Read more!

English | Telugu

తారక్, మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత సందడి చేశారు. అలాగే ఈ షోలో మహేష్ బాబు కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే షూట్ కూడా పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. మహేష్ ను ఎన్టీఆర్ అన్నయ్య అని పిలుస్తుంటారు. దీంతో మహేష్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోలో పాల్గొనబోతున్నారన్న న్యూస్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఆ ఎపిసోడ్ దసరాకు టెలికాస్ట్ కానుందని వార్తలొచ్చాయి. అయితే దసరాకు సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో దీపావళికి మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని భావించారంతా. కానీ దీపావళికి కూడా మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ కావట్లేదని తెలుస్తోంది. దీపావళికి మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్, మహేష్ ల ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు.

'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షో ఈ సీజన్ ను నవంబర్ 18న ప్ర‌సారం కానున్న‌ ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ కనిపించబోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ హీరో రామ్ చరణ్ తో స్టార్ట్ చేశారు కాబట్టి.. లాస్ట్ ఎపిసోడ్ ను మరో స్టార్ హీరో మహేష్ తో ఎండ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో షో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.