భీమా – ధీమా

మీరు భీమా కట్టరా? అయితే మీరు ధీమా గా ఉన్నారన్న మాట. అయితే మరీ అంతా ధీమాగా ఉండకంటి, ఇందులో కూడా  కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి అవి ఏమిటో సమస్యకు పరిష్కారానికి ప్రయత్నమే  చేయడమే   మా భీమా – ధీమా కార్యక్రమం. సొ వెల్కంటు  భీమా

ధీమా కార్యక్రమం... మొంటేజ...

                                                                                                    
మనిషికి భీమా ఉంటే ధీమా ఏ వేరని అని అనుకుంటున్నారు సామాన్యులు.  కొందరికి భీమా భారంగా మారిందని. ప్రతి సంవత్సరం మనం పెట్టె పెట్టుబడికి మనకు వచ్చే  ఆదాయం ఎంత అన్న ప్రశ్న వేదిస్తోంది. ఇది నిజం అయితే సంవత్సరం వచ్చిందటే  ఇన్సూరెన్స్ పోలసీ కోసం కంపెనీలు పడరాని పాట్లుపడతారు. మీకు 80 సి ప్రకారం   ట్యాక్స్ ఎగ్జంషన్  వస్తుంది అంటూ అసలు ఒప్పంద పాత్రల  చూడ కుండానే సంతకం చేసి ఇచ్చేస్తున్నారు పోలసీ దారులు. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ విలువ ఎంత? ఏ పాలసీ కి ఎంత కట్టాలి ? పాలసీ మెశ్చురి టీ ఎన్నాళ్లు?  భీమా మధ్యలో పాలసీ దారుకు జరిగే నష్టాన్ని ఎలా లెక్క కడతారు? కాష్ లెస్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ పరిధి లోకి వస్తుంది? రీ ఎంబర్స్ మెంట్ పాలసీ అంటే ఏ మిటి?  ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అంటే  ఏమిటి ? లైఫ్ ఇన్సూరెన్స్.నాన్ లైఫ్  ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అన సందేహాల కు మానిపుణులు ఇచ్చే సమ ధానాలు , సలహాలు సూచనలు మీకోసం అందిస్తోంది రాజ్ న్యూస్  అసలు ఇన్సూరెన్స్ లో ఉన్న నిజాలు,  ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, క్లెయిమ్ లు  ఇవ్వడం లో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తే ఎవరిని సంప్రదించాలి? కోర్టుకు వెళ్తే సమస్య మరింతజటిలం అయ్యే అవకాశం ఉన్నదున అంబుట్స్ మెన్ కమిటీ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న సందేహాలకు  సమాధానం    భీమా – ధీమా . అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ ఏ . వి  చూద్దాం.                                                                                                                        
 ఇన్సూరెన్స్ ఈ పదం గురించి తెలియని వాళ్ళు ఈ మధ్య కాలం లో లేరంటే అతిశయోక్తి లేదు నిజానికి తెలిసో తెలియక ఎప్పుడో ఎక్కడో ఏ స్నేహితుడి ప్రోత్సాహంతోనో  భీమా అస్దే ఇన్సూరెన్స్ కట్టేఉంటారు. దానిని వినియోగించుకునే ఉంటారు. లేదా మధ్యలోనే ప్రీమియం కట్ట లేక ఆపేసి ఉంటారు.  అయితే ఇన్సూరెన్స్ ఈ రోజు నిత్య  అవసరంగా మారింది. ముఖ్యంగా దిగువా మధ్య త్రాగతి ప్రజలకి , ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి గా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు  ఊ దర కొట్టే ప్రకటనలు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల కు  భారీ కమీషన్లు ముడుతూ  ఉండడం తో  సంవత్సరానికి 7000/ రూపాయలు కట్టండి ఇన్సూరెన్స్ మీకు నెల రోజుల్లో ఆక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ  అనారోగ్య సంస్య వస్స్థే మీకు దగ్గరలో ఉన్న అసు పత్రి  లో  ఐనా చేరండి. ఇది క్యాష్ లెస్ పాలసీ అంటూ చెప్పగానే ఏజెంట్ల మాటలను నమ్మి డబ్బు కడుతున్నారు పాలసీదారులు. మీ పాలసీ కి సం అస్సుర్డ్ అమౌంట్ 50000/ ఆక్షరాలా ఐదు లక్షలు వస్తుంది అని అనగానే అయితే తీసుకుందాం డబ్బు ఉన్న రోజు ఉంటుంది లేని రోజూ ఉంటుంది. అత్యవసర సమయంలో ఆడుకునే బీమా ఉందిగా అనుకుని ధీమా గా  ఉంటారు అసలు భీమలు ఎన్నిరకాలు  ఏ పాలసీ పెట్టుబడి దారుకు లాభ దాయకం అన్న అంశాలు నిపుణులు చెప్తారు లెట్స్ గో  ఫోర్ ఫాక్టర్స్ -.అసలు ఇన్సూరెన్స్ భారత్ లో ఎలా పుట్టింది దానిచరిత్ర పూర్వోత్తరాలు  తెలుసు కోడం అవసరం  ఏమంటారు. ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ను భారత దేశంలో 19జనవరి 1956  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం అప్పటికే 245 కంపనీలు  పని చేస్తున్నాయని వీటి అన్నిటి ఒక గొడుగుకిందకు తీసుకు వచ్చేందుకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించింది.  అయితే అన్నీ ప్రధాన కంపెనీలే ఇవి నాలుగు రాష్ట్రాలలో మెట్రోపాలిటన్  నగ రాలలో అంటే 19999 నాటికి ప్రైవేట్ రంగం లో ఇన్సు రెన్స్ లేదని పరిశోదనలో వెల్లడి అయ్యింది. వాటి పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది నాన్  లైఫ్ ఇన్సూరెన్స్,,గా కేటగిరీ లుగా  విభాగించారు  అయితే  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ని జనరల్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తారు. ఈ రెండు ఇన్సూరెన్స్ లు ఐ ఆర్ డి ఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆథారిటీ అండ్ దవలప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇర్ డా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్య వేక్షిస్తుంది. ఇన్సూరెన్స్ కు కస్టోడియన్ గా  ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్ల హక్కుల పరి రక్షణకు ఇరిడా  క స్టో డియన్ అని చెప్పాలి. భారతదేశంలో 57 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 24 ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాగా 33 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలుఉన్నాయి. అందులో కొన్ని 7 పబ్లిక్ రంగం విభాగంలో పనిచేస్తున్నాయి. గతంలో కొన్నిదశాబ్దాలుగా ఇన్సూరెన్స్ అంటే ఠక్కున గుర్తికు వచ్చేది ఎల్ ఐ సి మాత్రమే అంటే జీవిత భీమా సంస్థ, అదే పెద్ద వ్యవస్థ గా పేరెన్నిక గన్న ఏకైక సంస్థ అంటే అతిశయోక్ఠీ  కాదేమో. లేదా కొన్ని పేరెన్నిక సంస్థలుగా చెప్పుకునే సంస్థలలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్  ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, మాత్రమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, రంగం గా పేర్కొన్నారు.దీనిగురించిన  మరిన్ని వివరాలు.                               

