English | Telugu

Karthika Deepam 2: అటు స్వప్న ఎమోషనల్.. ఇటు కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -558 లో.... శ్రీధర్ కి స్వప్న టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. స్వప్న కాంచనతో అన్న మాటలు శ్రీధర్ గుర్తు చేసుకుంటాడు. మీ నాన్న కాశీ విషయంలో తప్పు చేసాడనుకుంటున్నావా అని స్వప్నని శ్రీధర్ అడుగుతాడు. ఒక మావయ్యగా అల్లుడు జీవితం బాగుండాలని అనుకున్నారని స్వప్న చెప్తుంది. శ్రీధర్ కాళ్లపై పడుకొని తనలో ఉన్న బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది స్వప్న. స్వప్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. అదంతా దూరం నుండి చూస్తున్న కావేరి ఏడుస్తుంది.

మరొకవైపు హాస్పిటల్ నుండి కార్తీక్, దశరథ్ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఎదురుగా దీప వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఏం పర్లేదు అమ్మ రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లమ్ లేదని దీపతో దశరథ్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఏమైంది బావ అని దీప అడుగుతుంది. కార్తీక్ నిజం చెప్పలేక బాధ బయటకి కనిపించకుండా కవర్ చేస్తూ ఏం లేదని చెప్తాడు.

కార్తీక్ ఇంట్లోకి వెళ్ళగానే మీ మావయ్యకి ఎలా ఉంది రిపోర్ట్స్ లో ఏం వచ్చిందని సుమిత్ర అడుగుతుంది. రిపోర్ట్స్ ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. అయ్యో మర్చిపోయి అన్నానురా.. నాకు బాలేదని చెప్తానని కార్తీక్ తో సుమిత్ర చెప్తుంది. బాలేంది నీకే అత్త అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

ఏం లేదు తాత నార్మల్ టెస్ట్ లు చేస్తారు కదా.. అవే ఏం లేదు.. అత్తకి బ్లడ్ తక్కువ ఉందట మావయ్యకి విటమిన్ డి తక్కువ అంట అని కార్తీక్ చెప్తాడు. అయితే రిపోర్ట్స్ ఇవ్వు చూస్తానని శివన్నారాయణ అనగానే ఆల్రెడీ డాక్టర్ చూసి చెప్పిందని కార్తీక్ అంటాడు.

ఒరేయ్ కార్తీక్ నువ్వు కూర్చొరా అని సుమిత్ర లోపలికి వెళ్లి పాయసం తీసుకొని వచ్చి కార్తీక్ కి తినిపిస్తుంది. నీకు పాయసం అంటే ఇష్టం కదా మళ్ళీ తినిపించే ఛాన్స్ వస్తుందో రాదో.. ఎందుకంటే నీకు పిల్లలు పుడితే నీకు తినిపించలేం కదా అని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్ బాధపడతాడు. బావ ఎందుకు బాధపడుతున్నాడని దీప అనుకుంటుంది. హ్యాపీగా ఉండాల్సిన బావ డల్ గా ఉన్నాడేంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.