English | Telugu

Bigg Boss 9 Telugu Srija Dammu : శ్రీజ రీఎంట్రీ కన్ఫమ్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో‌ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ‌అయిదు వారాల దాకా ఒక లెక్క.. ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సాగుతోంది. గత వారం ఫ్లోరా సైనీ,‌ శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇందులో ఫ్లోరా సైనీ జనాల ఓటింగ్ తో బయటకు వచ్చేసింది. కానీ‌ శ్రీజని వైల్డ్ కార్డ్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ చేసారు. ఇది క్లియర్ గా అన్ ఫెయిర్ అని జనాలు ఫైర్ అవుతున్నారు.

ఎలిమినేషన్ లో ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి లీస్ట్ లో.. మొదటగా ఫ్లోరాని ఎలిమినేషన్ చేసారు. కానీ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండో ఎలిమినేషన్ లో‌ రీతూని చేయాల్సి ఉండగా రీతూ-డీమాన్ పవన్ ల లవ్ ట్రాక్ పోతుందని తనని ఎలిమినేషన్ చేయకుండా ఆపారు. ఇది క్లియర్ గా కంటెంట్ కోసం బిగ్ బాస్ స్ట్రేటజీ అని తెలుస్తోంది. అయితే ఆడియన్స్ మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓట్లు వేసే మేము‌ పిచ్చోళ్ళమా అంటూ రోడ్ల మీదకొచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట ధర్నాకి దిగారు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ తో రూడ్ గా ప్రవర్తించారని తెలుస్తోంది. ‌అయితే బిగ్‌ బాస్ టీమ్ దీని గురించి పాజిటివ్ గా స్పందించిందని తెలుస్తుంది. శ్రీజని ఈ వారంలో హౌస్ లోకి రీఎంట్రీ చూపిస్తారని తెలుస్తుంది.

రివ్యూయర్ ఆదిరెడ్డి, శ్రీను65 లతో పాటు మరికొంత మంది ‌యూట్యూబర్స్ కూడా శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేదాకా మా పోరాటం ఆగదంటు తమ వీడియోలలో చెప్పుకొచ్చారు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక రోజుకో కొత్త గొడవ జరుగుతుంది. ‌అందులోను‌ దువ్వాడ మాధురి నామినేషన్ ఎక్కువగా ఉండటంతో పాత కంటెస్టెంట్స్ తనతో మాట్లాడటానికే భయపడుతున్నారు. అదే శ్రీజ ఉంటే మాధురికి సరైన సమాధానమిచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయేషా, నిఖిల్ ఇద్దరు కాస్త బాగానే మాట్లాడినా.. మాధురి, రమ్య మోక్షల మాటతీరు మాత్రం కావాలని గొడవ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరు కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నారంటు ఇన్ స్టాగ్రామ్ లో‌ ట్రోల్స్ మొదలయ్యాయి. ‌మరి వీరికి సరైన గుణపాఠం చెప్పడానికి బిగ్‌బాస్ యాజమాన్యం దమ్ము శ్రీజని హౌస్ లోకి తీసుకొస్తుందా.. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.