తెలుసుకుందాం... 

ప్రభుత్వ రంగంలో కొనసాగిన ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విస్తరించింది. ఇరిడా  ఇన్సూరెన్స్  రెగ్యు లేటరీ  ఆధారిటీ ఆఫ్  ఇండియా లో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తరువాత ఇన్సూరెన్స్ రెగ్యులే టరి  ఛత్రం 1999 ప్రకారం. ప్రైవేట్ రంగంలో ఎఫ్ డి ఏ అంటే  ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ను ఆహ్వానించింది భారతప్రభుత్వం. అయితే చట్ట ప్రకారం ఎఫ్ డి ఐ లను 26% పరిమితి విదిస్తూ 2016 లో చట్టం  తీసుకు  వచ్చింది. ఇక ప్రైవేట్ రంగం లోకి ఇన్సు రెన్స్ ఎప్పుడైతే పెట్టుబడులకు ఆహ్వానం పలికిందో 2000 సంవత్సరానికి, ఇన్సూరెన్స్ రంగం రూపు రేఖలు మారిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు 30 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ రాగాన్ని శాశిస్తు న్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇంకా మరెన్నో కంపెనీలు ఇరిడా అనుమతికోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.                                                                                                                                               
 ప్రైవేట్ రంగంలో దూసుకు పోతున్న ఇన్సూరెన్స్ రంగం లో 19 జనరల్ ఇన్సురేయన్స్ కంపెనీలు, 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు , విదేశీ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసి నట్లు  అయ్యిందని నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. భారత దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో  విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో ఎఫ్ డి ఐ ని 2000 సంవత్సరానికి 26% పరిమితి  విదించింది. తరువాత 2014 లో ఎఫ్ డి ఐ ను 49% పరిమితి  ని విదిస్తూ ఇరిడా ఇన్సూరెన్స్ చట్టం 2015 లో మార్పులు చేసిందని విశ్లేషకులు వివరించారు. అయితే ఇప్పటికీ ఎల్ ఐ సీ ఇన్సూరెన్స్ రంగం పై తన ఆది పత్యాన్ని కొనసాగించడం విశేషం ప్రవైట్ రంగంలో వచ్చిన హెచ్ డీ ఎఫ్ సీ, ఐ సి ఐసి ఐ , ఎస్ బి ఐ, బ్యాంకులు సైతం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్  కంపెనీలువచ్చి చేరడం తో 2017 నాటికి ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం లో  విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇన్సు రెన్స్ కంపెనీలు ఆతి తక్కువ ప్రీమియం, తో పాటు, అధిక మొత్తంలో క్లైమ్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సహజంగానే డోమెస్టిక్ ఎకానమీ ని నియంత్రించ గలిగింది.

చదువు కున్న వాళ్ళకి సామాన్యుడికి అర్ధం కాని అంశం  అసలు తాము తీసుకున్న పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? లేక, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా? అనే ది ఆర్ధం కాక అదేపనిగా ఇన్సూరెన్స్ సిబ్బంది ని తప్పించుకోలేక తప్పని స్థితి లో ఇన్సూరెన్స్ తీసుకున్నామని అంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, మధ్య ఉన్న తేడాను ఎలా గమనించాలి. వీటి ప్రీమియం వివరాలు నిపుణులని అడిగి తెలు సుకుందాం.                                                                                                          
 లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఒప్పందం అని నిబందనలు చెపుతున్నాయి. ఒప్పందం ప్రకారం వ్యక్తికినామినీ కి ఇస్తామన్న వాగ్దానం ప్రకారం నగదు చెల్లించడమ్ అని నిపుణులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్  ప్రకారం  ప్రీమియం చెల్లిస్తున్నంత  వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది.  ఎగ్రిమెంట్ జరిగిన నాటినుంచి లేదా చెప్పిన   తేదీ నుండి నిర్దేశిత తేదీ ప్రకారం. లేదా అనుకోకుండా, మరణించినా, విరమించినా అనారోగ్యం పాలైనా  పాలసీదారు ఒప్పందం ప్రకారం ప్రీమియం చెల్లింపు

