భీమా – ధీమా

మీరు భీమా కట్టరా? అయితే మీరు ధీమా గా ఉన్నారన్న మాట. అయితే మరీ అంతా ధీమాగా ఉండకంటి, ఇందులో కూడా  కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి అవి ఏమిటో సమస్యకు పరిష్కారానికి ప్రయత్నమే  చేయడమే   మా భీమా – ధీమా కార్యక్రమం. సొ వెల్కంటు  భీమా

ధీమా కార్యక్రమం... మొంటేజ...

                                                                                                    
మనిషికి భీమా ఉంటే ధీమా ఏ వేరని అని అనుకుంటున్నారు సామాన్యులు.  కొందరికి భీమా భారంగా మారిందని. ప్రతి సంవత్సరం మనం పెట్టె పెట్టుబడికి మనకు వచ్చే  ఆదాయం ఎంత అన్న ప్రశ్న వేదిస్తోంది. ఇది నిజం అయితే సంవత్సరం వచ్చిందటే  ఇన్సూరెన్స్ పోలసీ కోసం కంపెనీలు పడరాని పాట్లుపడతారు. మీకు 80 సి ప్రకారం   ట్యాక్స్ ఎగ్జంషన్  వస్తుంది అంటూ అసలు ఒప్పంద పాత్రల  చూడ కుండానే సంతకం చేసి ఇచ్చేస్తున్నారు పోలసీ దారులు. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ విలువ ఎంత? ఏ పాలసీ కి ఎంత కట్టాలి ? పాలసీ మెశ్చురి టీ ఎన్నాళ్లు?  భీమా మధ్యలో పాలసీ దారుకు జరిగే నష్టాన్ని ఎలా లెక్క కడతారు? కాష్ లెస్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ పరిధి లోకి వస్తుంది? రీ ఎంబర్స్ మెంట్ పాలసీ అంటే ఏ మిటి?  ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అంటే  ఏమిటి ? లైఫ్ ఇన్సూరెన్స్.నాన్ లైఫ్  ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అన సందేహాల కు మానిపుణులు ఇచ్చే సమ ధానాలు , సలహాలు సూచనలు మీకోసం అందిస్తోంది రాజ్ న్యూస్  అసలు ఇన్సూరెన్స్ లో ఉన్న నిజాలు,  ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, క్లెయిమ్ లు  ఇవ్వడం లో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తే ఎవరిని సంప్రదించాలి? కోర్టుకు వెళ్తే సమస్య మరింతజటిలం అయ్యే అవకాశం ఉన్నదున అంబుట్స్ మెన్ కమిటీ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న సందేహాలకు  సమాధానం    భీమా – ధీమా . అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ ఏ . వి  చూద్దాం.                                                                                                                        
 ఇన్సూరెన్స్ ఈ పదం గురించి తెలియని వాళ్ళు ఈ మధ్య కాలం లో లేరంటే అతిశయోక్తి లేదు నిజానికి తెలిసో తెలియక ఎప్పుడో ఎక్కడో ఏ స్నేహితుడి ప్రోత్సాహంతోనో  భీమా అస్దే ఇన్సూరెన్స్ కట్టేఉంటారు. దానిని వినియోగించుకునే ఉంటారు. లేదా మధ్యలోనే ప్రీమియం కట్ట లేక ఆపేసి ఉంటారు.  అయితే ఇన్సూరెన్స్ ఈ రోజు నిత్య  అవసరంగా మారింది. ముఖ్యంగా దిగువా మధ్య త్రాగతి ప్రజలకి , ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి గా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు  ఊ దర కొట్టే ప్రకటనలు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల కు  భారీ కమీషన్లు ముడుతూ  ఉండడం తో  సంవత్సరానికి 7000/ రూపాయలు కట్టండి ఇన్సూరెన్స్ మీకు నెల రోజుల్లో ఆక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ  అనారోగ్య సంస్య వస్స్థే మీకు దగ్గరలో ఉన్న అసు పత్రి  లో  ఐనా చేరండి. ఇది క్యాష్ లెస్ పాలసీ అంటూ చెప్పగానే ఏజెంట్ల మాటలను నమ్మి డబ్బు కడుతున్నారు పాలసీదారులు. మీ పాలసీ కి సం అస్సుర్డ్ అమౌంట్ 50000/ ఆక్షరాలా ఐదు లక్షలు వస్తుంది అని అనగానే అయితే తీసుకుందాం డబ్బు ఉన్న రోజు ఉంటుంది లేని రోజూ ఉంటుంది. అత్యవసర సమయంలో ఆడుకునే బీమా ఉందిగా అనుకుని ధీమా గా  ఉంటారు అసలు భీమలు ఎన్నిరకాలు  ఏ పాలసీ పెట్టుబడి దారుకు లాభ దాయకం అన్న అంశాలు నిపుణులు చెప్తారు లెట్స్ గో  ఫోర్ ఫాక్టర్స్ -.అసలు ఇన్సూరెన్స్ భారత్ లో ఎలా పుట్టింది దానిచరిత్ర పూర్వోత్తరాలు  తెలుసు కోడం అవసరం  ఏమంటారు. ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ను భారత దేశంలో 19జనవరి 1956  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం అప్పటికే 245 కంపనీలు  పని చేస్తున్నాయని వీటి అన్నిటి ఒక గొడుగుకిందకు తీసుకు వచ్చేందుకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించింది.  అయితే అన్నీ ప్రధాన కంపెనీలే ఇవి నాలుగు రాష్ట్రాలలో మెట్రోపాలిటన్  నగ రాలలో అంటే 19999 నాటికి ప్రైవేట్ రంగం లో ఇన్సు రెన్స్ లేదని పరిశోదనలో వెల్లడి అయ్యింది. వాటి పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది నాన్  లైఫ్ ఇన్సూరెన్స్,,గా కేటగిరీ లుగా  విభాగించారు  అయితే  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ని జనరల్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తారు. ఈ రెండు ఇన్సూరెన్స్ లు ఐ ఆర్ డి ఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆథారిటీ అండ్ దవలప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇర్ డా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్య వేక్షిస్తుంది. ఇన్సూరెన్స్ కు కస్టోడియన్ గా  ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్ల హక్కుల పరి రక్షణకు ఇరిడా  క స్టో డియన్ అని చెప్పాలి. భారతదేశంలో 57 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 24 ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాగా 33 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలుఉన్నాయి. అందులో కొన్ని 7 పబ్లిక్ రంగం విభాగంలో పనిచేస్తున్నాయి. గతంలో కొన్నిదశాబ్దాలుగా ఇన్సూరెన్స్ అంటే ఠక్కున గుర్తికు వచ్చేది ఎల్ ఐ సి మాత్రమే అంటే జీవిత భీమా సంస్థ, అదే పెద్ద వ్యవస్థ గా పేరెన్నిక గన్న ఏకైక సంస్థ అంటే అతిశయోక్ఠీ  కాదేమో. లేదా కొన్ని పేరెన్నిక సంస్థలుగా చెప్పుకునే సంస్థలలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్  ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, మాత్రమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, రంగం గా పేర్కొన్నారు.దీనిగురించిన  మరిన్ని వివరాలు.                               

