సార్వత్రిక ఎన్నికలు: సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్
posted on May 16, 2014 9:28AM
సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో వుంది. సీమాంధ్ర పార్లమెంట్ స్థానాల్లో 12 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో వుంది. వైసీపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 58 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, వైసీపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుంది. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ 10 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, టీఆర్ఎస్ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. టీడీపీ బీజేపీ కూటమి 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో వున్నారు. తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 53 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎంఐఎం రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నారు.