English | Telugu

డిస్టర్బ్ అయిన జగతి.. ఈ వసుధార అన్నీ సగం పనులే చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 725 లో... జగతికి‌ అసలు‌ నిజం తెలుస్తుంది. దాంతో తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఫంక్షన్ నుండి వచ్చిన మహేంద్ర జగతిని చూసి.. ఏంటి డిస్టర్బ్ గా ఉన్నావని అడుగుతాడు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందంటే నమ్మలేదు కదా.. మనముందు అలానే ఉన్నారు.. కానీ మనకి తెలియకుండా వాళ్ళ రిలేషన్ మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దామనుకున్నారని మహేంద్రతో జరిగిందంతా చెప్తుంది జగతి. వాళ్ళ మధ్య ఉన్న దూరం అలానే ఉంది. పాపం పిల్లలు మహేంద్ర‌‌.. మానసిక ఒత్తిడికి గురవుతయన్నారు. ఇలా అయితే ఏం కాదు.. వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని జగతి అనగా... వాళ్ళు చెప్తే వింటారా అంటే.‌. రిషి నాకు చాలా చేసాడు. అక్క దేవాయనికి ఎదురించి నన్ను ఇక్కడ ఉండేలా చేసాడు. వాళ్ళిద్దరరి మధ్య ఉన్న చిక్కుముడి విప్పి.. వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేద్దాం మహేంద్ర అని జగతి చెప్తుంది. సరే చేద్దామని మహేంద్ర అంటాడు.

తాగిన మత్తులో కావ్య గదిలోకి వెళ్ళిన రాజ్.. అసలు నిజం తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టీఆర్పీ లో టాప్ -5 లో ఉంటుంది. కాగా గురువారం నాటి ఎపిసోడ్-57లో.. ఉదయం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు.  అప్పుడే కావ్య గది నుండి బయటకొస్తాడు రాజ్. అది చూసినవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అమ్మాయంటేనే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఏం చేసావ్? అసలు ఎందుకు వెళ్ళావ్? ఇలాంటి విషయం నేను అడగలేనని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ఏమైందని అడుగుతుంది. నాకేం తెలియదని రాజ్ అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏం జరిగిందని అడగగా.. అసలు ఆ కళావతి అంటేనే నాకిష్టం లేదని అంటాడు.