తెలుసుకుందాం... 

ప్రభుత్వ రంగంలో కొనసాగిన ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విస్తరించింది. ఇరిడా  ఇన్సూరెన్స్  రెగ్యు లేటరీ  ఆధారిటీ ఆఫ్  ఇండియా లో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తరువాత ఇన్సూరెన్స్ రెగ్యులే టరి  ఛత్రం 1999 ప్రకారం. ప్రైవేట్ రంగంలో ఎఫ్ డి ఏ అంటే  ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ను ఆహ్వానించింది భారతప్రభుత్వం. అయితే చట్ట ప్రకారం ఎఫ్ డి ఐ లను 26% పరిమితి విదిస్తూ 2016 లో చట్టం  తీసుకు  వచ్చింది. ఇక ప్రైవేట్ రంగం లోకి ఇన్సు రెన్స్ ఎప్పుడైతే పెట్టుబడులకు ఆహ్వానం పలికిందో 2000 సంవత్సరానికి, ఇన్సూరెన్స్ రంగం రూపు రేఖలు మారిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు 30 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ రాగాన్ని శాశిస్తు న్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇంకా మరెన్నో కంపెనీలు ఇరిడా అనుమతికోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.                                                                                                                                               
 ప్రైవేట్ రంగంలో దూసుకు పోతున్న ఇన్సూరెన్స్ రంగం లో 19 జనరల్ ఇన్సురేయన్స్ కంపెనీలు, 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు , విదేశీ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసి నట్లు  అయ్యిందని నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. భారత దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో  విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో ఎఫ్ డి ఐ ని 2000 సంవత్సరానికి 26% పరిమితి  విదించింది. తరువాత 2014 లో ఎఫ్ డి ఐ ను 49% పరిమితి  ని విదిస్తూ ఇరిడా ఇన్సూరెన్స్ చట్టం 2015 లో మార్పులు చేసిందని విశ్లేషకులు వివరించారు. అయితే ఇప్పటికీ ఎల్ ఐ సీ ఇన్సూరెన్స్ రంగం పై తన ఆది పత్యాన్ని కొనసాగించడం విశేషం ప్రవైట్ రంగంలో వచ్చిన హెచ్ డీ ఎఫ్ సీ, ఐ సి ఐసి ఐ , ఎస్ బి ఐ, బ్యాంకులు సైతం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్  కంపెనీలువచ్చి చేరడం తో 2017 నాటికి ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం లో  విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇన్సు రెన్స్ కంపెనీలు ఆతి తక్కువ ప్రీమియం, తో పాటు, అధిక మొత్తంలో క్లైమ్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సహజంగానే డోమెస్టిక్ ఎకానమీ ని నియంత్రించ గలిగింది.