ఇన్సూరెన్స్ – నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన                                                

యాంకర్ 5)  నానాటికీ  భారీ రంగం గా ఎదుగుతున్న ఇన్సూరెన్స్ రంగం లో అసలు ఇన్సూరెన్స్ ఎన్నిరకాలు అన్న విష యం ముందుగా  తెలుసు కుందాం ఒకటి లైఫ్ ఇసురేన్స్ ,రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ను జీవన భీమా, అని  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సాధారణ భీమా  అని పేర్కొన్నారు. అటు వ్యక్తి లేదా ఇంటి పెద్ద లేదా అయింటి  పెద్ద పైనా  ఆధారపడి జీవిస్తున్నకుటుంబానికి ఇచ్చే భీమా ని జీవన భీమా అని అంటారు. సాధారణ భీమా ని జనరల్ ఇన్సూరెన్స్ గా పేర్కొన్నారు వాహనము  ఇల్లు, పశువులు, పంటలు, వాహనాలు, ఆరోగ్య భీమా శాతం సాధారణ భీమా పరిధి లోకి వస్తుంది.  ఆవివరాలు అన్నీ  పూర్తిగా స్పస్టం గా వివరంగా తెలుసుకుందాం.                                                                                                                                                  
ఒక్క మాటలో చెప్పా లంటే  ప్రజలకు అత్యంత విలువైన ది  ప్రాణం ,జీవన భీమా పరిధిలోకి పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితిలో  చనిపోయిన వ్యక్తికి, లేదా అతని పై ఆధార పడే వారికి భీమా కంపెనీలు కొంత నగదును పాలసీ కొనుగోలు దారు కుటుంబానికి ఇస్తారు. ఇంటి పెద్ద లేనందు వల్ల ఆ ఇంటిని నడపడం కష్ట  ఆ సాధ్యం, అలాటి ఆర్ధిక సమస్యలనుండి బయట పడేందుకు జీవిత భీమా తీసుకోడం  అవసరం అని ఇన్సూరెన్స్ నిపుణులు తెలియ జేస్తారు. రెండవది సాధారణ భీమా, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ పరిభాషలో పేర్కొన్నారు. ఈ పరిధిలో     ఆ రోగ్య భీమా , చికిత్స,  వాహనం, పంట లు, ఇల్లు అన్నీ ఈ పరిధిలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముందుగా ఇంటి భీమా సాధారణ భీమా పరిధిలో ఉందని గ్రహించాలి. దీని వల్ల మీయింటిని భూకంపం, షార్ట్ సర్క్యూట్, వరద వల్ల మునిగి పోయినా, ఇన్సూరెన్స్ నుండి    సంరక్షించు కోవచ్చని   అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఈ పాలసీ కింద నసఃతపరిహారం పొందవచ్చని, అదీ మీరు తీసుకున్న పాలసీ విలువ పైన ఆధార పడిఉంటుందని నిపుణులు వివరించారు.                                                                           

