందితే  స్తేరాయిడ్ లేని సప్లిమెంట్ గా  పని చేస్తుంది. మనం వాడే  మందులలో ఇబుఫ్రుబిన్, నేఫ్రోక్సిన్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి ఇది కాట్లేజ్ ను  రిపేర్ చేస్తాయి . అసలు మన శరీరంలో ని కాట్లేజ్  డ్యామేజ్   కావడం వల్లే ఆర్థరైటీస్  వస్తుందని తేల్చారు.                                                                                                               BOSWELLIA                                                                                                                                                                                    బోస్వేలియా  దీనిని  ఇండియన్ ఫ్రాన్కిన్ సెన్స్ అని అంటారు. ఈ మొక్క ఆఫ్రికాలో ఎక్కువగా లభిస్తుంది . ఆసియాలో  1 ౦ ౦ సంవత్సరాలుగా చాలా శక్తవంతంగా   పనిచేస్తుంది . బోస్ వేల్లియా  మీ జాయింట్ లో వచ్చే నొప్పి నివారణకు సహకరిస్తుంది. పరిశోదనలో  కోల్పోయిన కాట్లేజ్ ను కాపాడడంలో సహకరించిందని  నిపుణులు పేర్కొన్నారు .                                   CATS, CLAW ( UNCARIA TOMEN TOSE)                                                                                                                            ఈ చెక్క ద్వారా  వచ్చే వైన్ మద్యం లభిస్తుంది..  దక్షిణ అమెరికాలో దీని ద్వారా వచ్చే  కెమికల్  టోర్రిన్స్  ఇంఫ్లా మేషన్ కు చక్కగా  పని చేస్తుంది. ఇంఫ్లా మేషన్ పై జరిగిన పరిశోదనలో  ఇది  ఆస్టియో  ఆర్త రైటిస్ , కీళ్ళనొప్పులుకు సైడ్ ఎఫెక్ట్స్  లేని వాపును నివారించడంలో ఈ కెమికల్ పని చేస్తుందని  నిపుణులు తేల్చారు.                                                                             AVAAKADO- SOYAABEEN.                                                                                                                                                                            మీ జాయింట్స్ ఒక ప్రత్యేకమైన సైనోవైటల్ సేల్స్ ద్వార  ఎస్ యు  ద్వారా శరీరంలో టిష్యు ను  పెంచేందుకు సహకారిస్తాయి .  ఆస్టియో అర్థ రైటీస్తో బాదపడుతున్నవారికి ఎఎఎస్ యు  ను సప్లిమెంట్ గా ఇవ్వగా.. కీళ్ళ నొప్పులు తగ్గాయని , మందుల కన్నా  ఇది బాగా పని చేసిందని పరిశోదనలో  వెల్లడైయింది.. నొప్పి నివారణకు  సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు వాడడం అవసరం . ముఖ్యంగా మీ జాయింట్స్ కు బలం చేకూర్చే  ఆహారం తీసుకోడం ముఖ్యం. చాప్ప్రల్   ఒర్నికా ఇంట్లో తాయారు చేసిన కంబ్వి చొ , టీ  మీ లివర్ కు సహారిస్తుంది . మీరు ముందు డాక్టర్ ను సంప్రదించండి.. ఆ తరువాతే సప్లిమెంట్లు తీసుకోండి. ఎన్ని పెయిన్  కిల్లర్స్ వాడిన తగ్గని నొప్పులకు 11  సప్లిమెంట్లుతో నొప్పి మాయం  ఒకసారి ప్రయత్నం చేయండి ఫలితం తెలుస్తుంది.. 