చదువు కున్న వాళ్ళకి సామాన్యుడికి అర్ధం కాని అంశం  అసలు తాము తీసుకున్న పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? లేక, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా? అనే ది ఆర్ధం కాక అదేపనిగా ఇన్సూరెన్స్ సిబ్బంది ని తప్పించుకోలేక తప్పని స్థితి లో ఇన్సూరెన్స్ తీసుకున్నామని అంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, మధ్య ఉన్న తేడాను ఎలా గమనించాలి. వీటి ప్రీమియం వివరాలు నిపుణులని అడిగి తెలు సుకుందాం.                                                                                                          
 లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఒప్పందం అని నిబందనలు చెపుతున్నాయి. ఒప్పందం ప్రకారం వ్యక్తికినామినీ కి ఇస్తామన్న వాగ్దానం ప్రకారం నగదు చెల్లించడమ్ అని నిపుణులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్  ప్రకారం  ప్రీమియం చెల్లిస్తున్నంత  వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది.  ఎగ్రిమెంట్ జరిగిన నాటినుంచి లేదా చెప్పిన   తేదీ నుండి నిర్దేశిత తేదీ ప్రకారం. లేదా అనుకోకుండా, మరణించినా, విరమించినా అనారోగ్యం పాలైనా  పాలసీదారు ఒప్పందం ప్రకారం ప్రీమియం చెల్లింపు

ఇన్సూరెన్స్ – నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన                                                

యాంకర్ 5)  నానాటికీ  భారీ రంగం గా ఎదుగుతున్న ఇన్సూరెన్స్ రంగం లో అసలు ఇన్సూరెన్స్ ఎన్నిరకాలు అన్న విష యం ముందుగా  తెలుసు కుందాం ఒకటి లైఫ్ ఇసురేన్స్ ,రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ను జీవన భీమా, అని  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సాధారణ భీమా  అని పేర్కొన్నారు. అటు వ్యక్తి లేదా ఇంటి పెద్ద లేదా అయింటి  పెద్ద పైనా  ఆధారపడి జీవిస్తున్నకుటుంబానికి ఇచ్చే భీమా ని జీవన భీమా అని అంటారు. సాధారణ భీమా ని జనరల్ ఇన్సూరెన్స్ గా పేర్కొన్నారు వాహనము  ఇల్లు, పశువులు, పంటలు, వాహనాలు, ఆరోగ్య భీమా శాతం సాధారణ భీమా పరిధి లోకి వస్తుంది.  ఆవివరాలు అన్నీ  పూర్తిగా స్పస్టం గా వివరంగా తెలుసుకుందాం.                                                                                                                                                  
ఒక్క మాటలో చెప్పా లంటే  ప్రజలకు అత్యంత విలువైన ది  ప్రాణం ,జీవన భీమా పరిధిలోకి పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితిలో  చనిపోయిన వ్యక్తికి, లేదా అతని పై ఆధార పడే వారికి భీమా కంపెనీలు కొంత నగదును పాలసీ కొనుగోలు దారు కుటుంబానికి ఇస్తారు. ఇంటి పెద్ద లేనందు వల్ల ఆ ఇంటిని నడపడం కష్ట  ఆ సాధ్యం, అలాటి ఆర్ధిక సమస్యలనుండి బయట పడేందుకు జీవిత భీమా తీసుకోడం  అవసరం అని ఇన్సూరెన్స్ నిపుణులు తెలియ జేస్తారు. రెండవది సాధారణ భీమా, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ పరిభాషలో పేర్కొన్నారు. ఈ పరిధిలో     ఆ రోగ్య భీమా , చికిత్స,  వాహనం, పంట లు, ఇల్లు అన్నీ ఈ పరిధిలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముందుగా ఇంటి భీమా సాధారణ భీమా పరిధిలో ఉందని గ్రహించాలి. దీని వల్ల మీయింటిని భూకంపం, షార్ట్ సర్క్యూట్, వరద వల్ల మునిగి పోయినా, ఇన్సూరెన్స్ నుండి    సంరక్షించు కోవచ్చని   అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఈ పాలసీ కింద నసఃతపరిహారం పొందవచ్చని, అదీ మీరు తీసుకున్న పాలసీ విలువ పైన ఆధార పడిఉంటుందని నిపుణులు వివరించారు.                                                                           