సాధారణ భీమా పధకం పరిదిలో వచ్చే  అంశం ఆరోగ్య భీమా అదే హెల్త్  ఇన్సూరెన్స్ నేటి కాలంలో వైద్య ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి ఆరోగ్య భీమా తీసుకోడం వల్ల భీమా కంపనీలు. ఇచ్చే వైద్య ఖర్చులనుండి  కొంత మేర బయట పడవచ్చునని అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. ఈ ఆరోగ్య భీమా పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ కంపనీ  ఏ రకమైన వ్యాధి వచ్చినా , వైద్యానికి అయ్యే ఖర్చును ఆ కంపనీ  ఇస్తుంది.అయితే మీరు తీసుకునే పాలసీ విలువపైనే మీకు ఇవ్వాల్సిన క్లైమ్  ఆధార పడిఉంటుందని,  అని నిపుణులు తెలిపారు. సాధారణ భీమా పరిధిలోకి వచ్చే మరో  అంశం వాహనభీమా దేశంలో ఎక్కడైనా రోడ్డు పై వాహనం నడపినా వాహనాన్ని భీమా చేయడం తప్పనిసరి ఒక వేళ మీ వాహనానికి భీమా చేయకుండా రోడ్డు పై నడిపితే ట్రాఫిక్ పోలీసు జరిమానా విధిస్తారు వాహన చట్టం నిబంధనల ప్రకారం వాహనం వల్ల మీద్వారా మరొకరికి ప్రమాదం సంభవిస్త్గే వ్యక్తి గతంగా   మీరు ప్రమాదానికి గురి ఐనా పక్షం లో భీమా కంపనీ కొంత నగదు నష్ట పరిహారంగా ఇస్తుంది. ఒక వేళా మీవాహనం దొంగతనానికి గురి ఐనా, అదైనా ప్రమాదం జరిగినా  మీ     భీమా  పాలసీ  మీకు సహాయ పడుతుంది                                                                                                                                                          
ఈ భీమా పరిధిలోకి వచ్చిన మరో పధకం ప్రయాణ భీమా  ఈ భీమా ద్వారా మీరు యాత్ర చేస్తున్న సమయంలో వచ్చే నష్టం, నుంచి మిమ్మల్ల్ని కాపాడు తుంది. విహార యాత్రకు విదేశాలకు వెళ్ళి నప్పుడు ఒక వేళ ఏ దైనా ప్రమాదం జరిగితే మీ వస్తువులు చోరీకి గురి అయినప్పుడు, భీమా సంస్థ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణ భీమా పాలసీ మీ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రయాణ భీమా  కు సంబందించి ఒక్క కంపనీ  వీధి విధానాలను రూపొందించిందని కంప నీల షరతులకు లోబడి  పలాసీ లు వేరు వేరు గా ఉంటాయని నిపుణులు తెలిపారు.                                                                                
సాధారణ పరిధిలోకి వచ్చే మరో ఇన్సూరెన్స్ పాలసీ పంట భీమా పధకం క్రాప్ ఇన్సూరెన్స్ పధకంగా పేర్కొన్నారు. ఈ భీమా నియమ  నిబందనల ప్రకారం వ్యవసాయ రుణం తీసుకునే ప్రతి రైతు పంట భీమా తీసుకోడం తప్పనిసరి. పంట భీమా పాలసీ నిబందనల ప్రకారం పంటకు ఏ విధమైన నాష్టం కలిగినా, వ్భీమ కంపనీలు రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాయి. భీమా నిబందనల్ ప్రకారం పంట అగినికి అంటుకోవడం, పంట వరదలో చిక్కుకు పోవడం, పంటకు ఇతర తెగులు సోకి నస్గ్తపోయినా , కోతకు వచ్చిన పంట కోల్పోయినా పంట ఏ కారణం చేతైన పాడై పోయినా నష్ట పరి హరామ్ పొండా వచ్చని త్గెలియా చేస్తోంది. పంట భీమా పాలసీ లో ఖటి న మైన నియమ నిబంధనలవల్ల పాలసీ నగదు కన్నా తక్కువ నష్ట పరిహారం లభించనందు వల్ల రైతులలో పంట భీమా పట్ల ఆసక్తి  చూపక పోవడం గమనించాలి. వాస్తవానికి పంటచెడిపోయి నప్పుడు, పాడై పోయి నప్పుడు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భీమా కంపేనీలు ఆపంట పొలం పరిసరాలలో దగ్గర దగ్ఫ్గర గా ఉన్న పంటల నన్నిటిని సర్వే చేస్తారు ఎక్కువ మండి రైతులు నష్ట పోయి నప్పుడు మాత్రమే ఈ భీమా ఇస్తున్నారని దీని వల్ల భీమా తీసుకున్న తమకు పెద్దగా ఉపయోగం లేదని  రైతులు వాపోతున్నారు.                                                                                    
భీమారంగాన్ని సవివరంగా ప్రజలకు తెలపాలన్న లక్ష్యంగా మేము మాపతి సోదనలో తెలిసిన మరో భీమా వ్యాపార భీమా. నిజానికి ఏ కంపనీ ఉత్పాదక లేదా అమ్మకం జరిగే పరిశ్రమలు లేదా పెద్ద మొత్తంలో చేసే వ్యాపార్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. పెద పెద్ద  పరిశ్రమలలో ఉండే యంత్ర సామగ్రి, వల్ల ఏసీడ్ వల్ల బాయిలర్లు పేలడం,ప్లాస్టిక్, రసాయన, టైర్ల పరిశ్రమ, ఇలా పెద్ద పెద్ద పర్శ్రమలలో ఆగ్ని ప్రమాదాలు సహజంగా  జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ లేని పరిశ్రమలకు భారీ మొత్తం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. చట్ట ప్రకారం జరిగే చర్యలతో పాటు అందుకు అయ్యి ఖర్చు ను సైతం అటు భీమా సంస్థ కంపనీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూలం కషమ్ గా లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండే భీమా లు వాటివల్ల కలిగే లాభం, నష్టం. ----- నిపులతో వీటికి సంబందించిన ఆంశాల పై చర్చ -------.                                                                                      
యాంకర్ 6) ఇప్పుడు ఇన్సూరెన్స్ లు వాటిలో రకాలు ఏ ఇన్సూరెన్స్ ఏ పరిధిలో ఉంది నిపుణులు చెప్పిన సమాధానం చూశాంకదా ఇప్పుడు అసలు చిత్రమైనవిచిత్రమైన కదలు ఇన్సూరెన్స్ లో చోటు చేసుకున్న  దుష్టాంతరాలు  ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబందించిన కొన్ని వాస్తవాలని చూద్దాం. ఆసుపత్రులలో మీకు ఇన్సూరెన్స్ ఉందని అంటే రమ్మంటారు. ఆత్రువాత మనకి  ఇన్సూరెన్స్ మొత్తంలో ఉన్న పూర్తి క్లెయిమ్ ను ఎలా రాబట్టాలో రాబడతారు.  ఆచిత్రాలు ఒకసారి చూద్దామా.                                                                                                                                                                       వాయిస్ ఓవర్ 6) మీకు  మీకుఇన్సూరెన్స్ ఉందా అంటారు ఉందని అన్నారో మీరు బుక్ అయి పోయరన్న మాటే. అసలు ఇన్సూరెన్స్ పోలసీ ఎంత వరకు ఆంచనా వేస్తారు. దానిని బట్టి మీ సమస్య  పెద్దది మీకు సర్జరీ అవసరం అంటారు. వెంటనే ఎప్పుడు జాయిన్ అవుతారు. వెంటనే జాయిన్ అవ్వాలి లేదంటే మీ సమస్య   సీరియస్ ఇష్యూ ముందు అడ్మిట్ అవ్వండి టెస్ట్ చేశాక సమస్య పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.  అప్పుడు ట్రీట్ మెంట్ ట్  ఇవ్వాలి అంటూ రూమ్ ఆలో కేట్  చేస్తారు. సె లైన్ కామన్, టాబ్లెట్స్ కామన్,  పేటెంట్ కి భోజనం మేమే పెడతాం మీరు తీసుకు రావద్దు అంటూ అమ్మో పరవాలేదు అమ్మో ఇంటినుంచి తెచ్చుకునే బదులు ఇక్కడే ఇస్తారు కదా అనుకుని భీమా కదా ధీమా గావుంటారు.  తీరా చూస్తే రూమ్ రెంట్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్, మనం వాడినా వాడక పోయినా టవల్ సబ్బులు, న్యాప్ కీన్లు, నర్సింగ్ సేవలు. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వాళ్ళు వాడిన థియేటర్ సరంజామా,సూదులు, వగైరా, టిష్యూ పేపర్ లు సైతం వాడినా వా డక పోయినా వాటి కీ బిల్లులో అసలు బిల్లు కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తా రని బాదితులు వాపోతున్నారు. చివరన డిశ్చార్జ్ బిల్లు చూస్తే గుండె  ఘుబెల్  మంటుంది ఆంతా మీ ఇన్సూరెన్స్ కు తగ్గట్టు గానే మొత్తం బిల్లు క్లెయిమ్ చేస్తారు అప్ప్రూవల్ కు ఇన్సూరెన్స్ కంపనీకి పంపి అప్రూవల్ రాగానే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఒక్కోసారి మీ ఇన్సూరెన్స్ బిల్లు కన్నా కొంత అదనం గా వచ్చిన్నా ఆశ్చర్యం లేకపోలేదు. సొ మీరు ఇలాంటి సమస్య ఎదురయ్యిందా, అయితే కాస్త  జాగ్రత్తగా వినండి.  మీరు పెట్టిన క్లెయిమ్ ఇవ్వక పోయినా అదనంగా వచ్చే స్మస్యలకు ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళు ఎవరు అన్న సమ ధనం మానిపుణులు మీకు వివరిస్తారు.                                                           
------ఈ అం శం లోనే అసలు  ఆసుపత్రుల పై వస్తున్న ఆరోపణలు  వాస్తవమా కాదా ,అన్న విష యాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యజ మన్యాల సంఘం ప్రతినిధులు చెప్పాలి----  బైట్---                                                                                                                                  సమస్య  వచ్చిందంటే ఆసమయంలో ఎవరు దగ్గర లేకున్నా నిర్ణయం తీసుకోడం కష్టం దగ్గరలౌన్న నర్సింగ్ హోం కి వెళ్లలా లేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాల అన్నదే మీమాంస ఆసమయంలో నే తక్షణం చేయాల్సిన పరిస్తితి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్తితి అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రికి వేలాడమన్నా నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు రోగం బెత్తెడు బిల్లు  జా నేడు అన్నట్టుగా ఉంటుంది. అసలు సమస్య కు ట్రీట్మెంట్ ఇచ్చాం అంటారు. వాడినా వాడని వస్తువు బిల్లు నానా నెత్తి మీద రుద్ది బిల్లు తడిపి మోపెడు చేసి బిల్లీ కత్తి వెల్ల మంటూ సలహా ఇస్తార్. జర  జాగ్థే రహో అంటున్నాయి స్వీయ  అనుభవం వింటే మీకే ఆర్ధం అవుతుంది  ఆసుపత్రుల ఇన్సూరెన్స్ మాయ.                                                                                         

