నా నిర్ణయంతో కొంతమందికి నిద్ర పట్టడంలేదు..
posted on Nov 13, 2016 @ 11:46AM
నల్లధనం నియంత్రణపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గోవాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..అత్యున్నత పదవి అనుభవించడానికి నేను పుట్టలేదు.. దేశం కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యజించా అని చెప్పారు. నాజీవితం ప్రజల కోసమే అంకితం..ప్రజల కోసమే జీవిస్తా.. ప్రజల కోసమే జన్మిస్తా అని అన్నారు. ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డ్ తప్పనిసరి చేయోద్దని చాలా ఎంపీలు మంది నన్ను కోరారు.. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటాం..ఈ చర్యలు నల్లధనాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. చాలామంది పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..అయినప్పటికీ నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరిస్తున్నారు.. నోట్ల రద్దు నిర్ణయానికి బాసటగా నిలిచిన ప్రతి ఒక్క పౌరుడికి సెల్యూట్ తెలిపారు. రాత్రి 8 గంటలకు నేను తీసుకున్న నిర్ణయంతో భారత ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ నా నిర్ణయంతో ఇప్పటికీ కొంతమందికి నిద్ర పట్టడంలేదు అని వ్యాఖ్యానించారు. దేశ సంపదను కొల్లగొట్టిన వారిని గుర్తించి పట్టుకోవడమే మా బాధ్యత అని అన్నారు.