సాధారణ భీమా పధకం పరిదిలో వచ్చే  అంశం ఆరోగ్య భీమా అదే హెల్త్  ఇన్సూరెన్స్ నేటి కాలంలో వైద్య ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి ఆరోగ్య భీమా తీసుకోడం వల్ల భీమా కంపనీలు. ఇచ్చే వైద్య ఖర్చులనుండి  కొంత మేర బయట పడవచ్చునని అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. ఈ ఆరోగ్య భీమా పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ కంపనీ  ఏ రకమైన వ్యాధి వచ్చినా , వైద్యానికి అయ్యే ఖర్చును ఆ కంపనీ  ఇస్తుంది.అయితే మీరు తీసుకునే పాలసీ విలువపైనే మీకు ఇవ్వాల్సిన క్లైమ్  ఆధార పడిఉంటుందని,  అని నిపుణులు తెలిపారు. సాధారణ భీమా పరిధిలోకి వచ్చే మరో  అంశం వాహనభీమా దేశంలో ఎక్కడైనా రోడ్డు పై వాహనం నడపినా వాహనాన్ని భీమా చేయడం తప్పనిసరి ఒక వేళ మీ వాహనానికి భీమా చేయకుండా రోడ్డు పై నడిపితే ట్రాఫిక్ పోలీసు జరిమానా విధిస్తారు వాహన చట్టం నిబంధనల ప్రకారం వాహనం వల్ల మీద్వారా మరొకరికి ప్రమాదం సంభవిస్త్గే వ్యక్తి గతంగా   మీరు ప్రమాదానికి గురి ఐనా పక్షం లో భీమా కంపనీ కొంత నగదు నష్ట పరిహారంగా ఇస్తుంది. ఒక వేళా మీవాహనం దొంగతనానికి గురి ఐనా, అదైనా ప్రమాదం జరిగినా  మీ     భీమా  పాలసీ  మీకు సహాయ పడుతుంది                                                                                                                                                          
ఈ భీమా పరిధిలోకి వచ్చిన మరో పధకం ప్రయాణ భీమా  ఈ భీమా ద్వారా మీరు యాత్ర చేస్తున్న సమయంలో వచ్చే నష్టం, నుంచి మిమ్మల్ల్ని కాపాడు తుంది. విహార యాత్రకు విదేశాలకు వెళ్ళి నప్పుడు ఒక వేళ ఏ దైనా ప్రమాదం జరిగితే మీ వస్తువులు చోరీకి గురి అయినప్పుడు, భీమా సంస్థ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణ భీమా పాలసీ మీ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రయాణ భీమా  కు సంబందించి ఒక్క కంపనీ  వీధి విధానాలను రూపొందించిందని కంప నీల షరతులకు లోబడి  పలాసీ లు వేరు వేరు గా ఉంటాయని నిపుణులు తెలిపారు.                                                                                
సాధారణ పరిధిలోకి వచ్చే మరో ఇన్సూరెన్స్ పాలసీ పంట భీమా పధకం క్రాప్ ఇన్సూరెన్స్ పధకంగా పేర్కొన్నారు. ఈ భీమా నియమ  నిబందనల ప్రకారం వ్యవసాయ రుణం తీసుకునే ప్రతి రైతు పంట భీమా తీసుకోడం తప్పనిసరి. పంట భీమా పాలసీ నిబందనల ప్రకారం పంటకు ఏ విధమైన నాష్టం కలిగినా, వ్భీమ కంపనీలు రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాయి. భీమా నిబందనల్ ప్రకారం పంట అగినికి అంటుకోవడం, పంట వరదలో చిక్కుకు పోవడం, పంటకు ఇతర తెగులు సోకి నస్గ్తపోయినా , కోతకు వచ్చిన పంట కోల్పోయినా పంట ఏ కారణం చేతైన పాడై పోయినా నష్ట పరి హరామ్ పొండా వచ్చని త్గెలియా చేస్తోంది. పంట భీమా పాలసీ లో ఖటి న మైన నియమ నిబంధనలవల్ల పాలసీ నగదు కన్నా తక్కువ నష్ట పరిహారం లభించనందు వల్ల రైతులలో పంట భీమా పట్ల ఆసక్తి  చూపక పోవడం గమనించాలి. వాస్తవానికి పంటచెడిపోయి నప్పుడు, పాడై పోయి నప్పుడు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భీమా కంపేనీలు ఆపంట పొలం పరిసరాలలో దగ్గర దగ్ఫ్గర గా ఉన్న పంటల నన్నిటిని సర్వే చేస్తారు ఎక్కువ మండి రైతులు నష్ట పోయి నప్పుడు మాత్రమే ఈ భీమా ఇస్తున్నారని దీని వల్ల భీమా తీసుకున్న తమకు పెద్దగా ఉపయోగం లేదని  రైతులు వాపోతున్నారు.                                                                                    
భీమారంగాన్ని సవివరంగా ప్రజలకు తెలపాలన్న లక్ష్యంగా మేము మాపతి సోదనలో తెలిసిన మరో భీమా వ్యాపార భీమా. నిజానికి ఏ కంపనీ ఉత్పాదక లేదా అమ్మకం జరిగే పరిశ్రమలు లేదా పెద్ద మొత్తంలో చేసే వ్యాపార్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. పెద పెద్ద  పరిశ్రమలలో ఉండే యంత్ర సామగ్రి, వల్ల ఏసీడ్ వల్ల బాయిలర్లు పేలడం,ప్లాస్టిక్, రసాయన, టైర్ల పరిశ్రమ, ఇలా పెద్ద పెద్ద పర్శ్రమలలో ఆగ్ని ప్రమాదాలు సహజంగా  జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ లేని పరిశ్రమలకు భారీ మొత్తం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. చట్ట ప్రకారం జరిగే చర్యలతో పాటు అందుకు అయ్యి ఖర్చు ను సైతం అటు భీమా సంస్థ కంపనీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూలం కషమ్ గా లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండే భీమా లు వాటివల్ల కలిగే లాభం, నష్టం. ----- నిపులతో వీటికి సంబందించిన ఆంశాల పై చర్చ -------.                                                                                      