వాయిస్ ఓవర్ 7) మాయా మయా మాయా ఇదేంటి మాయ అనుకుంటున్నారు క దూ. ఒక్క సారి ఈమాయలో పడ్డారో మీకు లేనిరోగం తో పాటు అన్నీ గుర్తుకు వస్తాయి. .  ఇవిగో ఇవన్నీ నగరంలో పేరెన్నిక గన్న ఆసుపత్రు లే ఇక్కడ కాళ్ళు, కీళ్ళు, తల, వెన్నెముఖ, గుండె, కిడ్నీ, పురీషనాళం, ఊపిరి తిత్తులు, ఇలా ఒకటి పన్ను ,కన్నువెన్ను, ఆన్ని టికి ప్లాంట్లు, ఇన్ ప్లాంట్లు , చేయడంలో ప్రపంచంలో పేరు ఎన్నిక గన్న డాక్టర్ లే ఉంటారు. సేవలు అందిస్తారు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 300/ నుంచి 800/ కు తక్కువగా ఉండదు.  అసలు వచ్చిన  సమస్య  ఏమిటి అంటే దబ్భు పెడితే    ట్రీట్ మెంట్ కాస్ట్ తక్కువ,  ఇన్సూరెన్స్ తో అయితే ఎక్కువ ఇదేమి లాజిక్ అని అనుకుంటున్నారు? పాలసీ దారులు. ఇంకొందరు ఏదో ఒకటి ముందు  బయట పడ్డాం  కదా ఈ మీమాంస అవసరమా? అని అనుకుంటున్నారు. యెస్ అవసరమే ఎందుకంటే పాలసీ దారుల రక్షణ అవసరం కనుక  ఇరిడా నిర్దేశించిన ప్రమాణం ప్రకారం ఇన్సూరెన్స్ పెట్టుబడికి మనకు దక్కే లాభం ఎంత అని పెట్టుబడి దారులు అనుకుంటే పెట్టుబడి దారులు ఆలోచించేవాళ్లు. అటు ప్రైవేట్ , ఇటు ప్రభుత్వ రంగం లో పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా ఒస్తోంటే ఇంకా  ప్రైవెట్ రంగంలో మరిన్ని విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే ఆసుపత్రు లకు పండగ మాకు ఎందుకు ఇన్సూరెన్స్ దండగా అని సామాన్యుడు ఫీల్ అవుతున్నాడు. ఆడండి మనం కడుతున్న ఇన్సూరెన్స్లు మనకు కలిగే లాభం. మీ ఇన్సూరెన్స్ సంస్యలగురించి మాకు రాయండి  నేరుగా మా నిపుణులతో మాట్లా డండి . ఇన్సూరెన్లు క్లైములు వాటి పరిష్కారాలు వివిధ ర కా ల కేసులు ఇన్సూరెన్స్ పరిష్కారంలో అంబుట్స్మెన్ ఇచ్చే తీర్పులు న్యాయనిపుణుల   సలహా లు తదితర ఆంశాలు మరో ఎపిసోడ్ లో చర్చిద్దాం   అంటిల్ దేన్ కీప్  వాచింగ్ రాజ్ న్యూస్. 

ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఉసిరికాయ ఇలా తింటే మ్యాజిక్కే..!

  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          

డిప్రెషన్ బాధితులకు గుడ్ న్యూస్.. 7రోజులు ఇలా చేస్తే షాకింగ్ ఫలితాలు పక్కా..!

డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు.  చుట్టూ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే తప్ప దీన్నుండి సులువుగా బయట పడలేరు. డిప్రెషన్ కారణంగా నమోదు అవుతున్న మరణాలు కూడా చాలానే ఉంటున్నాయి.  అయితే డిప్రెషన్ లో నలిగిపోతూ ఇక తమ జీవితం అంతే నిరాశలో ఉండేవారికి గుడ్ న్యూస్.. డిప్రెషన్ ను తరిమి కొట్టే అద్బుతమైన మార్గం ఉంది.  కేవలం 7రోజులు చాలు.. జీవితంలో అద్బుతం జరుగుతుంది.  ఈ విషయం స్వయానా పరిశోధకులు,  వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  ఇంతకూ 7 రోజులు చేయాల్సిన పనులేంటి? ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫోన్ బంద్.. డిప్రెషన్ ఎండ్.. డిప్రెషన్ సమస్యను ఎండ్ చేయడానికి ఫోన్ బంద్ చేయడం అతిగొప్ప మార్గమని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.  ఒక పరిశోధన ప్రకారం కేవలం వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ లక్షణాలు 24శాతం తగ్గాయని చెబుతున్నారు.  అంతేకాదు.. ఆందోళన సమస్య 16.1 శాతం,  నిద్రలేమి, నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 14.5 శాతం తగ్గాయట.  కాబట్టి సోషల్ మీడియాకు వారం రోజులు దూరం ఉంటే ఇన్ని సమస్యలు మంత్రించినట్టు తగ్గుతాయని అంటున్నారు.  సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్,  అందులో నెట్ కనెక్షన్.. ఇవి రెండూ దూరంగా ఉంటే చాలని అంటున్నారు. సోషల్ మీడియా డిటాక్స్ ప్లాన్.. 7రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనే ప్లాన్ ను దశల వారిగా ఈ కింది విధంగా ఫాలో కావచ్చు. 1రోజు.. సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలో.. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆ తరువాత విషయాన్ని ఒక కాగితం మీద కొన్ని లక్ష్యాలు రాసుకోవాలి.  దీనివల్ల ఎవరికి వారికే తాము సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలి, దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి తమకు తాము రెఢీ అవుతారు. 2వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి మంచి మార్గం నోటిఫికేషన్లను ఆప్ చేయడం.  నోటిఫికేషన్ల వల్ల ఫోన్ ను పదే పదే తీయవలసి వస్తుంది. నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. హోమ్ స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్ లను తీసేయాలి. వాటిని ఫోల్డర్ లలో ఉంచి యాప్ లను తెరిచే అవసరం తగ్గించాలి. 3వ రోజు.. రోజూ ఫోన్ చూస్తూ గడిపే సమయాన్ని కాస్తా మంచి అలవాట్ల కోసం వెచ్చించాలి.  కొంతసేపు పుస్తకం చదవడం,   వ్యాయామం, మంచి అభిరుచి, ఎప్పటినుండో నేర్చుకోవాలని అనుకున్న పనిని నేర్చుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్స్,  తోటపని ఇట్లా ఏదైనా సరే.. సోషల్ మీడియాకు దూరంగా మనసును లాక్కెళ్లాలి. 4వ రోజు.. సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలు,  జరుగుతున్న పరిస్థితులతో మాత్రమే కనెక్ట్ అవుతూ ఉండాలి.  చేసే ప్రతి పనిని మనసుతో ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడు మానిటైజ్ అవుతుంది. మెదడు మీద సోషల్ మీడియా ఒత్తిడి మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. 5వరోజు.. మానసికంగా మెరుగ్గా ఉండటానికి ద్యానం, శ్వాస వ్యాయామాలు బాగా సహాయపడతాయి.  అందుకే రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయాలి. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎలా అనిపిస్తోంది, మనసు ఎలా ఫీలవుతోంది,  ఏ పని తేలికగా అనిపించింది, ఏ పని కష్టంగా అనిపించింది మొదలైనవన్నీ ఒక జర్నలింగ్ రాసుకోవాలి. ఇది జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 6వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం చాలా మంచిది. అది కూడా నేరుగా వ్యక్తులతో కలిసి సమయాన్ని గడపాలి. ఇది బంధాలను బలపరచడమే కాకుండా,  డిప్రెషన్ వంటి భూతాన్ని పారద్రోలడానికి బంధాలు ఎంతగా సహకరిస్తాయో కూడా అర్థం చేసుకునేలా చేస్తుంది. 7వ రోజు.. వారంలో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న మార్పును రివైండ్ చేసుకోవాలి.  ఏ చిన్న రిలీఫ్ కనిపించినా చాలా గొప్ప ఫలితం సాధించినట్టే.. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూస్తే దానికోసం అలాగే కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మెల్లిగా సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరం ఉంటూ కేవలం అవసరం కోసం మాత్రమే లిమిట్ గా సోషల్ మీడియా ఉపయోగించడం నేర్చుకుంటే డిప్రెషన్ భూతాన్ని తరిమి కొట్టేయవచ్చు.                         *రూపశ్రీ.

దోసకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలున్నవారికి మంచిది కాదు..!

దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది. అయితే చాలా మంది దోసకాయను వంటకంగా కాకుండా నేరుగా తినడానికి లేదా  సలాడ్, రైతా లలో జోడించుకోవడానికి ఇష్టపడతారు.  ఇంకొందరు  ఉప్పుతో కలిపి తింటారు. దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. కానీ కొందరికి మాత్రం దోసకాయ చేటు చేస్తుందని చెబుతారు.  ఇంతకీ దోసకాయలో ఉండే పోషకాలు ఏంటి? దోసకాయలను ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. దోసకాయ పోషకాలు.. దోసకాయలలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు  ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  దోసకాయలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, అవి కొంతమందికి  హాని కూడా చేస్తాయి.   దోసకాయలు ఎవరు తినకూడదంటే.. దోసకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొందరిలో  గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా ఇప్పటికే ఎసిడిటీ లేదా ఉబ్బరంతో బాధపడుతున్నవారు దోసకాయలను తక్కువగా తినాలట. లేదంటే  అస్సలు తినకపోవడం మేలట. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచుతుంది. దోసకాయలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే వారు  దోసకాయ తినడం మంచిది కాదు. దీని శీతలీకరణ ప్రభావం దగ్గును తీవ్రతరం చేస్తుంది.  జలుబును పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు,  గొంతునొప్పి వంటివి ఉన్నవారు దోసకాయ తినకపోవడం మంచిది. కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు వస్తాయి. పెదవులు లేదా గొంతు దురద, వాపు, కడుపు నొప్పి,  వికారం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. దోసకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దోసకాయ తినడం మానేయడం మంచిది. దోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన పదార్థం. అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు చాలా తక్కువ మొత్తంలో లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దోసకాయ తినడం మేలు. దోసకాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉంటే దోసకాయను ఎక్కువగా తినడం వల్ల తలతిరుగుడు, బలహీనత లేదా అలసట వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి. కొంతమందికి జలుబు సులభంగా సోకుతుంది. ఇలాంటి వారు చల్లని పదార్థాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.  సులభంగా జలుబుకు గురయ్యే అవకాశం ఉన్నవారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపులో చలి ఉండటం వంటి సమస్యలున్నవారు దోసకాయలు తినడం అస్సలు మంచిది కాదు.                                *రూపశ్రీ.

శీతాకాలంలో తులసి టీ చేసే మ్యాజిక్ ఇదే..!

  శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  ప్రతి సమస్యను తగ్గించుకోగానే మరొక సమస్య రెఢీ అవుతూ ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది అల్లం, వెల్లుల్లి, తులసి వంటి ఔషద గుణాలు ఉన్న పదార్థాలు బాగా వాడుతుంటారు.  అయితే శీతాకాలంలో తులసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. తులసి అద్బుతమైన మూలిక.. తులసి అద్బుతమైన మూలిక అనే విషయం అందరికీ తెలిసిందే. తులసికి ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం తులసిని పుష్కలంగా వాడవచ్చు. సీజన్ సమస్యలకు చెక్.. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే ముక్కు దిబ్బడ,  దగ్గు,  గొంతు నొప్పి వంటి సీజన్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ చాలా బాగా సహాయపడుతుంది. శ్వాస సమస్యలు.. చలికాలంలో చల్లని గాలుల కారణంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు శీతాకాలంలో విజృంభిస్తుంటాయి.  ఈ సమస్యల కు చెక్ పెట్టడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది. చర్మానికి తులసి.. తులసిలో వేడి గుణాలు ఉంటాయి.  తులసిని తీసుకున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పొట్ట ఆరోగ్యం.. తులసి టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం,  బరువు తగ్గడం,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. షుగర్ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారు రెగ్యులర్ గా తులసి టీ తాగుతూ ఉంటే సుగర్ లెవల్స్ క్రమంగా నియంత్రణలోకి వస్తాయట. తులసిలో ఉండే ఔషద గుణాలు జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఇది సాద్యమవుతుందని  అంటున్నారు. తులసి టీ తయారు విధానం.. టీ అనగానే బారతీయులకు పాలు, పంచదార వేసి చేసే పానీయం గుర్తు వస్తుంది.  కానీ తులసి టీ తయారు చేయడానికి పాలు అవసరం లేదు. కావలసిన పదార్థాలు.. తులసి ఆకులు.. నీరు తేనె నిమ్మరసం తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 తులసి ఆకులు వేయాలి.  దీన్ని బాగా మరిగించాలి.  మరిగిన తరువాత వడపోసుకోవాలి.  ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం,  ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనె,  నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు.  తులసిని నీళ్లలో మరిగించి తాగవచ్చు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కత్తి లాంటి కంటి చూపుకు అమేజింగ్ డ్రింక్ ఇది..!

  సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటిచూపు మెరుగ్గా ఉంటే జీవితంలో చాలా భాగం చాలా సవ్యంగా గడిచిపోతుంది. కానీ నేటి కాలంలో కంటిచూపు సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి.  చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరూ కళ్ల అద్దాలు ఉపయోగించడం, కంటి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటం చేస్తుంటారు. చాలామంది కంటి చూపు మెరుగవ్వడం కోసం సప్లిమెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు.  కానీ సంప్లిమెంట్లు అక్కర్లేకుండా కంటి చూపు కత్తిలా, పదునుగా మార్చే అద్బుతమైన డ్రింక్ ఒకటుంది.  ఈ డ్రింక్ ను తీసుకుంటే కంటి అలసట తగ్గడంతో పాటు కంటి శుక్లం సమస్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు.  ఈ డ్రింక్ ఏంటో.. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో.. ఈ డ్రింక్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. జామాకు టీ.. జామకాయ రుచికరమైన పండు మాత్రమే కాదు, దాని ఆకులలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. జామ ఆకులతో తయారుచేసిన టీ కంటి చూపును మెరుగుపరచడానికి,  కంటి చూపు జాగ్రత్తగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జామాకులలో పోషకాలు..  జామాకులలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు,  అనేక ఇతర పోషకాలు ఉంటాయి.  ఇవి  కళ్ళకు పోషణ ఇస్తాయి.  కంటి అలసటను తగ్గిస్తాయి.  కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జామాకు టీ తయారీ విధానం.. తాజాగా ఉన్న ఆకుపచ్చ జామ ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి, దుమ్ము, రసాయనాలు వాటి మీద నుండి తొలగించాలి.  ఒక పాన్‌లో రెండు నుండి మూడు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, జామ ఆకులను నీటిలో వేయాలి. ఆకులలోని  పోషకాలు నీటిలో చేరతాయి. సుమారు   7-8 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి. ఆ తరువాత స్టౌ ఆప్ చేసి వడగట్టాలి.  గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.  ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. జామాకు టీ ఇందుకే బెస్ట్.. జామ ఆకులలో  విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.  ఇది  రెటీనాను బలపరుస్తుంది.  రేచీకటి వంటి  కంటి   సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. జామాకు టీ  కళ్ళను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. తద్వారా కంటిశుక్లం,  వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది .  ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూడటం వల్ల కంటి అలసట,  పొడిబారడం జరుగుతుంది. జామాకు  టీ దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్ల వాపు,  ఎరుపు నుండి ఉపశమనం. దీనిలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు కళ్ళ ఎరుపు,  చికాకును తగ్గిస్తాయి . రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  జామాకు టీ  కళ్ళకు ఆక్సిజన్,  పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. దీని వలన కంటిచూపులో స్పష్టత పస్తుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పెట్టే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఏ సీజన్ లో అయినా పొట్ట సమస్యలకు చెక్ పెట్టే అమృతం ఇది..!

పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా  అసౌకర్యానికి లోనవుతారు.  పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా  బ్రేక్ పడుతుంది.  ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ఆరోగ్యకరమైన బాక్టీరియా తయారయ్యేది పొట్టలోనే.. అలాంటప్పుడు పొట్ట ఆరోగ్యం బలంగా ఉండటం ఎంతో  అవసరం.  పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా,  పొట్ట సమస్యలు ఏ సీజన్ లో వచ్చినా వాటికి చెక్ పెట్టాలన్నా కేవలం ఒక్క పానీయం అమృతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  అదేంటో  తెలుసుకుంటే.. మజ్జిగ.. శీతాకాలంలో తరచుగా మజ్జిగ, పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ప్రతి సీజన్‌లో కడుపు సమస్యలకు చెక్ పెట్టడంలో మజ్జిగ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ  తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇదే అసలైన మజ్జిగ.. మజ్జిగ ఈనాటి పానీయం కాదు.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. పెరుగు చిలికిన తర్వాత తయారుచేసిన మజ్జిగ ఎప్పుడూ ఆరోగ్యకరమైనది. చాలామంది వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతారు.  కానీ శీతాకాలం వచ్చేసరికి పెరుగు, మజ్జిగ వాడకం తగ్గిస్తారు.  అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రతి సీజన్ లో శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను బలంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. మజ్జిగ ఇలా తాగాలి.. చాలామంది పెరుగులో నీళ్లు కలిపి పలుచగా చేసుకుని దాన్నే మజ్జిగ అనుకుంటారు. కానీ నిజానికి మజ్జిగ అనేది పెరుగులో వెన్న తొలగించిన తరువాత లభించే ద్రవం. ఈ మజ్జిగలో అస్సలు ఫ్యాట్ ఉండదు.  ఈ మజ్జిగను నేరుగా అలాగే తాగవచ్చు.  లేదా అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి వంటివి కలిపి కూడా తాగవచ్చు.  అలా కాకున్నా ప్లెయిన్ మజ్జిగలో కాసింత నిమ్మరసం, జీలకర్ర పొడి కలుపుకుని తీసుకున్నా జీర్ణశక్తి బలంగా ఉంటుంది.   మజ్జిగ బెస్ట్ ఎందుకంటే.. మజ్జిగలో కాల్షియం, ప్రోబయోటిక్స్,  ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.  జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. భోజనం తర్వాత బరువుగా, గ్యాస్ లేదా ఉబ్బరం ఉన్నవారికి మజ్జిగ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జోడించిన రాతి ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.  వేయించిన జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  నల్ల మిరియాలు కడుపు వాయువును తగ్గించి కడుపును తేలికపరుస్తుంది.                                      *రూపశ్రీ.

