English | Telugu

Bigg Boss 9 Telugu Nominations: సుమన్ శెట్టి వ్యాలిడ్ నామినేషన్.. కంటెస్టెంట్స్ అంతా నవ్వులే నవ్వులు!


బిగ్ బాస్ సీజన్-9 లో నామినేషన్లు ఫుల్ హీటెడ్ గా జరిగాయి. హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ మొదటగా భరణి, దివ్యలని నామినేట్ చేసింది. తర్వాత సంజన వచ్చి రాము, భరణిలని నామినేట్ చేసింది.

ఆ తర్వాత బాల్ అయేషాకి రావడంతో తను సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనూజని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్‌లో గేమ్స్‌కి టీమ్‌లు ఏర్పడేటప్పుడు నాతో టీమ్‌ అవుతానని నాకు మాట ఇచ్చావ్.. కానీ సైలంట్‌గా కళ్యాణ్‌తో వెళ్లిపోయావ్ నువ్వు.. నాతో నువ్వు ఆడుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడేదేమో.. అలానే నువ్వు హౌస్‌లో చాలా ఎమోషనల్ అయిపోతున్నావ్.. సెంటిమెంట్ ఎక్కువైపోయిందనిపిస్తుంది అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. దానికి తనూజ మీకు చెప్పాను కదా అన్న ఎవరైనా అడిగితే నేను వెళ్ళిపోతాను.. మీరు ఫీల్ అవ్వరు కదా అని అడిగాను కదా సుమన్ అన్న అంటూ తనూజ చెప్పింది. లేదమ్మా నువ్వు నాతో అనలేదు.. నాతో అని ఉంటే నేనెందుకు ఇలా చెప్తానమ్మ అంటు సుమన్ శెట్టి అన్నాడు‌. మీ ట్రూ కలర్స్ కన్పిస్తున్నాయి అన్న.. నేను మిమ్మల్ని నమ్మాను.. కానీ మీరు రివేంజ్ నామినేషన్ చేసి ఏదో రీజన్ చెప్తున్నారు సుమన్ అన్నా అంటూ తనూజ అంది.

ఇక ఆ తర్వాత సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. హౌస్‌లో ఏదైనా గొడవ జరుగుతుందంటే మీకెందుకమ్మా అంత సంతోషం.. వెళ్లి ఆపాలి కానీ అలా మీరు ఎంజాయ్ చేస్తారా అని సుమన్ శెట్టి యాక్షన్ చేసి చూపించడంతో హౌస్‌లో అందరు తెగ నవ్వుకున్నారు. హౌస్ లోని వాళ్ళంతా మనవాళ్ళు.. మనవాళ్ళు అక్కడ అలా గొడవ పడుతుంటే రీతూ, మీరు వెళ్లి తెగ నవ్వుకుంటారా.. ఇదేంటండి.. అది నాకు నచ్చలేదంటు సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక సంజనని సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది అయేషా‌. సుమన్ శెట్టి నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.