యాంకర్ 6) ఇప్పుడు ఇన్సూరెన్స్ లు వాటిలో రకాలు ఏ ఇన్సూరెన్స్ ఏ పరిధిలో ఉంది నిపుణులు చెప్పిన సమాధానం చూశాంకదా ఇప్పుడు అసలు చిత్రమైనవిచిత్రమైన కదలు ఇన్సూరెన్స్ లో చోటు చేసుకున్న  దుష్టాంతరాలు  ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబందించిన కొన్ని వాస్తవాలని చూద్దాం. ఆసుపత్రులలో మీకు ఇన్సూరెన్స్ ఉందని అంటే రమ్మంటారు. ఆత్రువాత మనకి  ఇన్సూరెన్స్ మొత్తంలో ఉన్న పూర్తి క్లెయిమ్ ను ఎలా రాబట్టాలో రాబడతారు.  ఆచిత్రాలు ఒకసారి చూద్దామా.                                                                                                                                                                       వాయిస్ ఓవర్ 6) మీకు  మీకుఇన్సూరెన్స్ ఉందా అంటారు ఉందని అన్నారో మీరు బుక్ అయి పోయరన్న మాటే. అసలు ఇన్సూరెన్స్ పోలసీ ఎంత వరకు ఆంచనా వేస్తారు. దానిని బట్టి మీ సమస్య  పెద్దది మీకు సర్జరీ అవసరం అంటారు. వెంటనే ఎప్పుడు జాయిన్ అవుతారు. వెంటనే జాయిన్ అవ్వాలి లేదంటే మీ సమస్య   సీరియస్ ఇష్యూ ముందు అడ్మిట్ అవ్వండి టెస్ట్ చేశాక సమస్య పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.  అప్పుడు ట్రీట్ మెంట్ ట్  ఇవ్వాలి అంటూ రూమ్ ఆలో కేట్  చేస్తారు. సె లైన్ కామన్, టాబ్లెట్స్ కామన్,  పేటెంట్ కి భోజనం మేమే పెడతాం మీరు తీసుకు రావద్దు అంటూ అమ్మో పరవాలేదు అమ్మో ఇంటినుంచి తెచ్చుకునే బదులు ఇక్కడే ఇస్తారు కదా అనుకుని భీమా కదా ధీమా గావుంటారు.  తీరా చూస్తే రూమ్ రెంట్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్, మనం వాడినా వాడక పోయినా టవల్ సబ్బులు, న్యాప్ కీన్లు, నర్సింగ్ సేవలు. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వాళ్ళు వాడిన థియేటర్ సరంజామా,సూదులు, వగైరా, టిష్యూ పేపర్ లు సైతం వాడినా వా డక పోయినా వాటి కీ బిల్లులో అసలు బిల్లు కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తా రని బాదితులు వాపోతున్నారు. చివరన డిశ్చార్జ్ బిల్లు చూస్తే గుండె  ఘుబెల్  మంటుంది ఆంతా మీ ఇన్సూరెన్స్ కు తగ్గట్టు గానే మొత్తం బిల్లు క్లెయిమ్ చేస్తారు అప్ప్రూవల్ కు ఇన్సూరెన్స్ కంపనీకి పంపి అప్రూవల్ రాగానే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఒక్కోసారి మీ ఇన్సూరెన్స్ బిల్లు కన్నా కొంత అదనం గా వచ్చిన్నా ఆశ్చర్యం లేకపోలేదు. సొ మీరు ఇలాంటి సమస్య ఎదురయ్యిందా, అయితే కాస్త  జాగ్రత్తగా వినండి.  మీరు పెట్టిన క్లెయిమ్ ఇవ్వక పోయినా అదనంగా వచ్చే స్మస్యలకు ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళు ఎవరు అన్న సమ ధనం మానిపుణులు మీకు వివరిస్తారు.                                                           
------ఈ అం శం లోనే అసలు  ఆసుపత్రుల పై వస్తున్న ఆరోపణలు  వాస్తవమా కాదా ,అన్న విష యాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యజ మన్యాల సంఘం ప్రతినిధులు చెప్పాలి----  బైట్---                                                                                                                                  సమస్య  వచ్చిందంటే ఆసమయంలో ఎవరు దగ్గర లేకున్నా నిర్ణయం తీసుకోడం కష్టం దగ్గరలౌన్న నర్సింగ్ హోం కి వెళ్లలా లేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాల అన్నదే మీమాంస ఆసమయంలో నే తక్షణం చేయాల్సిన పరిస్తితి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్తితి అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రికి వేలాడమన్నా నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు రోగం బెత్తెడు బిల్లు  జా నేడు అన్నట్టుగా ఉంటుంది. అసలు సమస్య కు ట్రీట్మెంట్ ఇచ్చాం అంటారు. వాడినా వాడని వస్తువు బిల్లు నానా నెత్తి మీద రుద్ది బిల్లు తడిపి మోపెడు చేసి బిల్లీ కత్తి వెల్ల మంటూ సలహా ఇస్తార్. జర  జాగ్థే రహో అంటున్నాయి స్వీయ  అనుభవం వింటే మీకే ఆర్ధం అవుతుంది  ఆసుపత్రుల ఇన్సూరెన్స్ మాయ.                                                                                         

