Read more!

English | Telugu

మనసుకి నచ్చని అమ్మాయితో శోభనం ఎలా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -55 లో.. రాజ్ కావ్యల శోభనంకు దుగ్గిరాల కుటుంబం ముహూర్తం పెడతారు. రాజ్ గదిలో ఉండి ఆలోచిస్తూ.. కావ్య లోపలికి వచ్చినట్లు మళ్ళీ ఇద్దరికి బాగా గొడవ అయినట్లు ఉహించుకుంటాడు. నో అలా జరగకూడదు.. ఈ శోభనం జరుగకూడదని రాజ్ అనుకుంటాడు.

మరోవైపు గదిలో ఉన్న కావ్య దగ్గరికి అపర్ణ వెళ్లి కావ్యని తక్కువ చేసి అనరాని మాటలు అంటుంది. ఈ శోభనం జరుగకూడదని కావ్యని లోపలే ఉంచి బయట గడియ పెట్టి అపర్ణ వెళ్ళిపోతుంది. దాంతో కావ్య బాధపడుతూ.. నేను ఏమైనా జంతువునా? ఇలా బంధించారు? డోర్ తియ్యండని అంటుంది కావ్య. మరోవైపు రాజ్, కావ్యలకు శోభనం జరుగకూడదు.. ఒక వేళ జరిగితే మనం ఇంత చేసిన దానికి ప్రయోజనం ఉండదు.. ఎలాగైనా ఈ శోభనం జరుగకుండా చేసే బాధ్యత నీదే అని రాహుల్ తో అంటుంది రుద్రాణి. కలపడం కష్టం కాని విడగొట్టడం ఈజీ అని రాహుల్  అంటాడు. రాజ్ తో మాట్లాడడానికి రాజ్ నానమ్మ, తాతయ్య వస్తారు. అప్పుడు రాజ్ మీరు చెప్పారని పెళ్ళి చేసుకున్నాను కాని నాకు అమ్మాయి ఇష్టం లేదని రాజ్ అంటాడు. రాజ్ నానమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజ్ వినడు. ఇక రాజ్ తాతయ్య.. నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంతలో రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి నెగెటివ్ గా మాట్లాడుతాడు. ఇష్టంలేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్.. నీకు నచ్చిన అమ్మాయి స్వప్న.. వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందంటూ రాజ్ కి చిరాకు తెప్పిస్తాడు. కావ్య మీద ఇంకా ద్వేషం కలిగేలా అన్నీ కల్పించి చెప్తాడు రాహుల్.

ఆ తర్వాత రాజ్ ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను.. నా మనసుకు నచ్చని అమ్మాయితో శోభనం ఎలా చేసుకోవాలని గదిలోకి వెళ్ళి.. డెకరేట్ చేసిన రూమ్ ని చెడగొడతాడు. కావ్య మాత్రం ఆ గదిలోనే బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.