English | Telugu

Jayam serial : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా రుద్రని కాపాడిన గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -158 లో ......రుద్ర హడావిడిగా వెళ్తాడు. గంగ గదిలో ఉండగా అప్పుడే ఇషిక వస్తుంది. ఇప్పుడు రుద్ర బావ పారు దగ్గరికి వెళ్ళాడు. తనకి ఇంకా రుద్ర బావపై ప్రేమ ఉంది. ఇప్పుడు తనవైపుకి తిప్పుకుంటుందని ఇషిక అంటుంది. దాంతో గంగలో టెన్షన్ మొదలవుతుంది. రుద్ర వెనకాలే గంగ వెళ్తుంది. రుద్ర వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోతుంది. రుద్ర కంటే ముందే గంగ హోటల్ కి వెళ్తుంది.

అక్కడ పారు ఎక్కడుందో కనుక్కొని లోపలికి వెళ్తుంది. మరొకవైపు ప్రమీల, ప్రీతి అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే శోభనం గదిలో గంగ, రుద్ర బావ లేరు.. హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు బయటకి వెళ్లారని ఇషిక చెప్తుంది. మరొకవైపు గంగ లోపలికి రావడం చూసి పారు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి రుద్ర వచ్చాడు. లాక్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ పారు ఉన్న గదిలో గంగ ఉంటుంది. రుద్ర వస్తున్నాడని కర్టెన్ చాటున దాక్కుంటుంది. మరొకవైపు పారు పోలీసులకి ఫోన్ చేస్తుంది. రుద్ర లోపలికి వచ్చి పారు అని పిలుస్తుంటే బయట నుండి తన ఫ్రెండ్ వచ్చి ఇందాకే పారు వెళ్ళిపోయింది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను చాలా హా్ట్ అంటూ దగ్గరికి వస్తుంటే రుద్ర తోసేస్తాడు. దాంతో బ్లౌజ్ చింపుకొని హెల్ప్ అంటూ అరుస్తుంది. డోర్ తియ్యగానే పోలీసులు ఉంటారు. నన్ను బలవంతం చెయ్యబోయడని చెప్పగానే రుద్రని అరెస్ట్ చేయమని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆగండి అని లోపల నుండి గంగ వచ్చి.. నా భర్త ఏ తప్పు చెయ్యలేదని చెప్తుంది.

ఎలా నమ్మాలని ఇన్స్‌పెక్టర్ అనగానే గంగ రూమ్ లో జరిగింది వీడియో తీసింది చూపిస్తుంది. దాంతో ఆ అమ్మాయిపై ఇన్‌స్పెక్టర్ కోప్పడి స్టేషన్ కి రమ్మంటాడు. నా భర్తకి సారీ చెప్పమని గంగ అనగానే ఆమె రుద్రకి సారీ చెప్తుంది. పారు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ పాటికీ రుద్రని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటారు. మరొకవైపు రుద్ర గంగ ఎక్కడికి వెళ్లారని ఇంట్లో అందరు టెన్షన్ పడుతారు. రుద్ర, గంగ ఇంటికి వస్తారు. ఇంటి బయటే ఉంటారు. జరిగింది ఏది ఇంట్లో చెప్పకండి అని గంగ అంటుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావ్.. నేను పారుతో మాట్లాడినప్పుడు డౌట్ పడి వచ్చావా అని రుద్ర అంటుంటే.. విన్న మాట నిజమే కానీ డౌట్ తో కాదు మీకు ఏదో ప్రాబ్లమ్ వస్తుందేమోనని గంగ అంటుంది. ఇక కాసేపటికి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.