వాయిస్ ఓవర్ 7) మాయా మయా మాయా ఇదేంటి మాయ అనుకుంటున్నారు క దూ. ఒక్క సారి ఈమాయలో పడ్డారో మీకు లేనిరోగం తో పాటు అన్నీ గుర్తుకు వస్తాయి. .  ఇవిగో ఇవన్నీ నగరంలో పేరెన్నిక గన్న ఆసుపత్రు లే ఇక్కడ కాళ్ళు, కీళ్ళు, తల, వెన్నెముఖ, గుండె, కిడ్నీ, పురీషనాళం, ఊపిరి తిత్తులు, ఇలా ఒకటి పన్ను ,కన్నువెన్ను, ఆన్ని టికి ప్లాంట్లు, ఇన్ ప్లాంట్లు , చేయడంలో ప్రపంచంలో పేరు ఎన్నిక గన్న డాక్టర్ లే ఉంటారు. సేవలు అందిస్తారు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 300/ నుంచి 800/ కు తక్కువగా ఉండదు.  అసలు వచ్చిన  సమస్య  ఏమిటి అంటే దబ్భు పెడితే    ట్రీట్ మెంట్ కాస్ట్ తక్కువ,  ఇన్సూరెన్స్ తో అయితే ఎక్కువ ఇదేమి లాజిక్ అని అనుకుంటున్నారు? పాలసీ దారులు. ఇంకొందరు ఏదో ఒకటి ముందు  బయట పడ్డాం  కదా ఈ మీమాంస అవసరమా? అని అనుకుంటున్నారు. యెస్ అవసరమే ఎందుకంటే పాలసీ దారుల రక్షణ అవసరం కనుక  ఇరిడా నిర్దేశించిన ప్రమాణం ప్రకారం ఇన్సూరెన్స్ పెట్టుబడికి మనకు దక్కే లాభం ఎంత అని పెట్టుబడి దారులు అనుకుంటే పెట్టుబడి దారులు ఆలోచించేవాళ్లు. అటు ప్రైవేట్ , ఇటు ప్రభుత్వ రంగం లో పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా ఒస్తోంటే ఇంకా  ప్రైవెట్ రంగంలో మరిన్ని విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే ఆసుపత్రు లకు పండగ మాకు ఎందుకు ఇన్సూరెన్స్ దండగా అని సామాన్యుడు ఫీల్ అవుతున్నాడు. ఆడండి మనం కడుతున్న ఇన్సూరెన్స్లు మనకు కలిగే లాభం. మీ ఇన్సూరెన్స్ సంస్యలగురించి మాకు రాయండి  నేరుగా మా నిపుణులతో మాట్లా డండి . ఇన్సూరెన్లు క్లైములు వాటి పరిష్కారాలు వివిధ ర కా ల కేసులు ఇన్సూరెన్స్ పరిష్కారంలో అంబుట్స్మెన్ ఇచ్చే తీర్పులు న్యాయనిపుణుల   సలహా లు తదితర ఆంశాలు మరో ఎపిసోడ్ లో చర్చిద్దాం   అంటిల్ దేన్ కీప్  వాచింగ్ రాజ్ న్యూస్. 

శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి.  అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది.  ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.  శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు,  ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. విటమిన్ స,  యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.   ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.  మొత్తం రోగనిరోధక శక్తి,  హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి.  ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే.. ఉసిరి-తేనె.. తేనె కాంబినేషన్ లో  ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు    ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.   శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో  పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది,  శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్  ఇస్తుంది. ఎలా తినాలి.. టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి.  దీన్ని సమాన పరిమాణంలో  తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉసిరి-పసుపు.. ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.   పసుపులో  కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు  కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా  పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది,  శరీరాన్ని  డిటాక్స్  చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది ఎలా తీసుకోవాలి.. స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు  నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ,  ఒక  ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు. ఉసిరి-అల్లం..  అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది.  అల్లం శరీరంలో వేడిని  పెంచుతుంది. ఉసిరి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా  అల్లం రక్త  ప్రసరణను పెంచుతుంది,  ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది.   ఉసిరిలో ఉండే  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి.. 2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని  1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని  ఉదయాన్నే తీసుకోవాలి. ఉసిరి-బెల్లం.. ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.  ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.  ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు  చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్  శోషణను పెంచుతుంది.  శరీరానికి  వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎలా తీసుకోవాలి.. ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు,  జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి.  చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!

ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!

సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!

నేటికాలంలో ఆహారం పరంగా చాలా మార్పులు వచ్చాయి.  ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్   తప్పనిసరి. అయితే చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను స్కూలుకు పంపిస్తూ చాలా బీజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో టిపిన్, వంట అన్నీ తీరికగా చేసే సమయం ఉండదు. ఇలాంటి వారిలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్, శాండ్విచ్ వంటివి తీసుకుంటారు. దీని కోసం వైట్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు.  ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు.  అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారిలో కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.  ఇంతకీ అవేంటంటే?.. డయాబెటిస్ వైట్ బ్రెడ్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీన్ని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది . ఇది శరీర ఇన్సులిన్ సమతుల్యతను  దెబ్బతీస్తుంది. బరువు  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి  బ్రెడ్  అతిపెద్ద శత్రువు. ఇందులో కేలరీలు,  కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఉండదు. దీన్ని తినడం వల్ల  త్వరగా కడుపు నిండదు. ఇది అతిగా తినడం వల్ల శరీరంలో  అధిక కొవ్వు పేరుకుపోతుంది. జీర్ణక్రియ  బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రేగులలో జిగట పదార్థంగా పనిచేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఇది  జీర్ణం కావడం చాలా కష్టం. రోజూ బ్రెడ్ తినడం వల్ల తరచుగా మలబద్ధకం,  ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పోషకాలు గోధుమలలో ఉండే సహజ పోషకాలన్నీ తొలగిపోయాక మిగిలే పిండితో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో చాలా తక్కువ విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్లు ఉంటాయి.  బ్రెడ్ తినడం ద్వారా  శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ లభించవు.   ఈ కారణంగా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గుండె ఆరోగ్యం మార్కెట్లలో అమ్మే  బ్రెడ్‌లు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్‌లు,  ఉప్పు  వేసి తయారు చేస్తారు. వీటిలో  అధిక సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు పెంచుతుంది.  ఎక్కువ కాలం బ్రెడ్ ను కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది. -రూపశ్రీ

ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు  చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు.  అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం.. నిమ్మకాయ నీరు  క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ  ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు  తాగడం వల్ల  శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద  నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు? చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.   ఎలక్ట్రోలైట్ అంటే..  పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్,  బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు.  ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను  వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి  గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి. ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత.. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.  మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల  తలనొప్పి, గుండె లయ  గందరగోళంగా ఉండటం,  కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.  అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.

ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!

  సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు.. ఇతర మాంసాలతో పోలిస్తే  జీర్ణం కావడానకి కూడా తేలికగా ఉంటుంది.  చికెన్ లేకుండా భోజనం చేయలేని వారు చాలామంది ఉంటున్నారు.  ముక్క లేకపోతే ముద్ద దిగదు అని చాలా గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే రోజూ చికెన్ తినేవారికి చాలా పెద్ద షాకింగ్ న్యూస్.  రోజూ చికెన్ తినడం వల్ల జరిగేదేంటో వివరంగా చెప్పేశారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే.. వైద్యులు చెప్పేదాన్ని బట్టి కడుపు క్యాన్సర్ మెల్లిగా పెరుగుతూ వస్తుంది.  ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణం అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ ను రెగ్యులర్ గా ఎక్కువ రోజులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.  చికెన్ ను ఎలా వండుతున్నారనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు. అధికంగా చికెన్ తినడం వల్ల కడుపు,  పేగు సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, చికెన్ తినడం వల్ల మాత్రమే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని కాదు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు చికెన్ రెగ్యులర్ గా తినడం కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర ఆహారాల నుండి లభించాల్సిన చాలా పోషకాలు లోపిస్తాయని. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా ఒకే ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కడుపు లోపల సహజంగా ఉండే రక్షణ పొర బలహీనం అవుతుందని చెబుతున్నారు. రోజూ చికెన్ తినడం, అది కూడా బయట తినడం, వేయించిన చికెన్,  లేదా వేయించిన ఆహారాలు,  బయటి ఆహారాలు తినడం, తక్కువగా కూరగాయలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చికెన్ తింటే క్యాన్సర్ ఎలా వస్తుంది? శాకాహారాలతో పోలిస్తే చికెన్ జీర్ణం అవడం కాస్త కష్టం. రోజూ చికెన్ తినడం వల్ల జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అధికంగా నూనె లేదా కారం వంటివి తిన్నప్పుడు కడుపులోపలి పొరకు మంట కలుగుతుంది. దీని వల్ల వెంటనే సమస్య కనిపించకపోయినా ఎక్కువ కాలం కంటిన్యూగా చికెన్ తింటే కడుపు లోపలి రక్షణ పొర దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ మంట మీద వండిన చికెన్ ను, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన చికెన్ ను రెగ్యులర్ గా తీసుకుంటే హెటెరోసైక్లిక్ అమైన్స్ అనే హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలను చాలా కాలం పాటు పదే పదే తీసుకుంటే, అవి కణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి రోజూ చికెన్ తినేవారు.. దాన్ని ఎలా వండుతున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాన్ని గమనించుకోవాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఈ చిన్న అలవాట్లే మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...