English | Telugu

లాక్ డౌన్ టైములో సాయి శ్రీనివాస్ మూవీ రిలీజ్ కాలేదు.. నిజంగా బ్యాడ్ లక్!

బిబి జోడి సీజన్ 2 ఈ వారం శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోలో సాయిశ్రీనివాస్ - నయనిపావని జోడి పెర్ఫార్మ్ చేసాక శ్రీనివాస్ వాళ్ళ సిస్టర్ అంబికా స్టేజి మీదకు వచ్చి ఒక టీ కప్ తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది. ఇలాంటి ఆపర్చునిటీ తన బ్రదర్ కి ఇలా దొరకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. రోజు ఈ కప్ లో కాఫీ తాగుతూ ఎలా కష్టపడాలి అని ఆలోచించాలి ఫైనల్ గా ఎలా బిబి జోడి కప్ తీసుకోవాలి అని ఆలోచించు అంటూ విష్ చేసింది.

తర్వాత శేఖర్ మాష్టర్ కూడా ఒక విషయాన్నీ చెప్పారు. "కరెక్ట్ గా లాక్ డౌన్ టైములో సాయి ఒక మూవీ చేసాడు. నా ఫ్రెండ్ అజయ్ మంచి కొరియోగ్రాఫర్. సాయి బాడ్ లక్ అజయ్ బాడ్ లక్ ఏంటంటే లాక్ డౌన్ వచ్చింది. ఆ టైములో మూవీని ఇక్కడ రిలీజ్ చేయలేకపోయారు. దాన్ని యూఎస్ లో రిలీజ్ చేశారు. నిజంగా అలాంటి మూవీ ఇప్పుడు వస్తే డెఫినెట్ గా నువ్వు చేతికి అందవు సాయి. మంచి పొజిషన్ లో ఉంటావు. చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ చూసి నీకు అవకాశం ఇస్తే గనక నీకు నువ్వు డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోగలవు ఆ టాలెంట్ నీలో ఉంది" అని చెప్పారు.

ఇక నయని పావని కూడా ఒక విషయాన్నీ చెప్పుకొచ్చింది. "నాకు ఒక అక్క ఉంది. మా అక్క కూడా అంతే. తన లైఫ్ తనకు అస్సలు చూసుకోకుండా నేనేం చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనేదే ఆలోచిస్తుంది. నేను ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం తనే. నా పేరు పావని. మా అక్క పేరు నయని. నేను మా అక్క పేరుని పెట్టుకున్నాను. నీ పేరు ఎప్పుడు నా లైఫ్ లోకి వచ్చిందో అప్పుడు నాకు అన్నీ వచ్చాయి .నాకు మా అక్క లక్కీ చార్మ్" అంటూ చెప్పింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.