నశించిన ఓపిక.. బ్యాంకులపై దాడులు..
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఓపికగా ఉన్న ప్రజలు ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే యూపీలో ప్రజలు ఏకంగా బ్యాంకులపై దాడులకు దిగారు. వివరార ప్రకారం.. యూపీలోని మురాదాబాద్, లక్నో, బులంద్ షహర్ తదితర ప్రాంతాల్లో నగదు నిండుకుందని చెప్పి, తిరిగి బ్యాంకులకు తాళాలు వేసి అధికారులు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ప్రజలు ఆయా బ్యాంకులపై దాడులకు దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. మురాదాబాద్ లోని ఎస్బీఐ బ్యాంకు లోపలికి వెళ్లి ధ్వంసం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని.. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి చేరి నిరసన తెలిపారు. మరోవైపు హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.