 ప్రతి రోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కిడ్నీలను డేంజర్ లో పడేసే క్రియేటినిన్..!

  సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు కియేటినిన్ అంటే ఏంటి? ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే కిడ్నీలు ఎందుకు డేంజర్ లో పడతాయి.  దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. క్రియాటినిన్ అంటే.. క్రియాటినిన్ అనేది కండరాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. ఈ క్రియాటినిన్ ను మూత్రపిండాలు సులువుగానే ఫిల్టర్ చేస్తాయి. అయితే దీనికి కూడా ఒక పరిమితి ఉంది.  ఈ పరిమితికి మించి క్రియాటినిన్ అనేది ఉత్పత్తి అయితే మూత్రపిండాల పనితీరు మీద ప్రబావం చూపిస్తుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలలో విష పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది. క్రియాటినిన్ ఎలా పెరుగుతుంది? మానవ శరీరంలో క్రియేటిన్ అనే సమ్మేళనం విచ్చిన్నం కావడం ద్వారా క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కండరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దీన్ని సులువుగా ఫిల్డర్ చేసి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. అయితే గాయం, ఇన్పెక్షన్, మధుమేహం, అదిక రక్తపోటు, మందుల దుష్ప్రభావాల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయినప్పుడు రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతాయి. కొన్నిసార్లు శరీరం డీహైడ్రేషన్ కు లోను కాపడం,  అధికంగా ప్రోటీన్ తీసుకోవడం, కఠినమైన వ్యాయామాలు చేయడం లేదా కొన్ని మందులు.. మొదలైనవి క్రియేటినిన్ ను పెంచుతాయి. క్రియేటినిన్ స్థాయి.. సాధారణంగా క్రియేటినిన్ స్థాయి 0.6-1.3m/dl వరకు ఉంటుంది.  ఇది మగవారిలో కొంచెం ఎక్కువ ఉంటుంది.  స్త్రీలలో కండర ద్రవ్యరాశిని బట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. క్రియేటినిన్ పెరిగితే కనిపించే లక్షణాలు.. రక్తంలో క్రియేటినిన్ పెరిగితే ఎప్పుడూ అలసటగా ఉండటం, కాళ్లలో వాపు, ఊపిరి ఆడకపోవడం,  మూత్ర విసర్జనలో మార్పులు, తలనొప్పి,  కంటి చూపు మసకబారటం, నడుము దిగువ భాగంలో నొప్పి మొదలైన లక్షణాలు శరీరంలో క్రియేటినిన్ స్థాయిలు పెరిగాయనడానికి సంకేతాలు. మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. క్రియేటినిన్ స్థాయిలను మొదట్లోనే గుర్తించగలిగితే కిడ్నీల  ఆరోగ్యం కాపాడుకోవడానికి వీలవుతుంది. క్రియేటినిన్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది.. శరీరంలో క్రియేటినిన్ స్థాయిలను ముందుగానే గుర్తించి, వైద్యం తీసుకోగలిగితే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ క్రియేటినిన్ ను గుర్తించకుండా అలాగే ఎక్కువ రోజులు కొనసాగితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం,  గుండె సమస్యలు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. క్రియేటినిన్ పెరకకూడదంటే ఏం చేయాలి? క్రియేటినిన్ పెరగకూడన్నా, క్రియేటినిన్ ను మూత్రపిండాలు సమర్థవంతంగా ఫిల్టర్ చేయాలన్నా నీరు పుష్కలంగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ప్రోటీన్, ఉప్పు నియంత్రణలో తీసుకోవాలని, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు.  అదే విధంగా వైద్యుల సలహా లేకుండా మందులు, ముఖ్యంగా మూత్రపిండాలను ప్రభావితం చేసే మందులు అస్సలు వాడకూడదు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా తెలుసా?

  చాలా మంది  సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా  ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. గతంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు,  ఫ్లూ లాంటి అనారోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల  డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు, హెపటైటిస్ వంటి  ఇతర వైరల్ వ్యాధులు సీజన్‌తో సంబంధం లేకుండా వేగంగా వ్యాపిస్తున్నాయి. భారతదేశంలో వైరల్ ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని నివేదికలు కూడా చెబుతున్నాయి. భారతదేశంలోని ప్రతి 9మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక అంటు వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు రెండు విధాలుగా ఉన్నాయి.  ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్, రెండవది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటే..  వైరల్ ఇన్ఫెక్షన్,  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇవి రెండూ శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కానీ వాటి కారణాలు, లక్షణాలు,  చికిత్సలు భిన్నంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్.. వైరల్ ఇన్ఫెక్షన్ తుమ్మడం, దగ్గడం లేదా అప్పటికే ఇన్పెక్షన్ సోకిన ప్రాంతాలను తాకడం వంటి పనులు చేయడం ద్వారా   వైరస్ శరీర కణాల లోపల వ్యాప్తి చెందుతుంది. ఇది సాధారణంగా జ్వరం, అలసట, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తేలికపాటి దగ్గుకు కారణమవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణంగా  5-7 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మందులు ఇవ్వబడతాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. బాక్టీరియల్  ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం, నీరు లేదా గాయాల  ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ శరీరం వెలుపల జీవించగల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో  సాధారణంగా అధిక జ్వరం, దగ్గు, గొంతు లేదా చర్మ ఇన్ఫెక్షన్,  వాపుకు కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి  యాంటీబయాటిక్స్ ఇస్తారు.  ఈ యాంటీ బయాటిక్స్   బ్యాక్టీరియాను చంపుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ.. వైరల్ ఇన్ఫె7న్ ఎవరికైనా రావచ్చు. కానీ కొందరికి మాత్రం సాధారణ వ్యక్తుల కంటే మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు,  వృద్ధులలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది.  వీరికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.  అలాగే  గర్భిణీ స్త్రీలకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా అనుభవించేవారు,  నిద్ర సరిగా లేని వ్యక్తులకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ధూమపానం,  మద్యపానం చేసే వ్యక్తులు,  ఎక్కువ మందితో ఎక్కువగా,  ఎప్పుడూ కలుస్తూ ఉండే వ్యక్తులకు,  కలుషితమైన లేదా మురికి ప్రాంతాలలో నివసించే ప్రజలు. కలుషిత ఆహారం వంటివి తీసుకునేవారికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కుగా ఉంటుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...