ఇరగదీసిన క్రికెటర్లు.. గేల్, డివిలయర్స్, కోహ్లీ...
వీరబాదుడు బ్యాట్స్మెన్ క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లీ తమ సహజ శైలిలో వీరబాదుడు బాదడంతో ఐపీఎల్-7లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్కు దిగిన చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు సాధించింది. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్లకు తలో వికెట్టు లభించింది. ఆ తర్వాత 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే విజయం సాధించింది. బెంగళూరు ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్ తప్ప మరొకరు ఎందుకవుతారు?