కాలిన గాయాలకు శాస్త్ర చికిత్స అవసరం

పిల్లలో శరీరం కాలడం సహజంగా వచ్చే గాయమే వారికీ సత్వర చికిత్స అత్యవసరం 9 సంవత్సరాల బాలురు ఆస్ట్రేలియాలో ఆస్పత్రిలో చేరారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ లో ఉండే బాలురు 3సార్లు ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. 5 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండడం విశేషం. జార్జ్ ఇన్స్టిట్యూట్ యు ఎన్ ఎస్ డబ్లు  స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ నిర్వహించిన విశ్లేషణలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్ వంటి దేశాలలో 16  సంవత్సరాల లోపు బాలబాలికలు  కాలిన గాయాలతో 2009  జూలై 2018  మధ్య కాలంలో ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. ఆబో రిజినల్ టోర్రెస్స్త్రైల్  ఐలాండ్ లో బాలురు పది శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారని. ఇతరులలో ఇంతకుమించి మూడురెట్లు గాయాలు ఉండటాన్నిగమనించినట్లు వారు ఆసుపత్రులలో చేరారని కోర్ట్నీ రైడర్ తమ పరిశోదనలో వెల్లడించారు. చాలామంది కాలిన గాయాలతో బాధపడ్డారని గాయాల వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. 6, 980  పిల్లలలో  ఆసుపత్రిలో కాలిన గాయాలు 723 మందిని గుర్తించామని. వాళ్ళు అబోరిజినల్  ఒర్తోరేస్స్ స్ట్రీట్ ఐలాండ్ లో  వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. ఆస్ట్రేలియా జనత 10 % మంది సరిహద్దుల్లో నివసించేవారని స్థానికంగా ఔట్  పేషంట్  సేవలు పొందారని, వెనుకబడ్డ ప్రాంతాలలో 70 % గాయాలతో అలాగే ఉన్నారని . దీనికి కారణం వారు ఆసుపత్రులకు దూరంగా ఉండడమే అని అన్నారు. అయితే వారు దీర్ఘకాలంగా ఆసుపత్రులలో ఉండలేని స్థితి అని కోర్తెనీ వివరించారు. కాలడం వారికీ  సహజంగా వచ్చే గాయమని, దానికి  సత్వరం చికిత్స అవసరమని ఆమె అన్నారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ ఉండే  వారికీ కాలిని గాయాలకు వైద్యం ఖర్చుతో కూడుకున్నదని అందుకే వాళ్ళు ఆసుపత్రిలో చేరడానికి వాళ్ళు భయపడుతున్నారని ఆమె అన్నారు.. అన్నింటికన్నా ముందు  వారు సత్వరం కోలుకోడం ముఖ్యం. కాలిన గాయాల నుంచి కోలుకోవాలంటే  నెలలు సమయం పడుతుంది. దీర్ఘకాలంగా పాటు వైద్యం కోన సగుతుంది. సర్జరీలు  థెరఫీలు కుటుంబాలకు  అదనపు భారంగా మారాయి. పిల్లల పై శారీరకంగా సామాజికంగా చదువుపై వీటి ప్రభావం ఉంటుందని కోర్ట్నీ అన్నారు. ప్రస్తుతం శరీరం గాయాలకు ముఖ్యంగా కాలినా గాయాలకు పాశ్చాత్య చికిత్స అందిస్తున్నామని అన్నారు. శరీరం పై గాయాలను వాటి లక్షణాలను బట్టి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.  అబోరిజినల్  అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ మోడల్స్ అఫ్ హెల్త్ వెల్ బీయింగ్ హోలిస్టిక్  పద్దతిలో అందరికి   చికిత్స అందించామన్నారు. ఇందు కోసం సత్వరం కార్యక్రమం చెపట్టాలని   విధాన రూపకల్పన  క్ల్నికల్ గా వారికీ మార్గ నిర్దేశం చేయాలన కాలిన గాయాల నివారణ చికిత్సా అందించడమే  మన లక్ష్యం అని అన్నారు.. అబోరిజినల్  టోర్రెస్ స్ట్రైట్ ఐలాండ్ ప్రజల వర్గాలు ఆరోగ్యం పై వారి అనుభవాలు పరిశీలన మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, టైలోర్డ్ వారి సంస్కృతిక్ అవసరాలు సమర్ధంగా నిర్వహించగలగాలి ఇందుకోసం జార్జియో  ఇన్స్టిట్యూట్  గ్లోబల్ హెల్త్ యు ఎన్  ఎస్ డబ్ల్యు స్కూల్  హెల్ తో పలు కార్యక్రమాలు చేపట్టనున్నాట్టు ఆమె చెప్పారు.. 

ఇమ్యూనిటీపెంచుకోడానికి సప్లిమెంట్స్ వచ్చేసాయి

శతాబ్దాల చరిత్ర ఉన్న ఆయుర్వేద వైద్యంలో కోవిడ్ తరువాత జరిగిన అనారోగ్యానికి శరీరంలో ఒక వైపు నీరసం మరో వైపు ఇమ్యునిటీ అంటే రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోడం వల్లే చాలా మంది కోవిడ్ బారినపడ్డారు. చాలమందికి ఇమ్యునిటీ పెంచుకోడానికి వెతకని మార్గం లేదు తినని ఆహరం అంటూ లేదు అయితే  అందుకోసం ప్రతి ఒక్కరు వేల రూపాయలు ఖర్చు చేసి ఇమ్యునిటీ పొందడానికి అందుబాటులో ఉన్న  అన్ని మార్గాలను అవలంబించారు. అయితే అది అలోపతీ మందులు ఉన్నప్పటికీ ఆయుర్వేదం లో ఉన్న స్థానిక వనరులతోనే లూపిన్ సంస్థ సుప్లిమేంట్ ను రూపొందించింది. పురుషులలో 100 % ఇమ్యునిటీపెంచుకోడానికి ఆయుర్వేదంలో సప్లిమెంట్స్ వచ్చేసాయి. ముంబాయి లోని ప్రముఖమందుల ఉత్పాదక సంస్థ లూపిన్ లైఫ్ కాన్స్యుమర్ హెల్త్ కేర్  సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. శాస్రియంగా పరిశీలించిన మీదట ఈ మందును విడుదల చేసామని లూపిన్ సంస్థల నిర్వాహకులు అనీల్ వి కౌశల్  ప్రకటనలో స్పష్టం చేసారు. ఆయుర్వేదం లో సహజంగా అందరికీ తెలిసిన అశ్వగంధ , సతావరి, శిలాజీత్, వంటి సహసిద్ధ మూలికలతో ఈ సప్లిమేంట్ ను తయారు చేసినట్లు తెలిపారు. ఈ సప్లిమెంటు ను అందరికి అందుబాటులోకి తేనున్నట్లు కౌశల్ తెలిపారు. సప్లిమెంట్ వాడడం ద్వారా  పురుషులకి  మరింత శక్తి ని ఇస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని అన్నారు. ప్రాకృతికంగా మనకు లభ్యమయ్యే అశ్వగంధ, సతావరి, శిలాజీ వంటి మూలికలు భారత్ లో పుష్కలంగా ఉన్నాయని వీటిని పూర్తిగా వినియోగిస్తే ఎటువంటి వైరస్ ను అయినా ఎదుర్కోవచ్చని కౌశల్ వివరించారు. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ఈ మందుల ఉత్పత్తిని మరింత పెంచుతామని అన్నారు. అయితే ఇప్పటివరకు అన్నిట్లో  స్టేరాయిడ్ మందులు వాడారని స్టెరాయిడ్ రహిత సప్లిమేంట్ ను రూపొందించడంలో లూపిన్ సంస్థ సఫలమైందని కౌశల్ ప్రకనలో పేర్కొన్నారు. దీనిని ప్రతిరోజూ వాడవచ్చని కౌశల్ అన్నారు.