English | Telugu

'కార్తీకదీపం' ట్విస్ట్‌: ప్రియమణి కాదు... పైడమ్మ!

ప్రియమణి... పేరు అందంగా ఉంది కదూ! 'కార్తీక దీపం'లో ప్రియమణి పాత్రలో నటిస్తున్న శ్రీదివ్య కూడా అందంగానే ఉంటుంది. కనిపించేది పనిమనిషి పాత్రలో అయినప్పటికీ... ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ పేరుకు. అయితే, ప్రియమణి అసలు పేరు పైడమ్మ అని రివీల్ చేయడం 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకు లేటెస్టుగా తగిలిన షాక్.

రోజుకొక ఆసక్తికర మలుపుతో 'కార్తీక దీపం' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుంది. ఈమధ్య కార్తీక్ మీద మోనిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసును టేకప్ చేసిన ఏసీపీ రోషిణి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణిని విచారణకు పిలుస్తుంది. అప్పుడు 'నీ అసలు పేరు చెప్పు?' అని గట్టిగా అడిగేసరికి 'పైడమ్మ' అని చెప్పడంతో ఆడియన్స్ షాక్ అవుతారు.

ఇంటికి వెళ్లి విచారణ సంగతి మోనితకు చెబుతుంది పైడమ్మ. కార్తీక్, దీపకు రోహిణి సపోర్ట్ చేస్తే... తనకు ఎప్పటికీ కార్తీక్ దక్కకుండా పోతాడని మోనిత భయపడుతుంది. సీన్ రివర్స్ కాకుండా తనను కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలోనని మథనపడటం మొదలుపెడుతుంది. ఆ త‌ర్వాత ఆమె ఏం చేసిందో చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.